టెహ్రాన్: ఇరాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను మరో రైలును ఢీకొన్న సంఘటనలో కనీసం 31 మంది మరణించగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం సెమ్నన్ ప్రావిన్స్లో ఈ దుర్ఘటన జరిగినట్టు గవర్నర్ మహ్మద్ రెజా ఖబాజ్ తెలిపారు. మరణించిన 31 మందిని గుర్తించామని, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.