ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర? | another 26/11 may be planned on mumbai, says intelligence | Sakshi
Sakshi News home page

ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర?

Published Tue, Apr 14 2015 12:22 PM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM

ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర? - Sakshi

ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర?

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరో ఉగ్రదాడికి లష్కరే తాయిబా కుట్ర పన్నుతోందా? ఈసారి కూడా హోటళ్లు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుంటోందా? నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. సముద్రమార్గం గుండా ఉగ్రవాదులు చొరబడొచ్చని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరిస్తోంది.

26/11 తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని సమాచారం. ప్రధానంగా ముంబై రైళ్లలో హై ఎలర్ట్ ప్రకటించారు. 8-10 మంది ఉగ్రవాదులు చొరబడొచ్చన్నది నిఘా వర్గాల హెచ్చరికల సారాంశం. ఈ నేపథ్యంలో ముంబై నగర వ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. ఇంతకుముందు 2011 నవంబర్ 26వ తేదీన ఉగ్రవాదులు దాడి చేసి భారీ ప్రాణనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే.

మరోసారి ఈ తరహా దాడులు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితమే జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా జైలు నుంచి విడుదల కావడంతో.. ఇప్పుడు మరో దాడికి కుట్ర పన్నే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement