శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా లగేజీలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారాన్ని సీజ్ చేసి... ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.