బస్సు - ట్రక్ ఢీ : 21 మంది మృతి | 21 killed in Cambodia bus accident | Sakshi
Sakshi News home page

బస్సు - ట్రక్ ఢీ : 21 మంది మృతి

Published Tue, May 19 2015 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

21 killed in Cambodia bus accident

నాంపెన్ : కంబోడియా స్వే రింగ్ ప్రావెన్స్లో మంగళవారం బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

క్షతగాత్రులంతా గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులని పోలీసులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగాతోపాటు నిర్లక్ష్యంగా నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. బస్సు డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement