నాడు రాళ్లతో కొట్టి. నేడు పూలతో ఆహ్వానమా.? | varavara rao criticise TRS welcome to Konda Surekha | Sakshi
Sakshi News home page

నాడు రాళ్లతో కొట్టి. నేడు పూలతో ఆహ్వానమా.?

Published Thu, Mar 20 2014 2:15 PM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

నాడు రాళ్లతో కొట్టి. నేడు పూలతో ఆహ్వానమా.?

నాడు రాళ్లతో కొట్టి. నేడు పూలతో ఆహ్వానమా.?

హన్మకొండ: తెలంగాణ ఉద్యమంలో నాడు మానుకోటలో రాళ్లతో కొట్టారు.. నేడు పూలదండలు వేసి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఇలా చేర్చుకోవటం వలన టీఆర్‌ఎస్ పార్టీకి పవిత్రత వచ్చిందా? లేక ఆ పార్టీలోకి రావటం వలన కొండా దంపతులకు పవిత్రత చేకూరిందా? అని విరసం నేత డాక్టర్ పి.వరవరరావు ప్రశ్నించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘తెలంగాణ సాహిత్య చరిత్ర-పునర్నిర్మాణం’ అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఇలాగైతే మళ్లీ తిరుగుబాటు చేయక తప్పదని, విద్యార్థులు కూడా పోరాటాల్లో కీలకంగా ఉండాల్సి ఉంటుందని వరవరరావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పున ర్నిర్మాణం అన్న వారు కూడా ఆ అజెండానే  మరిచి..సీట్లు ఓట్లు వ్యవహారంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మూడు లక్షల మంది ఆదివాసీలకు చెందిన వందలాది గ్రామాలను కోల్పోవాల్సి రావడం సరి కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement