Lashkar-e-Taiba
-
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్ను కిగాలీ నుంచి భారత్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
కశ్మీర్లో బస్సు దాడి మా పనే: టీఆర్ఎఫ్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రియాస్ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. అంతేగాక భవిష్యత్తులో పర్యాటకులు లేదా స్థానికేతరులపై ఇలాంటి దాడులు మరిన్ని జరగవచ్చని హెచ్చరించింది. రియాస్ దాడి కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపింది. ఆదివారం జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. రియాస్లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తునన భక్తుల బస్సుపై ఈ దాడి జరిగింది. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్లో చేరింది.కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో 2023 జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. పాకిస్థాన్లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తుంది. -
ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం వేకువజామున దక్షిణ కశ్మీర్లోని చోటిగామ్ గ్రామంలో ముష్కరుల సంచారం ఉందన్న నిఘా సమాచారం మేరకు బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. దాక్కున్న ఉగ్రవాది ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో హతమైన ఉగ్రవాదిని బిలాల్ అహ్మద్ భట్గా గుర్తించారు. చెక్ చొలాన్ ప్రాంతానికి చెందిన భట్ లష్కరే తోయిబాలో సభ్యుడు. ఘటనా స్థలి నుంచి ఏకే రైఫిల్తోపాటు మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కుల్గామ్లోని సుద్సన్కు చెందిన ఫయాజ్(22) రాజ్పుటానా రైఫిల్స్ జవానుగా ఉండేవారు. బంధువు ఇంటికి పెళ్లికని వచి్చన ఫయాజ్ను ఉగ్రవాదులు నిర్బంధించి 2017 మేలో కాల్చి చంపారు. ఈ ఘటనలో భట్ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో కేసు కూడా నమోదైనట్లు షోపియాన్ సీనియర్ ఎస్పీ తనుశ్రీ తెలిపారు. గ్రెనేడ్ విసిరి ఇద్దరు స్థానికేతర కారి్మకులను చంపిన ఘటనలో భట్ హస్తముందని చెప్పారు. -
‘26/11’ మృతులకు రాష్ట్రపతి నివాళులు
న్యూఢిల్లీ: 2008 నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడిలో మృతిచెందిన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఘనంగా నివాళులరి్పంచారు. మాతృభూమి సంరక్షణ కోసం వారు ప్రాణాలరి్పంచారని కొనియాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రపతి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
పాక్లో అంగతకుల కాల్పులు.. లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ను గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్లో కాల్చి చంపారు. అక్రమ్ ఖాన్ అలియాస్ అక్రమ్ గాజీ.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బజౌర్ జిల్లాలో గురువారం అంగతకుల కాల్పుల్లో మరణించారు. కాగా అక్రమ్ ఖాన్ 2018 నుంచి 2020 వరకు ఎల్ఈటీ రిక్రూట్మెంట్ సెల్కు నాయకత్వం వహించారు. పాక్లో భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా అతడు పేరుగాంచారు. అక్రమ్ చాలా కాలంపాటు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అతను ర్రికూట్మెంట్ సెల్ అధిపతిగా ఉన్న సమయంలో సానుభూతిగల వ్యక్తులను గుర్తించి వారిని ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడంలో కీలకపాత్ర వహించారు. ఇదిలా ఉండగా గత నెల అక్టోబర్లో పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లో హత్యకు గురైన విషయం విదితమే. పంజాబ్లోని సియాల్ కోట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. గుజ్రాన్వాలా నగరానికి చెందిన లతీఫ్.. భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్కోట్లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికి మాస్టర్మైండ్ లతీఫే. చదవండి: Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర -
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ అనంతనాగ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజ్జైర్ ఖాన్ హతమయ్యాడు. ఈ మేరకు ఏడు రోజులుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్కు ముగింపు పలికినట్లు సైన్యం వెల్లడించింది. ఉజ్జైర్ ఖాన్తో పాటు మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమయినట్లు ఏడీజీపీ పోలీసు వినయ్ కుమార్ తెలిపారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతనాగ్లో ఏడు రోజులుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగింది. అటవీ ప్రాంతాల్లో, కొండ చరియల్లో నక్కి ఉన్న టెర్రరిస్టుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం సైన్యంపై ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య -
డ్రోన్లతో చొరబాట్లు!
న్యూఢిల్లీ: డ్రోన్లతో ఉగ్రవాదులు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, డబ్బులు చేరవేయడం గురించి విన్నాం. చొరబాట్లకు కూడా డ్రోన్లను ఉపయోగించుకుంటున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కొన్ని నెలల క్రితం డ్రోన్తో పంజాబ్లో ఓ ఉగ్రవాదిని జార విడిచిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్కు 70 కిలోల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని తెలియజేశాయి. పాకిస్తాన్ భూభాగంలోని షాకర్గఢ్లో లష్కతే తోయిబా శిక్షణా కేంద్రంలో ఇలాంటి డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న వీడియోను నిఘా వర్గాలు సేకరించాయి. డ్రోన్లు మనుషులను సునాయాసంగా మోసుకెళ్లి, నీటిలో భద్రంగా వదిలిపెడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. పంజాబ్లో డ్రోన్ సాయంతో అక్రమంగా చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని అధికారులు చెప్పారు. లష్కరే తోయిబా నాయకులే డబ్బులు ఇచ్చి పంపించినట్లు అతడు అంగీకరించాడని తెలిపారు. డ్రోన్ సాయంతో పంజాబ్ వెళ్లి, అక్కడే స్థిరపడి, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలంటూ లష్కరే తోయిబా నాయకత్వం నుంచి అతడికి ఆదేశాలు అందాయని వెల్లడించారు. పంజాబ్లో ఇప్పటికే మకాం వేసిన ముష్కరుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకోవాలంటూ అతడికి సూచనలిచ్చారని పేర్కొన్నారు. లష్కరే తోయిబాపై భారత్ గతంలోనే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఆయుధాలను, డ్రగ్స్ను పంపించడానికి పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు డ్రోన్లను వాడుకుంటున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ప్రధానంగా జమ్మూకశీ్మర్, పంజాబ్కు ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ వచ్చి పడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతోపాటు ఖలిస్తాన్ అనుకూల శక్తుల హస్తం కూడా ఉండొచ్చని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ హథ్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సైన్యం, కశ్మీర్ పోలీసులు, నిఘా ఏజెన్సీలు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయని, చొరబాటు యత్నాన్ని భగ్నం చేశాయన్నారు. పొరుగు దేశం నుంచి మన భూభాగంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకొనేందుకు ప్రయతి్నంచగా, కాల్పులు జరిపారని, దాంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మరణించారని, ఇద్దరి మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. హతమైన ముగ్గురు ముష్కరుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు, అనంత్నాగ్ జిల్లాలో ముగ్గురు భారత ఉన్నతాధికారులను బలి తీసుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఆపరేషన్ శనివారం నాలుగో రోజుకు చేరింది. -
రాక్షస మూక
► జమూకశ్మిర్లోని అనంత్నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ముష్కరుల దుశ్చర్యకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముగ్గురు ఉన్నతాధికారులను బలి తీసుకున్న రాక్షస మూక కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఎన్కౌంటర్లో ముగ్గురి మరణానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో ఈ ‘ప్రతిఘటన దళం’ రాక్షస దళంగా చెలరేగిపోతోంది. ప్రస్తుతం జమ్మూకశ్మిర్ అధికార యంత్రాంగానికి పెనుసవాలుగా మారింది. భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ టీఆర్ఎఫ్? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం.. టార్గెట్ కశ్మిరీ పండిట్లు.. ►జమ్మూకశ్మిర్కు స్వయం ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగ స్టులో రద్దు చేసి పారేసింది. ఈ పరిణామాన్ని ఉగ్రవాదులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కొంత కాలానికే అదే సంవత్సరం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ పురుడు పోసుకుంది. పురుడు పోసింది లష్కరే తోయిబా నాయకత్వమే. నిఘా వర్గాలకు దొరక్కుండా ఆన్లైన్ ద్వారా సభ్యులను చేర్చుకోవడం, నిధులను సేకరించడం మొదలుపెట్టారు. ఇతర ఉగ్రవాద ముఠాల్లోని కొందరు సభ్యులు సైతం టీఆర్ఎఫ్లో చేరిపోయారు. పాకిస్తాన్ సైన్యంతోపాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతు కూడా దొరకడంతో కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా మారిపోయింది. కార్యకలాపాలను ఉధృతం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. టీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం భారత జవాన్లు, జమ్మూకశ్మిర్లోని మైనారీ్టలే. కశ్మిరీ పండిట్లను అంతం చేయడమే ధ్యేయంగా దాడులకు దిగుతోంది. పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ►టీఆర్ఎఫ్ అరాచకాలు పెరిగిపోతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది జనవరిలో టీఆర్ఎఫ్పై నిషేధం విధించింది. సంస్థ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్ను యూఏపీఏలోని నాలుగో షెడ్యూల్ కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని రోజ్ అవెన్యూ కాలనీకి చెందిన షేక్ సజ్జాద్ గుల్ చిన్నప్పటి నుంచి ఉగ్రబాట పట్టాడు. 2018 జూన్లో జరిగిన కశ్మిరీ జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్య వెనుక అతడి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధంగా వ్యవహరిస్తోందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బందిని, మైనార్టీలను హత్య చేయడంతోపాటు పాకిస్తాన్ భూభాగం నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్కు పాల్పడుతోందని, అక్కడి నుంచి ఉగ్రవాదులను భారత్లోకి చేరవేస్తోందని వెల్లడించింది. ఎందుకు సృష్టించారు? ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నందుకు గాను పాకిస్తాన్ను పారిస్కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్్కఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో చేర్చింది. దీంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నేరుగా నిధులు అందించే మార్గం మూసుకుపోయింది. నిధులు ఆగిపోవడంతో లష్కరే తోయిబా, దాని అధినేత హఫీజ్ సయీద్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర య్యాయి. అందుకే లష్కరే తోయిబాకు అనుబంధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను సృష్టించా రు. పాకిస్తాన్ సర్కారు నేరుగా టీఆర్ఎఫ్కు నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని గానీ, మతపరమైన సాయుధ దళం అని గానీ చెప్పకుండా స్థానిక ప్రతిఘటన దళంగా మభ్యపెట్టడానికి టీఆర్ఎఫ్ అని నామకరణం చేసినట్లు స్పష్టమవుతోంది. ఉధృతంగా చేరికలు.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో జమ్మూకశ్మిర్లో భద్రతా దళాలు 90కిపైగా అపరేషన్లు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 108 మంది టీఆర్ఎఫ్కు చెందినవారే కావడం గమనార్హం. అలాగే 2022లో దాదాపు 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వీరిలో ఏకంగా 74 మంది కేవలం టీఆర్ఎఫ్లోనే చేరడం గమనార్హం. దీన్నిబట్టి టీఆర్ఎఫ్ నుంచి ఎదురవుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చు. నిషేధించిన మరుసటి రోజే ‘హిట్ లిస్ట్’.. ►భారత్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వం యూఏపీఏ కింద నిషేధించింది. వీటన్నింటిలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిషేధం విధించిన మరుసటి రోజే ఈ సంస్థ ‘హిట్ లిస్ట్’ విడుదల చేసింది. అందులో ఉన్న వ్యక్తులందరినీ అంతం చేస్తామని హెచ్చరించింది. సామాన్య యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి టీఆర్ఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. ‘సైకలాజికల్ ఆపరేషన్లు’ చేస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ప్రేరేపిస్తోంది. యువకుల మనసు మార్చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది. టీఆర్ఎఫ్ జమ్మూకశ్మిర్లోని మైనార్టీ సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీఓ) పనిచేస్తున్న సిక్కు యువకులపై రాస్ట్రియ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏజెంట్లు అనే ముద్ర వేస్తోంది. టీఆర్ఎఫ్ దాడుల్లో సిక్కులు సైతం బాధితులుగా మారుతున్నారు. టీఆర్ఎఫ్ ముష్కరులు భారత భద్రతా దళాలపై యుద్ధమే సాగిస్తున్నారని చెప్పొచ్చు. అధునాతన ఆయుధాలతో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతీక్కు ఐఎస్ఐ, లష్కరేతో లింకులు
ప్రయాగ్రాజ్: ఉమేశ్పాల్ హత్యకేసులో గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. గురువారం యూపీ పోలీసులు అతీక్ అహ్మద్ను, అతడి సోదరుడు అష్రాఫ్ను భారీ బందోబస్తు నడుమ ప్రయాగ్రాజ్లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ‘నాకు ఆయుధాలు, డబ్బుకు కొదవలేదు. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో పంజాబ్కు ఆయుధాలు, డబ్బు చేరుతాయి. అక్కడ మా వాళ్లు వాటిని అందుకుంటారు. కశ్మీర్ ఉగ్రవాదులు కూడా తీసుకెళతారు. కావాలంటే మీరు నన్ను అక్కడికి తీసుకెళ్తే డబ్బు, ఆయుధాలు అందజేస్తా’అంటూ అతీక్ అహ్మద్ విచారణలో వెల్లడించిన విషయాలను యూపీ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. రెండు గంటలపాటు సాగిన వాదోపవాదాల అనంతరం అతీక్, అష్రాఫ్లిద్దరికీ ఈనెల 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి, ఐదు రోజుల పోలీసు రిమాండ్కు అనుమతిస్తూ మేజిస్ట్రేట్ దినేశ్ గౌతమ్ ఆదేశాలిచ్చారని ఉమేశ్ పాల్ భార్య తరఫు లాయర్ చెప్పారు. ఇద్దరినీ రిమాండ్ పూర్తయ్యేదాకా ప్రస్తుతమున్న సబర్మతీ, బరేలీ జైళ్లలోనే ఉంచుతారన్నారు. -
కశ్మీర్లో సెంట్ బాటిల్ ఐఈడీ బాంబ్
జమ్మూ: జమ్మూకశ్మీర్లో పలు పేలుళ్లతో సంబంధమున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఆరిఫ్ను పోలీసులు రేసీ జిల్లాలో అరెస్ట్చేశారు. అతని వద్ద సుగంధ ద్రవ్య సీసాలో అమర్చిన అధునాతన పేలుడు పదార్థం(ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్లో ఇలా పర్ఫ్యూమ్ బాటిల్లో ఐఈడీ బాంబ్ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ చెప్పారు. స్ప్రే బటన్ను నొక్కడంతో యాక్టివేట్ అయిన ఆ బాంబ్ను నిర్వీర్యం చేసే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. ‘ వాస్తవానికి ఆరిఫ్ ఉపాధ్యాయుడిగా 12 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. మూడేళ్ల క్రితం కరాచీకి పారిపోయిన మేనమామ ద్వారా కశ్మీర్లోని లష్కరే ఉగ్రవాది ఖాసిమ్తో సంబంధం పెట్టుకుని ఉగ్రవాదిగా మారాడు’ అని డీజీపీ చెప్పారు. -
కశ్మీర్లో ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో లష్కరేతోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఆయుధ సరఫరా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షితుల్ని చేయడం వంటి చర్యలతో వీరికి సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పుల్వామా జిల్లా కాకాపొరాకు చెందిన లష్కరే కమాండర్ రియాజ్ అహ్మద్ దార్ అలియాస్ ఖాలిద్, అలియాస్ షీరాజ్ నేతృత్వంలో వీరు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కూడా వెల్లడైందని పోలీసు శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. -
లష్కరే టాప్ ఉగ్రవాది సలీం పర్రే హతం
జమ్మూ/శ్రీనగర్: శ్రీనగర్ శివారులో సోమవారం పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు. జమ్మూకశ్మీర్లోని సరిహద్దుల్లో పాక్ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. లక్ష్య పెట్టకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. -
పాక్ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు.. కుట్ర పన్నింది ఇలా...
సాక్షి, హైదరాబాద్: బిహార్లోని దర్భంగ రైల్వేస్టేషన్లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగానే కుట్ర సాగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో యూ పీవాసి ఇక్బాల్ ఖానా (ప్ర స్తుతం లాహోర్లో ఉంటున్నాడు) ఈ కుట్రను అమలు చేసినట్లు నిర్ధారించింది. ఈ మేరకు గురువారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు హైదరాబాదీలతో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసింది. పేలుడుకు కుట్ర పన్నింది ఇలా... ► ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన మహ్మద్ నాసిర్ ఖాన్ హై దరాబాద్ మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ సమీపంలో ఉండేవాడు. అతని సోదరుడు ఇమ్రాన్ మాలిక్ స్వస్థలంలో ఉండేవాడు. ► ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖానా 1993 నుంచి నకిలీ నోట్ల చెలామణి చేస్తున్నాడు. అతనిపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాక్కు పారిపోయి లాహోర్లో ఉంటున్నాడు. ► అక్కడి నుంచే ఐఎస్ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. లష్కరే తోయిబాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ► ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ ద్వారా ఇమ్రాన్ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. స్థానిక పదార్థాలతో పేలుళ్లు జరపడం ఎలా? అని ఆన్లైన్లో శిక్షణ ఇస్తూ యూ ట్యూబ్లోని కొన్ని వీడియోలు పంపాడు. ► గతంలో పాక్కు వెళ్లిన నాసిర్ అక్కడ ఉగ్రవాద శిక్షణ పూర్తి చేసి వచ్చాడు. బాంబుల తయారీ నుంచి గూఢచర్యం వరకు వివిధ అంశాల్లో అతను శిక్షణ పొందాడు. ► వేగంగా వెళ్లే రైళ్లలో అగ్నిప్రమాదాలు సృష్టించి భారీ ప్రాణనష్టం సృష్టించాలని ఇక్బాల్ చెప్పడంతో ఈ ఏడాది మేలో సిటీకి వచ్చిన ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ వద్ద ఆశ్రయం పొందాడు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు, కేంద్రం కీలక ఆదేశాలు సొంతంగా బాంబు తయారీ... దర్భంగా ఎక్స్ప్రెస్ను తగలబెట్టాలని నిర్ణయించుకొని చిక్కడపల్లి, హబీబ్నగర్లలోని దుకాణాల్లో కొన్న సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు తయారు చేశారు. ► గాజు సీసాలోకి ఈ పదార్థాలను ఇంజెక్షన్ సిరంజిల ద్వారా నింపి 16 గంటల్లో పేలి జరిగి మంటలు చెలరేగేలా కుట్రపన్నారు. ► ఈ ఏడాది జూన్ 15న రెడీమేడ్ వస్త్రాల పార్శిల్లో ఈ సీసాను ఉంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దర్భంగ వెళ్లే దర్భంగ ఎక్స్ప్రెస్లో దీన్ని బుక్ చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఈ పేలుడు ఆలస్యమైంది. 17న దర్భంగ స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫామ్పై రైలు ఆగి పార్సిల్ను అన్లోడ్ చేశాక స్వల్ప పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. ► దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ... ఇక్బాల్ ఖానా, నాసిర్, ఇమ్రాన్లతోపాటు వారికి పరోక్షంగా సహకరించిన యూపీవాసులు హాజీ సలీం, ఖఫీల్ అహ్మద్లను అరెస్టు చేసింది. ► సికింద్రాబాద్ పార్శిల్ ఆఫీస్లో ఈ అన్నదమ్ములు మహ్మద్ సూఫియాన్ పేరు తో ఇచ్చిన పాన్ కార్డు కాపీనీ ఇక్బాలే వాట్సాప్ ద్వారా పంపాడని ఎన్ఐఏ గుర్తించింది. -
పాక్లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్తో పాటు పొరుగున్న పాక్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్లోని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్లో అతివాద శక్తులు బలపడటం... భారత్కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
డ్రోన్ దాడి పాక్ పనే: జమ్ము కశ్మీర్ డీజిపీ
జమ్మూ: జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరంపై సంచలనాత్మక డ్రోన్ దాడి వెనుక నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నట్లు జమ్ము కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ తెలిపారు. పాక్ సరిహద్దు ఆవల నుంచే ఆ డ్రోన్లు వచ్చాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు ఆదివారం డ్రోన్లతో దాడులు జరపగా ఇద్దరు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. డ్రోన్ కాక్టైల్ భాగంలో ఆర్డీఎక్స్ను పేలుడుకు ఉపయోగించినట్లు అధికారులు అంచనాకొచ్చారు. భారత వైమానిక దళం స్థావరం వద్ద ప్రస్తుత పరిస్థితిని ఐపిఎస్ అధికారి సింగ్ పర్యవేక్షిస్తున్నాడని ఆయన అన్నారు. జమ్మూలో అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు వరుసగా సోదాలు జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో అనధికారికంగా డ్రోన్లను ఉపయోగించవద్దని ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. మరో ఉగ్రకుట్ర భగ్నం జమ్మూకశ్మీర్లో డ్రోన్ల సాయంతో ప్రయత్నించిన మరో ఉగ్రకుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు తోకముడిచాయి. జమ్మూకశ్మీర్లోని రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ వివరించారు. చదవండి: మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా -
కశ్మీర్పై డ్రోన్లతో దాడికి పాక్ కుట్ర
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించడానికి సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ లక్ష్యంగా డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించడానికి కుట్రలు పన్నుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) లష్కరే తోయిబా, కొందరు ఉగ్రవాదులకు శిక్షణనిస్తోంది ఇరాక్, సిరియాలౖపై దాడుల కోసం వాడుతున్న డ్రోన్లు, బాంబులు వెదజల్లే ఫ్లయింగ్ మిషన్లతో ఉగ్రవాద సంస్థలకి శిక్షణ నిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. తొలుత పాకిస్తాన్ నాసిరకమైన డ్రోన్లు వాడి వాటి వీడియోలను ప్రచారం కోసం వాడుకోవాలని అనుకుంది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని డబ్బులు వెదజల్లుతూ అంతర్జాతీయ విపణిలో లభించే డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లను తీసుకుంది. వాటితో జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ నిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 3 కి.మీ. వరకు బాంబుల వర్షం పాకిస్తాన్ ఐఎస్ఐ కొనుగోలు చేసిన డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లు అయిదు కేజీల పేలుడు పదార్థాలను మోసుకుపోగలవు. వాటి ద్వారా మూడు కి.మీ. పరిధి వరకు విధ్వంసం సృష్టించవచ్చు. ఇస్లామిక్ స్టేట్ ఫైటర్స్ ఈ డ్రోన్లను కొనుగోలు చేసి మొట్టమొదటి గురి కశ్మీర్పైనే పెట్టినట్టుగా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఉగ్రవాదంపై పోరాటం కోసం ఏర్పాటైన యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ సెంటర్కి చెందిన డాన్ రస్లార్ అనే ప్రొఫెసర్ చెప్పిన వివరాల ప్రకారం తొలుత పాకిస్తాన్ డూప్లికేట్ డ్రోన్లపైనే దృష్టి సారించింది. కానీ ఆ తర్వాత భారీగా నగదు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను తీసుకుంది. ఎలాంటి దాడినైనా తిప్పి కొడతాం: భారత్ పాక్ వైపు నుంచి వచ్చిన ఏ ముప్పునైనా తిప్పికొట్టడానికి భారత్ సిద్ధంగా ఉంది. సరిహద్దు ఆవల నుంచి డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లు ఏవీ వచ్చినా వెంటనే వాటిని కూల్చేందుకు సమాయత్తమవుతున్నట్టుగా సరిహద్దు భద్రతా దళానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. -
కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: దేశమంతటా లాక్డౌన్ అమలవుతున్న వేళ..కశ్మీర్లో సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్, మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు కొనసాగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ముష్కరులు కూడా హతమయ్యారు. కశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా ఉంచుకున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో కల్నల్ శర్మ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆ ఇంటిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం కల్నల్ శర్మ నేతృత్వంలోని బృందం లోపలికి చొచ్చుకెళ్లింది. కానీ, లోపలే పొంచి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే నేలకొరిగారు. వెలుపల వేచి చూస్తున్న బలగాలకు కల్నల్ శర్మ బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారికి చేసిన ఫోన్ కాల్స్కు ఉగ్రవాదులు సమాధానం ఇవ్వడంతో ప్రమాదాన్ని శంకించారు. ఆ వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టికరిపించారు. నేలకొరిగిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్లు 21 రాష్ట్రీయ రైఫిల్స్లోని గార్డ్స్ రెజిమెంట్కు చెందిన వారు. వీరితోపాటు లోపలికి వెళ్లిన జమ్మూకశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షకీల్ కాజీ కూడా బలయ్యారు. ఉగ్రహతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్, పాక్కు చెందిన హైదర్ కాగా, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నాడు. కాల్పులు జరుగుతుండగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నామని సైన్యం తెలిపింది. ఇదే ఉగ్రవాదుల ముఠాతో గురువారం సాయంత్రం కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయనీ, అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపింది. అప్పటి నుంచి ఇక్కడ గాలింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నేలకొరిగిన జవాన్ల అంత్యక్రియలు సోమవారం వారివారి స్వస్థలాల్లో జరగనున్నాయని పేర్కొంది. కల్నల్ అశుతోష్ శర్మ భౌతిక కాయాన్ని సొంతూరు జైపూర్కు, మేజర్ అనూజ్ సూద్ భౌతిక కాయాన్ని పుణేకు అధికారులు తరలించారు. కాగా, కశ్మీర్లోయలో కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం 2015 తర్వాత ఇదే ప్రథమం. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భద్రతాబలగాల త్యాగాలు జాతి మరువలేనివని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎ.ఖాజీ (ఫైల్ ఫొటోలు, ఎడమ నుంచి కుడికి) -
నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ: ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటన జమ్మూకశ్మీర్లో చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని దార్ మొహల్లా వాటరిగమ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ఉగ్రసంస్థలకు చెందిన ముజఫర్ అహ్మద్ భట్, ఒమర్ అమీన్ భట్, సాజద్ అహ్మద్ భట్, గుల్జార్ అహ్మద్ భట్లుగా గుర్తించారు. ఇందులో గుల్జార్ హిజ్బుల్కు చెందిన ఉగ్రవాది కాగా, మిగిలిన వారు లష్కరే తోయిబాకు చెందిన వారు. వీరంతా కుల్గామ్ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, రెండు పిస్తోళ్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మిలిటెంట్లు మృతి
కశ్మీర్: జమ్మూ- కశ్మీర్తో కాల్పుల మోత మోగింది. దక్షిణ కశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని గుండ్బాబా సంగంలో భద్రతా దళాలకు లష్కరే తొయిబా మిలిటెంట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దాళాలు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. మృతి చెందిన వారిలో లష్కరే తొయిబా మిలిటెంట్ల స్థానిక కమాండర్ ఫుర్కాన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వాళ్లను విచారించి తీరాల్సిందే: అమెరికా
వాషింగ్టన్ : తమ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయాలంటూ అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. లష్కర్-ఎ-తొయిబా నాయకుడు హఫీజ్ సయీద్ సహా ఇతర ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే వారందరినీ తప్పక విచారించి తీరాల్సిందేనని పేర్కొంది. తమ దేశ భవిష్యత్తు కోసం ఉగ్రవాదలును ఏరివేస్తామని ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలబెట్టుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్ వెల్స్ ట్వీట్ చేశారు. కాగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్- ఉగ్రవాదులకు డబ్బు చేకూరే మార్గాలను పరిశీలించే సంస్థ) బ్లాక్లిస్టులో ఉన్న దేశాల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇక భారత్లో ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే నిషేధించిన పాకిస్తాన్... తాము విడుదల చేసి నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్లిస్టు’లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తమ జాబితాలో గ్రేలిస్టులో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల పట్ల తన వైఖరి మార్చుకోకపోతే ఇరాన్, ఉత్తర కొరియాలతో పాటు బ్లాక్లిస్టులో చేరుస్తామని ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించింది. అక్టోబరు 2019 నాటికి తమ విధానమేమిటో స్పష్టం చేయాలని పాక్ను కోరింది. ఈ నేపథ్యంలో గురువారం ఎల్టీఈ చీఫ్ సయీద్ సహా ఉగ్ర సంస్థలకు సహాయం చేసే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. ఇక 2008లో ముంబై పేలుళ్లకు కీలక సూత్రధారిగా భావిస్తున్న హఫీజ్ సయీద్పై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాల్లో అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాక్ ప్రయత్నాలు బెడిసికొట్టిన విషయం విదితమే. -
ఉగ్రవాదంపై చర్యల్లో పాక్ విఫలం
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మనీలాండరింగ్ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలన్నీ పాక్ తుంగలో తొక్కిందని మండిపడింది. హఫీజ్ సయీద్తో పాటుగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ముద్ర వేసిన ఇతర ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిరోధించడంలో పాక్ విఫలమైందని పేర్కొంది. పాక్ తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యలు 40లో 31 ఎఫ్ఏటీఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చింది. గత ఏడాదే ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్ను గ్రే లిస్ట్లో ఉంచింది. ఈ ఏడాది గ్రే లిస్ట్ నుంచి పాక్ను బ్లాక్ లిస్ట్కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు పారిస్లో ఈ నెల 13 నుంచి జరగనున్నాయి. మా విమానం తిరిగిచ్చేయండి! పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి అమెరికా పర్యటన గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా పర్యటనకు ఇమ్రాన్ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్కు చెందిన ప్రైవేటు విమానంలో వెళ్లిన విషయం తెలిసిందే. తిరుగుప్రయాణంలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినందువల్ల ఇమ్రాన్, ఆయన బృందం వేరే విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. అయితే, సాంకేతిక లోపం వల్ల కాదు.. సౌదీ యువరాజుకు ఇమ్రాన్పై కోపం వచ్చి, తన విమానాన్ని వెనక్కు పంపించమని ఆదేశించినందువల్లనే ఇమ్రాన్ వేరే విమానంలో న్యూయార్క్ నుంచి పాకిస్తాన్కు తిరిగి వెళ్లారని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని ‘ది ఫ్రైడే టైమ్స్’ ఒక కథనంలో వెల్లడించింది. -
బ్లాక్లిస్టులో పాక్..!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్లిస్టులో పెట్టింది. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అక్టోబర్లో మళ్లీ ఈ చర్చలు జరగనున్నాయి. ఆ లోపు పాక్ తన వైఖరి మార్చుకొని ఉగ్రనిధులను ఆపకపోతే బ్లాక్ లిస్ట్లోనే ఉండిపోయే అవకాశం ఉంది. భారత్ కూడా సభ్యత్వం కలిగి ఉన్న ఈ ఎఫ్ఏటీఎఫ్ సదస్సుకు హోంశాఖ, విదేశాంగ శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. పాక్ తరఫున పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందన్నది ఎఫ్ఏటీఎఫ్ ప్రధాన అభియోగం. ఈ బృందంలో 41 మంది సభ్యులు ఉండగా వారికి పాక్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఉగ్ర నిధులకు వ్యతిరేకంగా రూపొందించిన 11 అంశాల్లో పదింటిని కూడా చేరలేకపోయింది. ఇప్పటికే గ్రే లిస్టులో ఉన్న పాక్ అక్టోబర్ కల్లా బృంద సభ్యులను మెప్పించగలిగేలా ఉగ్రనిధులను కట్టడి చేయాల్సి ఉంటుందని మరో అధికారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్న పాక్కు ఇది ఎదురు దెబ్బే. ఐరాసలో ‘కశ్మీర్’ మాటెత్తనున్న ఇమ్రాన్ ఇస్లామాబాద్: కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా చూపించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నా.. పాకిస్తాన్ వైఖరిలో మార్పు రావటం లేదు. త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 27వ తేదీన ప్రధాని ఇమ్రాన్ ఐరాసలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారయిందని ‘ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. కశ్మీర్పై భారత్ ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ప్రసంగించే అవకాశముందని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ చేరుకోనున్న భారత ప్రధాని మోదీ వద్ద... భారత్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ముస్లిం సంఘాలు, మానవ హక్కుల సంఘాలకు ఇమ్రాన్ సూచించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం ఉందని ఆ పత్రిక పేర్కొంది. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంపై భారత్తో సంబంధాలను పాక్ తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. -
తమిళనాడులో ‘లష్కరే’ జాడ
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావటంతో పోలీసులు శుక్రవారం గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు తెలియడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. తీవ్రవాదుల హిట్లిస్ట్లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి. ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుసబాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఐసిస్ మద్దతుదారులకు విదేశాల్లో శిక్షణనిచ్చి ఇక్కడ చొప్పించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకు రంగంలోకి దిగారు. నుదుట తిలకం పెట్టుకుని... కోయంబత్తూరులో చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నుదుట తిలకం పెట్టుకుని ఉన్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. -
నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: ఉద్రవాదుల తూటాల శబ్దాలతో సోమవారం తెల్లవారుజామూన కశ్మీర్ దద్దరిల్లింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య తెల్లవారుజామున భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు విస్రృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే జవాన్లపైకి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ముష్కరుల దాడిని తిప్పికొట్టిన భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
‘సరదా కోసం ఉగ్రవాద సంస్థ పేరు పెట్టా’
సాక్షి, ముంబై: యావత్ దేశం ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ కుర్రాడు చేసిన తుంటిరి పనితో నగరంలోని కళ్యాణ్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. తన వై ఫై నెట్వర్క్ పేరును లష్కరే తాలిబన్ అని పెట్టుకోవడంతో ఆ కుర్రాడు చిక్కుల్లో పడ్డాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఓ అపార్ట్ మెంట్లోని కొంతమంది వై ఫై నెట్వర్క్స్ గురించి సెర్చ్ చేస్తే ఆ జాబితాలో ఉగ్రవాద సంస్థ పేరు ఉండటం చూసి భయాందోళనలకు గురయ్యారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే కేసును ఛేదించారు. అపార్ట్మెంట్కు చెందిన కుర్రాడే కావాలనే ఉగ్రవాద సంస్థ పేరు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని విచారించగా.. ఉగ్రవాద సంస్థలతో అతడికి ఎలాంటి సంబంధంలేదని, కేవలం వై ఫై నెట్వర్క్ను ఎవరు వాడకూడదనే ఉద్దేశంతోనే సరదాగా ఆ పేరు పెట్టినట్లు పోలీసులకు వివరించారు. అయితే వెంటనే ఆ పేరును మార్చాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అతడిని హెచ్చరించారు. -
‘సిరియా కన్నా పాక్ మూడురెట్లు ప్రమాదరకరమైంది’
లండన్ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ ప్రథమ స్థానంలో ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ఉగ్రవాదులను పెంచి పోషించే పాక్ కారణంగా అంతర్జాతీయ భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ‘హ్యుమానిటి ఎట్ రిస్క్- గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇండిసెంట్’ పేరిట ఆక్స్ఫర్ట్ యూనివర్సిటీ, స్ట్రాటజిక్ ఫోర్సైట్ గ్రూప్(ఎస్ఫీజీ) ఆర్టికల్ను పబ్లిష్ చేశాయి. ‘ప్రపంచ భద్రతకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ఆఫ్గాన్ తాలిబన్, లష్కర్ ఎ తోయిబా, ఆల్ఖైదాకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడంలో మిగతా అన్ని దేశాలతో పోలిస్తే ముందువరుసలో ఉంది. అంతేకాదు తమ వద్ద ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేయడం ద్వారా మానవాళిని ప్రమాదంలో పడేసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. 2030 నాటికి ఈ ఉగ్ర సంస్థల కారణంగా ప్రపంచ పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని’ పేర్కొంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో 21వ శతాబ్దంలోని మొదటి దశాబ్దంలో జరిగిన ఉగ్రదాడుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. సుమారు 200 ఉగ్ర సంస్థల కార్యకలాపాలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను వెల్లడించినట్లు ఎస్ఫీజీ పేర్కొంది. గత ఐదు సంవత్సరాల కాలంలో లిబియా, సిరియా, యెమన్లలో అంతర్యుద్ధం ద్వారా ఐసిస్ మీడియా ప్రచారాన్ని బాగా పొందింది కానీ ఆల్ఖైదా చాప కింద నీరులా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉందని నివేదిక వెల్లడించింది. సిరియా కంటే కూడా పాక్లో పౌరుల భద్రతకు మూడు రెట్లు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఆల్ఖైదా పుట్టకకు కారణమైన పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్లో అస్థిరతను సృష్టిస్తోందని నివేదించింది. అంతేకాదు ఉగ్ర సంస్థల నుంచి రిటైర్ అయిన కొంత మంది మాజీ ఉగ్రవాదులు.. సాధారణ పౌరుల ముసుగులో తమ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారని వెల్లడించింది. -
లష్కరే తోయిబా, టీటీపీలతో ముప్పు
వాషింగ్టన్: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా(ఎల్ఈటీ), తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)ల నుంచి తమ దేశానికి, తమ ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా పేర్కొంది. సిక్కు వేర్పాటువాద బబ్బర్ ఖల్సా కార్యకలాపాలతో మిత్రదేశాల్లోని అమెరికా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని అధ్యక్ష భవనం పేర్కొంది. ఎల్ఈటీ, టీటీపీతోపాటు ఐఎస్(ఇస్లామిక్ స్టేట్), అల్ కాయిదా, బోకో హరామ్, ఇంకా డజన్ల సంఖ్యలో ముస్లిం అతివాద గ్రూపుల వేర్పాటువాద, ఉగ్రవాద చర్యల వల్ల అమెరికా లోపల, వెలుపల అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది’ అని పేర్కొంది. -
పట్టుకోవడానికి పదహారేళ్లు!
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్ల క్రితం ముంబై సబర్బన్ ప్రాంతమైన ఘట్కోపర్లో జరిగిన పేలుడు కేసులో నిందితుడు యహ్యా అబ్దుల్ రెహ్మాన్ పోలీసులకు ఇప్పటికి చిక్కాడు. అప్పట్లో దుబాయ్ పారిపోయిన ఇతగాడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇక తనపై పోలీసు నిఘా ఉండదనే ఉద్దేశంతో తిరిగి రావాలనుకున్నాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. రెహ్మాన్ను పట్టుకునేందుకు అదనుగా భావించిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) రెహ్మాన్ను మాటు వేసి పట్టుకుంది. అనంతరం రెహ్మాన్ను ముంబై పోలీసులకు అప్పగించారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే ఘట్కోపర్ కేసులో నగరానికి చెందిన మరో ఇద్దరు నిందితులుగా ఉండి, నిర్దోషులుగా బయటపడ్డారు. ఇద్దరిని బలిగొన్న బాంబు పేలుడు ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా 2002 డిసెంబర్ 2న ఘట్కోపర్ ప్రాంతంలో బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్) విభాగానికి చెందిన బస్సు సీటు కింద ఏర్పాటు చేసిన బాంబు పేలి ఇద్దరు చనిపోయారు. దాదాపు 70 మంది క్షతగాత్రులయ్యారు. ఈ కేసులో మొత్తం 19 మందిని నిందితులుగా ముంబై పోలీసులు గుర్తించారు. మరో తొమ్మిది మంది ఉగ్రవాద అనుమానితుల్ని అరెస్టు చేశారు. అయితే వీరిపై కేసు వీగిపోగా మిగిలిన వారిపై విచారణ జరగాల్సి ఉంది. ఇక్కడి వారు ఇద్దరూ మృతి ఘట్కోపర్ పేలుడు కేసులో నగరానికి చెందిన ఇద్దరు నిందితులుగా అరెస్టు అయ్యారు. వీరిలో ఒకరైన రజాక్ 2012లో హుమాయున్నగర్ పరిధిలో ఆత్మహత్య చేసుకోగా, సలావుద్దీన్ 2014లో నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్లేపల్లికి చెందిన మహ్మద్ అబ్దుల్ రజాక్ మసూర్ 1997–98ల్లో దుబాయ్ వెళ్ళి ఎల్ఈటీతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పాక్లో శిక్షణ అనంతరం 2002లో రజాక్ ఎల్ఈటీ భారత్లో చేసే ఆపరేషన్లకు కో–ఆర్డినేటర్గా వ్యవహరించాడు. అక్కడే ఉంటూ 2002 నవంబర్ 21న జరిగిన దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు, ఘట్కోపర్ బ్లాస్ట్ తదితరాలను పర్యవేక్షించాడు. 2005 ఆగస్టులో ఢిల్లీ స్పెషల్సెల్ పోలీసులకు అక్కడి జకీర్నగర్ ప్రాంతంలో పట్టుబడ్డాడు. విచారణలోనే ఘట్కోపర్ కేసు అంగీకరించడంతో అక్కడి పోలీసులూ అరెస్టు చేశారు. హుమాయున్నగర్లోని వెంకటాద్రి కాలనీలో ఉండే రజాక్ 2012 అక్టోబర్ 10న ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఆదివారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన ఐసిస్ ఉగ్రవాద అనుమానితుడు అబ్దుల్లా బాసిత్ మేనమామ సలావుద్దీన్ సైతం ఘట్కోపర్ పేలుళ్ల కేసులో నిందితుడే. నల్లగొండకు చెందిన సలావుద్దీన్ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) నార్త్రన్ రీజియన్ కమాండర్గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆపై రెండేళ్ల పాటు సిమికి ఆలిండియా చీఫ్గా వ్యవహరించాడు. 2001లో సిమిని కేంద్ర నిషేధించిన తరవాత సలావుద్దీన్ దుబాయ్కు మకాం మార్చాడు. అక్కడ ఉంటూనే ఘట్కోపర్ పేలుళ్లకు సహకరించాడు. 2011లో కేరళలో చిక్కిన ఇతడు జైలు నుంచి బయటకు వచ్చాడు. 2014 అక్టోబర్లో నల్లగొండ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఘట్కోపర్ పేలుళ్ల కేసుకు సంబంధించి రజాక్, సలావుద్దీన్పై ఉన్న అభియోగాలు వారు మరణించడానికి ముందే అక్కడి కోర్టులో వీగిపోయాయి. -
పొలిటికల్ పార్టీకి షాక్
వాషింగ్టన్ : సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పాకిస్తాన్కు చెందిన మిల్లి ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీకి షాక్ తగిలింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్దవా(జేయూడీ) స్థాపించిన ఈ పార్టీని ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించింది. దీంతో పాటు పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఏడుగురు నాయకులను ఉగ్రవాదులుగా గుర్తిస్తున్నట్లు చెప్పింది. లష్కర్-ఈ-తైబా(ఎల్ఈటీ) కశ్మీర్లో నడుపుతున్న తెహ్రిక్-ఈఆజాదీ-ఈ-కశ్మీర్(టీఏజేకే)ను సైతం ఉగ్ర సంస్థగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు హోం శాఖ నుంచి గుర్తింపు తీసుకోవాలని ఎంఎంఎల్ను పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్(పీఈసీ) కోరిన తరుణంలో అమెరికా నిర్ణయం సయీద్కు చావుదెబ్బే. రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం గతంలో ఎంఎంఎల్ చేసిన దరఖాస్తును ఈసీ తిరస్కరించింది. ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారనే అభియోగంపై పాకిస్తాన్ హోం శాఖ ఎంఎంఎల్కు రాజకీయ పార్టీ హోదా ఇవ్వొద్దని ఈసీని కోరింది. అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ముద్ర పడుతుందనే భయంతో ఎల్ఈటీ తరచూ పేర్లు మార్చుకుంటూ వస్తుంది. టీఏజేకే, ఎంఎంఎల్లు ఎల్ఈటీకు మారు పేర్లే. అంతర్జాతీయ సమాజానికి ఈ విషయం తెలియజేసేందుకే టీఏజేకే, ఎంఎంఎల్లను ఉగ్రసంస్థలుగా గుర్తిస్తున్నామని అమెరికా వివరించింది. -
పాక్ నిషేధిత జాబితాలో సయీద్ సంస్థలు
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఆంక్షల్ని తప్పించుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చట్టాల్లో సవరణలు చేసింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా, ఫలాహ్–ఐ–ఇన్సానియత్ ఫౌండేషన్తో పాటు పలు సంస్థల్ని ఉగ్రవాద జాబితాలో చేర్చుతూ పాక్ అధ్యక్షుడు ఆర్డినెన్స్ జారీ చేశారు. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర సంస్థలూ ఇందులో ఉన్నాయి. ఉగ్రవాదానికి పాక్ అనుకూలమన్న ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగా పారిస్లో ఫిబ్రవరి 18 నుంచి జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని ఎఫ్ఏటీఎఫ్ నియంత్రిస్తోంది. ఉగ్రవాదులకు అండగా ఉన్న పాక్ను ‘ఎఫ్ఏటీఎఫ్’ గ్రే జాబితాలో చేర్చేందుకు అమెరికా, భారత్ల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ జారీచేశారు. గతంలో 2012 నుంచి మూడేళ్ల పాటు పాక్ ‘ఎఫ్ఏటీఎఫ్’ గ్రే జాబితాలో కొనసాగింది. -
మోదీ దౌత్యం.. పాక్కు శాపం
ఇస్లామాబాద్: అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కొనసాగించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అభిప్రాయపడ్డారు. మోదీ దౌత్యనీతి తమ దేశానికి శాపంగా మారిందని ముషారఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ అనుసరించిన విధానాలు.. పాక్ను అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టాయని అన్నారు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అంతర్జాతీయ దౌత్య విధానాలు అవలంభించడంలో మోదీతో తమ నేతలు పోటీపడలేకపోయారని అన్నారు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం నిష్క్రియా పరమైన దౌత్య విధానాలను అనుసరిస్తోందన్నారు. ప్రణాళిక లేని దౌత్య విధానాల వల్ల అంతర్జాతీయ ప్రపంచం నుంచి పాకిస్తాన్ దూరం జరిగిందని అన్నారు. ‘పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉందా? మన దౌత్య విధానం భారత ప్రధాని నరేంద్ర మోదీ కన్నా దూకుడుగా ఉందా? నరేంద్ర మోదీ అంతర్జాతీయంగాక్త మన దేశాన్ని ఏకాకి చేయడం నిజం కాదా? ఇప్పటివరకూ కులభూషన్ జాదవ్ను గూఢచారిగా భారత్ గుర్తించలేదు.. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మాత్రం లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా ఎందుకు గుర్తించింద’ని ముషారఫ్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దూకుడుతో కూడిన దౌత్య విధానాలను పాకిస్తాన్ పాలకులు అనుసరించలేకపోవడం వల్ల నేడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. -
హఫీజ్ సయీద్తో పొత్తుకు సిద్ధమే!
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్కు ఇటీవలే జై కొట్టిన పాక్ మాజీ మిలటరీ రూలర్.. తాజాగా మరో అడుగు ముందుకేశారు. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్తో పొత్తు సిద్దమని ముషారఫ్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పాకిస్తాన్లోని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. ‘పొత్తు విషయమై నేను వారితో మాట్లాడలేదు, అయితే వారు ముందుకుకొస్తే అహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముషారఫ్ చెప్పారు. గత నెల్లో పాకిస్తాన్లోని 23 పార్టీలతో కలిపి అవామీ ఇత్తేహాద్ కూటమిని ముషారఫ్ ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లోనూ కూటమి కకావికలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు అతిపెద్ద మద్దతుదారుడిని అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ముంబై దాడుల తరువాత హఫీజ్ సయీద్ని అమెరికా సైతం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని తలమీద 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. పాకిస్తాన్లోని పలు మతసంస్థలపై హఫీజ్ సయీద్ పట్టుసాధించాడు. హఫీజ్ సయీద్ ఉగ్రవాది కాదని.. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి హఫీజ్ సయీద్ పేరును తొలగించాలని ముషారఫ్ కోరారు. -
పాకిస్తాన్ ఇక ఏకాకే!?
ఇస్లామాబాద్/వాషింగ్టన్ : అంతర్జాతీయంగా పాకిస్తాన్పై భారత్ మరోమారు అత్యంత కీలక దౌత్య విజయాన్ని సాధించింది. భారత్పై ఉగ్రదాడులకు తెగబడుతున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు హక్కానీ నెట్వర్క్తో సంబంధాలున్నాయని అమెరికా తేల్చింది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. హక్కానీ నెట్వర్క్తో సంబంధాలున్న లష్కరే తోయిబాపై ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. అందులో భాగంగా అమెరికన్ కాంగ్రెస్ కొత్తగా రూపొందించిన నేషనల్ ఢిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం 2018లో లష్కరే తోయిబా, హక్కానీ నెట్వర్క్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. లష్కరే తోయిబాను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేలా అమెరికా కొత్తగా చట్టాన్ని రూపొందించింది. లష్కరే తోయిబాను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించడంతో.. ఉగ్రవాదంపై పోరు చేస్తున్న పాకిస్తాన్ కూడా ఈ సంస్థను ఉగ్రసంస్థగానే పరిగణించాల్సి ఉంటుంది. ఉగ్రవాదంపై పోరుగలో భాగంగా పాకిస్తాన్కు అమెరికా భారీగా ఆర్థిక సహకారం అందిస్తోంది. గతంలో 350 మిలియన్ డాలర్లు ఉన్న ఆర్థిక సహకారం.. ఈ ఏడాది 700 మిలియన్ డాలర్లకు అమెరికా పెంచింది. హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబాలను నిర్వీర్యం చేసే క్రమంలో పాకిస్తాన్ వెనకడుగు వేస్తే.. భవిష్యత్లో అమెరికా నుంచి ఎటువంటి నిధులు అందవని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది భారత్ విజయం ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన బ్రిక్స్, ఇతర అంతర్జాతీయ వేదికలపై లష్కరే తోయిబా, దాని అధిపతి హహీజ్ సయీద్పై భారత్ పోరుబాట పట్టింది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ను అంతర్జాతీయ ఉగ్రసంస్థలుగా ప్రకటించాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా డిమాండ్ చేసింది. అంతేకాక జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్ పెద్ద పోరాటమే చేసింది. చైనా అడ్డుపడకపోయి ఉంటే.. మసూద్ అజర్ని ఈ పాటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రపంచం గుర్తించేది. -
లష్కరే కమాండర్ మట్టూ హతం
- అతని అనుచరుడు ముజామిల్ కూడా.. - సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది శ్రీనగర్: కశ్మీర్లో మరో అగ్ర మిలిటెంట్ను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంత్నాగ్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ జునైద్ మట్టూతో పాటు అతని సహచరుడు ముజామిల్ హతమయ్యాడు. బిజిబిహారా సమీపంలోని ఆర్వాని గ్రామంలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ చేపట్టిన ఈ ఆపరేషన్లో మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. సంఘటనా స్థలం వద్ద తమపై రాళ్లు రువ్విన ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని భద్రతా దళాలు ఉదయం 8 గంటలకే చుట్టుముట్టాయి. 10 గంటలకు వారి నుంచి కాల్పులు మొదలవడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో 8 గంటల పాటు ముగ్గురు ఉగ్రవాదులు ఇంటిలోనే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని స్థానికులు రాళ్లు రువ్వడం తమకు ప్రతిబంధకంగా మారిందని పోలీసులు తెలిపారు. రూ. 10 లక్షల రివార్డు రెండేళ్లుగా ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న మట్టూ తలపై పోలీసులు రూ. 10 లక్షలు ప్రకటించారు. 18 ఏళ్ల వయసులో మిలిటెన్సీలో చేరిన మట్టూ, కశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ 12 మంది ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. గతేడాది పోలీసు వాహనంపై దాడిచేసి ముగ్గురిని హతమార్చిన దాడిలో అతడి పాత్ర ఉంది. గురువారం కుల్గాం జిల్లాలో ఓ పోలీసు అధికారి హత్యలో మట్టూ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. గతేడాది బుర్హాన్ వనీ తరువాత లోయలో చనిపోయిన మూడో టాప్ మిలిటెంట్ మట్టూనే. ఇద్దరు పౌరుల మృతి ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్లో భద్రతా దళాలు నిమగ్నమై ఉన్నపుడు స్థానికులు వారితో ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో అల్లరిమూకలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, 10 మంది గాయపడ్డారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట శుక్రవారం పాక్ సైన్యం కాల్పులు జరపడంతో భారత సైనికుడు మృతిచెందాడు. భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో గాయపడిన జవాన్ నాయక్(34) భక్తావర్ సింగ్ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నాయక్ సొంతూరు పంజాబ్ హోషిరాపూర్ జిల్లాలోని హజీపూర్. ఉగ్ర దాడిలో ఆరుగురు పోలీసుల మృతి శ్రీనగర్: కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో శుక్రవారం పోలీసుల వాహనంపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడటంతో ఆరుగురు పోలీసులు చనిపోయారు. పోలీసులు అనంతనాగ్లో విధులు ముగించుకుని అచాబల్ తిరిగి వెళ్తుండగా కుల్గాడ్ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తర్వాత మృతుల ముఖాలను ఛిద్రం చేసి, పోలీసుల ఆయుధాలను తీసుకుని పారిపోయారు. ఈ దాడికి పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే బాధ్యత ప్రకటించుకుందని అధికారులు తెలిపారు. తమ కమాండర్ జునైద్ మట్టూని హతమార్చినందుకు ప్రతీకారంగానే లష్కరే ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతం, మట్టూ హతమైన ఎన్కౌంటర్ జరిగిన చోటుకు 20 కి.మీ. దూరంలో ఉంది. -
పాక్ ఉగ్రవాది బహదూర్పై చార్జిషీట్
ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన ఎన్ఐఏ న్యూఢిల్లీ: లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న పాకిస్థానీ జాతీయుడు బహదూర్ అలీ అలియాస్ సైఫుల్లా మన్సూర్పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు బహదూర్ అలీ కుట్ర పన్నాడని చార్జిషీట్లో పేర్కొంది. ఢిల్లీ జిల్లా జడ్జి అమర్నాథ్ ఎదుట ఈ మేరకు అభియోగపత్రాన్ని నమోదు చేసింది. అలీ మరో ఇద్దరు ఉగ్రవాదులు అబు సాద్, అబు దార్దాతో కలసి వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి ఏడు రోజులు ప్రయాణించి జూన్ 20న భారత్ చేరుకున్నాడని చార్జ్షీట్లో పేర్కొంది. జూన్ 22న ఎన్ కౌంటర్లో అబు సాద్, అబు దర్దా మృతి చెందారని, దీంతో అలీ అక్కడి నుంచి తన మకాంను వేరే చోటికి మార్చాడని వెల్లడించింది. జూలై 24న అలీని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. లాహోర్లోని రైవిండ్ గ్రామానికి చెందిన బహదూర్ అలీ పాఠశాల విద్యను మధ్యలోనే విడిచిపెట్టారు. అరెస్ట్ సమయంలో అతని వద్ద జమ్మూకశ్మీర్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ మ్యాప్లు లభించాయని ఎన్ఐఏ వెల్లడించింది. -
కశ్మీర్ బ్యాంకులకు టార్గెట్ చేసిన లష్కరే తోయిబా
-
ఉడీ ఉగ్రదాడి; సంచలన వాస్తవం
జమ్మూకశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై దాడి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే-ఈ-తొయిబా పనేనని వెల్లడైంది. పాకిస్థాన్ లోని గుజ్రాన్ వాలా పట్టణంలో వెలసిన పోస్టర్లు ఇందుకు సాక్షంగా నిలుస్తున్నాయి. ఉడీ దాడిలో హతమైన ఉగ్రవాది మహ్మద్ అనాస్ అలియాస్ అబూ సిరాఖా అంత్యక్రియలు సందర్భంగా నిర్వహించే ప్రత్యేక నమాజ్ కు రావాలంటూ స్థానికులను ఆహ్వానిస్తూ గుజ్రాన్ వాలాలో పోస్టర్లు వెలిశాయని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది. 'ఎంతో ధైరవంతుడైన మత పోరాటయోధుడు అబూ సిరఖా మహ్మద్ అనాస్.. ఆక్రమిత కశ్మీర్ లో ఉడీ బ్రిగేడ్ క్యాంపులో 177 మంది హిందూ సైనికులను నరకానికి పంపాడు. మతం కోసం అతడు ప్రాణత్యాగం చేశాడ'ని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. మహ్మద్ అనాస్ ఫొటోతో పాటు లష్కరే-ఈ-తొయిబా అధినేత హఫీజ్ మహ్మద్ సయీద్ చిత్రాన్ని పోస్టర్లతో ముద్రించారు. అనాస్ మృతదేహం లేకుండా అతడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. గుజ్రాన్ వాలా పట్టణంలోని గిర్ జాఖ్ సమీపంలో బాదానుల్లా ప్రాంతంలో అంత్యక్రియలు జరపనున్నట్టు తెలిపారు. ఉడీ దాడి పాకిస్థాన్ ఉగ్రవాదుల పనేనని భారత్ చేస్తున్న వాదనకు ఈ పోస్టర్లు సాక్ష్యంగా నిలిచాయి. ఉడీ దాడితో సంబంధం లేదని బొంకుతున్న పాకిస్థాన్ దీనికి ఏం సమాధానం చెబుతుందో చూడాలి. అయితే పాకిస్థాన్ కే చెందిన జైషే-ఈ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉడీ దాడికి పాల్పడిందన్న అనుమానాన్ని ప్రాథమికంగా భారత్ వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పోస్టర్లతో ఇది లష్కరే-ఈ-తొయిబా ఘాతుకంగా వెల్లడైంది. కుట్రదారులను గుర్తించడం, ఆధారాల సేకరణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి సాధించలేకపోయారు. ఉడీ దాడిలో హతమైన ఉగ్రవాదుల వద్ద రెండు జర్మనీ తుపాకులు దొరికాయి. అయితే వీటిలో ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. మరో తుపాకీని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన మందులు, ఆహార పొట్లాలు ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారని నిర్ధారించినా.. వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో కచ్చితంగా నిర్దరణకు వచ్చే అవకాశం కల్పించలేకపోయాయి. ఉగ్రవాదులకు చొరబాటుకు సహకరించారనే ఆరోపణలతో అరెస్టు చేసిన అహసాన్ ఖుర్షీద్, ఫైసాల్ అవాన్ కూడా పరస్పర విరుద్ధ వాంగూల్మం ఇవ్వడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గుజ్రాన్ వాలాలో వెలుగుచూసిన పోస్టర్లు సాక్ష్యంగా నిలబడతాయా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఉడీ దాడిలో హతమైన మిగతా ముగ్గురు ఉగ్రవాదుల స్వస్థలాల్లో కూడా ఇదేవిధంగా పోస్టర్లు వెలిశాయో, లేదో తెలియదని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' పేర్కొంది. సెప్టెంబర్ 18న ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 సైనికులు మృతి చెందారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
బహదుర్తోనే పాక్ భారీ స్కెచ్
ఢిల్లీ : పాకిస్థానీ ఉగ్రవాది బహదూర్ అలీ (అలియాస్ సైఫుల్లా)ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టింది. గత నెల 25న జమ్ముకశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దులు దాటి భారత్లోకి ఆయుధాలతో చొరబడిన బహదూర్ అలీ భద్రతా దళాలకు చిక్కిన విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్లో లష్కరే తొయిబా క్యాంపులు నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు హెచ్చరించారు. పాక్ అతడిని చొరబాటు ద్వారా కశ్మీర్కు పంపిందని ఎన్ఐఏ పేర్కొంది. కశ్మీర్ పరిస్థితిని అవకాశంగా మలుచుకునేందుకు ఎల్ఈటీ యత్నిస్తుందని ఎన్ఐఏ వెల్లడించింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తాయిబాకు చెందిన బహదూర్ అలీ గత నెలలో భారత్లోకి భారీగా ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలతో చొరబడ్డాడు. భద్రతాదళాలకు చిక్కడంతో తాను పాక్ జాతీయుడినని అంగీకరించాడు. పైగా సాధ్యమైనంత ఎక్కువమందిని కాల్చిచంపేందుకే లష్కరే ఆదేశాల మేరకు భారత్లోకి వచ్చినట్లు స్పష్టం చేశాడు. అదుపులోకి తీసుకున్న బహదుర్ అలీ నుంచి మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులతో పాటు 23వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
కశ్మీర్ అల్లర్లలో లష్కరే పాత్ర: సయీద్
లాహోర్: కశ్మీర్ తాజా అనిశ్చితిలో పాక్ ప్రేరేపిత లష్కరే ఉగ్రసంస్థ పాలు పంచుకుందని మరోమారు స్పష్టమైంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తరువాత.. అంతిమయాత్రను భారీ ఎత్తున నిర్వహించింది లష్కరే ఉగ్రవాది అమీర్ అబూ దుజానా అని ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ వెల్లడించాడు. ‘కశ్మీర్లో లక్షలాదిగా తరలివచ్చిన బుర్హాన్ వానీ అంతిమయాత్రను దిగ్విజయంగా నిర్వహించింది మరెవరో కాదు.. మన లష్కరేకు చెందిన అమీర్’ అని సయీద్ పేర్కొన్నాడు. అలాగే, కశ్మీర్ అల్లర్ల సమయంలో కశ్మీర్ లోయ నుంచి వేర్పాటు వాద నేత ఆసియా అంద్రాబీ తనకు ఫోన్ చేసి సాయం కోరారని వెల్లడించాడు. ‘అంద్రాబీ నాకు ఫోన్ చేసి.. మేం కష్టాల్లో ఉన్నాం. మా పాకిస్తానీ సోదరులెక్కడ అని ప్రశ్నించింది. ఆ వెంటనే మేం పని ప్రారంభించాం. రెండు, మూడు రోజుల్లోనే ఫైసలాబాద్ నుంచి కొందరిని కశ్మీర్ పంపించాం’ అని హఫీజ్ సయీద్ తెలిపాడు. -
26/11పై మరిన్ని ఆధారాలు ఇవ్వండి: పాక్
ఇస్లామాబాద్: ముంబై నగరంపై 2008 నవంబరు 26న జరిగిన దాడులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేసేందుకు తమకు మరిన్ని ఆధారాలు అందివ్వాలని భారత్ను పాకిస్థాన్ కోరింది. పాక్ విదేశాంగ కార్యదర్శి, భారత విదేశాంగ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు. ఈ కేసులో లష్కరే తోయిబా కమాండర్ జకీ-ఉర్ రెహ్మాన్ లఖ్వీతోపాటు మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. భారత్ ఈ లేఖకు ఇంకా స్పందించలేదు. ఈ కేసులో అరెస్టయి, ఏడాది క్రితం విడుదలైన లఖ్వీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ఆరేళ్లుగా సాగుతున్నఈ కేసు విచారణను తొంద రగా ముగించాలని కోరుతున్న భారత్.. అన్ని ఆధారాలను ఇప్పటికే అందించింది. -
బాల్థాక్రే హత్యకు కుట్ర
వీడియోలింకు వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడి తన భార్యకు ముంబై దాడి విషయం తెలియదని వ్యాఖ్య ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్థాక్రే హత్యకు లష్కరే తోయిబా కుట్రపన్నిందని.. 26/11 ఘటనలో అప్రూవర్గా మారిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పాడు. ఎప్పుడు వీలు చిక్కినా థాక్రేను మట్టుబెట్టాలనే లక్ష్యంతో లష్కరే ఒకరిని ప్రత్యేకంగా నియమించిందని.. అయితే, అతన్ని పోలీసులు పట్టుకోవటంతో ప్రయత్నం విఫలమైందని హెడ్లీ తెలిపాడు. అబు జుందాల్ తరపు న్యాయవాది అబ్దుల్ వాహబ్ ఖాన్.. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నపుడు హెడ్లీ ఈ వివరాలు వెల్లడించాడు. శివసేన కార్యాలయం ‘సేన భవన్’ను తను కూడా రెండుసార్లు సందర్శించినట్లు తెలిపాడు. ఈ ప్రయత్నం కచ్చితంగా ఎప్పుడు జరిగిందీ.. గుర్తురావటం లేదని కానీ.. పోలీసుల కస్టడీనుంచి ఆ లష్కరే ఉగ్రవాది తర్వాత తప్పించుకున్నాడని వెల్లడించాడు. 2009లో మరోసారి భారత్లో దాడులకు (అల్కాయిదా తరపున) వచ్చినపుడు ఖర్చుల కోసం అల్కాయిదా నాయకుడు ఇలియాస్ కశ్మీరీ రూ. లక్ష పాకిస్తానీ కరెన్సీ ఇచ్చినట్లు హెడ్లీ తెలిపాడు. ముంబై దాడులకు కారకులైన 10 మంది ఉగ్రవాదులను తనెప్పుడూ కలవలేదనీ.. కానీ, కసబ్ ఫొటోను మాత్రం ఇంట ర్నెట్లో చూశానన్నాడు. ‘ముంబై ఘటనతో మీరు సంతోషంగా ఉన్నారా?’ అన్న వాహబ్ ఖాన్ ప్రశ్నకు.. హెడ్లీ స్పందిస్తూ ‘అవునని చెప్పినా తప్పుడు సమాధానమే.. కాదని చెప్పినా తప్పుడు సమాధానమే అవుతుంది’ అని అన్నాడు. తన భార్య షాజియాకు ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేదని హెడ్లీ పునరుద్ఘాటించాడు. షాజియా గురించి ప్రశ్నించటంతో హెడ్లీ-ఖాన్ మధ్య వాగ్వాదం జరిగిం ది. ‘మీరు అనవసరమైన, పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. నోటికేదొస్తే దాన్ని అడగడం సరైంది కాదు’ అని అన్నాడు. కాగా, బాల్థాక్రేపై హిట్లిస్టులో ఉన్నారనే విషయం గర్వకారణమని శివసేన తెలిపింది. అయితే హెడ్లీ చెప్పేంతవరకు.. బాల్థాక్రేపై దాడికి యత్నించిన వ్యక్తిని పట్టుకోవడం.. అతడు తప్పించుకున్న విషయా న్ని ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రశ్నించారు. -
అది లష్కరే తోయిబా అనుబంధ సంస్థే
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నది. జమాతే ఉద్ దవా (జేయూడీ) వంటి ఉగ్రవాద గ్రుపులకు మీడియా కవరేజ్ ఇవ్వకుండా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జేయూడీ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని తొలిసారి పాక్ ధ్రువీకరించింది. లష్కరే తోయిబా, జమాతే ఉద్ దావా, ఫల్హా ఏ ఇన్సానియత్ ఫౌండేషన్ గ్రూపులకు మీడియా కవరేజ్ నిషేధించాలంటూ అన్ని శాటిలైట్ టీవీ చానెళ్లు, రేడియో స్టేషన్లకు పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. జమాతే ఉద్ దావా, ఫల్మా ఏ ఇన్సానియత్ ఫౌండేషన్లు లష్కరే తోయిబా అనుబంధ సంస్థలని ఈ నోటిఫికేషన్ లో స్పష్టంచేసింది. అదేవిధంగా మరో 60 సంస్థలు, 12 ఇతర గ్రూపులపైనా నిఘా ఉంచాలని ఈ నోటిఫికేషన్ పేర్కొంది. జాతీయ కార్యాచరణలో భాగంగానే ఈ సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్ స్పష్టంచేసింది. ఈ ఉగ్రవాద గ్రూపులకు సంబంధించి సామాజిక సేవ పేరిట నిధుల సేకరణకు ఇచ్చే వాణిజ్య ప్రకటనలను కూడా ప్రచురించకూడదని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే టీవీ చానెళ్లు, రేడియో స్టేషన్లపై భారీ జరిమానా విధంచడమే కాకుండా, లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశముంటుందని నోటిఫికేషన్ హెచ్చరించింది. ఇటీవల అమెరికా పర్యటనలో ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అగ్రరాజ్యానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నోటిఫికేషన్ జారీచేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక 2008లో ముంబైలో 166మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల మారణహోమానికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. అతను పాక్ లో యథేచ్ఛగా తిరుగుతూ.. భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటాడు. -
కీలక ఉగ్రవాది కోసం వెళ్లి నేలకొరిగాడు
శ్రీనగర్: ఉగ్రవాదుల ఎత్తులకు పై ఎత్తులకు వేసి వారి ఆటకట్టించగల జమ్మూకశ్మీర్కు చెందిన ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్లోని బందిపోర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో అల్తాఫ్ అహ్మద్ అనే సబ్ ఇన్స్పెక్టర్ నేలకొరిగాడు. ఈ విషయం తెలిసి రాష్ట్ర పోలీసు శాఖ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. ఎందుకంటే చనిపోయిన అల్తాఫ్కు కర్తవ్యం అంటే ప్రాణం. ఎంతటి క్లిష్ల పరిస్థితులమధ్యనైనా విధులు నిర్వర్తించడంలో ముందుంటాడు. అలాంటి అధికారి ఉగ్రవాదులతో జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో పోలీసుశాఖకు తీరని లోటు ఏర్పడినట్లయింది. 'నేను మీ కెమెరా ముందు ఏం మాట్లాడలేకపోతున్నాను. బహుషా నాకు ఏడ్పుకూడా రావొచ్చు' అని అక్కడి డీజీపీ కే రాజేంద్ర కుమార్ అన్నారు. మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి అల్తాఫ్ బందిపూర్కు కోవర్ట్ మిషన్ లో భాగంగా వెళ్లాడని, అక్కడ పాకిస్థాన్ ఉగ్రవాది లష్కరే తోయిబా కమాండర్ అబూ ఖాసింను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నించాడని, ఆ ప్రయత్నంలో జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఉదంపూర్ వద్ద బీఎస్ఎఫ్ కాన్వాయ్పై భారీ ఎత్తున దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈదాడి ప్రధాన సూత్రదారుడు ఖాసీం అని గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక విధుల్లో భాగంగా బందిపోర్ జిల్లాకు అల్తాఫ్ను పంపించారు. కానీ, టార్గెట్కు దగ్గరవుతుండగానే వాళ్లు ఎదురుకాల్పులు జరపగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఇప్పటి వరకు సైన్యం నిర్వహించిన పలు ఆపరేషన్లకు ఆల్తాఫ్ ఎనలేని సేవలను అందించాడు. -
లష్కరే టాప్ మిలిటెంట్ హతం
శ్రీనగర్: జమ్మూక శ్మీర్లో మిలిటెంట్లపై పోరులో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ ఇర్షద్ గానీని శనివారం ఎన్కౌంటర్లో హతమార్చాయి. పుల్వామా జిల్లా కాకపోరా ప్రాంతంలోని బేగమ్ బాగ్ గ్రామం వద్ద మిలిటెంట్లు ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే ఆర్మీ రంగంలోకి దిగి, పోలీసులతో కలసి గానీని మట్టుబెట్టింది. మిగతా మిలిటెంట్ల కోసం గాలిస్తున్నారు. కాకపోరాకే చెందిన ఇర్షద్ తలపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. 2013లో హైదర్పోరాలో 8 మంది జవాన్లను చంపిన కేసుతోపాటు ఆర్మీ, పోలీసులపై జరిగిన పలు దాడుల కేసుల్లో అతడు నిందితుడు. -
లష్కరే, ఐఎస్ఐఎస్లపై సమష్టి పోరు
సుష్మా స్వరాజ్ పిలుపు కైరో: తమ పొరుగున ఉన్న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, తాలిబాన్లపైనా, గల్ఫ్ ప్రాంతంలో ముప్పుగా పరిణమించిన ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలపై ఉమ్మడి పోరాటం చేద్దామని భారత్ పిలుపునిచ్చింది. నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈజిప్టులో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఈజిప్టు వ్యూహాత్మక నిపుణులు, విధాన రూపకర్తలనుద్దేశించి మాట్లాడారు. అపనమ్మకం, హింసల నుంచి శాంతి, అభివృద్ధి దిశగా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే.. చర్చల ద్వారా విస్తృతమైన దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతానికి ఐఎస్ఐఎస్ నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందో.. భారత్కు కూడా పొరుగుదేశం నుంచి లష్కరే తోయిబా, తాలిబాన్ల నుంచి ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. -
‘లఖ్వీ స్వరం సాక్ష్యంగా చెల్లదు’
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్, ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మన్ లఖ్వీ స్వర నమూనాలు సాక్ష్యంగా చెల్లవని ఆ దాడుల కేసును వాదిస్తున్న పాక్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) న్యాయవాది మహ్మద్ అజహర్ చౌదరీ తెలిపారు. ఇలాంటి ఆడియోలను సాక్ష్యం అంగీకరించే చట్టాలు పాక్లో లేవన్నారు. లఖ్వీ స్వర నమూనాలు సాక్ష్యంగా ఉపయోగించలేమని స్పష్టం చేశారు. బలవంతంగా సేకరించడం కూడా సాధ్యం కాదని, ఆ విధమైన చట్టాలు పాక్లో లేవని చౌదరీ తెలిపారు. భారత్, అమెరికాలో కూడా ఇలాంటి చట్టాలు లేవన్నారు. గత వారంలో రష్యాలోని ఉఫా నగరంలో భారత్, పాక్ ప్రధానులు భేటీ అయి ముంబై దాడులపై అదనపు సమాచారం (లఖ్వీ స్వర నమూనాతో సహా) ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో పాక్ దర్యాప్తు సంస్థ న్యాయవాది ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర?
-
ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర?
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరో ఉగ్రదాడికి లష్కరే తాయిబా కుట్ర పన్నుతోందా? ఈసారి కూడా హోటళ్లు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుంటోందా? నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. సముద్రమార్గం గుండా ఉగ్రవాదులు చొరబడొచ్చని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరిస్తోంది. 26/11 తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని సమాచారం. ప్రధానంగా ముంబై రైళ్లలో హై ఎలర్ట్ ప్రకటించారు. 8-10 మంది ఉగ్రవాదులు చొరబడొచ్చన్నది నిఘా వర్గాల హెచ్చరికల సారాంశం. ఈ నేపథ్యంలో ముంబై నగర వ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. ఇంతకుముందు 2011 నవంబర్ 26వ తేదీన ఉగ్రవాదులు దాడి చేసి భారీ ప్రాణనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. మరోసారి ఈ తరహా దాడులు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితమే జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా జైలు నుంచి విడుదల కావడంతో.. ఇప్పుడు మరో దాడికి కుట్ర పన్నే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. -
ముంబై స్టేషన్లపై టెర్రరిస్టుల టార్గెట్?
ముంబై: ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లకు టెర్రరిస్టు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలోకి సముద్ర మార్గం ద్వారా లష్కరే తాయిబా ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దీనికి సంబంధించి సోమవారం స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు సుమారు 10 మంది ముంబై రైల్వేస్టేషన్లను టార్గెట్ చేశారనే సమాచారంతో ఈ అలర్ట్ జారీ చేశారు. దీంతో 17 స్టేషన్లకు ఆర్పీఎఫ్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు. దేశంలో సంచలనం సృష్టించిన 2008 వరుస పేలుళ్లు, 26/11 దాడులకు అబూ యాకూబ్ బాధ్యుడన్న సంగతి తెలిసిందే. సముద్రమార్గం గుండా వచ్చి దాడులు చేయడం అతడి ఆపరేషన్ స్టైల్. ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్న యాకూబ్ పాకిస్తాన్లోని కరాచీ ద్వారా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. -
ఉగ్రవాది ఖాజాపై కేసు కొట్టివేత
హైదరాబాద్ సిటీ : లష్కర్-ఎ-తోయిబా (ఎల్టీ) ఉగ్రవాద సంస్థ సౌత్ ఇండియా ఆపరేషన్ చీఫ్ షేక్ అబ్దుల్ ఖాజా అలియాస్ అంజాద్పై నమోదైన నకిలీ పాస్పోర్టు, నకిలీ నోట్ల కేసును నాంపల్లి ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. సాక్ష్యాధారాలు రుజువు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో ఖాజాపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది. మలక్పేటకు చెందిన ఖాజా బేగంపేటలోని నగర కమిషనర్స్ టాస్క్ఫోర్స్ కార్యాలయం (ప్రస్తుతం సికింద్రాబాద్కు మారింది)పై 2005 అక్టోబర్ 12న జరిగిన మానవ బాంబు దాడి కేసులో 9వ నిందితుడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఖాజాను జనవరి 18, 2010న అఫ్జల్గంజ్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఇన్స్పెక్టర్ మధుకర్స్వామి అరెస్టు చేశారు. ఆ సమయంలో అతని నుంచి కరాచీ నివాసి మహ్మద్ ఫరాన్ అనే పేరుతో పాకిస్తాన్కు చెందిన పాస్పోర్టు, రూ.50 వేలు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ బాంబు పేలుడు కేసులో ఇతడిని అదే రోజు రిమాండ్ చేయగా, అతనిపై సిట్ అధికారులు నకిలీపాస్పోర్టు, నకిలీ నోట్ల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జ్షీట్ వేయడంతో కోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణలో పోలీసులు అతనిపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో కేసు వీగిపోయింది. ఖాజాపై ఈ కేసు కొట్టివేసినా టాస్క్ఫోర్స్ బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉండటంతో అతను ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నాడు. అఫ్జల్గంజ్లో అరెస్టు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో చెట్టుకింద పాస్పోర్టు ఎలా సీజ్ చేశారని ఖాజా తరపు న్యాయవాది అజీమ్ ప్రశ్నించడంతో కేసు వీగిపోయింది. -
రిపబ్లిక్ డేకి దాడులకు లష్కరే వ్యూహం
-
రిపబ్లిక్ డేకి దాడులకు లష్కరే వ్యూహం
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లష్కర్-ఇ- తోయిబా ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిఘా పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరోవైపు పాక్ సరిహద్దుల్లోనూ భద్రత పెంపుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 10 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దుల్లో మోహరించాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. -
ఉగ్ర మూకలన్నిటిపై ఎక్కుపెట్టాలి
పాకిస్తాన్కు అమెరికా స్పష్టీకరణ తాలిబాన్, హక్కానీ, లష్కరే సంస్థలు పాక్కు, పొరుగు దేశాలకు, అమెరికాకు ముప్పుగా పరిణమించాయి ఉగ్రవాదులకు చోటిస్తే వచ్చే ముప్పుకు షెషావర్ ఘటనే తార్కాణం పాక్ పర్యటనలో తేల్చి చెప్పిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ ఇస్లామాబాద్: ఉగ్రవాదం విషయంలో ఎలాంటి భేదాలూ చూపకుండా చర్యలు చేపట్టాలని పాకిస్తాన్కు అమెరికా స్పష్టంచేసింది. పాకిస్తాన్తో పాటు భారత్, అమెరికా వంటి దేశాలకు ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన లష్కరే తోయిబా, తాలిబాన్, హక్కానీ వ్యవస్థలన్నిటిపైనా ఆయుధం ఎక్కుపెట్టాలని సూచించింది. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ తీసుకునే చర్యలను తాము వేచి చూస్తామని ఆ దేశ నాయకత్వానికి తెలియజేసింది. సోమవారం భారత పర్యటన ముగించుకుని అహ్మదాబాద్ నుంచి పాక్లో పర్యటన కోసం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ.. పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్, ప్రధానమంత్రి నవాజ్షరీఫ్ తదితరులతో భేటీ అయ్యారు. కెర్రీ మంగళవారం అజీజ్తో కలిసి ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడారు. ‘‘పాకిస్తానీ తాలిబాన్లు, అఫ్గాన్ తాలిబాన్, హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్కు, దాని పొరుగు దేశాలకు, అమెరికాకు ముప్పుగా పరిణమించాయి. ఈ దేశంలో కానీ, మరెక్కడైనా కానీ ఈ ఉగ్రవాదులు పాదం మోపకుండా చేసేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎలాంటి పొరపాటూ చేయవద్దు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ముష్కర మూకలు హక్కానీ, లష్కరే 2008లో అఫ్గానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయంపై దాడిచేసి 58 మంది ప్రాణాలను బలితీసుకున్న బాంబు దాడికి, 2011లో కాబూల్లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి, ఆ దేశంలో భారీ ట్రక్కులతో జరిగిన బాంబు దాడులకు పాల్పడింది హక్కానీ నెట్వర్కే. అఫ్గానిస్థాన్లో హక్కానీలు ప్రాబల్యం పెంచుకోవడానికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తెరవెనుక నుంచి మద్దతునిస్తోందని అమెరికా, అఫ్గాన్ అధికారులు పదేపదే చెప్పారు. కానీ ఈ ఆరోపణలను పాక్ తిరస్కరించింది. ఇక లష్కరే తోయిబా 2008 నవంబర్లో ముంబైలో మారణకాండకు తెగబడి 166 మందిని పొట్టనపెట్టుకోవటంతో సహా భారత్పై అనేక దాడులకు పాల్పడింది. ఉగ్రవాదులకు చోటిస్తే వచ్చే ముప్పుకు షెషావర్ విషాదమే తార్కాణం... ‘ఉగ్రవాదులు తన భూభాగంలో స్థానం కల్పించటం వల్ల, తన భూభాగం నుంచి పనిచేసేందుకు అవకాశం ఇవ్వటం వల్ల తనకే పొంచి వున్న పెను ముప్పుకు డిసెంబర్ 16నాటి విషాదం తార్కాణం’ అంటూ పాక్లోని పెషావర్లో ఒక సైనిక పాఠశాలపై గత నెలలో జరిగిన ఉగ్రవాద దాడిలో విద్యార్థులతో సహా 150 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాన్ని కెర్రీ ప్రస్తావించారు. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇటు పాక్లో, అటు అఫ్గానిస్థాన్లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలకు ఆలవాలంగా మారిన నార్త్ వజీరిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు పాక్ గత ఏడాది జూన్లో సైనిక చర్య ప్రారంభించిందని కెర్రీ చెప్పారు. ఈ సైనిక చర్యలో 1,500 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారని.. ఫలితాలు ఉన్నప్పటికీ సైనిక చర్య ఇంకా పూర్తి కాలేదన్నారు. ఉగ్రవాద సంస్థలపై భేదం లేదు: పాక్ అజీజ్ స్పందిస్తూ.. ఉగ్రవాద సంస్థలన్నిటిపై ఎలాంటి భేదం లేకుండా చర్యలు చేపడతామని కెర్రీకి హామీ ఇచ్చారు. ‘‘ఇక్కడి నుంచి అఫ్గానిస్థాన్లో కార్యకలాపాలు నిర్వహించే వారి (హక్కానీ నెట్వర్క్) సామర్థ్యం దాదాపుగా అదృశ్యమైంది. మా సైనిక బలగాలు భవిష్యత్తులో మరికొంత కాలం ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో నిమగ్నమై ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులతో సైన్యం పోరాడుతున్న ప్రాంతాల పునర్నిర్మాణానికి అమెరికా సాయం కావాలని ఆయన కోరారు. దీనికి కెర్రీ స్పందిస్తూ ముందుగా కేటాయించిన నిధుల్లో 250మిలియన్ డాలర్లను నార్త్ వజీ రిస్థాన్లో సహాయ చర్యలకు ఇస్తామన్నారు. పాక్ చర్యలపై వేచి చూస్తాం... మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అనే భేదమేమీ తమకు ఉండదని.. అందరిపై చర్యలు చేపడతామని అమెరికాకు పాక్ హామీ ఇచ్చిందని కెర్రీ వెంట పర్యటిస్తున్న అమెరికా ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరమైనవని.. ఎందుకంటే ఇప్పటివరకూ పాక్ ఉగ్రవాదుల్లో మంచి వారు, చెడ్డవారు అనే భేదం చూపించినట్లు భావించాల్సి వస్తుందని పేరు బహిర్గతం చేయడానికి నిరాకరించిన సదరు అధికారి విశ్లేషించారు. అయితే.. ఇప్పటికైనా ఉగ్రవాద సంస్థలన్నిటిపై ఎలాంటి తేడా లేకుండా చర్యలు చేపడతామని పాక్ హామీ ఇవ్వటం ఆహ్వానించదగ్గదని చెప్పారు. ఇది వాస్తవంగా ఎంతవరకూ కార్యరూపం దాలుస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుందని.. నిజం ఏమిటనేది చేసే పనిలో తేలుతుందన్నారు. ఇదిలావుంటే.. పెషావర్సైనిక పాఠశాలను సందర్శించేందుకు జాన్కెర్రీ తలపెట్టిన పర్యటన.. వాతావరణం అనుకూలించనందున రద్దు చేశారు. మా దేశంలో ఉగ్రవాదులకు భారత్ సాయం చేస్తోంది: పాక్ పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలకు భారత్ సాయం చేస్తోందని పాక్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. ‘‘పాక్కు సంబంధించి భారత్కు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. పాక్ లోపల దారుణమైన దురాగతాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు భారత్ సాయం అందిస్తోంది. తాలిబాన్కు భారత్తో సంబంధాలున్నాయి. పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధం నుంచి దృష్టి మళ్లించి.. తూర్పు సరిహద్దులో కొట్లాటలతో పాక్ తలమునకలై ఉండాలని భారత్ కోరుకుంటోంది. బలూచిస్థాన్లోని ఉగ్రవాదంలోనూ భారత్ ప్రమేయాన్ని విస్మరించరాదు’’ అని ఆయన మంగళవారంపాక్ పత్రిక ‘డాన్ న్యూస్’తో పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు ఆధారాలను అందించాలని ప్రశ్నించగా అనుభవాలు, విశ్వాసాలు ఈ ఆరోపణలకు ఆధారమని వ్యాఖ్యానించారు. -
నాంపల్లి కోర్టుకు టుండా
1998లో పట్టుబద్ద సలీం జునేదీ కేసులో నిందితుడు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య తిరిగి ఢిల్లీకి సిటీబ్యూరో: లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఢిల్లీ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో బాంబు పేలుళ్ల కుట్రకు పాల్పడిన కేసులో ఆయన నిందితుడు. బాబ్రీమసీదు విధ్వంసానికి ప్రతీకారంగా నగరంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన పాకిస్తాన్ జాతీయడు సలీం జునేదిని నగర పోలీసులు 1998 జులై 1న ఆరెస్టు చేసి సెలైన్సర్తో కూడిన పిస్టల్, 18 కేజీల ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అతనికి సహకరించిన ఉత్తరప్రదేశ్కు చెందిన అబ్దుల్ కరీం టుండా విదేశాలకు పారిపోయాడు. అతన్ని గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీటీ వారెంట్పై సిట్ పోలీసులు ఢిల్లీ నుంచి టుండాను తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి, చార్జీషీట్ దాఖలు చేశారు. బుధవారం కేసు విచారణ ఉండడంతో ఢిల్లీ జైలులో ఉన్న టుండాను అక్కడి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య విమానంలో నగరానికి తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరచి, విచారణ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్లో వస్త్ర వ్యాపారి అయిన టుండా బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా డెహ్రాడూన్, లక్నో, ఘజియాబాద్, ముంబై, అలీఘర్లతో పాటు గణేష్ ఉత్సవాలకు ముందు హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సలీం జునేదీకి విధించిన ఐదేళ్ల శిక్షా కాలం చర్లపల్లి జైలులో ముగియడంతో అతన్ని రెండేళ్ల క్రితం పాకిస్తాన్కు పంపించారు. ఇదే కేసులో టుండా విచారణ ఎదుర్కొంటున్నారు. -
ఒబామా పర్యటన సందర్భంగా దాడులు?
-
ఇదేం న్యాయం?!
సంపాదకీయం: జమ్మూ-కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని, ఆ సుందర ప్రదేశం చుట్టూ అలుముకున్న ఉద్రిక్తతలు సమసిపోవాలని ఆశించే వారందరికీ పత్రిబల్ ఎన్కౌంటర్ ఉదంతంలో సైన్యం తీసుకున్న నిర్ణయం నిరాశ కలిగిస్తుంది. పత్రిబల్ ఎన్కౌంటర్ మనం నిత్యం వినే ఎన్కౌంటర్ కథనాలకు భిన్నమైనదేమీ కాదు. 2000 సంవత్సరంలో అనంతనాగ్ జిల్లాలో అయిదుగురు పౌరులను సైన్యం కాల్చిచంపింది. వీరంతా సరిహద్దులకు ఆవలినుంచి చొరబడి వచ్చిన లష్కరే తొయిబా ఉగ్రవాదులని ప్రకటించింది. అంతకు కొన్ని రోజుల క్రితం కాశ్మీర్లోని చిట్టిసింగ్పురా అనేచోట కూలీలుగా పనిచేస్తున్న 36 మంది సిక్కులను హతమార్చిన ఉగ్రవాదులు ఈ అయిదుగురేనని తెలిపింది. ఆ నరమేథం కారకులు దాగిన ప్రదేశాన్ని గుర్తించి, వారిని ప్రాణాలకు తెగించి ఎంత చాకచక్యంగా మట్టుబెట్టిందీ ఆనాటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీకి సైనిక, పోలీసు అధికారులు వివరించారు. మరికాసేపట్లోనే ఎన్కౌంటర్ గురించిన అనుమానాలు గుప్పుమన్నాయి. మృతులు పాకిస్థాన్నుంచి వచ్చినవారు కాదని, ఉగ్రవాదంతో సంబంధంలేని సాధారణ పౌరులని ఆ మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు వెల్లడించారు. అమాయకు లపై ఉగ్రవాద ముద్రేసి హతమార్చడాన్ని నిరసిస్తూ నిరసన ప్రదర్శన జరిగితే, దానిపై పోలీసులు కాల్పులు జరిపారు. అందులో మళ్లీ తొమ్మిదిమంది మరణించారు. ఎన్కౌంటర్ ఉదంతంలో తమకు న్యాయం జరగాలని, ప్రాణాలు తీసిన సైనిక జవాన్లపై చర్య తీసుకోవాలని ఆనాటి నుంచి మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈలోగా ఇది ఎన్నో మలుపులు తిరిగింది. ఖననం చేసిన మృతదేహాలను వెలికితీసి డీఎన్ఏ పరీక్షల కోసం పంపిన నమూనాలు తారుమారయ్యాయి. పోలీసు అధికారుల సస్పెన్షన్లు, న్యాయవిచారణలు, మానవ హక్కుల సంఘం జోక్యం వంటివన్నీ అయ్యాయి. చివరకు సీబీఐ దర్యాప్తు కూడా సాగింది. అన్ని అవాంతరాలనూ అధిగమిం చాక డీఎన్ఏ పరీక్షల్లో ఎన్కౌంటర్ మృతులంతా కాశ్మీర్వాసులేనని తేలింది. సీబీఐ దర్యాప్తు నివేదిక సైతం సైన్యాన్ని తప్పుబట్టింది. ఒక బ్రిగేడియర్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లు, ఒక సుబేదారు ఈ నేరంలో భాగస్వాములని నిర్ధారించింది. కింది కోర్టులో సీబీఐ చార్జిషీటు దాఖలుచేసినప్పుడు సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టం ప్రకారం తమను విచారించడానికి ముందస్తు అనుమతులు తీసుకోవా లని చార్జిషీటులోని సైనికాధికారులు అభ్యంతరం లేవనెత్తారు. కింది కోర్టు, హైకోర్టు ఆ వాదనను తోసిపుచ్చాక విషయం సుప్రీంకోర్టు ముందుకెళ్లింది. సీబీఐ నిందితులుగా నిర్ధారించినవారందరి ప్రాసిక్యూ షన్కు అనుమతినివ్వడం లేదా సైనిక న్యాయస్థానంలో తామే విచారించడం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఇది చెప్పి కూడా రెండేళ్లు దాటుతోంది. మొత్తం పద్నాలుగేళ్ల కాలహరణం తర్వాత నిందితులంతా నిర్దోషులని సైనిక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్కౌంటర్లో మరణించిన వారంతా పాక్ పౌరులేనని, వారికి సంబంధించి అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే సైన్యం దాడిచేసి అయిదుగురినీ మట్టుబెట్టిందని ఆ తీర్పు పేర్కొంది. డీఎన్ఏ పరీక్షలు సైతం నిర్ధారణగా తేల్చిచెప్పిన విషయాలు కళ్లముందుండగా, వారి బంధువుల సాక్ష్యాధారాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు మార్షల్ ఎలా నిర్ధారించగలిగింది? అందుకు అది చూపిన కారణాలేమిటి? ఏ విషయంపైనా స్పష్టత లేదు. పారదర్శకత అసలే లేని కోర్టు మార్షల్ తీర్పుద్వారా సైన్యం పంపదలుచుకున్న సందేశం ఏమిటి? నాలుగేళ్ల క్రితం మఛిల్ ప్రాంతంలో జరిగిన ఒక బూటకపు ఎన్కౌంటర్పై కోర్టు మార్షల్ చేయబోతున్నట్టు నెలక్రితం సైన్యం ప్రకటిస్తే హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తాజా ఉదంతాన్ని చూస్తే అలాంటి ఆశలన్నీ ఆవిరవుతాయి. అసలు సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టం గురించే ఎన్నో విమర్శలున్నాయి. కేంద్రం నియమించిన జస్టిస్ బీపీ జీవన్రెడ్డి కమిటీ కూడా ఆ చట్టం అమానవీయమైనదని, దాన్ని రద్దు చేయాలని తేల్చిచెప్పింది. కాశ్మీర్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులరీత్యా ఆ చట్టం అవసరమున్నదనుకున్నప్పుడు ఆ ‘ప్రత్యేక పరిస్థితుల’ను ఎదుర్కోవ డానికి మాత్రమే ఆ చట్టం ఉపయోగపడాలి. కానీ, ఈ ఉదంతంలో ‘ప్రత్యేక పరిస్థితి’ ఏం ఉంది? ఉగ్రవాద ఘటనతో సంబంధంలేని సాధారణ పౌరులను అకారణంగా మట్టుబెట్టడమే ఇందులోని విషయం. ఇలా ఎవరినైనా చంపవచ్చునన్నది వారికప్పగించిన విధుల్లో భాగం కాదు. ఆ చర్య కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేది కాదు సరిగదా... దాన్ని మరింత విషమింపజేసేది. అలాంటపుడు సుప్రీంకోర్టు ముందుకు ఈ విషయం వచ్చినప్పుడే కేంద్రం దృఢంగా వ్యవహరించి, నిందితులైన జవాన్లను సాధారణ న్యాయస్థానంలో విచారించడం సబబేనని తన వాదనగా చెప్పి ఉండాల్సింది. సాయుధ దళాల చట్టం ఇలాంటి కేసుల్లో వర్తించబోదని స్పష్టంచేయాల్సింది. కనీసం కోర్టు మార్షల్ విచారణ అయినా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సింది. తమవారిని అకారణంగా పొట్టనబెట్టుకున్న జవాన్లకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయనే అభిప్రాయం కాశ్మీర్ పౌరుల్లో ఏర్పడితే, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి చేసే ప్రయత్నాలకు అది విఘాతం కలిగిస్తుంది. అంతేకాదు... ప్రపంచంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై సంశయాలు రేకెత్తిస్తుంది. ఇప్పటికైనా కేంద్రం మేల్కొనాలి. విస్పష్టమైన ఆధారాలున్నందువల్ల కోర్టు మార్షల్ నిర్ణయాన్ని రద్దుచేసి నిందితులను సాధారణ చట్టాలకింద న్యాయస్థానంలో విచారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. -
మూడు రోజుల పోలీస్ కస్టడీకి టుండా
న్యూఢిల్లీ : నగరంలో 1997 అక్టోబర్ 26న జరిగిన బాంబుపేలుడు కేసులో ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఇప్పటివరకు వివిధ బాంబు పేలుళ్ల కేసుల్లో పోలీస్ కస్టడీలో ఉన్న టుండాను శుక్రవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, అతడిని 1997 అక్టోబర్ 26 బాంబు పేలుళ్ల కేసులో విచారించాల్సిన అవసరం ఉందని, అందువల్ల అతడిని తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరగా, మేజిస్ట్రేట్ పై విధంగా తీర్పు చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 37 బాంబు పేలుళ్ల కేసుల్లో టుండాకు సంబంధం ఉందంటూ పోలీసులు అతడిని అరెస్టు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల క్రితం అతని బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు చేయాలన్న పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల అతడికి బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని తెలిపింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ బన్సల్ ఎదుట హాజరైన టుండా.. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ చేయొద్దని కోరాడు. తన వయసు 72 సంవత్సరాలని, వివిధ వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇటీవలే తనకు పేస్ మేకర్ అమర్చారని, హైబీపీతో కూడా బాధపడుతున్నానని తెలిపాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని కోరాడు. తనకు ఈ పరీక్ష అంటే ఏంటో, దాని పరిణామాలేంటో కూడా తెలుసని కోర్టుకు చెప్పాడు. -
బ్రెయిన్ మ్యాపింగ్ వద్దన్న టుండా.. సరేనన్న కోర్టు
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో బాంబుల తయారీలో నిపుణుడైన అబ్దుల్ కరీం టుండా విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు మన్నించింది. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు వద్దని అతడు కోరగా.. టెస్టు చేయాలన్న పోలీసుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల అతడికి బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని తెలిపింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ బన్సల్ ఎదుట హాజరైన టుండా.. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ చేయొద్దని కోరాడు. తన వయసు 72 సంవత్సరాలని, వివిధ వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇటీవలే తనకు పేస్ మేకర్ అమర్చారని, హైబీపీతో కూడా బాధపడుతున్నానని తెలిపాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని కోరాడు. తనకు ఈ పరీక్ష అంటే ఏంటో, దాని పరిణామాలేంటో కూడా తెలుసని కోర్టుకు చెప్పాడు. భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఉన్న ఉగ్రవాద నెట్వర్కు, అతడి సన్నిహితుల గురించి తెలుసుకోడానికి బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష చేయాలంటూ ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కోర్టులో దరఖాస్తు చేసింది. ఈ పిటిషన్పై వాదనల సందర్భంగా టుండా తరఫు న్యాయవాది ఎం.ఎస్.ఖాన్ పై విషయాలను కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితుడి అనుమతి లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్ చేయకూడదంటూ సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. -
కాశ్మీర్లో ఐదుగురు తీవ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని గండర్బల్ జిల్లాలోని ప్రంగ్ సమీపంలోని నజవాన్ అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున కంగన్ పోలీసులు, 24వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన భద్రతదళాలు సంయుక్తంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ దళాలు గత రాత్రి నుంచి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా భద్రతదళాలకు తీవ్రవాదులు తారసపడ్డారు. దాంతో తీవ్రవాదులు కాల్పుల ప్రారంభించగానే, భద్రతదళాలు అప్రమత్తమైయ్యాయి. దాంతో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో తీవ్రవాదులు మరణించారు. మృతి చెందిన తీవ్రవాదులు స్థానికులు కాదని భద్రత అధికారులు అభిప్రాయపడ్డారని తెలిపింది. తీవ్రవాదుల మృతదేహలను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లష్కర్-ఈ- తొయిబా సంస్థకు చెందిన అసదుల్లా వర్గానికి చెందిన వారని వివరించింది.