Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Extends Yoga Day Wishes1
‘యోగా’ మన జీవితంలో భాగం కావాలి: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘యోగా అనేది మన శరీరం, ఆత్మ రెండింటిపైన పని చేస్తుంది. ప్రశాంతతను పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి యోగాను.. మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం’ అని తెలిపారు.Working on both body and spirit, Yoga helps develop strength and tranquility. On this #InternationalYogaDay, let us commit to making this timeless practice a part of our daily lives.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2025

Yoga day Celebrations In Vijayawada Side Screen Fall2
ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత

సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న కేంద్రం వద్ద లైవ్ సైడ్ స్క్రీన్ పక్కకు పడిపోయింది. ఈ క్రమంలో పక్కనే యోగా చేసే వారిపై స్కీన్‌ పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.మరోవైపు.. విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో యోగా సందర్భంగా అరకొరగా వసతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగా చేసేందుకు స్టేడియంకు వచ్చిన వారికి కావాల్సిన మొత్తంలో మ్యాట్స్‌ ఇవ్వకపోవడంతో వాటి కోసం అందరూ ఎగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారికి చెదరగొట్టారు.ఇదిలా ఉండగా.. విశాఖలో యోగా డే సందర్భంగా ప్రమాదం తప్పింది. యోగా డే వేడుకల కోసం ప్రజలను తరలిస్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హనుమంతువాక విశాలాక్షి నగర్ వద్ద బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారంతా బస్సు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

Iran Supreme Leaders Old Posts Resurface Internet3
మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్‌ సుప్రీం

టెహ్రాన్: ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య ఘర్షణలు ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పాత వివాదాస్పద పోస్టులు మరోమారు వైరల్‌గా మారాయి. మహిళల గురించి, ఉదారవాదంపై ఆయన చేసిన చేసిన పోస్టులు తిరిగి ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్ట్‌లలో ఖమేనీ మహిళల హక్కులపై స్పందించడమే కాకుండా, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. Man has a responsibility to understand #woman’s needs and feelings and must not be neglectful toward her #emotional state— Khamenei.ir (@khamenei_ir) September 15, 2013ఈ పోస్టులలో కొన్ని దశాబ్దకాలం క్రితం నాటివి. ఇవి ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయి. సోషల్ మీడియా యూజర్స్‌ ఈ పోస్ట్‌లను చూసి కంగుతింటున్నారు. మహిళలను ఉద్దేశించిన ఆయన చేసిన పోస్ట్‌లలో ​కొన్ని లైంగిక వాంఛల పరమైనవి ఉన్నాయి. మరికొన్ని ప్రేమను పెంపొందించే సలహాలతో కూడినవై ఉన్నాయి.‘పురుషుడు.. స్త్రీ అవసరాలను, భావాలను అర్థం చేసుకునే బాధ్యతను కలిగి ఉండాలి. ఆమె భావోద్వేగ స్థితి విషయంలో పురుషుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు’ అని ఖమేనీ ఒక పోస్టులో పేర్కొన్నారు.Women are stronger than men. Women can completely control and influence men with their wisdom and delicacy. May 11, 2013— Khamenei.ir (@khamenei_ir) March 7, 20182013 నాటి ఒక పోస్ట్‌లో ఖమేనీ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. ‘నేను మొదటి రోజున ప్రత్యేకమైన దుస్తులతో పాఠశాలకు వెళ్లాను. అయితే వాటిని ఇతర పిల్లల ముందు ధరించడం అసౌకర్యంగా అనిపించింది. కానీ సరదాగా ఉండటం ద్వారా ఆ పరిస్థితిని అధిగమించాను’ అని ఆయన రాశారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాసిన పుస్తకం తాను చదవడంపై కూడా ఖమేనీ వ్యాఖ్యానించారు. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ని అధ్యయనం చేయముందు నాకు భారతదేశం గురించి తెలియదు.ఈ వలసరాజ్యం పలు ఎత్తుపల్లాలను చూసింది’ అని రాశారు.I went 2school w/a cloak since1st days;it was uncomfortable 2wear it in front f other kids,but I tried 2make up 4it by being naughty&playful— Khamenei.ir (@khamenei_ir) September 24, 2013ఖమేనీ ఈ తరహా వ్యాఖ్యలపై సోషల్ మీడియా యూజర్స్‌ స్పందించారు. ఒక యూజర్‌..‘క్షమించండి, అయతుల్లా ఖమేనీ.. మీ గేమ్‌ల గురించి నాకు తెలియదు’ అని అన్నారు. మరొక యూజర్‌ ‘ప్రేమికునిగా పుట్టి, సుప్రీం నేతగా ఉండవలసి వచ్చింది’ అని అన్నారు. Before studying "Glimpses of World History" by Mr. #Nehru I didn't know #India before colonization had undergone so many important #advances— Khamenei.ir (@khamenei_ir) August 6, 2013 ఇంకొకరు ‘పాత ట్వీట్‌లు మళ్లీ తెరపైకి వచ్చినా, వాటిని తొలగించని మొదటి వ్యక్తి అయతుల్లా ఖమేనీ’ అని అన్నారు. ఇజ్రాయెల్, యూఎస్‌లు ఒత్తిడిని పెంచుతున్నప్పటికీ, తాను లొంగిపోయేది లేదని ఖమేనీ స్పష్టం చేసిన తరుణంలో ఈ పోస్టులు వైరల్‌గా మారాయి.ఇది కూడా చదవండి: ట్రంప్‌-మునీర్ భేటీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

BRS MLA Kaushik Reddy Arrest Related Updates4
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌.. వరంగల్‌లో ఉద్రిక్తత

కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ అప్‌డేట్స్‌.. 👉బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకింది. అక్రమ కేసులో అరెస్టయిన కౌశిక్‌ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్‌ఎస్‌ నేతలు భారీ సంఖ్యలో పీఎస్‌ వద్దకు చేరుకున్నారు. దాస్యం వినయ్‌ భాస్కర్‌, రాకేశ్‌ రెడ్డి తదతరులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అని తెలియగానే హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్న హనుమకొండ మాజి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారిని ఏనుగుల రాకేష్ రెడ్డి అడ్వొకేట్లను అడ్డుకున్న పోలీసులు -Team PKR pic.twitter.com/rfjXBJNBTF— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 21, 2025👉ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా స్టేషన్‌ బయటే అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.👉హరీష్‌ రావు సీరియస్‌.. కౌశిక్‌ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది.రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడు.కేసులు, అరెస్టులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.నీ వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోస పూరిత వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం.అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.బిఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.ఇందిరమ్మ…— Harish Rao Thanneeru (@BRSHarish) June 21, 2025👉అయితే, మనోజ్‌ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఎమ్మెల్యే తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు.👉దీనిపై 308(2), 308(4), 352 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరికాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి కౌశిక్‌ రెడ్డిని తరలించనున్నారు. అక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరుచనున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025

Kubera Movie Making Video5
'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా

ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' థియేటర్లలోకి వచ్చేసింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చాలారోజుల తర్వాత థియేటర్లు కాస్త కళకళలాడుతున్నాయి. ధనుష్ నటనని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం నటీనటులు అందరూ ఎంత కష్టపడ్డారనే మేకింగ్ వీడియోని టీమ్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ఈ వీడియోలో అసలు రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ ఎలా చేశారనేది చూపించారు. అలానే సినిమాలో కొన్నిసీన్లు చెత్తకుప్పలో చిత్రీకరించారు. కొన్నిసార్లు నిజమైన డంప్ యార్డ్‌లో తీసినప్పటికీ మరికొన్ని సార్లు కృత్రిమంగా అలాంటి ప్రదేశాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. మేకింగ్ వీడియోలోనూ ఈ బిట్ చూపించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాలో బడా వ్యాపారులు వేల కోట్ల సంపదతో ఎలాంటి మోసాలు చేస్తున్నారనే విషయాల్ని చూపించారు. ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించగా.. నాగార్జున సీబీఐ అధికారిగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించారు. ఫస్టాప్‌లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర కాగా.. సెకండాఫ్‌లో హీరోకి సాయపడే వ్యక్తిగా కనిపించారు. చాలారోజుల తర్వాత నాగ్ ఫెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. రష్మిక ఎప్పటిలానే తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. వీకెండ్ పూర్తయితే ఈ మూవీ రిజల్ట్‌పై ఫుల్ క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా)

minister Bandi Sanjay Sensational Comments On Phone Tapping6
‘సిరిసిల్ల అడ్డగా ఫోన్‌ ట్యాపింగ్‌.. ప్రభాకర్‌ రావు కారణంగానే అరెస్ట్‌ అయ్యా’

సాక్షి, కరీంనగర్: హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. ప్రభాకర్ రావు చాలామంది‌ సంసారాలు నాశనం చేశారు.. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు.ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. తాజాగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘అందరికంటే ఎక్కువ ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు చేసింది నేనే. హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక‌ మంది ఉసురు పోసుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?. ఫోన్ ట్యాపింగ్‌కు కారణం కేసీఆర్, కేటీఆరే. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది.ప్రభాకర్ రావు‌ సీఎంవో ఆఫీసుని అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం బంద్ చేయండి. అందరి జీవితాలు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. నన్ను పేపర్ లీక్ అయ్యిందని ప్రభాకర్ రావు అదేశాల మేరకే అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణను సర్వనాశనం చేసిందే కేసీఆర్ ఫ్యామిలీ. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు పోయారు?. కేటీఆర్ అమెరికా పోయి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఇండియాకు వచ్చాడు. నాకు‌ సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. విచారణకు హాజరవుతాను’ అని స్పష్టం చేశారు.

Omar Abdullah on Trump Munir Lunch7
ట్రంప్‌-మునీర్ భేటీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

శ్రీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- పాక్‌ సైన్యాధ్యక్షుడు అసిఫ్‌ మునీర్‌ల లంచ్‌ భేటీపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన ప్రయోజనాలను పొందేవరకు మాత్రమే ఇతర దేశాలతో స్నేహం చేస్తుందని, వాషింగ్టన్ తనను తాను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.‘అమెరికా అధ్యక్షుడు తన ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎవరిని విందుకు ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదో మనం ఆయనకు చెప్పగలమా? అమెరికా అధ్యక్షుడు మనకు ప్రత్యేకమైన స్నేహితుడు అని మనం భావిస్తుంటాం. ఆయన మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది వేరే విషయం. అమెరికా తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. అవసరం లేనప్పుడు మరే ఇతర దేశాన్ని పట్టించుకోదు’ అని శ్రీనగర్ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు. ఆయన తన తండ్రి ఫరూక్ అబ్దుల్లాతో కలిసి వందే భారత్ రైలులో జమ్మూకు వెళ్లారు. ఈ రైలు సేవలను ఆయన కొనియాడారు.ఇది కూడా చదవండి: International Yoga Day: యోగాభ్యాసంపై కింగ్ చార్లెస్ ఏమన్నారంటే..

where Tesla set to open its first showroom in india8
వచ్చే నెలలో టెస్లా షోరూమ్‌ ఓపెన్‌

ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్‌లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్‌ ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. యూరప్‌, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌, మస్క్‌ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అ‍మ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్‌ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్‌కు భారత్‌ భారీ మార్కెట్‌గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌ అయిన భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించనుందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ముంబయిలో షోరూమ్‌ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్‌ ఓపెన్‌ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్‌టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్‌యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్‌లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్‌లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది.

 Interesting Moral story on gangamma moongdal9
పెసరపప్పు : ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు

అనగనగా ఒక ఊరిలో గంగమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె భర్త ఒక దుకాణంలో పని చేస్తూ ఉండేవాడు. అతను తెచ్చే కొద్ది జీతంతోనే ఆమె గుట్టుగా సంసారాన్ని నడిపేది. ఎవరి దగ్గరా చేయి చాచకుండా లౌక్యంగా పనులు చక్కబెట్టేది. ఒకసారి వాళ్లింటికి చుట్టాలు వస్తున్నారని కబురు వచ్చింది. ఇంట్లో సరుకులేమీ లేవు. వచ్చినవారికి ఏం వండిపెట్టాలా అని ఆలోచిస్తుండగా డబ్బాలో ఎప్పుడో దాచిన పెసరపప్పు కనిపించింది. వచ్చినవారికి అదే వండి పెట్టాలని అనుకొని బయటకు తీసింది. నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఎండలో ఆరబెట్టింది. కాసేపటికి కొన్ని కాకులు ఆ పప్పును కాళ్లతో తొక్కి, తింటూ ఎంగిలి చేశాయి. గంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తరిమింది. కాకులు ఎంగిలి చేసిన పప్పుతో అతిథులకు వంట వండిపెట్టడం ఆమెకు మనస్కరించలేదు. కానీ ఏదైనా కొందామంటే చేతిలో డబ్బు లేదు. వెంటనే ఓ ఉ΄ాయం ఆలోచించి, ఆ పప్పును మూటగట్టి వీధి చివరున్న ఓ ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంటి ఇల్లాలు చాలా అమాయకురాలని పేరు. గంగమ్మ ఆమె దగ్గరికి వెళ్లి, తన దగ్గరున్న పప్పు చూపించి ‘నాణ్యమైన పెసరపప్పు. ఇప్పుడే కడిగి ఆరబోశాను. మా ఆయనకు ఇవాళ వేయించిన పప్పు తినాలని ఉందంట. కానీ ఇప్పుడు దీన్ని వేయిస్తే బాగుండదు. దీన్ని నువ్వు తీసుకొని నీ దగ్గరున్న పప్పు ఇస్తావా?’ అని అడిగింది. అవతలున్న ఇల్లాలు చాలా సంతోషించింది. ‘హయ్యో! ఈ గంగమ్మ ఎంత పిచ్చిది! కడిగి, ఆరబెట్టిన పప్పు ఇచ్చి దుమ్ముతో ఉండే పప్పు అడుగుతోంది’ అని అనుకొని ఆ పప్పు తీసుకొని తన దగ్గరున్న పప్పు గంగమ్మకు ఇచ్చి పంపింది. ఇదంతా ఇంట్లో నుంచి వాళ్లాయన గమనించాడు. భార్యను పిలిచి, ‘పిచ్చిదానా! శుభ్రమైన పప్పును మనకు ఇచ్చి, మన దగ్గరున్న పప్పు అడగటానికి గంగమ్మ అంత తెలివితక్కువ మనిషి కాదు. ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు. ఈ పప్పులో ఏదో దోషం ఉండి ఉంటుంది. దాన్ని పారేయ్‌’ అని చెప్పాడు. ఆయన భార్య ‘అయ్యో’ అనుకుంటూ ఆ పెసరపప్పును పారేసింది.నీతి: ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు. అలా ఇస్తే అందులోని ఆలోచనను గుర్తించాలి.

Pak nominates Donald Trump for 2026 Nobel Peace Prize10
అమెరికాతో పాక్‌ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరు ప్రతిపాదన

ఇస్లామాబాద్‌: అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం పాకిస్తాన్‌ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బహిర్గతమైంది. ట్రంప్‌ విషయంలో పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరు పాక్‌ ప్రతిపాదించింది. దీంతో, ఈ విషయంలో హాట్‌ టాపిక్‌గా మారింది.వివరాల ప్రకారం.. 2026 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరును పాకిస్తాన్‌ ప్రతిపాదించింది. ఈ సందర్బంగా పాకిస్తాన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్‌ కుదిర్చారని తెలిపింది. ఆయన వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రశంసలు కురిపించింది. భారత్‌ మాత్రం పాకిస్తాన్‌పై దాడికి పాల్పడి ప్రాణ నష్టానికి కారణమైందని ఆరోపించింది. ట్రంప్‌ దౌత్యం వల్లే యుద్దం ముగిసిందని చెప్పుకొచ్చింది.🇵🇰 BREAKING: Pakistan nominates Donald Trump for Nobel Peace Prize! 🏆Because obviously, “ceasefire magic” happened just on Trump’s request 🙃No military diplomacy, no DGMOs, no backchannel talks - just one phone call from The Donald, and India-Pakistan hugged it out! 💥📞🕊️… pic.twitter.com/BQSkJt936b— Raksha Samachar | रक्षा समाचार 🇮🇳 (@RakshaSamachar) June 21, 2025రెండు దేశాల మధ్య జోక్యం నిజమైన శాంతి స్థాపకుడిగా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను స్పష్టం చేసింది. చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించాలనే ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం అని కీర్తించింది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ పదే పదే చేసిన ప్రతిపాదనలకు ఇస్లామాబాద్ కూడా ప్రశంసించింది. ఆయన ప్రమేయంతో దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని పేర్కొంది. చివరగా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండా.. ఈ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి నెలకొనదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.JUST ANNOUNCED: Pakistan nominates President Donald Trump for 2026 Nobel Peace Prize 🇺🇸PEACEMAKER-IN-CHIEF TRUMP! 🇺🇸 pic.twitter.com/ihGlDz1iZp— Ape𝕏 (@CubanOnlyTrump) June 20, 2025అయితే, ట్రంప్‌ పేరును ప్రతిపాదించిన సందర్భంగా భారత్‌ విషయాలు, కశ్మీర్‌ అంశంపై ప్రస్తావించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ట్రంప్‌.. కశ్మీర్‌ అంశమై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాక్‌ మధ్య కశ్మీర్‌ వివాదంపై తాను మధ్యవర్తిత్వం కూడా తీసుకుంటాని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు, తాజాగా పాక్‌ సైతం ఇదే ప్రస్తావన తేవడంతో కొత్త ప్లాన్‌ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కశ్మీర్‌, పీఓకే విషయంలో భారత్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్‌కు నోబెల్‌ అంటే ఎంత ఇష్టమంటే.. అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్‌ అవార్డుపై ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నారు. పలుమార్లు తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌ అధినేత నెతన్యాహుతో సమావేశం సందర్భంగా వాళ్లు నాకు ఎప్పటికీ నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వరు. అది ఏమాత్రం బాగోలేదు. నేను అర్హుడను అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ఒబామాకు దీనిని ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే సంధి కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీనిని పాక్‌ బాగానే గమనించింది. ఇటీవల ఫీల్డ్‌ మార్షల్‌ అసిం మునీర్‌ మాట్లాడుతూ భారత్‌-పాక్‌ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్‌ నోబెల్‌ ప్రైజ్‌కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement