ప్రధాన వార్తలు

‘యోగా’ మన జీవితంలో భాగం కావాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘యోగా అనేది మన శరీరం, ఆత్మ రెండింటిపైన పని చేస్తుంది. ప్రశాంతతను పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి యోగాను.. మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం’ అని తెలిపారు.Working on both body and spirit, Yoga helps develop strength and tranquility. On this #InternationalYogaDay, let us commit to making this timeless practice a part of our daily lives.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2025

ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న కేంద్రం వద్ద లైవ్ సైడ్ స్క్రీన్ పక్కకు పడిపోయింది. ఈ క్రమంలో పక్కనే యోగా చేసే వారిపై స్కీన్ పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.మరోవైపు.. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో యోగా సందర్భంగా అరకొరగా వసతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగా చేసేందుకు స్టేడియంకు వచ్చిన వారికి కావాల్సిన మొత్తంలో మ్యాట్స్ ఇవ్వకపోవడంతో వాటి కోసం అందరూ ఎగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారికి చెదరగొట్టారు.ఇదిలా ఉండగా.. విశాఖలో యోగా డే సందర్భంగా ప్రమాదం తప్పింది. యోగా డే వేడుకల కోసం ప్రజలను తరలిస్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హనుమంతువాక విశాలాక్షి నగర్ వద్ద బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారంతా బస్సు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్ సుప్రీం
టెహ్రాన్: ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య ఘర్షణలు ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పాత వివాదాస్పద పోస్టులు మరోమారు వైరల్గా మారాయి. మహిళల గురించి, ఉదారవాదంపై ఆయన చేసిన చేసిన పోస్టులు తిరిగి ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్ట్లలో ఖమేనీ మహిళల హక్కులపై స్పందించడమే కాకుండా, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. Man has a responsibility to understand #woman’s needs and feelings and must not be neglectful toward her #emotional state— Khamenei.ir (@khamenei_ir) September 15, 2013ఈ పోస్టులలో కొన్ని దశాబ్దకాలం క్రితం నాటివి. ఇవి ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయి. సోషల్ మీడియా యూజర్స్ ఈ పోస్ట్లను చూసి కంగుతింటున్నారు. మహిళలను ఉద్దేశించిన ఆయన చేసిన పోస్ట్లలో కొన్ని లైంగిక వాంఛల పరమైనవి ఉన్నాయి. మరికొన్ని ప్రేమను పెంపొందించే సలహాలతో కూడినవై ఉన్నాయి.‘పురుషుడు.. స్త్రీ అవసరాలను, భావాలను అర్థం చేసుకునే బాధ్యతను కలిగి ఉండాలి. ఆమె భావోద్వేగ స్థితి విషయంలో పురుషుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు’ అని ఖమేనీ ఒక పోస్టులో పేర్కొన్నారు.Women are stronger than men. Women can completely control and influence men with their wisdom and delicacy. May 11, 2013— Khamenei.ir (@khamenei_ir) March 7, 20182013 నాటి ఒక పోస్ట్లో ఖమేనీ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. ‘నేను మొదటి రోజున ప్రత్యేకమైన దుస్తులతో పాఠశాలకు వెళ్లాను. అయితే వాటిని ఇతర పిల్లల ముందు ధరించడం అసౌకర్యంగా అనిపించింది. కానీ సరదాగా ఉండటం ద్వారా ఆ పరిస్థితిని అధిగమించాను’ అని ఆయన రాశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం తాను చదవడంపై కూడా ఖమేనీ వ్యాఖ్యానించారు. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ని అధ్యయనం చేయముందు నాకు భారతదేశం గురించి తెలియదు.ఈ వలసరాజ్యం పలు ఎత్తుపల్లాలను చూసింది’ అని రాశారు.I went 2school w/a cloak since1st days;it was uncomfortable 2wear it in front f other kids,but I tried 2make up 4it by being naughty&playful— Khamenei.ir (@khamenei_ir) September 24, 2013ఖమేనీ ఈ తరహా వ్యాఖ్యలపై సోషల్ మీడియా యూజర్స్ స్పందించారు. ఒక యూజర్..‘క్షమించండి, అయతుల్లా ఖమేనీ.. మీ గేమ్ల గురించి నాకు తెలియదు’ అని అన్నారు. మరొక యూజర్ ‘ప్రేమికునిగా పుట్టి, సుప్రీం నేతగా ఉండవలసి వచ్చింది’ అని అన్నారు. Before studying "Glimpses of World History" by Mr. #Nehru I didn't know #India before colonization had undergone so many important #advances— Khamenei.ir (@khamenei_ir) August 6, 2013 ఇంకొకరు ‘పాత ట్వీట్లు మళ్లీ తెరపైకి వచ్చినా, వాటిని తొలగించని మొదటి వ్యక్తి అయతుల్లా ఖమేనీ’ అని అన్నారు. ఇజ్రాయెల్, యూఎస్లు ఒత్తిడిని పెంచుతున్నప్పటికీ, తాను లొంగిపోయేది లేదని ఖమేనీ స్పష్టం చేసిన తరుణంలో ఈ పోస్టులు వైరల్గా మారాయి.ఇది కూడా చదవండి: ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్.. వరంగల్లో ఉద్రిక్తత
కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్డేట్స్.. 👉బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకింది. అక్రమ కేసులో అరెస్టయిన కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పీఎస్ వద్దకు చేరుకున్నారు. దాస్యం వినయ్ భాస్కర్, రాకేశ్ రెడ్డి తదతరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అని తెలియగానే హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్న హనుమకొండ మాజి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారిని ఏనుగుల రాకేష్ రెడ్డి అడ్వొకేట్లను అడ్డుకున్న పోలీసులు -Team PKR pic.twitter.com/rfjXBJNBTF— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 21, 2025👉ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా స్టేషన్ బయటే అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.👉హరీష్ రావు సీరియస్.. కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది.రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడు.కేసులు, అరెస్టులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.నీ వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోస పూరిత వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం.అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.బిఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.ఇందిరమ్మ…— Harish Rao Thanneeru (@BRSHarish) June 21, 2025👉అయితే, మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్కి తరలించారు. ఎమ్మెల్యే తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఏప్రిల్లో ఫిర్యాదు చేశారు.👉దీనిపై 308(2), 308(4), 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరికాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి కౌశిక్ రెడ్డిని తరలించనున్నారు. అక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరుచనున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025

'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' థియేటర్లలోకి వచ్చేసింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చాలారోజుల తర్వాత థియేటర్లు కాస్త కళకళలాడుతున్నాయి. ధనుష్ నటనని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం నటీనటులు అందరూ ఎంత కష్టపడ్డారనే మేకింగ్ వీడియోని టీమ్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ఈ వీడియోలో అసలు రియల్ లొకేషన్స్లో షూటింగ్ ఎలా చేశారనేది చూపించారు. అలానే సినిమాలో కొన్నిసీన్లు చెత్తకుప్పలో చిత్రీకరించారు. కొన్నిసార్లు నిజమైన డంప్ యార్డ్లో తీసినప్పటికీ మరికొన్ని సార్లు కృత్రిమంగా అలాంటి ప్రదేశాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. మేకింగ్ వీడియోలోనూ ఈ బిట్ చూపించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాలో బడా వ్యాపారులు వేల కోట్ల సంపదతో ఎలాంటి మోసాలు చేస్తున్నారనే విషయాల్ని చూపించారు. ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించగా.. నాగార్జున సీబీఐ అధికారిగా రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపించారు. ఫస్టాప్లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర కాగా.. సెకండాఫ్లో హీరోకి సాయపడే వ్యక్తిగా కనిపించారు. చాలారోజుల తర్వాత నాగ్ ఫెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. రష్మిక ఎప్పటిలానే తనదైన యాక్టింగ్తో ఆకట్టుకుంది. వీకెండ్ పూర్తయితే ఈ మూవీ రిజల్ట్పై ఫుల్ క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా)

‘సిరిసిల్ల అడ్డగా ఫోన్ ట్యాపింగ్.. ప్రభాకర్ రావు కారణంగానే అరెస్ట్ అయ్యా’
సాక్షి, కరీంనగర్: హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు చాలామంది సంసారాలు నాశనం చేశారు.. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అందరికంటే ఎక్కువ ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు చేసింది నేనే. హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక మంది ఉసురు పోసుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?. ఫోన్ ట్యాపింగ్కు కారణం కేసీఆర్, కేటీఆరే. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది.ప్రభాకర్ రావు సీఎంవో ఆఫీసుని అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం బంద్ చేయండి. అందరి జీవితాలు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. నన్ను పేపర్ లీక్ అయ్యిందని ప్రభాకర్ రావు అదేశాల మేరకే అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణను సర్వనాశనం చేసిందే కేసీఆర్ ఫ్యామిలీ. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు పోయారు?. కేటీఆర్ అమెరికా పోయి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఇండియాకు వచ్చాడు. నాకు సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. విచారణకు హాజరవుతాను’ అని స్పష్టం చేశారు.

ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- పాక్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ల లంచ్ భేటీపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన ప్రయోజనాలను పొందేవరకు మాత్రమే ఇతర దేశాలతో స్నేహం చేస్తుందని, వాషింగ్టన్ తనను తాను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు వైట్ హౌస్లో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.‘అమెరికా అధ్యక్షుడు తన ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎవరిని విందుకు ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదో మనం ఆయనకు చెప్పగలమా? అమెరికా అధ్యక్షుడు మనకు ప్రత్యేకమైన స్నేహితుడు అని మనం భావిస్తుంటాం. ఆయన మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది వేరే విషయం. అమెరికా తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. అవసరం లేనప్పుడు మరే ఇతర దేశాన్ని పట్టించుకోదు’ అని శ్రీనగర్ రైల్వే స్టేషన్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు. ఆయన తన తండ్రి ఫరూక్ అబ్దుల్లాతో కలిసి వందే భారత్ రైలులో జమ్మూకు వెళ్లారు. ఈ రైలు సేవలను ఆయన కొనియాడారు.ఇది కూడా చదవండి: International Yoga Day: యోగాభ్యాసంపై కింగ్ చార్లెస్ ఏమన్నారంటే..

వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్కు భారత్ భారీ మార్కెట్గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించనుందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్బర్గ్ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్బర్గ్కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది.

పెసరపప్పు : ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు
అనగనగా ఒక ఊరిలో గంగమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె భర్త ఒక దుకాణంలో పని చేస్తూ ఉండేవాడు. అతను తెచ్చే కొద్ది జీతంతోనే ఆమె గుట్టుగా సంసారాన్ని నడిపేది. ఎవరి దగ్గరా చేయి చాచకుండా లౌక్యంగా పనులు చక్కబెట్టేది. ఒకసారి వాళ్లింటికి చుట్టాలు వస్తున్నారని కబురు వచ్చింది. ఇంట్లో సరుకులేమీ లేవు. వచ్చినవారికి ఏం వండిపెట్టాలా అని ఆలోచిస్తుండగా డబ్బాలో ఎప్పుడో దాచిన పెసరపప్పు కనిపించింది. వచ్చినవారికి అదే వండి పెట్టాలని అనుకొని బయటకు తీసింది. నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఎండలో ఆరబెట్టింది. కాసేపటికి కొన్ని కాకులు ఆ పప్పును కాళ్లతో తొక్కి, తింటూ ఎంగిలి చేశాయి. గంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తరిమింది. కాకులు ఎంగిలి చేసిన పప్పుతో అతిథులకు వంట వండిపెట్టడం ఆమెకు మనస్కరించలేదు. కానీ ఏదైనా కొందామంటే చేతిలో డబ్బు లేదు. వెంటనే ఓ ఉ΄ాయం ఆలోచించి, ఆ పప్పును మూటగట్టి వీధి చివరున్న ఓ ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంటి ఇల్లాలు చాలా అమాయకురాలని పేరు. గంగమ్మ ఆమె దగ్గరికి వెళ్లి, తన దగ్గరున్న పప్పు చూపించి ‘నాణ్యమైన పెసరపప్పు. ఇప్పుడే కడిగి ఆరబోశాను. మా ఆయనకు ఇవాళ వేయించిన పప్పు తినాలని ఉందంట. కానీ ఇప్పుడు దీన్ని వేయిస్తే బాగుండదు. దీన్ని నువ్వు తీసుకొని నీ దగ్గరున్న పప్పు ఇస్తావా?’ అని అడిగింది. అవతలున్న ఇల్లాలు చాలా సంతోషించింది. ‘హయ్యో! ఈ గంగమ్మ ఎంత పిచ్చిది! కడిగి, ఆరబెట్టిన పప్పు ఇచ్చి దుమ్ముతో ఉండే పప్పు అడుగుతోంది’ అని అనుకొని ఆ పప్పు తీసుకొని తన దగ్గరున్న పప్పు గంగమ్మకు ఇచ్చి పంపింది. ఇదంతా ఇంట్లో నుంచి వాళ్లాయన గమనించాడు. భార్యను పిలిచి, ‘పిచ్చిదానా! శుభ్రమైన పప్పును మనకు ఇచ్చి, మన దగ్గరున్న పప్పు అడగటానికి గంగమ్మ అంత తెలివితక్కువ మనిషి కాదు. ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు. ఈ పప్పులో ఏదో దోషం ఉండి ఉంటుంది. దాన్ని పారేయ్’ అని చెప్పాడు. ఆయన భార్య ‘అయ్యో’ అనుకుంటూ ఆ పెసరపప్పును పారేసింది.నీతి: ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు. అలా ఇస్తే అందులోని ఆలోచనను గుర్తించాలి.

అమెరికాతో పాక్ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదన
ఇస్లామాబాద్: అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం పాకిస్తాన్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బహిర్గతమైంది. ట్రంప్ విషయంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు పాక్ ప్రతిపాదించింది. దీంతో, ఈ విషయంలో హాట్ టాపిక్గా మారింది.వివరాల ప్రకారం.. 2026 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఈ సందర్బంగా పాకిస్తాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్ కుదిర్చారని తెలిపింది. ఆయన వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రశంసలు కురిపించింది. భారత్ మాత్రం పాకిస్తాన్పై దాడికి పాల్పడి ప్రాణ నష్టానికి కారణమైందని ఆరోపించింది. ట్రంప్ దౌత్యం వల్లే యుద్దం ముగిసిందని చెప్పుకొచ్చింది.🇵🇰 BREAKING: Pakistan nominates Donald Trump for Nobel Peace Prize! 🏆Because obviously, “ceasefire magic” happened just on Trump’s request 🙃No military diplomacy, no DGMOs, no backchannel talks - just one phone call from The Donald, and India-Pakistan hugged it out! 💥📞🕊️… pic.twitter.com/BQSkJt936b— Raksha Samachar | रक्षा समाचार 🇮🇳 (@RakshaSamachar) June 21, 2025రెండు దేశాల మధ్య జోక్యం నిజమైన శాంతి స్థాపకుడిగా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను స్పష్టం చేసింది. చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించాలనే ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం అని కీర్తించింది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ పదే పదే చేసిన ప్రతిపాదనలకు ఇస్లామాబాద్ కూడా ప్రశంసించింది. ఆయన ప్రమేయంతో దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని పేర్కొంది. చివరగా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండా.. ఈ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి నెలకొనదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.JUST ANNOUNCED: Pakistan nominates President Donald Trump for 2026 Nobel Peace Prize 🇺🇸PEACEMAKER-IN-CHIEF TRUMP! 🇺🇸 pic.twitter.com/ihGlDz1iZp— Ape𝕏 (@CubanOnlyTrump) June 20, 2025అయితే, ట్రంప్ పేరును ప్రతిపాదించిన సందర్భంగా భారత్ విషయాలు, కశ్మీర్ అంశంపై ప్రస్తావించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ట్రంప్.. కశ్మీర్ అంశమై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య కశ్మీర్ వివాదంపై తాను మధ్యవర్తిత్వం కూడా తీసుకుంటాని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు, తాజాగా పాక్ సైతం ఇదే ప్రస్తావన తేవడంతో కొత్త ప్లాన్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక, ఆపరేషన్ సిందూర్ సమయంలో కశ్మీర్, పీఓకే విషయంలో భారత్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్కు నోబెల్ అంటే ఎంత ఇష్టమంటే.. అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ అవార్డుపై ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నారు. పలుమార్లు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుతో సమావేశం సందర్భంగా వాళ్లు నాకు ఎప్పటికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. అది ఏమాత్రం బాగోలేదు. నేను అర్హుడను అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ఒబామాకు దీనిని ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే సంధి కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీనిని పాక్ బాగానే గమనించింది. ఇటీవల ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ మాట్లాడుతూ భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్ నోబెల్ ప్రైజ్కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది.
తేనెటీగల డాన్సింగ్ సీక్రెట్ : నోబెల్ బహుమతి కూడా
నాకు అది అలవాటు.. నువ్వే గుర్తు చేయాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్.. వరంగల్లో ఉద్రిక్తత
'కుబేర' హిట్.. నాకు చాలా సంతోషంగా ఉంది: కేతిరెడ్డి
జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?
పెసరపప్పు : ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు
ఇరాన్ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్ వెల్లడి
Golconda: కోట టు టూంబ్స్.. ఆకాశ యానం
'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా
International Yoga Day మహిళలకోసం బెస్ట్ అండ్ హెల్దీ ఆసనాలు
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
సాక్షి కార్టూన్ 20-06-2025
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
మేఘాలయ హనీమూన్ కేసులో విస్తుపోయే నిజాలు
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
తేనెటీగల డాన్సింగ్ సీక్రెట్ : నోబెల్ బహుమతి కూడా
నాకు అది అలవాటు.. నువ్వే గుర్తు చేయాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్.. వరంగల్లో ఉద్రిక్తత
'కుబేర' హిట్.. నాకు చాలా సంతోషంగా ఉంది: కేతిరెడ్డి
జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?
పెసరపప్పు : ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు
ఇరాన్ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్ వెల్లడి
Golconda: కోట టు టూంబ్స్.. ఆకాశ యానం
'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా
International Yoga Day మహిళలకోసం బెస్ట్ అండ్ హెల్దీ ఆసనాలు
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
సాక్షి కార్టూన్ 20-06-2025
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
సినిమా

కేరవాన్లో ఫుల్లుగా ఏడ్చేదాన్ని.. తర్వాత నవ్వుతూ..: అనన్య
ప్రేమలో మోసపోయానంటోంది తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు బ్రేకప్ జరిగింది. ఆ సమయంలో నా మనసుకు, మెదడుకు, చేతలకు సంబంధమే లేకుండా పోయింది. అతడికి ఫోన్ చేయడం ఇష్టం లేకపోయినా నాకు తెలీకుండానే ఫోన్ చేసేవాడిని. ఎందుకు చేశానో అర్థమయ్యేది కాదు. రెండు, మూడేళ్లపాటు చాలా బాధపడ్డాను. కేరవాన్లో ఏడ్చేసి..కానీ, చేసే పనిపై దాని ప్రభావాన్ని పడనివ్వలేదు. రాత్రంతా ఏడ్చి ఉదయాన్ని జిమ్కు వెళ్లిపోయేదాన్ని. కేరవాన్లో ఏడ్చేసి.. ఏం జరగనట్లు కళ్లు తుడుచుకుని నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్ని. ఈ బాధలో నుంచి బయటకు వస్తానా? లేదా? అనుకున్నాను. తర్వాత ఇదంతా ఒక మాయ అని తెలుసుకుని బయటపడ్డాను అని తెలిపింది.తెలుగమ్మాయికి అవకాశాలు తక్కువ?తెలుగమ్మాయిలకు వస్తున్న అవకాశాల గురించి అనన్య మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బిజినెస్. హిట్స్ వస్తేనే మార్కెట్ పెరుగుతుంది, అప్పుడే హీరోయిన్లను సినిమాలో పెట్టుకుంటారు. వైష్ణవి చైతన్య విషయంలో అదే జరిగింది. మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. కానీ, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి బ్లాక్బస్టర్ హిట్ కొడితే వచ్చినన్ని అవకాశాలు.. తెలుగమ్మాయి బ్లాక్బస్టర్ హిట్ కొడితే రావట్లేదు. ఇదే నిజం. హిట్స్ ఉన్నా ఎందుకు మంచి అవకాశాలు రావడం లేదని కొంతకాలం బాధపడ్డాను. తర్వాత నాకోసం నేను మార్కెటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. నాకు నేనే మార్కెటింగ్సినిమాల్లో యాక్ట్ చేసి వదిలేయకుండా వాటి ప్రమోషన్స్పై ఎక్కువగా ఫోకస్ చేశాను. దానివల్ల నాకంటూ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్టులు వస్తున్నాయి. బాలీవుడ్లో ఉమెన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాను. తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మల్లేశం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన అనన్య.. వకీల్ సాబ్, తంత్ర, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించింది. పొట్టేల్ సినిమాకుగానూ గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా

శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్, మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్-నాగార్జునల నటనగురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇక కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది.నిజానికి నాగార్జున టాలీవుడ్లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. ఇలా టాప్ లీగ్లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. ఆది కూడా నాగ్కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది.శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే.. ఆయనను ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రాకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్.శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్లు దాదాపు చాలా నేచురల్గా ఉంటాయి, అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకుని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అనే చర్చ జరుగుతోంది.

'8 వసంతాలు' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రేమకథలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలా వచ్చిన చిత్రం '8 వసంతాలు'. గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనంతిక సనీల్ కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమకథా సినిమా అనగానే.. హా ఏముంది అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకుంటారు. కుదిరితే ఒక్కటవుతారు లేదంటే విడిపోతారు. ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముందిలే అనుకుంటాం. కానీ ప్రేమకథని ఎంత అందంగా, ఎంత హృద్యంగా చెప్పొచ్చో కొందరు దర్శకులు నిరూపించారు. అలా 'అందాల రాక్షసి', 'సీతారామం' లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటితో సరిసమానంగా నిలిచే చిత్రం ఈ '8 వసంతాలు'.సినిమా టైటిల్స్ పడుతున్న టైంలోనే మొత్తం కథని రివర్స్లో చూపించేస్తారు. అలా ఊటీలో ఓ కరాటే ఇన్స్టిట్యూట్లో కథ మొదలవుతుంది. తనని ఓడిస్తే ఐపాడ్ గిఫ్ట్గా ఇస్తానని హీరో వరుణ్ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడున్న వాళ్లందరూ అతడి చేతిలో ఓడిపోతారు. కానీ శుద్ధి అతడిని ఓడిస్తుంది. అహాన్ని నేలకు దించుతుంది. ఆ క్షణం వరుణ్.. శుద్ధితో ప్రేమలో పడిపోతాడు. తర్వాత ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంది కదా అనుకునే టైంలో వరుణ్ తన స్వార్థం చూసుకుంటాడు. శుద్ధిని దూరం పెడతాడు. దీంతో ఆమె వచ్చి వరుణ్ ముందు నిలబడుతుంది. వీళ్లిద్దరి మధ్య సాగే సంభాషణ విజిల్స్ వేయిస్తుంది. అలా అదిరిపోయే సీన్తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్కి వచ్చేసరికి శుద్ధికి కరాటే నేర్పిన గురువు చనిపోవడం, ఆయన అస్థికల్ని గంగలో కలపడం ఇలా సాగుతుంది. కొన్నాళ్ల తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. ఈమెలానే అతడు కూడా ఓ రచయిత. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? ఇంతకీ సంజయ్ గతమేంటి? చివరలో శుద్ధితో సంజయ్ ఒక్కటయ్యాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.'8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. మధ్యమధ్యలో బలమైన సన్నివేశాలు, మనసుని తాకే డైలాగ్స్ వస్తుంటాయి. తొలి భాగంలో మహిళల గుణం గురించి హీరోయిన్ చెప్పే ఓ సీన్ భలే ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు శుద్ధి-వరుణ్ మధ్య సంభాషణ వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి సంజయ్ పాత్ర ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎందుకంటే క్లైమాక్స్కి కాసేపు ముందు వచ్చే ఈ పాత్రకు పెద్దగా సీన్స్ ఉండవు. కానీ క్లైమాక్స్లో ఇతడి పాత్రని తొలి సీన్ నుంచి లింక్ చేసిన విధానం.. థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అలానే '8 వసంతాలు' అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా సరే హీరోయిన్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. డైలాగ్స్ అయితే భావుకత, కవితలు అంటే ఇష్టపడేవారితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చేస్తాయి.ఎవరెలా చేశారు?శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక జీవించేసింది. 17 ఏళ్ల అమ్మాయిగా, 25 ఏళ్ల మహిళగా వేరియేషన్స్ చూపించింది. వరుణ్గా చేసిన హనురెడ్డి.. ఎన్నారై కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సెకండాఫ్లో వచ్చే సంజయ్ పాత్రధారి రవి దుగ్గిరాల ఇదివరకే 'మధురం'లో నటించాడు. ఇందులో అతడి పాత్ర ఉన్నది కాసేపు అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది. మిగిలిన పాత్రధారులు కూడా ఎవరికి వాళ్లు పూర్తిగా న్యాయం చేశారు.టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ హైలైట్. ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి వస్తుంటుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఊటీ, కశ్మీర్, కాశీ అందాల్ని బాగా చూపించారు. ఇక డైరెక్షన్ విషయానికొస్తే.. ఇదివరకే మధురం షార్ట్ ఫిల్మ్, మను సినిమాతో తానెంటో నిరూపించుకున్న ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు '8 వసంతాలు' సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.స్వచ్ఛమైన ప్రేమకథని వినసొంపైన సంగీతంతో మనసుని తాకే సంభాషణలతో తీసిన ఓ మంచి సినిమా చూడాలనుకుంటే '8 వసంతాలు' అస్సలు మిస్ కావొద్దు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన

అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
సెలబ్రిటీలు ఏం మాట్లాడాలన్నా, ఎలాంటి పోస్టులు వేయాలన్నా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం. గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) ఇప్పుడలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయిన సంగతి తెలిసిందే! మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన అతడి పేరు విశ్వాస్ కుమార్ రమేశ్. చిన్నపాటి గాయాలతో సంఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు.అతడు చెప్పేది అబద్ధంఅతడి గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. విశ్వాస్ అబద్ధం చెప్తున్నాడని కొందరు పుకార్లు సృష్టించారు. అది నిజమని నమ్మిన సుచిత్రా కృష్ణమూర్తి ఆ రూమర్స్ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రమేశ్ అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అదేగనక నిజమైతే అతడికి కఠిన శిక్ష విధించాలి. లేదంటే పిచ్చి ఆస్పత్రిలో వేయాలి అని ట్వీట్ చేసింది.ట్వీట్ డిలీట్ఇది చూసిన నెటిజన్లు అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నావని విమర్శించారు. ఆయన విమాన ప్రమాదంలోని బాధితుడే అని అహ్మదాబాద్లోని ఆస్పత్రి అధికారులే ధృవీకరించాక ఇంకేంటి సమస్య? అని ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న సుచిత్ర.. వెంటనే సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా దాన్ని పోస్ట్ చేసినందుకు సారీ అని ట్వీట్ చేసింది.నటిగా..గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్లోనూ నటించింది. 1999లో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు శేఖర్కపూర్ను వివాహమాడింది. వీరికి కావేరీ అనే కూతురు జన్మించింది. 2007లో సుచిత్రా- శేఖర్ విడాకులు తీసుకున్నారు. Took out my last tweet on the air india crash survivor. Seems to be false news circulated for God knows what reason. My apologies— Suchitra Krishnamoorthi (@suchitrak) June 19, 2025 చదవండి: ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా!
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

బ్యాటింగ్తో అదరగొట్టారు
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయం ఘనంగా మొదలైంది. అంచనాలకు మించిన ఆటతో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. సీనియర్లు తప్పుకున్నా... జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు తాము సరైనోళ్లమని యువ ఆటగాళ్లు నిరూపించారు. అసాధారణ బ్యాటింగ్తో ముందుగా యశస్వి జైస్వాల్, ఆపై కెప్టెన్గా తొలి పరీక్షలో శుబ్మన్ గిల్ సెంచరీలు బాది సత్తా చాటగా, రిషభ్ పంత్ తన విలువను ప్రదర్శించాడు. హెడింగ్లీ పిచ్పై ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లందరినీ ఒక ఆటాడుకున్న మన బ్యాటర్లు భారీ స్కోరుతో మొదటి రోజును గొప్పగా ముగించారు. లీడ్స్: ఇంగ్లండ్తో మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్ భారీ స్కోరుతో చెలరేగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెపె్టన్ శుబ్మన్ గిల్ (175 బంతుల్లో 127 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 101; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగగా, వైస్ కెపె్టన్ రిషభ్ పంత్ (102 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. టెస్టుల్లో జైస్వాల్కు ఇది ఐదో సెంచరీ కాగా, గిల్కు ఆరో శతకం. జైస్వాల్, గిల్ మూడో వికెట్కు 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత గిల్, పంత్ నాలుగో వికెట్కు అభేద్యంగా 138 పరుగులు జత చేశారు. సిరీస్లో శుభారంభం... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 42; 8 ఫోర్లు) జట్టుకు సరైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చకచకా బౌండరీలు బాదారు. ఒకదశలో అసహనంతో జైస్వాల్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లండ్ ఏమాత్రం అవకాశం లేకపోయినా... ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరి విఫలమైంది. తొలి గంటలో భారత్ 9 ఫోర్లతో 44 పరుగులు చేసింది. ఎట్టకేలకు లంచ్ విరామానికి ముందు ఇంగ్లండ్కు ఊరట దక్కింది. ఆరు బంతుల వ్యవధిలో రాహుల్, తొలి టెస్టు ఆడుతున్న సుదర్శన్ (0) అవుట్ కాగా...లంచ్ సమయానికి జట్టు స్కోరు 92/2కు చేరింది. భారీ భాగస్వామ్యం... విరామానంతరం 96 బంతుల్లో జైస్వాల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో జైస్వాల్, గిల్ ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఆడుకున్నారు. ఓవర్కు దాదాపు ఐదు పరుగుల రన్రేట్తో పరుగులు రాబట్టి ప్రత్యరి్థపై ఆధిక్యం ప్రదర్శించారు. వోక్స్ వేసిన రెండు ఓవర్లలో గిల్, జైస్వాల్ చెరో 3 ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించారు. 56 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు జోరు పెంచిన జైస్వాల్ కార్స్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి 99కు చేరుకున్నాడు. తర్వాతి బంతిని సింగిల్ తీసిన అతను 144 బంతుల్లో సెంచరీ మార్క్ను చేరుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరడానికి జైస్వాల్ 48 బంతులే (8 ఫోర్లు, 1 సిక్స్తో) తీసుకోవడం విశేషం. పంత్ జోరు... టీ తర్వాత రెండో ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ను స్టోక్స్ బౌల్డ్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత గిల్, పంత్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా...గిల్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. బషీర్ ఓవర్లో పంత్ వరుసగా 4, 6 బాదడంతో స్కోరు 300కు చేరుకోగా... టంగ్ ఓవర్లో కవర్స్ దిశగా ఆడి గిల్ 140 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ హాఫ్ సెంచరీ (91 బంతుల్లో) పూర్తయింది. ఎంత ప్రయత్నించినా ...పేలవ బౌలింగ్తో ఇంగ్లండ్ ఈ జోడీని విడదీయలేకపోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 127; పంత్ (బ్యాటింగ్) 65; ఎక్స్ట్రాలు 24; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 359. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221. బౌలింగ్: వోక్స్ 19–2–89–0, కార్స్ 16–5–70–1, టంగ్ 16–0–75–0, స్టోక్స్ 13–1–43–2, బషీర్ 21–4–66–0. ఇంగ్లండ్ పశ్చాత్తాపం!‘కాస్త క్రికెట్ బుర్ర వాడేవారు ఎవరైనా ఇక్కడ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు’... ఇంగ్లండ్ నిర్ణయంపై మాజీ కెపె్టన్ మైక్ అథర్టన్ వ్యాఖ్య ఇది. మరో మాజీ కెపె్టన్ కుక్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. తీవ్రమైన ఎండ, పొడిగా ఉన్న పిచ్, స్వింగ్కు ఏమాత్రం అవకాశం లేని వాతావరణం, పెద్దగా అనుభవం లేని బౌలర్లు... ఇలాంటి స్థితిలో టాస్ గెలిచి స్టోక్స్ బౌలింగ్ ఎంచుకునే సాహసం చేశాడు. హెడింగ్లీ మైదానంలో గత ఆరు టెస్టుల్లో ముందుగా బౌలింగ్ చేసిన జట్టే గెలిచింది. కానీ శుక్రవారం పరిస్థితి వాటికి భిన్నం. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే తాము చేసిన తప్పేమిటో ఇంగ్లండ్కు అర్థమై ఉంటుంది.పెనాల్టీ పరుగులు...7 బంతుల ఓవర్! → 45 పరుగుల వద్ద జైస్వాల్కు అదృష్టం కలిసొచి్చంది. కార్స్ వేసిన యార్కర్ను అతను చివరి నిమిషంలో నిలువరించగలిగాడు. ఇంగ్లండ్ అప్పీల్కు సిద్ధమైన తరుణంలో అంపైర్ దానిని ‘నోబాల్’గా ప్రకటించాడు. ఆ తర్వాత రీప్లే చూస్తే బంతి ముందుగా అతని ప్యాడ్కు తాకినట్లు తేలింది. ‘నోబాల్’ కాకపోతే అది కచి్చతంగా అవుట్గా తేలేది. → గిల్ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు కార్స్ బౌలింగ్లో కష్టసాధ్యమైన సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే గిల్ చాలా దూరంలోనే ఉన్నా... పోప్ వేసిన త్రో నేరుగా వికెట్లకు తాకకపోవడంతో రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. ఓవర్త్రో బౌండరీని చేరడంతో మరో నాలుగు పరుగులు జట్టు ఖాతాలో చేరాయి. → టీ విరామానికి ముందు స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో స్లిప్ ఫీల్డర్ రూట్ బంతిని ఆపే క్రమంలో దానిని పక్కకు తోశాడు. అది అక్కడే పెట్టిన వికెట్ కీపర్ హెల్మెట్ను తాకడంతో భారత్కు ఐదు పెనాల్టీ పరుగులు అదనంగా లభించాయి. ఈ గందరగోళంలో అంపైర్ లెక్క తప్పడంతో ఈ ఓవర్లో స్టోక్స్ 7 బంతులు వేశాడు. → ఇటీవలి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి నివాళి అర్పిస్తూ మ్యాచ్ ఆరంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించిన ఇరు జట్ల ఆటగాళ్లు భుజానికి నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.

గిల్, జైశ్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్దే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(101), కెప్టెన్ శుబ్మన్ గిల్(127 నాటౌట్) సెంచరీలతో మెరిశారు. ప్రస్తుతం క్రీజులో గిల్తో పాటు రిషబ్ పంత్(65) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. కార్స్ ఓ వికెట్ సాధించాడు.

వారెవ్వా గిల్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే అద్బుత సెంచరీ
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో గిల్ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన గిల్.. విరాట్ కోహ్లిని తలపించాడు. తొలుత దూకుడుగా ఆడిన శుబ్మన్, జైశ్వాల్ ఔటయ్యాక ఆచిచూచి తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 140 బంతుల్లో గిల్ తన ఆరో టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 14 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి కంటే ముందు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ డెబ్యూలో సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.భారత టెస్టు కెప్టెన్గా అరంగేట్ర ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్గా గిల్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే అగ్రస్ధానంలో ఉన్నారు. 1951లో కెప్టెన్గా తన అరంగేట్ర ఇన్నింగ్స్లో ఇంగ్లండ్పైనే సెంచరీ చేశారు.భారత టెస్ట్ కెప్టెన్గా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..164* విజయ్ హజారే వర్సెస్ ఇంగ్లండ్, ఢిల్లీ 1951116 సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్ ఆక్లాండ్ 1976115 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియన్ అడిలైడ్ 2014102*శుబ్మన్ గిల్ vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025భారీ స్కోర్ దిశగా భారత్..తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 78 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 మూడు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(46), గిల్(112) ఉన్నారు.

చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. ఒకే ఒక్కడిగా రికార్డు
టెస్టు క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన అద్బుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో జైశ్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.144 బంతుల్లోనే జైశ్వాల్ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించాడు.ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కు 131 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 69 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఈ క్రమంలో జైశ్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. జైశ్వాల్ సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్లోని లీడ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ టీమిండియా ఓపెనర్ ఈ ఫీట్ సాధించలేకపోయాడు. 1967లో భారత క్రికెట్ దిగ్గజం ఫరూక్ ఇంజనీర్ చేసిన 87 పరుగులే.. టీమిండియా ఓపెనర్ లీడ్స్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పుడు 58 ఏళ్ల ఫరూక్ ఇంజనీర్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు👉ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండు దేశాల్లోనూ తన కెరీర్లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా జైశ్వాల్నిలిచాడు. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైశ్వాల్ సెంచరీతో మెరిశాడు. ఆసీస్ గడ్డపై జైశ్వాల్కే అదే తొలిటెస్టు మ్యాచ్.👉ఇంగ్లండ్పై గడ్డపై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025చదవండి: ENG vs IND: ఇషాన్ కిషన్కు ఆ జట్టు నుంచి పిలుపు.. అక్కడ బాగా రాణిస్తే?
బిజినెస్

చిన్న పట్టణాల్లో స్మార్ట్ఫోన్ల జోరు
న్యూఢిల్లీ: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతోందని అంతర్జాతీయ సెమీకండక్టర్ దిగ్గజం మీడియాటెక్ ఇండియా ఎండీ అంకు జైన్ వెల్లడించారు. 5జీ సేవల విస్తరణ, స్మార్ట్ఫోన్లు చౌకగా లభిస్తుండటం, కనెక్టెడ్ ఉపకరణాలకు డిమాండ్ నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఉపకరణాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, టెక్నాలజీ రంగం, యువత వృద్ధి చోదకాలుగా ఉండబోతున్నాయని జైన్ చెప్పారు.నెక్ట్స్–జనరేషన్ స్మార్ట్ఫోన్ల సామర్థ్యాలను పెంచే డైమెన్సిటీ 8450 చిప్సెట్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వివరాలు చెప్పారు. టీవీలు, స్పీకర్లు, ఫ్రిజ్లు మొదలైన ఉపకరణాల్లోనూ ఏఐ చిప్సెట్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ హోమ్ మార్కెట్లో కూడా తమకు ప్రాధాన్యం పెరుగుతోందని జైన్ చెప్పారు. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకెళ్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కొరతపై స్పందిస్తూ తమ సరఫరా వ్యవస్థకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు వేసుకుంటున్నామని జైన్ వివరించారు. కొత్త విభాగాల్లోకి విస్తరణ .. ఆటోమోటివ్, శాటిలైట్ కమ్యూనికేషన్స్లాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరిస్తున్నామని జైన్ తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు 4జీ స్మార్ట్ క్లస్టర్లను రూపొందించేందుకు జియోథింగ్స్తో జట్టు కట్టామని, స్కోడా స్లావియా, టాటా పంచ్ ఈవీలాంటి కార్లకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలపైనా దృష్టి పెడుతున్నామని చెప్పారు. భారత్లో శాటిలైట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వ్యవస్థ విస్తరించే కొద్దీ తమ చిప్సెట్స్కు కూడా డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. భారత మార్కెట్లో మరిన్ని పెట్టుబడులకు, ఇంజనీరింగ్ సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు మీడియాటెక్ కట్టుబడి ఉందని చెప్పారు. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారత స్మార్ట్ఫోన్ చిప్సెట్ మార్కెట్లో మీడియాటెక్ సంస్థకు 45 శాతం, క్వాల్కామ్కి 32 శాతం వాటా ఉంది. 2004లో మీడియాటెక్ భారత్లో తమ తొలి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బెంగళూరు, నోయిడా కార్యాలయాల్లో 1,000 మంది పైగా ఇంజనీర్లు ఉన్నారు.

ఫైనాన్షియల్ సెక్టార్పై మస్క్ కన్ను
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.

స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!
రాయల్ ఎన్ఫీల్డ్ తన ఐకానిక్ బుల్లెట్ 350 సిరీస్ ధరల్లో స్వల్ప మార్పులు ప్రకటించింది. వేరియంట్ను అనుసరించి ధరను రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెంచినట్లు తెలిపింది. దాంతో బేస్ వేరియండ్ ధర రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై ప్రీమియం మోడల్ ధర రూ.2.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.ఈ ధరల పెంపుతో పాటు బుల్లెట్ సిరీస్లో అప్డేటెడ్ మోడల్ బెటాలియన్ బ్లాక్ను ప్రవేశపెట్టింది. బెటాలియన్ బ్లాక్ బేస్ ధర రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆకట్టుకునే డిజైన్తో బ్లాక్ బాడీ, గోల్డెన్ హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రిప్స్, రెట్రో టెయిల్ లైట్, స్కూప్డ్ సింగిల్ సీట్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరిఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ మిలిటరీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.1.76 లక్షలకు చేరింది. రెడ్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. దీనిపై రూ.2000 ధర పెరిగింది. బ్లాక్, మెరూన్ రంగుల్లో లభించే స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.3,000 పెరిగింది. దీని ధర రూ.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్లాక్ గోల్డ్ ఎడిషన్ ఇప్పుడు రూ.2.18 లక్షలకు (ఎక్స్-షోరూమ్) రూ .2,000 పెరిగింది.

అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరి
రోడ్డు భద్రతను పెంపొందించే నిర్ణయాత్మక చర్యలో భాగంగా 2026 జనవరి 1 నుంచి ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని కొత్త ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ఏబీఎస్) అమర్చాలని భారత ప్రభుత్వం తెలిపింది. 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే ఏబీఎస్ ఉండాలనే మునుపటి నిబంధనను ఈ నిర్ణయంతో సవరించినట్లయింది.పెరుగుతున్న ప్రమాదాలుదేశవ్యాప్తంగా రోడ్డు మరణాల్లో 44 శాతం ద్విచక్రవాహనాల వల్ల జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో వీల్ లాక్ను నిరోధించే టెక్నాలజీ ఏబీఎస్ను ప్రవేశపెట్టడం వల్ల ప్రమాదాలు 45 శాతం వరకు తగ్గుతుందని తెలుపుతున్నాయి. ఈ టెక్నాలజీని అన్ని ద్విచక్రవాహనాల్లో అమలు చేస్తే ప్రమాద సంబంధిత గాయాలు, మరణాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.త్వరలో రెండు హెల్మెట్లు..ద్విచక్రవాహనాల్లో ఏబీఎస్ను తప్పనిసరి చేయడంతోపాటు అన్ని వాహన డీలర్లు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలనేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి రైడర్ కోసం, మరొకటి వెనుక కూర్చున్న వ్యక్తికి ఉపయోగపడుతుందని చెప్పాయి. హెల్మెట్ వాడకాన్ని పెంచడంతోపాటు రైడర్ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అడ్వాన్స్గా ఆరు నెలల రెంట్.. ఆపై ఎన్నో ఛార్జీలుధరలు పెరుగుతాయా..?ఏబీఎస్ భద్రతా ఫీచర్లు వాహన ధరలను పెంచుతాయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడళ్ల ధరలు ఇది రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరగవచ్చనే అభిప్రాయాలున్నాయి. లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర వాహనాలు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.
ఫ్యామిలీ

నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.చెమటలు చిందించాలి చాలామంది మదిలో మెదిలే ఆలోచన ఇది. కానీ ఇవేమీ లేకుండానే హ్యాపీగా నెలకు 7 కిలల దాకా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఒక వైద్యుడు. అదీ కఠినమైన డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు. మరి ఆ జాదూ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. పదండి.. ఆలస్యం ఎందుకు..!నాన్-ఇన్వాసివ్ కార్డియాలజీలో నిపుణుడైన కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ సోషల్మీడియా ద్వారా తన ఫాలోయర్లకు అనేక ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటారు. తాజాగా 'జాదూ డైట్ (మ్యాజిక్ డైట్) ఫర్ వెయిట్ లాస్' అంటూ కొన్ని వివరాలను షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రకారం ఇది శాకాహారంతో బరువు తగ్గించుకునే ఒక ప్రణాళిక. కడుపు మాడ్చుకోవాల్సి అవసరం లేకుండానే సరళమైన డైట్తో కేవలం ఒక నెలలో కనీసం 7 కిలోల బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని హామీ ఇస్తున్నారు కూడా.వెయిట్ లాస్ జర్నీ- చిట్కాలుడాక్టర్ బిమల్ ఛాజెర్ చెబుతున్న డైట్ సరళమైన, ఆరోగ్యకరమైన ఆహారాల కలయితో ఉంటుంది. బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదనీ, ఆకలితో ఉండకుండా కేలరీల లోటును భర్తీ చేసి.శరీరం సహజంగా కొవ్వును కరిగించడానికి అనుమతిస్తుంది. ఇదీ చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో'జాదూ డైట్ ఫర్ వెయిట్ లాస్'మనం మన కడుపును అధిక కేలరీల ఆహారంతో నింపితే, మన బరువు పెరుగుతుంది, అదే తక్కువ కేలరీల ఆహారంతో నింపితే, ఆకలీ వేయదు, బరువూ పెరగదు సింపుల్ మ్యాజిక్ అంటారాయన. స్వీట్ కార్న్, బీట్ రూట్, క్యారెట్లతో చేసిన సలాడ్, గుమ్మడికాయ, బీన్స్, క్యారెట్ ముక్కలు, రాగిపిండితో చేసిన సూప్ ఇలాంటివి ఆయన షేర్ చేసిన వీడియో మనం చూడవచ్చు.జాదూ డైట్లో నిజానికి బాగా తినాలి, కానీ లో-కేలరీల ఆహారాలకు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, సలాడ్లు...ఇది శరీరాన్ని ఆహారం లేకుండా ఉంచకుండా వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఫలితంగా నెలలో 7 కిలోల బరువు తగ్గడం పక్కా..అది కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అని చెప్పారు. View this post on Instagram A post shared by Food Link (@ig_foodlink)ఆహారంగా ఇంకా ఏం తీసుకోవచ్చుబ్లాక్ టీ తాగవచ్చు. ఎక్కువ పండ్లు తీసుకోవాలి. ప్రోటీన్ , ఇతర పోషకాల కోసం మూంగ్ లేదా మసూర్ దాల్ తీసుకోవచ్చు. ఇందులో దోసకాయ, బీట్రూట్ క్యారెట్ ఇలా పచ్చి కూరగాయలతో కలిపి పప్పును తినవచ్చు.రాత్రి భోజనంలో సూప్తో పాటు సలాడ్ , ఉడికించిన కూరగాయలుఎన్ని రోజులు చేయాలి?ఈ డైట్ను కేవలం ఒక నెల పాటు మాత్రమే సాగించాలి.దీన్ని ఎప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ డైట్తో మీరు సుమారు 3 నెలల్లో 10-20 కిలోలు తగ్గవచ్చు. ఈ జాదూ డైట్ అద్భుతంగా పనిచేస్తుందనంటూ కోలకత్తాకు చెందిన ఒక మహిళ 86 నుంచి -62 కిలోలకు బరువు తగ్గిన వైనాన్ని ఉదహరించారు.గమనిక: ఈ కథనం డా. బిమల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం అందించినంది మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం.

Ladakh ఆనందాల పర్యటనపై అనుమానాల ముసురు
నగరంలో చాలా మందికి వేసవి సీజన్ పూర్తవ్వగానే టూర్స్ గురించిన టాపిక్స్పై చర్చలు పూర్తవుతాయి. కొంతమందికి మాత్రం అప్పుడే మొదలవుతాయి. అలాంటి వారిలో లద్దాఖ్ ప్రియులు ముందుంటారు. అయితే పహల్గామ్ దాడి తదనంతర పరిణామాల వల్ల పర్యాటకుల సంఖ్యలో కొంత మార్పు కనిపిస్తోంది. బైకర్స్, కార్లలో టూర్ వెళ్లే వారు ఇప్పటికే తమ తమ ప్లాన్స్ పూర్తిచేసుకునే దిశగా కదులుతున్నారు. అయితే వివిధ రకాల మార్గాల ద్వారా వెళ్లే పర్యాటకుల తాకిడి మాత్రం బాగా తగ్గిందని సమాచారం. -సాక్షి, సిటీబ్యూరో సోషల్ మీడియా కేంద్రంగా.. లద్దాఖ్ను తరచూ సందర్శించే ఉత్తరాది వాసి రట్టన్ ధిల్లాన్, లద్దాఖ్ లోని ముఖ్యపట్టణమైన లేహ్ ఖాళీగా ఉన్నట్లు చూపించే వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘గత 10 సంవత్సరాలుగా లేహ్ను సందర్శిస్తున్నా.. ఇంత తక్కువ మంది పర్యాటకులు ఉన్న లెహ్ పట్టణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది లద్దాఖ్ అంటే నమ్మడం కష్టం’ అంటూ ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు లద్దాఖ్ ప్రస్తుత పరిస్థితికి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. ది తాత్కాలికమేనని తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలలోనే ఎందుకు?పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, జమ్మూ కశ్మీర్లోని పర్యాటక రంగం దెబ్బతింది. హోటళ్ళు, రిసార్టులు హౌస్బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఈ ప్రాంతంలోని పొరుగు ప్రాంతాల్లో, ముఖ్యంగా దాని ప్రక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో కూడా కనిపిస్తోంది. అయితే మరోవైపు యువత మాత్రం తగ్గేదే లేదంటూ రైడర్స్ గ్రూపుల ద్వారా టూర్కు ప్లాన్ చేస్తున్నారు.సాధారణంగా లద్దాఖ్ ప్రాంతం చలికాలంలో మంచు తీవ్రంగా ఉంటుంది. మంచుతో కప్పబడిపోయే రహదారుల వల్ల ప్రయాణం కష్టతరమవడం, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని ఎవరూ ఎంచుకోరు.. అదే మే నెల నుంచి అక్టోబరు వరకూ ఈ ప్రాంతంలో వాతావరణం పూర్తి పొడిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో అద్భుతమైన వైవిధ్యభరితమైన లద్దాఖ్ అందాలను సందర్శించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. మరోవైపు ఈ సీజన్లో దేశంలోని మిగిలిన ప్రాంతాలు వర్షాలతో పర్యటనలకు అంత అనుకూలంగా ఉండకపోవడం కూడా లద్దాఖ్ను ఈ సీజన్లో అత్యంత అనువైన ఎంపికగా మార్చింది అనొచ్చు.అయితే నగరంనుంచి ఏటా ఈ సమయానికి లద్దాఖ్ ప్రయాణానికి హుషారుగా సిద్ధమయ్యే బైకర్లు ప్రస్తుతం కొంత తటపటాయిస్తున్నారని నగరానికి చెందిన బైకర్ సదాశివరెడ్డి అన్నారు. తీవ్రవాద దాడి అనంతరం సెక్యూరిటీ పటిష్టం కావడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులపై బైకర్స్ సందేహంతో ఉన్నారని, అయితే ఇప్పటికే కొందరు బయలుదేరారు కాబట్టి.. వారిని చూసి మరికొందరు కూడా అదే బాట పట్టవచ్చని చెప్పారాయన. లద్దాఖ్ అనేది బైకర్స్కి స్వర్గధామం లాంటిది అంటున్న ఆయన.. ఏటా కేవలం 3, 4 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాన్ని వదులుకోరని అంటున్నారు. బైకర్లలో సందిగ్ధం..అయినా తగ్గేదేలే..: అయితే నగరం నుంచి ఏటా ఈ సమయానికి లద్దాఖ్ ప్రయాణానికి హుషారుగా సిద్ధమయ్యే బైకర్లు ప్రస్తుతం కొంత తటపటాయిస్తున్నారని నగరానికి చెందిన బైకర్ సదాశివరెడ్డి అన్నారు. తీవ్రవాద దాడి అనంతరం సెక్యూరిటీ పటిష్టం కావడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులపై బైకర్స్ సందేహంతో ఉన్నారని, అయితే ఇప్పటికే కొందరు బయలుదేరారు కాబట్టి.. వారిని చూసి మరికొందరు కూడా అదే బాట పట్టవచ్చని చెప్పారాయన. లద్దాఖ్ అనేది బైకర్స్కి స్వర్గధామం లాంటిది అంటున్న ఆయన.. ఏటా కేవలం 3, 4 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాన్ని వదులుకోరని అంటున్నారు. ప్రభావం ఉన్నా.. పుంజుకుంటోంది.. దేశంలో మరే ప్రాంతంలో చూడలేని అనేక అద్భుతమైన ప్రకృతి విశేషాలు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాంతం అక్కడి ప్రకృతి సౌందర్యం అలవాటైతే మళ్లీ మళ్లీ వెళ్లకుండా ఉండడం కష్టం. అందుకే దేశవ్యాప్తంగా లద్దాఖ్ చాలా కాలం నుంచి అనేక మందికి అభిమాన టూరిస్ట్ ప్లేస్గా మారింది. బైక్ రైడర్లకైతే మరింత ఇష్టం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు కార్లు, ఇతర వాహనాల ద్వారా వెళ్లేవారు పెరిగారు. Hard to believe this is Ladakh in June right in the middle of peak season. I’ve been visiting Leh for the past 10 years and have never seen the town this quiet and deserted, with so few tourists around. Looks like Pahalgam incident has had a huge impact! Hoping things… pic.twitter.com/0uc3sPIS3q— Rattan Dhillon (@ShivrattanDhil1) June 11, 2025గత నెలతో పోలిస్తే మెరుగైందంటున్న టూర్ ఆపరేటర్లు: గత ఐదారేళ్లుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ఒకప్పుడు బైక్ రైడర్గా లద్దాఖ్కు వెళ్లడం అలవాటైన నేను ఆ తర్వాత టూర్ ఆపరేటర్గా మారాను. గత పదేళ్లుగా పర్యాటకుల్ని తీసుకెళుతున్నా. తీవ్రవాద దాడి వల్ల సాధారణంగా మే నెల కల్లా ఊపందుకోవాల్సిన పర్యాటకుల సంఖ్య జూన్ నెలకు గానీ పుంజుకోలేదు. ఏదేమైనా ఈ నెలలో పరిస్థితి పూర్తి ఆశాజనకంగా కనిపిస్తోంది. – శ్రవణ్ కొన్నేరు, మ్యాడ్ ఓవర్ లద్దాఖ్ చదవండి: ఉద్ధండ ఆర్టిస్టులు : ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే..

ఉద్ధండ ఆర్టిస్టులు : ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే..
సాక్షి, సిటీబ్యూరో: కళాకారుని సృజనాత్మకతకు మానవత్వం తోడైతే అద్భుతాలు సృష్టించ వచ్చని.. అది అనాథ, నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతుందని పలువురు కళాకారులు నినదిస్తున్నారు. ఇందులో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల విద్యకు సహకారం అందించడమే లక్ష్యంగా పరోపకార –2025 కళా ప్రదర్శన (Art Exhibition) నిర్వహించ నున్నారు. నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నచికేత తపోవన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల సమగ్ర విద్య, సాధికారత కోసం ప్రత్యేక నిధుల సేకరణ కళా కార్యక్రమంగా ‘పరోపకార–2025’ సగర్వంగా ఆవిష్కరిస్తున్నారు. కళ, లగ్జరీ రంగాల్లో వ్యాపారవేత్త అయిన సుష్మ తోట నిర్వహణలో నగరంలోని జూబ్లీ హిల్స్ ‘ది కులినరీ లౌంజ్’ వేదికగా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే.. నా పదేళ్ల అనుభవం.. నచికేత తపోవన్ కోసం ఈ పరోపకార– 2025 భారీ నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టేలా చేసింది. ఈ ఏడాది పరోపకార ఫండ్ రైజింగ్ ప్రధానంగా అనాథ, పేద, గిరిజన, మొదటి తరం విద్యార్థులకు ఉచిత విద్యపై దృష్టి సారిస్తోంది. పరోపకార 2025లో ప్రదర్శించే కళాఖండాల కొనుగోలు ద్వారా వచ్చే ప్రతి రూపాయి చిన్నారులు చదువుకోడానికి ఫీజులు, పుస్తకాలు, యూనిఫారŠమ్స్, ఆహారం అందించే నిధిగా వినియోగిస్తాం. కార్పొరేట్ సంస్థల కోసం ప్రత్యేకంగా ఎన్నో టీమ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలను రూపొందించిన అనుభవం ఉంది.. కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఉన్నటువంటి సంతృప్తి, సంతోషం మరెక్కడా లభించదు. విద్య, ఆరోగ్యం అనేవి ప్రతి ఒక్కరి హక్కు.. కలిసొచ్చే అదృష్టం కాదు. – సుష్మ తోట, నిర్వాహకులు. ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శన.. ఉచిత విద్య, సామాజిక సేవ లక్ష్యంతో సుష్మ తోట సంకలనం చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం.. కళను సమాజిక మార్పుకు నాంది పలికే విధంగా సరికొత్త లక్ష్యంతో మిళితం చేస్తుంది. ప్రఖ్యాత కళాకారులు తోట వైకుంఠం(Thota Vaikuntam), జోగెన్ చౌదరి, శక్తి బర్మన్, ఏలే లక్ష్మణ్(Laxman Aelay), రమేష్ గోర్జాల తదితరుల అద్భుతమైన కళాకృతులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్న చిన్నారుల ఆధ్వర్యంలో కూడా హృదయాన్ని హత్తుకునే ప్రదర్శనలు ఉంటాయి. ఈ వేదికగా రెండు రోజుల ప్రదర్శనలో ప్రసిద్ధ కళాకారులతో సమావేశాలు, విద్యార్థులతో సంభాషణలు ఉంటాయి.

Yoga సంపూర్ణ ఆరోగ్యం కోసం ఖర్చు లేని మందు, కానీ..!
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా‘సంపూర్ణ ఆరోగ్యానికి ఖర్చులేని మందు, మానసిక వికాస సిద్ధి, శరీరం – మనసు మధ్య సమతుల్య సాధనకు సహాయపడేది యోగాఒక్కటే’ అనే నినాదం మార్మోగుతోంది. విశాఖపట్నంలో యోగా ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననుండడం మరో విశేషం. విద్యాలయాల్లో గతంలో ప్రతిరోజూ ఒక పీరియడ్ ‘డ్రిల్ క్లాసు’ కోసం కేటాయించేవారు. తొలుత పరు గుతో పాటు ఆపై అనేక క్రీడల్లో విద్యార్థు లకు శిక్షణ ఇవ్వడానికి పీఈటీ,ఎంపీఈడీ, బీపీఈడీ టీచర్లు, అధ్యాప కులు ఉండేవారు. ఆపై వేలాది మంది శిక్షకులు విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చే వారు. విద్యాలయాల్లో రానురాను వీరి నియామకాలు నిలిచిపోవడంతో, ఏకంగా పలు క్రీడాంశాలే మటు మాయమయ్యాయి.గతంలో ప్రతి ఏటా జోన్, సెంట్రల్ జోన్, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో జరిగే క్రీడాపోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇవి వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేవి. ప్రస్తుతం జిల్లా స్థాయిలో మొక్కుబడిగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలోనూ అనేక విద్యా లయాలకు కనీస ప్రాతినిధ్యం కూడా లభించడం లేదు. నేడు అనేక పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాపరికరాలు సైతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక విద్యాలయాల్లో వ్యాయామ విద్యకు చోటెక్కడున్నట్టు? అలాగే, ప్రభుత్వ గుర్తింపు పొందిన వేలాది పాఠశాలలు జానెడు ఖాళీ స్థలానికి కూడా నోచుకోని అపార్ట్మెంట్లలో నడుస్తున్నాయి. కచ్చితంగా ఆటస్థలం ఉండాలనే విద్యాశాఖ నిబంధనలున్నా, ఫలితం మాత్రం శూన్యం! ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?యోగా, వ్యాయామ విద్యల మధ్య పెద్దగా తేడాలేమీ లేవు. రెండింటిలోనూ శారీరక భంగిమలు 70 శాతం సమానం. వ్యాయామంలో తొలుత రన్నింగ్ ఉంటే, యోగాలో మెడిటేషన్ ఉంటుంది. రన్నింగ్ తర్వాత యోగా చేస్తే సత్ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, ఆధునిక కాలానుగుణంగా వ్యాయామ విద్యలో అవసరమైన మార్పు–చేర్పులు చేసి, ఉన్నత పాఠశాలల్లోని ప్రతి విద్యార్థీ విధిగా నిత్యం ‘స్పోర్ట్స్ పీరియడ్’లో పాల్గొనేలా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోగలిగితే... యోగా ఉన్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పడంలో సందేహించాల్సింది లేదు.చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో– నిమ్మరాజు చలపతిరావు ( జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం)
ఫొటోలు
అంతర్జాతీయం

క్లస్టర్ బాంబుతో ఇజ్రాయెల్ గజగజ
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం 8వ రోజుకి చేరగా.. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు దిగింది. అసలు ఈ క్లస్టర్ బాంబు అంటే ఏమిటి? వాటి ప్రమాద తీవ్రత ఎంత?. ఆ బాంబును చూసి ఇజ్రాయెల్ ఎందుకు వణికిపోతోంది? వాటిని నిషేధం నిజంగానే అమల్లో ఉందా?.. క్లస్టర్ బాంబు అనేది ఒక క్షిపణిలా కనిపించినా.. అది గాలిలోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన సబ్మ్యూనిషన్లు (submunitions) అనే మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. భూమిని తాకిన వెంటనే అవి పేలిపోతాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై జరిపిన తాజా దాడిలో.. ఒక మిసైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి, దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు (submunitions) సెంట్రల్ ఇజ్రాయెల్లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడినట్టు నమోదైన ఇది మొట్టమొదటి కేసు.మోస్ట్ డేంజర్ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయనేది ఇజ్రాయెల్ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు.. భారీ ముప్పును కలిగించేందుకు.. ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. డ్యామేజ్ ఏంటంటే.. ఇజ్రాయెల్ వార్తా సంస్థ ప్రకారం.. జూన్ 19న జరిగింది ఇదే. క్షిపణుల్లో ఒకటి అజోర్లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. వివాదాలకు కేరాఫ్గా..క్లస్టర్ బాంబులను వివాదాలకు కేంద్ర బిందువుగా చెబుతుంటారు. అందుకు కారణం.. ఇవి కలిగించే నష్టమే. సాధారణ క్షిపణి ఒక్క స్థలంలో పెద్ద పేలుడు కలిగిస్తుంది. కానీ క్లస్టర్ బాంబు చిన్న చిన్న మ్యూనిషన్లను పెద్ద ప్రాంతంలో చల్లుతుంది. ఒక్కో submunition శక్తి తక్కువైనా, దాని విస్తృత పరిధి కారణంగా ఎక్కువమందికి ప్రమాదం కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా జనావాసాలపై గనుక పడితే వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటిలో కొన్నివాటిని భూమిని తాకిన వెంటనే పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి తరువాత కాలంలో కూడా పౌరులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీటి వినియోగంపై ఆంక్షలున్నాయి. 2008లో జరిగిన క్లస్టర్ మ్యూనిషన్లపై సమావేశ ఒప్పందం ప్రకారం.. ఈ బాంబులను ఉపయోగించడం, నిల్వ చేయడం, అమ్మకాలు-కొనుగోలు జరపడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఒప్పందంపై 111 దేశాలు, 12 ఇతర ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా, భారత్ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2023లో ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా క్లస్టర్ బాంబులను అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా తమపై క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైతం ఆరోపించింది. U.S. President Joe Biden is under scrutiny for providing Ukraine with cluster bombs.But what makes cluster bombs so controversial?#clusterbomb #joebiden #internationaltreaty #treaty pic.twitter.com/JCuAe0RM9H— CGTN Europe Breaking News (@CGTNEuropebreak) July 11, 2023

అమెరికాతో మాకేంటి.. ఇరాన్ సంగతి మేమే తేలుస్తాం: నెతన్యాహు
టెలీ అవీవ్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందన్నారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేము అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్పై దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే. ఇరాన్లో ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉంది. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వేచి చూసే ఆలోచనేమీ లేదు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదు. ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం మాకు లేదు. అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయం’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలవాలని అటు అమెరికా అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
టెలీ అవీవ్: ఇరాన్తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ ‘త్యాగం’ అని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయడం లేదు.. దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్కు నష్టం జరుగుతోంది. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ ‘హీరో’. పెళ్లి వాయిదా కుటుంబ ‘త్యాగం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మీ కుటుంబాన్ని ఒక త్యాగమేనా?. యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం సమయంలో ఎంతోమంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే.. మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉండగా.. అప్పుడు యుద్ధం కారణంగా మొదటిసారి వాయిదా పడింది. ఇక, రెండో సారి ఇరాన్తో యుద్ధం కారణంగా వాయిదా పడింది.

భారత్ దాడులతో వణికిపోయాం.. పాక్ డిప్యూటీ పీఎం షాకింగ్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ ఎట్టకేలకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై స్పందిస్తోంది. ఆపరేషన్ సిందూర్ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు పాక్ నేతలు ఒక్కొక్కరుగా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ చేరిపోయారు. తాజాగా ఆపరేషన్ సిందూర్పై ఇషాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వైమానిక దాడులు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ మాపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్లోని రెండు ముఖ్యమైన వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్, షోర్కోట్ ఎయిర్బేస్లపై భారత్ విరుచుకుపడింది. దీంతో, రెండు ఎయిర్బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్పై పాకిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. అందుకే ప్రతి దాడి చేయలేకపోయాం. దాడుల విషయంలో భారత్ వేగంగా స్పందించింది. భారత్తో యుద్ధం అంత తేలిక కాదు.భారత దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా నాతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో మాట్లాడాలని యువరాజు సూచించారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికా సైతం భారత్ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు.Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview 📍India struck the Nir Khan Air base and Shorkot Air base 📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu— OsintTV 📺 (@OsintTV) June 19, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చేసిన దాడులను పాక్ ప్రధాని అంగీకరించారు. బాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్ వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజాము 2.30కి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్ఖాన్ ఎయిర్బేస్తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని మునీర్ తనతో చెప్పారన్నారు. ఇక, షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
జాతీయం

స్కూటీకి రూ. లక్ష... నంబర్కు రూ.14 లక్షలు
సిమ్లా: బైక్ లేదా కారు.. వాహనం ఏది కొ న్నా, రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకుంటాం. ఏదైతే ఏముందిలే? అని కొందరనుకుంటే.. ఇష్టమైన నంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేయాలనుకుంటారు మరికొందరు. ఈ కోవలోకే వస్తాడు హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఈ వ్యక్తి. లక్ష రూపాయలు పెట్టి కొన్న స్కూటీకి వీఐపీ నంబర్ హెచ్పీ21సీ–0001 కోసం ఏకంగా రూ.14 లక్షలు చెల్లించాడు. ఆ నంబర్ కోసం వేలంలో ఇద్దరే పాల్గొనడం గమనార్హం. సోలన్ జిల్లాలోని బడ్డీకి చెందిన ఓ వ్యక్తి రూ.13.5 లక్షలు పాడగా.. హమీర్పూర్కు చెందిన సంజీవ్ కుమార్ అతని కంటే ఎక్కువగా రూ.14 లక్షలకు ఆ నంబర్ను కైవసం చేసుకున్నాడు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇదే. తనకు ప్రత్యేకమైన నంబర్లను సేకరించడం ఇష్టమని చెప్పే సంజీవ్ కుమార్.. ఫ్యాషన్ ముందు డబ్బులు లెక్క కాదంటున్నాడు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడం తప్పదని చెబుతున్నాడు.

ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను
సివాన్: నిత్యం ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాత్రి పగలు ప్రజల కోసమే పని చేస్తున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం బిహార్, ఓడిశాలో పర్యటించారు. తొలుత బిహార్లోని సివాన్ జిల్లాలో రూ.5,900 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. బిహార్లోని పాటలీపుత్ర జంక్షన్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను ఆర్జేడీ అవమానించిందని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను అంబేడ్కర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అందుకే అంబేడ్కర్ అంటే ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు ఇష్టం లేదన్నారు. బాబాసాహెబ్ చిత్రపటాన్ని ఆర్జేడీ నేతలు పాదాలతో తొక్కేశారని, దీనిపై క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తే ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంబేడ్కర్ కంటే తామే గొప్పవాళ్లమని ఆర్జేడీ–కాంగ్రెస్ నాయకులు అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ తన హృదయంలో ఉన్నాడని, ఆయన చిత్రపటాన్ని గుండెకు హత్తుకోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు కొల్లగొట్టడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కాచుకొని కూర్చున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం ‘‘భారతదేశ ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. నిన్ననే విదేశాల నుంచి తిరిగొచ్చా. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి నేతలు మన దేశ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేదల సాధికారతకు ఎదురవుతున్న అడ్డంకులను ఎన్డీయే ప్రభుత్వం తొలగిస్తోంది. గత 11 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. అభివృద్ధి కోసం అహోరాత్రులూ శ్రమిస్తున్నాం. బిహార్లో మళ్లీ జంగిల్రాజ్ రావొద్దంటే విపక్ష ఇండియా కూటమి ఓడించాలి. ఎన్డీయే నినాదం సబ్కా సాత్, సబ్కా విశ్వాస్. విపక్ష కూటమి నినాదం పరివార్కా సాత్, పరివార్కా వికాస్. సొంత కుటుంబాల అభివృద్ధి తప్ప ప్రజలంటే వారికి లెక్కలేదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదా?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. భువనేశ్వర్లో తిరంగా యాత్ర ప్రధాని మోదీ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో తిరంగా యాత్ర, రోడ్షోలో పాల్గొన్నారు. ఎయిర్పోర్టు నుంచి జనతా మైదాన్ వరకు 9 కిలోమీటర్ల మేర జరిగిన ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరంగా యాత్ర నిర్వహించారు. రూ.18,600 కోట్లకుపైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా.. వాషింగ్టన్లో పర్యటించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించగా, తాను తిరస్కరించానని ప్రధాని మోదీ చెప్పారు. వాషింగ్టన్ పర్యటనకు బదులు ఒడిశాను ఎంచుకున్నానని తెలిపారు. భువనేశ్వర్ సభలో ఆయన మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ నాతో ఫోన్లో మాట్లాడారు. వాషింగ్టన్కు రావాలంటూ ఆహ్వానించారు. చర్చించుకుందామని, కలిసి భోజనం చేద్దామని అన్నారు. ఆహ్వానించినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలియజేశా. జగన్నాథుడు కొలువుదీరిన ఒడిశాకు వెళ్లాల్సి ఉందని చెప్పా. వాషింగ్టన్కు రాలేనంటూ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు.

సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
షిల్లాంగ్: సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యకేసు మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ప్రతి సంఘటన ఒక్కో క్లైమాక్స్ను తలపిస్తోంది.తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పెళ్లైన పదకొండు రోజులకే సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీకి ఇష్టం లేకపోయినా హనీమూన్ పేరిట మేఘాలయాకు తీసుకెళ్లి, ముందస్తు ప్లాన్ ప్రకారం.. సుపారీ కిల్లర్ల సాయంతో హత్య చేయించిన విషయం తెలిసిందే. హత్య అనంతరం, మేఘాలయా నుంచి తన పుట్టినిల్లు ఉత్తరప్రదేశ్ వచ్చేందుకు సోనమ్ రఘువంశీ బురఖా ధరించి సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ప్రయాణం సమయంలో కనీసం ఎక్కడా తినకుండా నిర్విరామంగా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో ఆమెను బోర్డర్ దాటించిన వెహికల్ డ్రైవర్ చెప్పాడు.రాజా రఘువంశీ కేసును మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇండోర్లో సోనమ్ రఘువంశీని ఉత్తర్ప్రదేశ్కు తీసుకొచ్చిన కారు డ్రైవర్లు మోహిత్,పియూష్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన మోహిత్ను పోలీసులు విచారించారు.సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ‘జూన్ 8 మేఘాలయా నుంచి ఉత్తర ప్రదేశ్కు చేర్చేందుకు తీసుకెళ్లేందుకు ఎర్టిగో మాట్లాడుకున్నారు. రాజ్ సూచన మేరకు మోహిత్, పియూష్ ఆమెను తీసుకెళ్లారు. ప్రయాణం నిమిత్తం నన్ను(మోహిత్),పియూష్ని పనిలోకి తీసుకున్నారు. అప్పటికే మేఘాలయ సోహ్రాలోని ఓ లోయలో కుళ్ళిన రాజా రఘువంశీ రాజ్ మృతదేహాం లభ్యమై ఏడు రోజులవుతుంది.ఇక ఎర్టిగోలో మా ప్రయాణం ప్రారంభమైంది. సోనం బుర్ఖాలో మారువేషంలో ఉంది. మేం ఏదైనా తినాలని రోడ్డు పక్కన కారు ఆపినా అందుకు ఒప్పుకోలేదు. ఇలా మేఘాలయ నుండి వారణాసికి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం జరిగింది. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు సోనంను ప్రశ్నిస్తున్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే ఇన్ని వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించిందా? తాజా పరిణామంతో రాజా రఘువంశీ హత్యలో కూడా ఆమె ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

‘ ఇది పాకిస్తాన్కు అత్యంత చిరాకు కల్గించే అంశం’
న్యూఢిల్లీ: ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికాలో పర్యటించడమే కాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డిన్నర్ మీట్లో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై ప్రజల్లో ఆసక్తికర చర్చ ఇంకా సాగుతూనే ఉంది. పాక్ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు వెళ్లకుండా ఒక ఆర్మీ చీఫ్ వెళ్లడం ఏంటనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. పాకిస్తాన్లో నియంత పాలన మనకు కొత్తేమీ కాదు. గతంలో పర్వేజ్ ముష్రాఫ్.. పాకిస్తాన్ పీఠాన్ని ఎలా అధిరోహించారో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆ తరహా లక్షణాలున్న వ్యక్తి అసిమ్ మునీర్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడైన అసిఫ్ మునీర్కు అత్యంత క్రూరుడు, నియంత అనే అపవాదు కూడా ఉంది. మరి ఈ తరహా లక్షణాలుండటమే కాకుండా ఆర్మీ చీఫ్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని అగ్రరాజ్యం ఆహ్వానించడమే ప్రధానంగా చర్చ. అది కూడా భారత్తో జరిగిన యుద్ధం అనంతరం చోటు చేసుకున్న పరిణామం ఇది. అంటే ఇక్కడ పాకిస్తాన్కు అమెరికా ఏ తరహా సహకారం అందిస్తుందో అనేది క్లియర్గానే తెలిసిపోతుంది.ఇదిలా ఉంచితే, ఈ అంశంపై భారత డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ పరోక్షంగా స్పందించారు. ‘ ప్రధాని కనిపించకుండా ఒక ఆర్మీ చీఫ్ దేశ అంతర్గత విషయాలు చర్చించడం నిజంగానే పాకిస్తాన్కు అత్యంత చిరాకు కల్గించే అంశమన్నారు. ‘ ఇది నా అభిప్రాయం కాకపోయినా, ఏ దేశమైనా ఇలానే అనుకుంటుంది. ప్రధానికి స్థానం లేకుండా ఆర్మీ చీఫ్కు ప్రత్యేక స్థానం ఇవ్వడం అనేది ఆశ్చర్యం కల్గిస్తుంది. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది కూడా’ అని రాజేశ్ కుమార్ తెలిపారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

సాఫ్ట్వేర్ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. ఈస్ట్మారేడ్పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్మెట్కు చెందిన అమృత్కు ఇచ్చి వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్కు ఫోన్ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, ప్రణీత్రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.

ప్రియుడే కాలయముడు?
విశాఖపట్నం: భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి బీచ్రోడ్డు సమీపంలోని జీడి తోటలో బంగారు కవిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడే కవితను కిరాతకంగా హత్య చేసి.. నెల రోజులుగా ఏమీ ఎరుగనట్టు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్రైమ్ సినిమా కథను తలపించేలా సాగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివి.. కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవితకు, భీమిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు బొడ్డు రాజుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితను అడ్డు తొలగించుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడదామనే నెపంతో గత నెలలో ఆమెను బీచ్రోడ్డు సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమెపై రాయితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్కనే ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి, ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసి వచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఏమీ తెలియనట్టు అందరితో కలిసి తిరుగుతూ, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. కవిత కనబడటం లేదని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానంతో రాజును పలుమార్లు విచారించారు. అయినప్పటికీ తనకు ఏమీ తెలియదని నమ్మబలుకుతూ దర్యాప్తును పక్కదారి పట్టించాడు. అయితే కవిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ఆధారాలతో బొడ్డు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఒక వైపు దారుణ హత్యకు పాల్పడి, మరో వైపు నెలరోజుల పాటు అందరినీ నమ్మించిన రాజు తీరుపై పోలీసులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.