iran
-
20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్నకు భారీ షాక్
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై తొలిసారిగా దాడులు చేసిన ఐదు వారాల తర్వాత ఇరాన్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. గత 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేయగా, మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ దాడి చేసింది. గత 20 ఏళ్లకు పైగా కాలంలో అమెరికాకు జరగని అత్యంత అరుదైన దాడిగా నిలిచింది. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే టెహ్రాన్ సామర్థ్యం గణనీయంగా తగ్గి పోయిందని, ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన వెంటనే జరిగిన ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2003 తర్వాత శత్రువుల కాల్పులకు అమెరికా జెట్లు కూలిపోవడం ప్రస్తుతం యుద్ధంపై మరింత ఉత్కంఠను పెంచింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా యుద్ధ విమానాలను శత్రువులు కూల్చివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. గత 20 ఏళ్లలో అమెరికా యుద్ధ విమానం శత్రువుల దాడిలో కూలిపోవడం ఇదే మొదటిసారి.20 ఏళ్ల తర్వాత తొలిసారి: ఇరాన్ చేతిలో కూలిన అమెరికా యుద్ధ విమానాలుశుక్రవారం ఇరాన్ ఒక F15-E స్ట్రైక్ ఈగిల్ (Strike Eagle) యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఇందులో ఉన్న ఒక సైనికుడిని రక్షించగా, రెండో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, ఇరాన్ రక్షణ దళాల దాడిలో అమెరికాకు చెందిన A-10 అటాక్ ఎయిర్క్రాఫ్ట్ కూడా కూలిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. చివరిసారిగా 2003లో ఇరాక్ దండయాత్ర సమయంలో అమెరికాకు చెందిన A-10 థండర్బోల్ట్ II విమానం శత్రువుల దాడిలో కూలిపోయింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం, అదీ ట్రంప్ హయాంలో జరగడం గమనార్హం. ఎందుకంటే అమెరికా ప్రజలు సాధారణంగా తమ సైన్యానికి ఎటువంటి ప్రాణనష్టం జరగని యుద్ధాలకే అలవాటు పడ్డారు. ఇప్పుడు యుద్ధ విమానాలు కూలిపోవడం, సైనికుల ఆచూకీ తెలియకపోవడం వంటి ఘటనలు అమెరికాలో రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు. ఇదీ చదవండి: షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్లోని ఈ పాలసీ తెలుసా?చావో రేవో- ఇరాన్ వ్యూహంప్రస్తుతం ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి అత్యంత ప్రమాదకరంగా పోరాడుతోందని, చావో రేవో అన్న రీతిలో ఎదురు దాడులకు దిగుతోందని చెబుతున్నారు. ఫిబ్రవరి 28 మొదలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు గత ఐదు వారాలుగా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు దెబ్బతిన్నాయని ట్రంప్ ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందీ అనడానికి ఈ దాడులే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.ఇరాన్పై అమెరికా సాగిస్తున్న వైమానిక యుద్ధం ఇప్పటివరకు భారీ విజయం అన్నారు రిటైర్డ్ మెరైన్ కల్నల్, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో సీనియర్ రక్షణ సలహాదారు మార్క్ కాన్సియన్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీపై ఎగిరిన అమెరికా యుద్ధ విమానాల నష్టాల రేటు ఒకానొక దశలో 3 శాతంగా ఉండేదని, ఇది ఇరాన్పై అమెరికా సాగిస్తున్న యుద్ధంలో సుమారు 350 యుద్ధ విమానాలకు సమానమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!అమెరికా విమానాలను కూల్చడానికి రాడార్లకు కూడ ఆ చిక్కని భుజంపై నుండి ప్రయోగించే (Shoulder-fired) క్షిపణులను వాడి ఉండవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేస్తున్నాయి. ఇదే ఇరాన్కు వరంగా మారిందని ఇరాన్ ప్రోగ్రామ్ సీనియర్ డైరెక్టర్ బెహ్నామ్ బెన్ తలేబ్లు అన్నారు. కాగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా దళాలు ఇప్పటివరకు 13,000 కంటే ఎక్కువ మిషన్లు నిర్వహించాయి. 12,300 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు ఇక చుక్కలే..
-
చావుదెబ్బ కొట్టిన ఇరాన్.. రగిలిపోతున్న ట్రంప్!
-
ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్
-
అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. F-35, F-15 నేలకూల్చిన ఇరాన్
-
ఇరాన్ స్కూల్స్ ను టార్గెట్ చేసిన అమెరికా-ఇజ్రాయెల్
-
అమెరికా ఎయిర్క్రాఫ్ట్స్ కూల్చివేత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్-అమెరికా భీకర దాడులు చేస్తోంది.. -
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
-
ఆ చమురు నౌక చైనాకు మళ్లింది!
న్యూఢిల్లీ: 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరిన పింగ్ షున్ అనే నౌక తన ప్రయాణ దిశను ఉన్నట్టుండి చైనా వైపు మార్చుకుంది! ముందుగా నిర్దేశించిన మేరకు ఈ చమురు నౌక గుజరాత్లోని వదినార్ రేవుకు చేరాల్సి ఉంది. మూడు రోజులుగా నౌక ప్రయాణం వదినార్ వైపే సాగింది. అక్కడికి కొద్ది దూరంలో ఉండగా శుక్రవారం ఉన్నట్టుండి చైనాలోని డోంగ్యింగ్ కేసి మళ్లినట్టు నౌకల ప్రయాణాన్ని గమనించే ‘కోలా డేటా’పేర్కొంది. పింగ్ షున్ తాజాగా తన గమ్యస్థానాన్ని డోంగ్యింగ్గానే చూపుతున్నట్టు తెలిపింది. ఈ నౌక గనక భారత్ చేరితే ఏడేళ్ల అనంతరం ఇరాన్ నుంచి మన దేశానికి తొలిసారి చమురు దిగుమతి జరిగేది. ఈ నౌకలోని చమురు తాలూకు క్రయ, విక్రయదార్ల వివరాలు వెల్లడి కాలేదు. ఎస్వాతిని దేశపు జెండాతో కూడిన ఈ చమురు నౌక ఈ వారం మొదట్లో భారత్కు బయల్దేరింది. ఇప్పుడిలా సముద్ర మధ్యంలో ఉన్నట్టుండి చైనా వైపు ఎందుకు మళ్లిందన్నది తెలియాల్సి ఉంది. బహుశా చెల్లింపుల అంశమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందని కోలా అభిప్రాయపడింది. ‘‘చమురు చెల్లింపులకు సరఫరా కంపెనీలు గతంలో కనీసం 30 నుంచి 60 రోజుల గడువిచ్చేవి. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు సరఫరా పూర్తిగా అడుగంటి డిమాండ్ చుక్కలనంటింది. దాంతో కంపెనీలు తక్షణ చెల్లింపులను డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ముందుకొచ్చే దేశాలకే పెద్దపీట వేస్తున్నాయి’’అని పేర్కొంది. ఇరాన్ చము రును సరఫరా చేస్తోందంటూ పింగ్ షున్ నౌకపై 2025లో అమెరికా నిషేధం విధించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తేయడం తెలిసిందే. దాంతో ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు నౌకలపై మన చమురు కంపెనీలన్నీ జల్లెడ పడుతున్నాయి. ఆ క్రమంలోనే పింగ్ షున్ ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరి తాజాగా ఉన్నట్టుండి చైనా బాట పట్టింది. అయితే, చెల్లింపు సంబంధిత అంశాలు కొలిక్కి వచ్చే పక్షంలో ఈ నౌక భారత్కే వచ్చే అవకాశాలూ లేకపోలేదని ‘కోలా’లో ప్రధాన పరిశోధకునిగా పని చేస్తున్న సుమిత్ రిటోలియా చెప్పుకొచ్చారు. చమురు కొనుగోళ్ల కోసం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముమ్మర పోటీకి ఈ ఉదంతం తాజా నిదర్శనమన్నారు. 2018 వరకు భారత్కు అతి పెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఇరాన్ కూడా ఉండేది. మన చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా 11.5 శాతం దాకా ఉండేది. 2019లో ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేసింది. -
కువైట్లో ప్రధాన చమురు కేంద్రంపై... ఇరాన్ డ్రోన్ దాడులు
ఇజ్రాయెల్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ భారీగా దాడులు కొనసాగించింది. కువైట్లో మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లో ఒక నీటి శుద్ధి కేంద్రంపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. దానికి భారీ నష్టమే వాటిల్లినట్టు సమాచారం. బహ్రెయిన్లోనూ నిర్విరామంగా సైరన్లు మోతలు విన్పించాయి. పలు డ్రోన్లను అడ్డుకుని నేలకూల్చినట్టు సౌదీ అరేబియా పేర్కొంది. యూఏఈలో కూడా ఒక చమురు క్షేత్రానికి మంటలు అంటుకున్నాయి. దాంతో దాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ నౌకపైనా దాడులు! అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహంలింకన్ యుద్ధ నౌకపైనా భారీగా దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. సౌదీలోని పాటు అలీ అల్ సలేం డ్రోన్ స్థావరంపై కూడా బాంబుల వర్షం కురిపించినట్టు పేర్కొంది. అమెరికా తమ విద్యుత్కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే యూఏఈలో అమెరికాకు చెందిన కీలకమైన స్టార్గేట్ ఏఐ సెంటర్ను నేలమట్టం చేసేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్లో అమెజాన్, ఒరాకిల్ వంటి పలు టెక్ దిగ్గజ కంపెనీల కార్యాలయాలపై ఇరాన్ ఇప్పటికే దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో రాపిడ్ సెంట్రీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. -
పాక్కు షాక్.. ఇస్లామాబాద్ వచ్చేది లేదు: ఇరాన్
ఇరాన్ యుద్ధం ముగింపు కోసం పాకిస్థాన్ చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. అమెరికా పెట్టిన డిమాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఇరాన్ తేల్చిచెప్పింది. దీంతో ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపేప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.పశ్చిమాసియా యుద్దం మెుదలై నెలరోజులు గడుస్తోన్నా పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు కదా మరింత దురుతున్నాయి. ఇంతకాలం పాటు చర్చలు జరుగుతన్నాయని ప్రచారం జరిగినా వాటిపైనా ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అసలు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. యుద్ధ విరమణకు ట్రంప్ పెట్టిన నిబంధనలు ఏ మాత్రం అంగీకారం లేవని ఇరాన్ పేర్కొన్నట్లు తెలిపింది. దీంతో సీజ్ ఫైర్ ఒప్పందం కోసం ఇస్లామాబాద్లో నిర్వహిస్తున్న చర్చలకు ఎట్టిపరిస్థితుల్లో తమ దేశ ప్రతినిధులను పంపేది లేదని తెలిపింది. ఈ ప్రకటనతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.కాగా ఇరాన్ తన ఆధీనంలోని హార్ముాజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే యుద్ధ విరమణకు అంగీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. .. "హార్ముాజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛగా తెరిచే వరకు ఇరాన్ను రాతి యుగం నాటి పరిస్థితికి వెళ్లేలా బాంబులతో ధ్వంసం చేస్తూనే ఉంటాం" అని సోషల్ మీడియాలో ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైతం వెనక్కి తగ్గట్లేదుకాగా పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇప్పుడు టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు ఈ చర్చల కోసం మరో వేదికల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
F-15 జెట్ ధ్వంసం .. ఇరాన్ చేతిలో అమెరికా ఫైలట్?
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చి వేసింది. దీంతో దీనికి చెందిన ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వారిలో ఒకరి క్షేమ సమాచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఆందోళనకరంగా మారింది.నైరుతి ఇరాన్ ప్రాంతంలో (IRGC) జరిపిన దాడిలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం దెబ్బతింది. దీంతో విమానం కూలిపోయే ముందే ఈ జెట్లో ఉండే ఇద్దరు సిబ్బంది పారాచూట్ ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. దీంతో వీరి క్షేమ సమచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య హాట్టాఫిక్గా మారింది. వీరిలో ఒకరిని అమెరికా రక్షించి తరలించిందని కథనాలు పేర్కొన్నాయి. కాగా మరోకరి క్షేమంపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.అమెరికా వాదన ఈ ఇద్దరిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు విజయవంతంగా రక్షించి, ఇరాన్ భూభాగం నుండి తరలించాయి.రెండో వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నాయని వెస్ట్రన్ మీడియా పేర్కొంది. మరోకరి కోసం తీవ్ర గాలింపులు జరుగుతన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి వివరాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సైతం తెలిపినట్లు వైట్హౌస్ కథనాలు పేర్కొన్నాయి.ఇరాన్ వాదన అయితే జెట్ కూల్చివేతతో ఇరాన్లో దూకిన సిబ్బంది ఒకరు ఇరాన్ అదుపులో ఉన్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం ఆ దేశ ప్రజలకు ఆ ఫైలట్ను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయనను పట్టుకున్న వారికి మంచి బహుమతులు ఇస్తామని ప్రకటించినట్లు తెలిపింది.కాగా ఇప్పుడు ఆ అమెరికన్ ఫైలట్ అంశం ఇరు దేశాల మధ్య ఛాలెంజ్గా మారింది. అతన్ని క్షేమంగా పట్టుకుంటామని అమెరికా ప్రకటిస్తుండగా టెహ్రాన్ సైతం అతని కోసం తీవ్రంగానే గాలింపులు చేపడుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇద్దరు అమెరికన్ పైలెట్లను అదుపులోకి తీసుకున్నామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్ (IRGC) ప్రకటించింది. అమెరికా వెంటనే సెర్చ్ పార్టీలను పంపి పైలెట్లను వెతికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటనపై అమెరికా అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు, కానీ ఇరాన్ మీడియా ప్రచారం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.అదే సమయంలో, ఇరాన్ గగనతలంపై అమెరికా అపాచీ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ వర్గాలు ఈ హెలికాప్టర్లను టార్గెట్ చేశామని పేర్కొంటున్నాయి. మరోవైపు, అమెరికా రీ-ఫ్యూయెలింగ్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్-అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న సంకేతాలుగా భావించబడుతున్నాయి.ఈ సంఘటనలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత పొందలేదు. స్వతంత్ర ధృవీకరణ లేకపోవడంతో, ఇరాన్ ప్రకటనలు ప్రచార యుద్ధంలో భాగమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ఈ వార్తలు పశ్చిమాసియా భద్రతా పరిస్థితులను కుదిపేస్తూ, అమెరికా-ఇరాన్ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ట్రంప్ కు షాక్.. అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఇరాన్..
-
భారత్కు రష్యా గుడ్ న్యూస్
ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులను తీవ్ర తరం చేసింది. ఇదే సమయంలో యుద్ధం విషయంలో ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. -
అమెరికా దాడులు.. ఇరాన్లో కూలిన అతి పెద్ద వంతెన
పశ్చిమాసియాలో యుద్ధం కల్లోలం సృష్టిస్తోంది. ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్పై అమెరికా దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఇరాన్లో అతి పెద్ద వంతెనపై అమెరికా దళాలు దాడులు చేశాయి.ఇరాన్ను రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామంటూ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే.. మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెనను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.దాడి జరిగిన ప్రాంతంలో భారీ పొగ అలుముకుంది. వంతెన కూలిపోవడాన్ని చూపే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను పశ్చిమ నగరం కరాజ్తో అనుసంధానించేలా నిర్మితమవుతున్న ఈ వంతెన 136 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది.దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కుప్పకూలింది. ఇది ఇకపై ఎప్పటికీ ఉపయోగపడదు. మున్ముందు ఇంకా చాలా ఉన్నాయి’’ అంటూ పేర్కొన్నారు. సమయం మించిపోకముందే ఇరాన్ ఓ ఒప్పందానికి రావాలని ఆయన హెచ్చరించారు.అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో తామే విజయం సాధించామని చెప్పుకుంటున్న ట్రంప్.. అమెరికా సైనిక చర్య టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని ధ్వంసం చేసిందన్నారు. రాబోయే 2-3 వారాల పాటు ఇరాన్పై అత్యంత కఠినంగా దాడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని ఆయన మరోసారి బెదిరింపులకు దిగారు. మన శత్రువులు ఓడిపోతున్నారు. గత ఐదేళ్లుగా నా అధ్యక్షతన అమెరికా సాధించిన విజయాల కంటే ఇప్పుడు మరింత భారీ విజయాన్ని నమోదు చేస్తోంది’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఐరాస హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను ఆపాలంటూ ఆయన పిలుపునిచ్చారు.'నాయకులు విధ్వంసం కంటే చర్చలకే మొగ్గు చూపినప్పుడు యుద్ధాలు ముగుస్తాయన్న ఐరాస చీఫ్.. తాను సంబంధిత పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని.. ఈ ప్రయత్నాలకు మద్దతుగా తన వ్యక్తిగత రాయబారి జీన్ ఆర్నాల్ట్ను ఈ ప్రాంతానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులను ఖండించడమే కాకుండా.. హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ఆంటోనియో పునరుద్ఘాటించారు.నౌకాయాన స్వేచ్ఛను నిరాకరించడం వల్ల ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ఉన్న ప్రపంచంలోని నిరుపేదలు ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన హెచ్చరించారు. మధ్యప్రాచ్య సంక్షోభం నియంత్రణ తప్పుతోందని.. ఇది మొత్తం ప్రాంతాన్ని కమ్మేసే విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చిన ట్రంప్.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని.. అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. -
హార్మూజ్పై బ్రిటన్ సమావేశం
లండన్: అంతర్జాతీయ నౌకాయాన రంగంలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఏకపక్షంగా గుత్తాధిపత్యం సాధించి నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బ్రిటన్ కన్నెర్రజేసింది. ఇరాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా గళం విప్పేందుకు, దేశాల మధ్య ఐక్యత సాధించేందుకు బ్రిటన్ నడుంబిగించింది. ఇందులోభాగంగా గురువారం ఏకంగా 40కిపైగా దేశాలతో వర్చువల్ భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు. భేటీలో బ్రిటన్ విదేశాంగ శాఖ మహిళా కార్యదర్శి యూవెట్టీ కూపర్ ఇరాన్పై నిప్పులు చెరిగారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొనసాగించే దురుద్దేశంతో ఇరాన్ హార్మూజ్ను గుప్పిటపట్టింది. దానిని ఎలాగైనా మనం తెరిపించాల్సిందే. గల్ఫ్ ప్రాంతం గుండా నౌకాయానానికి మార్గం సుగమం చేసేందుకు సమష్టిగా పోరాడేందుకు ఈ భేటీని ఒక వేదికగా మార్చుకుందాం. ఇరాన్పై దౌత్య, రాజకీయ మార్గాల్లో తీవ్రంగా ఒత్తిడి చేసి హార్మూజ్ను తెరిపిద్దాం. లేదంటే పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది’’అని కూపర్ ఆవేదన వ్యక్తంచేశారు. సైనికచర్య ద్వారా హార్మూజ్ను తెరవొచ్చని అమెరికా భావించడం అసంబద్దంగా ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యానించారు. ‘‘హార్మూజ్ ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్ మొదట్నుంచీ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హార్మూజ్ గుండా వాణిజ్యం మొదలుకావాలి’’అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ వ్యాఖ్యానించారు. బిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, కెనడా, జపాన్, యూఏఈ తదితర 40కిపైగా దేశాలు ఈ భేటీలో పాల్గొన్నాయి. -
ఇస్ఫహాన్, కరాజ్, టెహ్రాన్లపై క్షిపణుల వాన
దుబాయ్/టెహ్రాన్/ఇస్లామాబాద్: ఇరాన్ అణ్వాయుధ తయారీ ప్రయత్నాల అంతమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఆరంభించిన పశ్చిమాసియా యుద్ధం హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో కొత్త మలుపు తీసుకుని ఇప్పుడు అతి క్షిపణుల ప్రయోగాలతో మరింత ఉధృతమైంది. దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో సమాధానం చెబుతోంది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై గురువారం సైతం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అగ్రనాయకత్వాన్ని అంతమొందించినా ఇరాన్ తన శక్తిసామర్థ్యాలతో హార్మూజ్ను ఇంకా గుప్పిటపట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. దీంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘గతంలో ఎన్నడూలేనంత భీకరంగా దాడి చేసి హార్మూజ్ను మేం హస్తగతం చేసుకోగలం.కానీ అమెరికా ఒంటరిగా అలా చేయాలని అనుకోవట్లేదు. హార్మూజ్పై ఆధారపడిన దేశాలన్నీ ఇప్పటికైనా ధైర్యం కూడదీసుకుని,కలసికట్టుగా రణరంగంలోకి దూకండి. హార్మూజ్ను చేజిక్కించుకోండి’’అని పిలుపునిచ్చారు. అపార ఆయుధ సంపత్తి మా సొంతంఇస్ఫహాన్ సమీప క్షిపణి నిల్వ కేంద్రంపై అమెరికా దాడులుచేసింది. నిల్వకేంద్రంలో భారీగా పేలుళ్లు జరిగాయి. కొన్ని నిమిషాలపాట ఆగకుండా నిల్వకేంద్రం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కరాజ్, టెహ్రాన్ నగరాలపైనా అమెరికా దాడులను కొనసాగించింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ(81) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య చనిపోయింది. ప్రతిగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను ఉధృతంచేసింది. ఇరాన్ క్షిపణులను కూల్చేపనిలో పడ్డామని ఇజ్రాయెల్ తెలిపింది. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ స్థావరంపై ఇరాన్ దాడులుచేసింది. యూఏఈపై ఇరాన్ డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 19 క్షిపణులు, 26 డ్రోన్లను నేలమట్టంచేశామని యూఏఈ తెలిపింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ దీటుగా స్పందించింది. ‘‘అపార ఆయుధ సంపత్తి మా సొంతం. మీరు ఇప్పటిదాకా దాడిచేసినవి మా అసలైన స్థావరాలు కావు. అవి ఎక్కడున్నాయో మీ నిఘా వర్గాలకు కనీసం అవగాహన కూడా లేదు. మాపై ఎంతగా బాంబుల వర్షం కురిపించి నష్టం చేకూర్చినా ఇంకా ఎంతో మందుగుండు, ఆయుధ నిల్వలున్నాయి’’అని ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫఘరీ అన్నారు. 70 లక్షల మంది సిద్ధం... అమెరికా భూతల దాడులకు దిగితే వారిని మా గడ్డ మీదనే అంతంచేసేందుకు 70 లక్షల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలీబాహ్ హెచ్చరించారు. ఇరాన్ జనాభా 9 కోట్లు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాలని ఇరాన్ ప్రభుత్వం విస్తృతస్తాయిలో ప్రచారంచేస్తోందని వార్తలొచ్చాయి. -
త్వరలోనే ఖేల్ ఖతం
వాషింగ్టన్: ఇరాన్లో కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావొస్తున్నాయని, తమ సైనిక దళాలు త్వరలోనే అక్కడ పని పూర్తి చేస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు. ట్రంప్ బుధవారం రాత్రి జాతినుద్దేశించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. పశ్చిమాసియాలో కల్లోలం మొదలైన తర్వాత ఆయన ప్రైమ్–టైమ్ ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అమెరికా సైన్యం ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిందని అన్నారు. తమ లక్ష్యాలన్నీ ఇప్పటివరకు నెరవేరాయని, కొన్నిసార్లు లక్ష్యం కంటే ఎక్కువే సాధించామని చెప్పారు. స్వల్పకాలంలో ఇరాన్ వరుస దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని హెచ్చరించారు. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చారు. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని ట్రంప్ గుర్తుచేశారు అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. అయితే, ఇరాన్పై భూతల దాడుల గురించి ట్రంప్ ప్రస్తావించలేదు. నాటో కూటమి తీరుపైనా స్పందించలేదు. నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ఆయన కొన్నిరోజులుగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్తో చర్చల గురించి కూడా మాట్లాడలేదు. ట్రంప్ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే.. హార్మూజ్ను స్వాధీనం చేసుకోండి ‘‘అమెరికా సైన్యం గతంలో ఎన్నో యుద్ధాల్లో పోరాటం సాగించింది. ఇరాన్పై పోరు 32 రోజులకు చేరింది. ఈ యుద్ధం ముగించడానికి కొంత సమయం పడుతుంది. రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, ఇరాక్ యుద్ధాలు సంవత్సరాలపాటు కొనసాగాయి. ఇరాక్ యుద్ధభూమిలో అమెరికా సాయుధ బలగాలు వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, తిరుగులేని విజయాలు సాధించాయి. అమెరికా సైనిక చర్య చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అనే సంగతి మర్చిపోవద్దు. ఇరాన్లోని యురేనియం స్వా«దీనం చేసుకోవడానికే ఈ యుద్ధం ప్రారంభించామన్న వాదనలో నిజం లేదు. ఇరాన్ అణు కేంద్రాలను చాలావరకు ధ్వంసం చేశాం. అక్కడున్న అణు ధూళి దగ్గరికి చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఉపగ్రహాలతో నిఘా కొనసాగుతుంది. మరోసారి అణ్వ్రస్తాల ఆలోచన చేస్తే క్షిపణులతో చావుదెబ్బ కొడతాం. హార్మూజ్ విషయంలో ప్రపంచదేశాలు ఇప్పటిదాకా వాయిదా వేసుకున్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వెంటనే వెళ్లి ఆ జలసంధిని చేజిక్కించుకోవాలి. ఈ యుద్ధం.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి నా అధ్యక్ష పదవీకాలంలో గత ఐదేళ్లుగా అమెరికా విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పుడు మునుపెన్నడూ లేనట్టి ఘన విజయం సాధించబోతున్నాం. అమెరికాతోపాటు ప్రపంచ భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ క్యూరీ ప్రారంభించాం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. అలాంటి ఆయుధాలు ఉండడం మనకు భరించలేని ముప్పు అవుతుంది. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం. అయినా సరే అక్కడ అణ్వాయుధ కార్యకలాపాలు ఆగడం లేదు. మరోచోట అణు కేంద్రాలు నిర్మించాలని చూస్తున్నారు. అణ్వాయుధాలపై ఇరాన్కు ఆశలు చావడం లేదు. నేరుగా అమెరికా భూభాగంపై దాడిచేసేలా బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోంది. ఇరాన్పై యుద్ధంతో అమెరికాకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. అమెరికా మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇది మీ పిల్లలు, మీ మనవళ్ల భవిష్యత్తు కోసం పెడుతున్న నిజమైన పెట్టుబడి’’అని ట్రంప్ తమ దేశ పౌరులకు తేల్చిచెప్పారు. అమెరికన్లకు అంత ఓపిక ఉందా? ఇరాన్పై యుద్ధం కొనసాగించడానికి అమెరికా ప్రజలకు ఓపిక ఉందో లేదో తనకు తెలియదని ట్రంప్ అన్నారు. బుధవారం వైట్హౌస్లో ఈస్టర్ విందు కార్యక్రమంలో అతిథులతో ఆయన ముచ్చటించారు. ఇరాన్ చమురును అత్యంత సులభంగా స్వా«దీనం చేసుకోగల సత్తా అమెరికాకు ఉందని చెప్పారు. కానీ, అలాంటి ప్రయత్నం పట్ల అమెరికన్లలో తగినంత సహనం ఉన్నట్లు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యుద్ధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారని ఆక్షేపించారు. ఇరాన్ చమురును తీసుకురావడానికే తాను ఇష్టపడుతున్నానని తెలిపారు. కానీ, తమ ప్రజలు మాత్రం ఇరాన్లో గెలిచేసి, ఇంటికి తిరిగి రండి అంటున్నారని విమర్శించారు. వారే అలా అంటే ఇక తాను చేసేది ఏముంటుందని నిర్వేదం వ్యక్తంచేశారు. నాటో ఒకకాగితం పులి హార్మూజ్ను తెరిపించడానికి చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చొరవ తీసుకోవాలని ట్రంప్ సూచించారు. కొన్ని ఆసియా దేశాలు అమెరికా చమురు కంటే గల్ఫ్ చమురుపై అధికంగా ఆధారపడుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. నాటో కూటమిని సైతం దూషించారు. అందులో పనికిమాలిన భాగస్వామ్య దేశాలు ఉన్నాయని మండిపడ్డారు. నాటో ఒక పేపర్ టైగర్ అంటూ ఎద్దేవా చేశారు. నాటోతో తమకు అవసరం లేదని, తమ అవసరమే వారికి ఉంటుందని తేల్చిచెప్పారు. అసలు అమెరికా లేకపోతే నాటో పట్టుకొచ్చేదా? అని ప్రశ్నించారు. ఈస్టర్ విందులో ట్రంప్ మాట్లాడిన వీడియోను ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!
-
శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుంది: ఇరాన్
టెహ్రాన్: వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో బదులిచ్చింది. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఖతమ్ అల్ అన్బియా ప్రకటించింది. ఇరాన్ను అణిచివేసి.. రాతి యుగం నాటికి పంపుతానన్న ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్లను ఇరాన్ హెచ్చరించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న అమెరికా వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక శక్తిపై అమెరికా వద్ద ఉన్న సమాచారం అసంపూర్ణంగా పేర్కొంది. టెహ్రాన్ క్షిపణి, డ్రోన్ దాడి సామర్థ్యాలను భారీగా తగ్గించామన్న ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తూ.. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి వాషింగ్టన్కు ఏమీ తెలియదంటూ ఖాతమ్ అల్-అన్బియా ప్రతినిధి పేర్కొన్నారు."మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు, సుదూర శ్రేణి దాడి డ్రోన్లు, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను నాశనం చేశామని అనుకోవద్దు. అటువంటి అంచనాలు మీరు చిక్కుకున్న ఊబిని మరింత లోతుగా చేస్తాయి. మీరు దెబ్బతీశామని భావిస్తున్న ప్రాంతాలు చాలా స్వల్పమైనవి. మా వ్యూహాత్మక సైనిక ఉత్పత్తి మీకు తెలియని.. మీరు చేరుకోలేని రహస్య ప్రాంతాల్లో జరుగుతోంది’’ అని ఇరాన్ పేర్కొంది. అమెరికా దురాక్రమణకు దిగిందని ఆరోపిస్తూ.. ప్రతీకార చర్యలు కొనసాగుతాయి. ఈ యుద్ధం అమెరికా లొంగిపోయే వరకు ఆగిపోదు.. భవిష్యత్తులో మరిన్ని వినాశకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తమ్ అల్-అన్బియా ప్రతినిధి హెచ్చరించారు. -
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన అతి పెద్ద దాడి ఇదే..
-
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్లో విధ్వంసం జరిగిందని, ఇరాన్ ముఖ్య నేతలను అంతం చేసినట్టు చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు. అలాగే, ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. దీంతో, యుద్దం వేళ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, ఇరాన్ జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తాజాగా మొజ్తాబా ఖమేని సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలి. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదే సమయంలో ఇరాన్లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ మసూద్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టంచేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ.. తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను దృఢంగా, ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ట్రంప్ పాలనలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
డెడ్ లైన్.. ఇరాన్ నామరూపాలు లేకుండా చేస్తాం..
-
యుద్ధం వల్ల రేడియేషన్ వచ్చేసింది జాగ్రత్త
-
ఇరాన్లో ఇంకేం సాధించాల్సి ఉంది?: ఆస్ట్రేలియా ప్రధాని
కాన్బెర్రా: ఇరాన్లో సాధించాల్సింది ఇంకేముందంటూ అమెరికాను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రశ్నించారు. ‘‘ఇరాన్ సంఘర్షణలో నిర్దేశించుకున్న ప్రాథమిక లక్ష్యాలు నెరవేరాయని.. ఇకపై అక్కడ సాధించాల్సింది ఏముందో స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుంది’ అంటూ అల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, సైనిక పారిశ్రామిక కేంద్రాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని అల్బనీస్ పిలుపునిచ్చారు.రాజధాని కాన్బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఒకటి మాత్రం స్పష్టం.. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంత తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరో రెండు మూడు వారాల పాటు అత్యంత కఠినమైన దాడులు కొనసాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో అల్బనీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
ఇరాన్ వీధుల్లో శవాల దిబ్బలే మిగిలాయి: ట్రంప్
-
అక్కడ శవాల దిబ్బలే మిగిలాయి: ట్రంప్
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం మరో 2-3 వారాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. -
అమెజాన్ పై ఇరాన్ భీకర దాడి..
-
త్వరలో యుద్ధానికి తెర.. లేదు వినాశనమే!
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్పై దాడులకు తెర దించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. రెండు మూడు వారాల్లో పోరుకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతానని మంగళవారం ఆయన ప్రకటించారు. నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోదనని నమ్మకం కలిగిన వెంటనే దాడులు నిలిపేస్తా. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిపించే బాధ్యతను అక్కడి నుంచి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకే వదిలేస్తానని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. మరోవైపు గల్ఫ్లో అమెరికా సేనల మోహరింపు మాత్రం పెరుగుతూనే ఉంది. మరో 10 వేల మందికి పైగా సైనికులను తరలిస్తున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి! యూఎస్ఎస్ జార్జి డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక కూడా మూడు డిస్ట్రాయర్ నౌకలు, 6,000 మంది సెయిలర్లతో గల్ఫ్ బాట పట్టినట్టు పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఇరాన్పై భూతల దాడుల నిమిత్తమేనన్న అనుమానాలకు ఊతమిచ్చేలా ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ సైట్లో పోస్టులు చేశారు. ‘‘హార్మూజ్ను తక్షణం తెరవాల్సిందే. లేదంటే బాంబులతో ఇరాన్ను సర్వనాశనం చేస్తాం. దాంతో ఆ దేశం రాతియుగాల కాలానికి వెళ్తుంది’’అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు! ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కాల్పుల విరమణ కోరుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుద్ధాన్ని కొనసాగించి తీరతామని పునరుద్ఘాటించింది. స్వీయరక్షణ విషయంలో డెడ్లైన్లేవీ ఉండబోవని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘యుద్ధ విరమణ దిశగా పశ్చిమాసియాలో అమెరికా దూత స్టీవ్ విట్కాఫ్ నుంచి పలు ప్రతిపాదనలు అందడం నిజమే. కానీ అమెరికాతో మా దేశం నేరుగా ఎలాంటి చర్చలూ జరపడం లేదు’’అని స్పష్టం చేశారు. -
ఒప్పందం చేసుకోండి.. ట్రంప్ అసహానానికి గురవుతున్నారు: జేడీవాన్స్
ఇరాన్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యుద్ధ ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలన్నారు. లేనిపక్షంలో ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పశ్చిమాసియా యుద్ధం మెుదలై నెలరోజులు గడుస్తున్నా పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు కదా మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు త్వరగా ఒక డీల్ కుదుర్చుకోవాలని మధ్యవర్తుల ద్వారా వాన్స్ సందేశం పంపారు.ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంగా ఉన్నారని డీల్ కుదరకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలు ,విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కాగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చేసిన ప్రకటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది "యుద్ధ నేరాల" కిందకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ తాము దౌత్యానికి సిద్ధమే కానీ, అమెరికాను అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నారు.అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నుండి నేరుగా సందేశాలు అందుతున్న మాట నిజమేనని, అయితే వీటిని అధికారిక చర్చలుగా భావించలేమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భూతల దాడులకు పాల్పడే ధైర్యం చేయదని, ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. -
యుద్ధంలోకి మమ్మల్ని లాగలేరు
లండన్: ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
దాడులు ఉధృతం
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఖతర్ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి.యూఏఈలోని ఉమ్ అల్ థౌబ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం. హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్పైకి క్షిపణులు ప్రయోగించారు! ఉత్తర ఇరాక్లోని ఇబ్రిల్లో బ్రిటన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. దాంతో అక్కడ మంటలు చెలరేగినట్టు సమాచారం. ఇరాన్కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమని రష్యా అనుకూల చెచెన్ ఫైటర్లు ప్రకటించారు! పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడా కూడగడతామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చైనా, పాకిస్తాన్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించాయి. దద్దరిల్లిన టెహ్రాన్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఒకప్పటి అమెరికా రాయబార కార్యాలయ భవన ప్రాంగణం భారీగా దెబ్బ తింది. టెహ్రాన్లో ఫెంటానిల్ ఉత్పత్తి చేస్తున్న టోఫిక్ దారు కర్మాగారాన్ని బాంబులతో నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాన్ని రసాయినిక ఆయుధాల తయారీకి ఇరాన్ వాడుతోందని ఆరోపించింది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగింది. రాజధాని బీరూట్పై జరిగిన దాడులకు ఐదుగురు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సైన్యం వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లా కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది.ప్రభుత్వంపై ఐఆర్జీసీ పట్టు!ఇరాన్ పూర్తిగా సాయుధ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం చెప్పుచేతల్లోకి వెళ్లిన ట్టు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలు, నియామకాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై ఐఆర్జీసీయే పూర్తిస్థాయిలో పెత్తనం చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ పేర్కొంది. -
ఒంటరి మానవుడు ట్రంప్!
ఇరాన్తో యుద్ధం ముగిసే సమయానికి అమెరికా సర్వభ్రష్టమయ్యే సూచనలు కనబడు తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సలహాను శిరసావహించి యుద్ధంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఆయనతో చెడినట్టు కథనాలొస్తున్నాయి. గత ఏలుబడిలోనూ, రెండోసారి వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా నాటోను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తాజాగా ఆ సంస్థ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ఇన్నేళ్లుగా తమను బహిరంగంగా దూషిస్తున్నా మౌనంగా ఉండిపోయిన దేశాలు, ఆయన మాట విని ఇరాన్తో అనవసర కయ్యానికి దిగదల్చు కోలేదని గత నెల రోజులుగా వాటి ప్రవర్తన చెబుతోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని బద్దలు కొడదాం రమ్మని పిలుపునిస్తే ఎవరూ కదలకపోగా... దీంతో మాకేమిటి సంబంధమని స్పెయిన్ నిలదీసింది. మొదట్లో సిద్ధపడినట్టే కనిపించిన జర్మనీ, ఫ్రాన్స్ చివరకు మౌనం పాటించాయి. డీగోగార్షియా సైనిక స్థావరాన్ని ఇవ్వబోమని యుద్ధం తొలినాళ్లలో తిరస్కరించిన బ్రిటన్ అటుతర్వాత అంగీకరించినా, ఇప్పుడు అది సైతం యుద్ధ నౌకలను పంపేదిలేదని చెబుతోంది. సైనిక విమానాలు ఇంధనం నింపు కోవటానికి అనుమతించబోమని ఇటలీ చెప్పగా, ఇజ్రాయెల్కు ఆయుధాలతో వెళ్లే విమా నాలను తమ గగనతలంలోకి రానీయబోమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఇలా ఎవరికి వారు మొహం చాటేస్తుండగా నాటో నుంచి తప్పుకోవటం తప్ప దిక్కులేదని ట్రంప్ భావించ టంలో ఆశ్చర్యం లేదు.నాటో ఆవిర్భవించి 77 యేళ్లు కావస్తోంది. స్థాపిత ఉద్దేశాలు మరిచి ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల అమెరికా ప్రయోజనాలు నెరవేర్చటానికి ముందుకురికిన ఆ సంస్థ వల్ల గతమంతా నెత్తుటితో తడిసింది. ఇన్ని దశాబ్దాల్లోనూ చోటుచేసుకున్న యుద్ధాల చిట్టా తీస్తే చాలావరకూ నాటోయే దోషిగా తేలుతుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి ముప్పు ముంచుకురాబోతున్నదని బెదిరి స్థాపించిన ఈ కూటమికి ఇన్నేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ వైపునుంచి బెడద ఏర్పడింది లేదు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అప్పటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వార్సా కూటమిని రద్దుచేశాం గనుక, నాటోను కూడా రద్దు చేయమని కోరగా అందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు అంగీకరించలేదు. కనీసం దాన్లో తమను కూడా చేర్చుకోవాలని ప్రతిపాదించినా అవి తిరస్కరించాయి. పైపెచ్చు నాటోను ‘ఒక్క అంగుళం’ కూడా విస్తరించబోమని, రష్యా సరిహద్దు దేశాలను చేర్చుకునేది లేదని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించాయి.ప్రపంచంలో పనికిమాలిన సంస్థ ఏమైనా ఉన్నదంటే అది నాటోయే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక దాన్ని శాంతిస్థాపక సంస్థగా మారిస్తే ప్రపంచంలో సహజ వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి సైనిక వ్యయానికయ్యే ఖర్చంతా ఆదా అయి అవిద్య, నిరు ద్యోగం, అధిక ధరలు, ప్రాణాంతక వ్యాధులు సమసిపోయేవి. ఐక్యరాజ్యసమితికయ్యే వార్షిక వ్యయంతో పోలిస్తే నాటో ఖర్చు 400 రెట్లు ఎక్కువ! ఇందులో అత్యధిక శాతం సొమ్ము మారణాయుధాలకూ, సైనిక స్థావరాల నిర్వహణకూ ఖర్చవుతుంది. నాటో పేరు చెప్పి వివిధ యూరప్ దేశాల్లో తిష్టవేసిన సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్యే దాదాపు 20 లక్షలు! మిగిలిన దేశాలకు చెందినవారి సంఖ్య అందులో సగం కూడా ఉండదు. నాటో నుంచి వైదొలగుతామని ట్రంప్ చెబుతున్న కబుర్లు ఉత్త బడాయి మాటలు. అదే అమలైతే ఇంటిదారిపట్టిన లక్షలాదిమంది సైనికుల్ని పోషించలేక అమెరికా ఆర్థిక వ్యవస్థ చతికిల బడుతుంది. అది సజావుగా సాగాలంటే, డాలర్ పచ్చగా కళకళలాడాలంటే ప్రపంచంలో ఏదో మూల మారణాయుధం పేలాల్సిందే!‘ఒక దశ దాటాక యుద్ధంలో నీకు ఆసక్తి లేకపోయినా, యుద్ధానికి నీపై ఆసక్తి తగ్గదు’ అని రష్యా విప్లవ సారథుల్లో ఒకరైన మార్క్సిస్టు సిద్ధాంతకర్త ట్రాట్సీ్క అంటాడు. కొరివితో తలగోక్కున్న చందంగా ఇరాన్పై అనవసర యుద్ధానికి దిగిన ట్రంప్కు దాన్నుంచి బయటపడటం ఎలాగో తెలియటం లేదు. అయినా రోజురోజుకూ పడిపోతున్న స్టాక్ మార్కెట్లను మాయజేయటం కోసం యుద్ధ విరమణ తథ్యమంటూ ప్రకటించటానికి ఆయన అలవాటుపడ్డారు. ఆ మాటెలా ఉన్నా ట్రంప్ బెదిరింపు నిజమై నాటో కనుమరుగైతే ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. -
యుద్ధం ఉద్రిక్తం.. అమెజాన్ సెంటర్పై ఇరాన్ దాడి?
ఇరాన్ అన్నంత పని చేసింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా లాంటి ఐటీ కంపెనీలపై దాడి చేస్తామని టెహ్రాన్ ఇదివరకే హెచ్చరించింది. తాజాగా బహ్రెయిన్లోని అమెజాన్ కంపెనీపై క్షిపణులతో విరుచుకపడ్డట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం బహ్రెయిన్లో అమెరికా కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్కు చెందిన డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా అంతకుముందు ఒక కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేస్తున్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించింది. కానీ మంటలు సంభవించిన ప్రాంతం వివరాలు మాత్రం పేర్కొనలేదు.మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా సహా 18 అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది. ఇరాన్లో జరిగే ప్రతి ఉగ్రదాడికి బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.కాగా మరోవైపు, ఇరాన్తో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ యుద్ధాన్ని రెండు మూడు వారాల్లో ముగించగలదని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది -
కాల్పుల విరమణ కోరిన ఇరాన్.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాత పాలకుడితో పోలిస్తే కొత్త పాలకుడు కొంత నయం. హర్మూజ్ జలసంధి తెరిస్తే.. కాల్పుల విరమణ పరిశీలిస్తాం. హర్మూజ్ తెరిచే వరకు ఇరాన్పై దాడులు కొనసాగిస్తాం. ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం.. వారు అన్నట్లుగానే తిరిగి రాతి యుగానికి పంపిస్తాం’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణ కోరలేదని.. ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. మరోవైపు, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా ప్రజల నుండి కూడా యుద్ధానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొంది. యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే రెండు మూడు వారాల్లో ధరలు తగ్గుతాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అయితే, హోర్ముజ్ జలసంధి తెరిచే వరకు దాడులు ఆపబోమని తాజాగా హెచ్చరించడం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది. -
25 రోజుల నరకం, బాంబుల మోత : ఎవరీ కేతన్ మెహతా
అకారణంగా ఇరాన్ జైల్లో 50 రోజులు బందీగా ఉన్నాడు. సరిగ్గా విడుదలైన సమయానికి యుద్ధం రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. జైలు గోడల మధ్యనుంచి విడుదలైనా కూడా ఆయనకు విముక్తి లభించలేదు. దీంతో అతని సంతోషం అంతా ఆవిరై పోయింది. భయంకరమైన అనుభవంతో ఎలాగోలా ప్రాణాలు ఇండియాకు చేరుకున్నాడు. ఇంతకీ ఎవరతను? తీవ్ర ఉద్రికత్తతల మధ్య అడ్డంకులను దాటుకొని సొంతగడ్డపై ఎలా అడుగు పెట్టాడు?ఎన్డీటీవీ కథనం ప్రకారం ఇరాన్లో 50 రోజుల జైలు జీవితం తర్వాత, విడుదలైన భారత్కు చెందిన కేతన్ మెహతా ఫిబ్రవరి 27న ఒక హోటల్కు చేరాడు. మరుసటి రోజు (ఫిబ్రవరి 28) ఆయన భారత్కు తిరిగి రావాల్సి ఉంది. కానీ సరిగ్గా ఆ సమయానికే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించాయి. దీనితో విమానాశ్రయాలు మూతపడ్డాయి. భారత రాయబార కార్యాలయం (Indian Embassy)ని సంప్రదిస్తే హోటల్ నుంచి బయటకు రావద్దని సూచించారు.యుద్ధం తీవ్రం, ఉద్రిక్తతలుకేతన్ ఉన్న హోటల్, ఇరాన్ నావిదికాదళ ప్రధాన స్థావరమైన బందర్ అబ్బాస్ రేవు పట్టణానికి కేవలం 600-700 మీటర్ల దూరంలోనే ఉంది. రోజురోజుకు యుద్ధ పరిస్థితి తీవ్రమవుతోంది. ప్రతిరోజూ 100 నుండి 200 బాంబులు పడుతుండటం, కిటికీల నుండి క్షిపణులు వర్షంలా కురవడం చూశానంటూ తన అనుభవాన్నివివరించారు. అయితే ఇండియన్ ఎంబసీ తనతో నిరంతరం సంప్రదిస్తూ తనకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. యుద్ధం కారణంగా విమానాలు లేకపోవడంతో, 20 రోజుల తరువాత ఆయన బస్సు ద్వారా ఇరాన్ నుండి ఆర్మేనియా సరిహద్దు వరకు సుమారు 1,800 కిలోమీటర్లు ప్రయాణించారు.ఈ 18-19 గంటల ప్రయాణంలో కొండల మధ్య బాంబు పేలుళ్ల శబ్దాలు వినపడేవని, పేలుళ్ల ధాటికి బస్సు కూడా ఊగిపోయేదని ఆయన చెప్పారు. చివరకు, ఆర్మేనియా చేరుకున్న తర్వాత అక్కడి నుండి విమానంలో కేతన్ మెహతా సురక్షితంగా ఢిల్లీ సమీపంలోని తన నివాసానికి చేరుకున్నారు. జైలు కష్టాల కంటే, యుద్ధం మధ్య గడిపిన ఆ 25 రోజులు తన జీవితంలో అత్యంత భయానకమైనవని ఆయన గుర్తు చేసుకున్నారు.ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులుజైలుకెందుకెళ్లారు?డిసెంబర్ 8న MT వేలియంట్ రోర్ (MT Valiant Roar) అనే చమురు ట్యాంకర్ను ఇరాన్ అధికారులు పట్టుకున్నారు. ఈ నౌక అక్రమ డీజిల్ను రవాణా చేస్తోందని ఆరోపించారు. నౌకలోని 10 మంది భారతీయ సిబ్బందిని అరెస్టు చేసి ఇరాన్లోని బందర్ అబ్బాస్ జైలుకు తరలించారు. అందులో కేతన్ మెహతా ఒకరు. అయితే దీనిని దుబాయ్కు చెందిన ప్రైమ్ ట్యాంకర్స్ LLCసంస్థ తిరస్కరించింది. ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
చర్చలు కాదు.. యుద్ధానికి రెడీ.. UAE సంచలన ప్రకటన
-
ట్రంప్నకు మరోసారి బ్రిటన్ ప్రధాని షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ షాక్ ఇచ్చారు. ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తేలేదని తేల్చిపారేశారు. తమకు బ్రిటన్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్న స్టార్మర్.. పశ్చిమాసియా యుద్ధంతో మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో బ్రిటన్ పూర్తిగా పక్కకు తప్పుకోవడం లేదని కూడా ఆయన సంకేతాలిస్తూ.. హర్మూజ్ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామని బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ నేతృత్వంలో 35 దేశాలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ రవాణా మార్గానికి ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని స్టార్మర్ అన్నారు.‘‘నేను ప్రజలతో నిజాయితీగా ఉండాలి, ఇది అంత సులభం కాదని చెబుతూ.. యుద్ధం కారణంగా బ్రిటన్ ప్రజల దైనందిన జీవితంపై పడే ప్రభావాన్ని ఆయన అంగీకరించారు. ఈ సంక్షోభ సమయంలో యూరోపియన్ మిత్రదేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం కేవలం దౌత్యం మాత్రమే కాదని.. అది బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు, ఇరాన్పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి...మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
అమెరికాకు మద్దతుగా యుద్ధంలోకి UAE
-
యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ
-
ట్రంప్ కు దెబ్బ మీద దెబ్బ చెప్పినా వినలేదు...
-
హర్ముజ్ లో ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ భీకర దాడి..
-
Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు
కన్యాకుమారి/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు, కన్యాకుమారికి చెందిన సుమారు 600 మంది మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేశాయి. స్వదేశంలో నెలల తరబడి చెమటోడ్చినా దక్కని ఆదాయం, అక్కడ కేవలం పది రోజుల్లోనే చేతికి అందేది. ఆ ఆశే వారిని ఏడు సముద్రాలు దాటించి, ఇరాన్ తీరానికి చేర్చింది. అయితే నేడు అక్కడ పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం ఈ మత్స్యకారులు ఇరాన్లోని బుషెహర్, దాని పరిసర తీర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ‘స్క్రోల్ ఇన్’కు ‘సౌత్ ఏషియన్ ఫిషర్మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం గత ఫిబ్రవరిలో ఇరాన్ సర్వోన్నత నేత ఖమేనీ మరణించిన తర్వాత మొదలైన వైమానిక దాడులు, బాంబుల వర్షం.. ఇరాన్లోని మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం తిండి, నీరు, కనీస వైద్యం అందక పడవలపైనే కాలం వెళ్లదీస్తున్న వీరి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.ఒకే సిమ్ కార్డు.. 12 మంది వినియోగంకన్యాకుమారిలోని మత్స్యకార కుటుంబానికి చెందిన షాజీ.. ఇరాన్లో చిక్కుకున్న భర్త రవికుమార్ నుంచి వచ్చే ఫోను కోసం నిత్యం ఎదురు చూస్తుంటుంది. ఇరాన్లో చిక్కుకున్న బాధితుల వద్ద కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా కరువయ్యాయి. రవికుమార్తో పాటు మరో 12 మంది కలిసి కేవలం ఒకే ఒక్క సిమ్ కార్డును వాడుతున్నారు. ‘బాంబుల శబ్దంతో నిద్ర పట్టడం లేదు.. ఆహారం నిండుకుంది’ అని వారు ఫోన్లో చెబుతుంటే ఇక్కడ కుటుంబ సభ్యుల కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎటు నుంచి క్షిపణులు వస్తాయో తెలియని స్థితిలో మత్స్యకారులు కాలం వెళ్లదీస్తున్నారని ‘సౌత్ ఏషియన్ ఫిషర్మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపారుఅప్పుల ఊబిలో కుటుంబాలుతమ వారిని క్షేమంగా తిరిగి భారత్ రప్పించేందుకు ఇక్కడి మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాయి. మేరీ రాజ్ అనే మహిళ తన 20 ఏళ్ల కుమారుని ఉపాధి కోసం తన ఒంటి మీద ఉన్న నగలను తాకట్టు పెట్టి, రూ.1.5 లక్షలు అప్పు చేసింది. విదేశాల్లో బాగా సంపాదిస్తారని అక్కడికి పంపిస్తే, ఇప్పుడు ప్రాణాలతో కుమారుడు వస్తే చాలని మేరా రాజ్ దేవుడిని వేడుకుంటోంది.అక్కడి సౌకర్యాలే శాపమయ్యాయా?భారతదేశంలో చేపల వేట తగ్గిపోవడం, మౌలిక సదుపాయాల కొరత ఉండటంతో మత్స్యకారులు ఇరాన్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇరాన్లో అనారోగ్యానికి గురైతే హెలికాప్టర్లు పంపే స్థాయి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు యుద్ధం కారణంగా అక్కడి యజమానులు కూడా చేతులెత్తేస్తున్నారు. మత్స్యకారుల పాస్పోర్టులు యజమానుల వద్దే ఉండటం, భాష తెలియకపోవడం వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సంపాదన ఆశ చూపి తీసుకెళ్లిన యజమానులు ఇప్పుడు భద్రతకు గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టం చేయడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది.ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనయుద్ధ ప్రాంతం నుంచి విద్యార్థులను తరలించిన కేంద్ర ప్రభుత్వం, సముద్రం మధ్యలో చిక్కుకున్న మత్స్యకారుల విషయంలో అలసత్వం వహిస్తోందని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోలాహలంలో ఉన్న అధికారులు, ఈ నిరుపేద మత్స్యకారుల గోడును పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. బాంబుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న తమ వారిని కాపాడాలని కన్యాకుమారి తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత -
టార్గెట్ ఇరాన్.. నెతన్యాహు కొత్త కూటమి ప్రకటన
జెరూసలేం: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు వ్యతిరేకంగా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అయితే, కూటమిలో దేశాల పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా ప్రసంగిస్తూ.. ఇరాన్ వ్యతిరేకంగా కొత్త ప్రాంతీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇజ్రాయెల్ పక్కనే ఉన్న దేశాలు సహా పలు దేశాలతో కొత్త కూటములు కుదుర్చుకుంటున్నాం. త్వరలోనే ఈ ఒప్పందాల గురించి మరింత వివరంగా చెబుతాను. కచ్చితంగా ఆ కూటమి.. ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతం కూటమిలో ఉన్న దేశాల పేర్లను వెల్లడించలేదు. అయితే.. ఇరాన్ సైనిక, అణు ఆశయాలపై ఉన్న ఉమ్మడి ఆందోళనల కారణంగా ఇజ్రాయెల్, అరబ్ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని నెతన్యాహు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇక, యుద్ధరంగంలో సాధించిన ప్రధాన విజయాల నేపథ్యంలో, ఈ సంప్రదింపులను ఒక విస్తృత వ్యూహంలో భాగంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ‘మేము గట్టిగా దెబ్బకొట్టి, రెండు అస్తిత్వ ముప్పులను దూరం చేశాము’ అని నెతన్యాహు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్లు అటువంటి ఆయుధాలను ఉత్పత్తి చేసే ఇరాన్ పారిశ్రామిక సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీశాయని ఆయన తెలిపారు. ఇదే సమయంలో, టెహ్రాన్లో దీర్ఘకాలిక మార్పు వస్తుందని అంచనా వేశారు. ఎప్పుడో ఒకప్పుడు ఇరాన్ పాలన పతనమవుతుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజా పరిణామాలుఇజ్రాయెల్–అరబ్ సహకారం: ఇరాన్ అణు ప్రణాళికలు మరియు ప్రాంతీయ ప్రభావం కారణంగా, ఇజ్రాయెల్ కొన్ని అరబ్ దేశాలతో కొత్త భద్రతా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.ఉగాండా భాగస్వామ్యం: "ఎంటెబ్బే అలయన్స్" పేరుతో ఉగాండా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ వ్యతిరేకంగా నిలబడుతోంది. ఇది 1976లో జరిగిన ఎంటెబ్బే ఆపరేషన్ చరిత్రను తలపిస్తోంది.కూటమి లక్ష్యాలుఇరాన్ అణు ప్రణాళికలను అడ్డుకోవడంహెజ్బుల్లా, హౌతీలు వంటి ఇరాన్ మిత్ర బలగాలను ఎదుర్కోవడంప్రాంతీయ భద్రతా సమీకరణలో ఇజ్రాయెల్ స్థానం బలపరచడంప్రతికూలతలు..ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే అవకాశంచమురు సరఫరా అంతరాయం వల్ల గ్లోబల్ ఆర్థిక సంక్షోభంఇరాన్ ప్రతీకార దాడులు ఇజ్రాయెల్ మరియు మిత్ర దేశాలపై పెరగడం -
ఇరాన్ యుద్ధం: షాకిస్తున్న మృతుల గణాంకాలు
టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు ఇరాన్ పొలిమేరలు దాటింది. కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధ భూమి నుంచి అందుతున్న మృతుల గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి.ఇరాన్: మరణాల హోరుయుద్ధానికి ప్రధాన కేంద్రమైన ఇరాన్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. హక్కుల సంస్థ ‘హర్నా’ లెక్కల ప్రకారం, ఇక్కడ ఇప్పటివరకు 3,492 మంది మృతి చెందారు. వీరిలో 1,574 మంది సామాన్య పౌరులు కాగా, కనీసం 236 మంది పసిపిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు రెడ్ క్రాస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మరణాల సంఖ్య 1,900 గా ఉండవచ్చని, దాదాపు 20,000 మంది గాయపడ్డారని అంచనా వేస్తోంది. యాక్టివ్ వార్ జోన్ కావడంతో అసలు మరణాల సంఖ్య ఈ గణాంకాలకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.లెబనాన్ నుంచి గల్ఫ్ వరకు..యుద్ధం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదులెబనాన్: ఇక్కడ ఇజ్రాయెల్ దాడుల్లో 1,268 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 124 మంది చిన్నారులు ఉన్నారు. సుమారు 400 మంది హిజ్బుల్లా ఫైటర్లు కూడా హతమైనట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు ఇండోనేషియా యూఎన్ శాంతి భద్రతల సిబ్బంది కూడా ఈ దాడులకు బలైపోయారు.ఇరాక్: ఇక్కడ పౌరులు, మిలిషియా సభ్యులు కలిపి 105 మంది మరణించారు.గల్ఫ్ దేశాలు: యుద్ధం సెగ గల్ఫ్ దేశాలకూ తగిలింది. ఇరాన్ దాడుల వల్ల యూఏఈలో 10 మంది, కువైట్లో ఏడుగురు, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్ తదితర ప్రాంతాలుఇటు ఇరాన్, లెబనాన్ నుంచి వచ్చిన మిస్సైల్ దాడుల వల్ల ఇజ్రాయెల్లో 19 మంది పౌరులు, సరిహద్దు పోరులో 10 మంది సైనికులు మృతి చెందారు. వెస్ట్ బ్యాంక్లో ఇరాన్ మిస్సైల్ పడి నలుగురు పాలస్తీనా మహిళలు మృతి చెందగా, సిరియాలో మరో నలుగురు బలయ్యారు. ఇరాక్లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ గణాంకాలు కేవలం అంకెలు కావు, ఛిద్రమైన ఎన్నో కుటుంబాల గాథలు. యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో ఈ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. -
క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇరాన్కు చైనా ఝలక్?
బీజింగ్: తమ దేశానికి రావాల్సిన మూడు చమురు నౌకలు విజయవంతంగా హార్మూజ్ జలసంధిని దాటాయని చైనా మంగళవారం ప్రకటించింది. హార్మూజ్ను దాటడంలో ఎంతగానో సహకరించిన ఇరాన్ పేరును ప్రస్తావించకుండానే నౌకల సాఫీ ప్రయాణానికి చేయూతనందించిన వారికి ధన్యవాదాలు అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ గుండా తమ నౌకలు ప్రయాణిస్తున్నాయని చైనా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.మరోవైపు ఇరాన్లో పరిస్థితులపై పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాన్ దార్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం మంతనాలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సన్నిహిత నేత అయిన వాంగ్ యీ ఇప్పటికే దేశ అధికార కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ బ్యూరోలోనూ సభ్యునిగా ఉన్నారు. క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇదిలా ఉండగా.. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రష్యా ముడిచమురు నౌక క్యూబాకు చేరుకుంది. కొంతకాలంగా రష్యా చమురును కొనుగోలుచేయొద్దంటూ క్యూబాపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో క్యూబా చమురుకష్టాలు మొదలయ్యాయి. తాజాగా రష్యా చమురును తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే క్యూబాలోని మటాంజా నౌకాశ్రయానికి రష్యా చమురునౌక ‘అనటోలీ కొలోడ్కిన్’చేరుకుంది.మార్చి 8న రష్యా నుంచి బయల్దేరి ఇంగ్లిష్ ఛానల్ మీదుగా ఈ నౌక ఇటీవల అట్లాంటిక్ సముద్రజలాల్లోకి ప్రవేశించి అమెరికా అనుమతుల కోసం వేచిచూస్తున్న విషయం తెల్సిందే. ఇది ఏకంగా 7,30,000 బ్యారెళ్ల చమురును మోసుకొచ్చింది. నౌక రాకపై క్యూబా ఇంధన, గనుల మంత్రి విసెంటే లేవీ అమితానందం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లూ క్యూబా తమ చమురుఅవసరాల కోసం అత్యధికంగా వెనెజువెలాపై ఆధారపడేది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్చేశాక ఆ దేశం నుంచి చమురురాక దాదాపు ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోబోతే అమెరికా అడ్డుకోవడం తెలిసిందే. -
యుద్ధంపై ఇరాన్ రెడ్క్రిసెంట్ సంస్థ రిపోర్ట్.. నష్టం ఎంతంటే..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు జరుపుతోంది. -
యుద్ధానికి త్వరలో తెర!
వాషింగ్టన్: ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది.‘‘యుద్ధాన్ని నాలుగు నుంచి ఆరు వారాలు మాత్రమే సాగించాలని ముందే నిర్ణయించుకున్నాం. హర్మూజ్ కోసం పట్టుబడితే పోరు మరిన్ని రోజులు కొనసాగేలా ఉంది. కనుక మన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ నావికా దళాన్ని, దాని క్షిపణి నిల్వలను పూర్తిగా నేలమట్టం చేసి యుద్ధానికి త్వరగా తెర దించేస్తా’’ అని ట్రంప్ చెప్పుకొచి్చనట్టు పేర్కొంది. మరోవైపు సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు మాత్రం ఇరాన్ పూర్తిగా ఓడేదాకా యుద్ధాన్ని కొనసాగించాల్సిందిగా అమెరికాను కోరుతున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది! నాటో దేశాలపై గుర్రు ఇరాన్పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి. మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
ఇస్ఫహాన్ అణు కేంద్రంపై బాంబుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితి మరింత విషమిస్తోంది. చర్చలకు ససేమిరా అంటున్న ఇరాన్పై అమెరికా కన్నెర్రజేసింది. స్వీయ కాల్పుల విరమణను తుంగలో తొక్కుతూ మంగళవారం ఆ దేశంపై భారీ స్థాయి దాడులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్ నగరంలోని కీలక అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఆ కేంద్రంలోనే ఇరాన్ దాచి ఉంచినట్టు చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తాజా దాడిలో అక్కడి అణుకేంద్రానికి నష్టం జరిగిందా అన్నది తెలియరాలేదు.త్వరగా ఒప్పందానికి రాకపోతే ఇరాన్లోని మౌలిక వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ట్రంప్ సోమవారమే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము వేళ ఇజ్రాయెల్తో కలిసి టెహ్రాన్పైనా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో ఇరాన్ రాజధాని దద్దరిల్లిపోయింది. నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయి. లెబనాన్పైనా ఇజ్రాయెల్ భారీగా దాడులను కొనసాగించింది. వాటిలో ఐరాస శాంతి పరిరక్షక దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది మరణించినట్టు సమాచారం. మొత్తమ్మీద మంగళవారం ఒక్క రోజే 21 మంది మృతి చెందినట్టు లెబనాన్ పేర్కొంది.మొత్తం మృతుల సంఖ్య 1,268 దాటినట్టు వెల్లడించింది. ఉత్తర గాజాలో కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ఒక వ్యక్తి, అతని ఐదేళ్ల కుమారుడు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా తమ మౌలిక వ్యవస్థలను లక్ష్యం చేసుకుంటున్నాయంటూ ఇరాన్ మండిపడింది. దీనికి తమ సమాధానం భయానకంగా ఉంటుందని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలపై కూడా బుధవారం నుంచి భారీగా దాడులు చేస్తామని రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్తో పాటు 18 సంస్థల పేర్లను వెల్లడించింది! తక్షణం కార్యాలయాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆ కంపెనీల సిబ్బందికి సూచించింది. మండుతున్న చమురు ధరలుయుద్ధం దెబ్బకు అంతర్జాతీయంగా చమురు ధరలు నానాటికీ ఎగబాకుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధర 107 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధానికి తెర తీసినప్పటితో పోలిస్తే ఇది ఏకంగా 45 శాతం ఎక్కువ కావడం విశేషం! మరోవైపు అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి! మంగళవారం గ్యాలన్ (దాదాపు 3.8 లీటర్ల) పెట్రోల్ ధర 4.02 డాలర్లకు చేరింది. 2022 తర్వాత అమెరికాలో పెట్రోల్ ధర 4 డాలర్లను దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం! ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలయ్యే నాటికి అమెరికాలో గ్యాలర్ పెట్రోల్ ధర 2.98 డాలర్లుగా ఉంది. డీజిల్ ధర కూడా గ్యాలన్కు 3.75 డాలర్ల నుంచి 5.45 డాలర్లకు పెరిగింది. ఇజ్రాయెల్లో సైరన్ మోతలు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో దుబాయ్ సమీపంలో కువైట్కు చెందిన ఓ చమురు నౌకపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో నౌకలో మంటలు చెలరేగాయి. సిబ్బంది చాలాసేపు శ్రమించి వాటిని ఆర్పేశారు. ఐదు క్షిపణులు, ఏడు డ్రోన్లను కూల్చేసినట్టు కువైట్ పేర్కొంది. దుబాయ్లోని అల్ బదాలో ఓ ఆవాస ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిలో శకలాలు పడి ఇద్దరు భారతీయులతో పాటు నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలు కూడా దాడుల బారిన పడ్డాయి. ఆ దేశాలతో పాటు ఇజ్రాయెల్ నగరాల్లో కూడా రోజంతా సైరన్ మోతలు విన్పించాయి. ఇరాక్లోని సులేమానియా యూనివర్సిటీపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది.హార్మూజ్ సుంకం ఖరారుహార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి వసూలు చేయాల్సిన సుంకాన్ని ఇరాన్ లాంఛనంగా ఖరారు చేసింది. ఒక్కో నౌక నుంచి గరిష్టంగా రూ.19 కోట్ల దాకా వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ దేశ పార్లమెంటు భద్రతా మండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. హార్మూజ్పై ఇరాన్ సార్వ¿ౌమాధికారానికి నిదర్శనంగా ఈ చర్య తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఐబీ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలకు హార్మూజ్ గుండా వెళ్లనివ్వబోమని పేర్కొంది.ఇటలీ సైతం... గగనతలం మూతస్పెయిన్ బాటలోనే ఇటలీ కూడా అమెరికాకు షాకిచ్చింది. ఇరాన్పై పోరులో అమెరికా వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తన గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. సిసిలీలోని తమ వైమానిక స్థావరాన్ని అమెరికా వాడుకునేందుకు కూడా అనుమతి నిరాకరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సోమవారం స్పెయిన్ కూడా ఈ మేరకు ప్రకటన చేయడం తెలిసిందే. -
తన ఆటలో తానే పావయిందా?
ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ముగింపు సూచనలు లేవు సరికదా మరింత తీవ్రతరమవటమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఇరాన్ తరఫున యెమెన్లోని హవుతీలు కూడా రంగంలో దిగటంతో పర్షియన్ గల్ఫ్తో బాటుగా ఎర్ర సముద్రంపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎర్ర సముద్రం, బాబెల్ మెండెబ్ జలసంధి గుండా సుమారు 12 శాతం ప్రపంచ చమురు, గ్యాస్ రవాణా జరుగు తున్నది. అంటే, ఇరాన్ ఈ యుద్ధాన్ని మరొక అంచెకు తీసుకొని వెళ్లటానికి నిశ్చయించినట్లు లెక్క.అమెరికా ప్రేరేపిత యుద్ధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం (1945) తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఏ యుద్ధం, సంక్షోభం తలెత్తినా, అందులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ యూఎస్ఏ పాత్ర ప్రస్ఫుటం. ప్రచ్ఛన్న యుద్ధ (1945–1991) కాలంలో యూఎస్ విదేశాంగ విధానం సోవియట్ రష్యాను, కమ్యూనిజాన్ని అడ్డుకోవటం లక్ష్యంగా రూపొందించబడి నది. సోవియట్ విచ్ఛిన్నం (1991) తరువాత యూఎస్ఏ నాయక త్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికన్ ప్రయోజనాలకు విఘాతం నెపంతో ముందస్తు సైనిక చర్యలు, ప్రభుత్వ మార్పిడు లను నిస్సంకోచంగా తన విదేశాంగ నీతిగా ఉంచుకొన్నది.యుద్ధంతో శాంతా?ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ఏ ఇక యుద్ధాలు చేయటం లేదా ప్రోత్సహించడం ఉండదని ప్రకటించాడు. బైడెన్ ప్రభుత్వం అనవసరంగా యూఎస్ఏను యుద్ధాల ఊబిలోనికి లాగి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని విమర్శించాడు. అదే సమయంలో సుంకాల యుద్ధానికి (టారిఫ్ వార్) తెరతీశాడు. క్రమంగా ట్రంప్ ప్రభుత్వం ‘యుద్ధాలకు ముగింపు’ విధానం నుండి మళ్లీ సైనిక జోక్యం వైపు తిరిగి వచ్చింది. మొట్టమొదటిగా పనామాను బెదిరించి లొంగదీసు కోవటం మొదలుపెట్టి, ఉక్రెయిన్కు సాయుధ సహకారాన్ని మరింత విస్తరించి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేట్లు చేస్తున్నది. ఇరాన్ మీద 12 రోజుల యుద్ధం, వెనిజులాలో సైనిక చర్యతో యూఎస్ తన పంథా మార్చుకోలేదని అర్థమయింది. గ్రీన్ల్యాండ్ను యూఎస్ఏకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. ఇరాన్తో యుద్ధం ప్రారంభిస్తూనే క్యూబాతో కలహానికి శ్రీకారం చుట్టాడు.ఇటీవల 2025లో యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025) యూఎస్ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈ వ్యూహం ప్రకారం బలం, సామర్థ్యం ద్వారా శాంతిని స్థాపించాలని యూఎస్ ప్రతిపా దిస్తుంది. అంటే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి (వార్ ఫర్ పీస్) అనే విపరీత సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ వ్యూహంలో భాగంగానే ట్రంప్ వివిధ దేశాలను సైనిక, ఆర్థిక, సాంకేతిక శక్తి ద్వారా లోబర్చుకొనే విధానాన్ని అమలుపరుస్తున్నాడు. బెదిరింపులకు లొంగిపోయిన దేశాలను మరింతగా బెదిరించాడు. ఎదురు నిలబడ్డ దేశాల విషయంలో వెనకడుగు వేశాడు. ఉదాహరణకు రష్యా, చైనా, కెనడా, ఈయూ, భారత్లతో ట్రంప్ వెనకడుగు వేశాడు.డీప్ స్టేట్ మద్దతు లేదా?యూఎస్ఏ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని ఆ దేశంలోని డీప్ స్టేట్ రూపొందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రిపబ్లికన్ల చేతిలో ఉన్నా, డెమోక్రాట్ల చేతిలో ఉన్నా డీప్ స్టేట్ చెప్పుచేతల్లో ఉండాల్సిందే. సీఐఏ, పెంటగన్, ఎన్ఐఏ, మీడియా లాబీ, ఆయుధ కంపెనీల లాబీలు, టెక్ కంపెనీ లాబీలు, బడా మదుపరుల లాబీలు, యూదుల లాబీలతో కూడిన ఈ డీప్ స్టేట్ ప్రభుత్వ విధానాలు తన లక్ష్యాలకు అనుగుణంగా ఉండేట్లుగా చూస్తుంది.డీప్ స్టేట్ కనుసన్నల్లో ఉండే యూఎస్ విధానం ఎల్లప్పుడూ జియో పొలిటికల్ లక్ష్యాలతో పాటుగా అమెరికన్ లాబీల ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. ఈ లక్ష్యానికి అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఉదారవాద ముసుగులను కప్పి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుం టారు. తాత్కాలికంగా యూఎస్ ఆధిపత్యానికి నష్టం కలిగినా సరే, యూఎస్ డీప్ స్టేట్ లాబీల వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది.యూఎస్ అధ్యక్షులెవరయినా యూఎస్ డీప్ స్టేట్ ప్రయోజనా లకు విరుద్ధంగా వెళ్లలేరు. గత ఎన్నికలలో బైడెన్పై ట్రంప్ ఓటమికి డీప్ స్టేట్ సహకరించిందని అనుమానం. అందుకే ట్రంప్ డీప్ స్టేట్ని పక్కకి నెట్టి హెగ్సెత్, కుష్నర్, లిండ్సే, విట్కాఫ్ వంటి వ్యక్తులపై ఆధారపడుతున్నారు. డీప్ స్టేట్ భాగస్వామ్యం లేకపోవ టంతో ఇరాన్ వ్యూహంలో డొల్లతనం కన్పడుతున్నది.ఎంతవరకు పోరాడగలవు?ఇరాన్పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యాలలో వైరుధ్యం కన్పడుతున్నది. ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేయటం, ఇరాన్ను ముక్కలుగా చేయటం, సుదూర భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ సవాలు చేసే స్థితిలో లేకుండా చూడటం ఇజ్రాయెల్ లక్ష్యం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమయిన జెరూసలెం వంటి ప్రదేశాలతో కూడిన ఇజ్రాయెల్కు ఉనికి, అస్తిత్వాల సమస్య ఉన్నది. సామ్యూల్ హంటింగ్టన్ సూచించినట్లు, ఇది నాగరికతల మధ్య యుద్ధం. ఆర్థిక, వాణిజ్య ఆంక్షల నడుమ చితికిపోయిన ఇరాన్ మనుగడకు ఈ యుద్ధం ఒక సవాల్. అందుకే ఈ రెండు దేశాలది ‘నిండా మునిగిన వాడికి చలేమిటి?’ పరిస్థితి. దీర్ఘ పోరాటానికి ఈ రెండు దేశాలూ వెనుకాడవు.ఇరాన్ నుండి తమను రక్షించుకోవటానికి అమెరికా ఛత్ర ఛాయలోకి దూరిన సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు, ఈ యుద్ధం నుండి తప్పించుకోలేని పరిస్థితి. తమను తాము రక్షించుకోలేని ఈ దేశాలు ఇరాన్ నాశనాన్నే కోరుకుంటాయి. భవిష్యత్తులో మరెప్పుడూ తమపై దాడి చేయనంతగా ఇరాన్ను ధ్వంసం చేయాలని ఈ దేశాలు కోరుకోవడం సహజం. అందువలన ఇవి యుద్ధం ఆగాలని కోరుకోకపోవచ్చును. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యాది అస్తిత్వ సమస్య. అందుకే ఎంత నష్ట పోయినా, నాలుగేళ్లయినా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది.కానీ యూఎస్ఏ పరిస్థితి దీనికి భిన్నం. ఈ యుద్ధం అస్తిత్వానికి సంబంధించినది కాదు, మనుగడకు సంబంధించినది కాదు. యుద్ధ లక్ష్యాలలో గందరగోళం స్పష్టంగా ఉన్నది. ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికి సుముఖంగా లేడు. కానీ అర్ధంతరంగా కాడి పడవేస్తే అది యూఎస్ ప్రతిష్ఠకు మాయని మచ్చ. ఇప్పటికే యూఎస్ మదుపరులు, వ్యాపార లాబీలు ట్రంప్పై ఒత్తిడి పెంచారు. యూఎస్ఏ జీడీపీ సుమారుగా 31.89 ట్రిలియన్ డాలర్లు. కానీ అప్పుల భారం 38.5 ట్రిలియన్ డాలర్లు. బాండ్ మార్కెట్ ద్వారా యూఎస్ చైనా, జపాన్, ఈయూ దేశాల నుండి పెద్ద మొత్తాలలో పెట్టుబడులను సేకరిస్తున్నది. ఈ పెట్టుబడులను వినియోగించే ఖరీదైన యుద్ధాలను నిర్వహిస్తున్నది. యూఎస్ బాండ్లపై ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లితే యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుంది. ప్రస్తుత యుద్ధం ప్రపంచ ఆయిల్ గ్యాస్ మార్కెట్లను సంక్షోభంలోనికి నెట్టివేస్తే, దీర్ఘకాలంలో యూఎస్ బాండ్ మార్కెట్ తద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే యూఎస్ డీప్ స్టేట్ లాబీలు ట్రంప్ను ఏదో రకంగా యుద్ధం నుండి బయటకు వచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
అమెరికా టెక్ కంపెనీలకు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచే ఈ దాడులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సైన్యం ఏప్రిల్ 1 నుంచి వెస్ట్ ఆసియా ప్రాంతంలో అమెరికా కంపెనీలే లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించాయి. ఐఆర్జీసీ ప్రకటించిన జాబితాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. అమెరికా దాడులకు ప్రతీకారంగా సైనిక స్థావరాలకే కాకుండా వాణిజ్య, సాంకేతిక రంగ సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ చర్యలు ఏప్రిల్ 1, బుధవారం రాత్రి 8 గంటలకు (టెహ్రాన్ సమయం) ప్రారంభమవుతాయని హెచ్చరించింది. ‘ప్రతి ఉగ్రదాడికి ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము’ అని ఐఆర్జీసీ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు జరుపుతోంది. ఈ చర్యలు అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా జరుగుతున్నాయని ఇరాన్ పేర్కొంది. అయితే, ఈసారి సాంకేతిక, వాణిజ్య రంగ సంస్థలను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకోవడంతో యుద్దం మరింత ఉద్రిక్తమయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘మీకోసమే ఎదురు చూస్తున్నాం’
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని మోహరిస్తున్నాయి. ఈ క్రమంలో శత్రు దేశాల సైన్యం భూతల దాడులకు దిగితే తాము ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది.ఇరాన్ ప్రెస్ టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఇస్లామిక్ రిపబ్లిక్ సైన్యం తమ కమాండోల క్లిప్లను చూపిస్తూ అమెరికన్ సైనికులను ఎదుర్కొని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించింది. 59 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఇరాన్ ప్రత్యేక దళాల కదలికలను వేగంగా చూపిస్తూ ‘దగ్గరకు రండి, మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం’అనే సందేశం ఇస్తున్నట్లుగా ఉండటాన్ని గమనించొచ్చు. దీంతో పాటు సైనిక సామగ్రితో ఉన్న సైనికులు యుద్ధ విన్యాసాలు చేయడం, కఠినమైన భూభాగం గుండా దళాలు ముందుకు సాగడం చూడొచ్చు. మరో క్లిప్లో ఇరాన్ సైన్యానికి చెందిన ఒక భారీ క్షిపణి ప్రయోగ వాహనం తన ఆయుధాన్ని పేల్చడం, ఆ తర్వాత పేలుళ్లు సంభవించడం కనిపిస్తుంది. అమెరికా వైపు చర్యలుఅమెరికా వైట్ హౌస్ ప్రకారం..అదనపు సైన్యాన్ని పశ్చిమ ఆసియాకు పంపడం ద్వారా అమెరికా తాను అనుకున్న లక్ష్యాలను సాధించగలదని తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలైన్ లీవిట్ మాట్లాడుతూ..‘ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ లక్ష్యాలను సాధించడానికి పెంటగాన్ సైనిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది’అని తెలిపారు. పెంటగాన్ ఇరాన్లో కొన్ని వారాలపాటు భూసైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయి ఆక్రమణ కాకుండా, లక్ష్యిత దాడుల రూపంలో ఉండవచ్చని సమాచారం. Iran’s Army released footage of its elite commandos, declaring it is ready to confront and defeat American soldiers.Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/gIdaV4W8lI— Press TV 🔻 (@PressTV) March 31, 2026 -
ట్రంప్నకు షాకిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
రోమ్: ఇరాన్పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాక్ తగిలింది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలంలో అనుమతి ఇవ్వబోమని కొన్ని దేశాలు స్పష్టంగా ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో ఇటలీ కూడా చేరింది. అమెరికా యుద్ధ విమానాలకు గగనతలాన్ని మూసివేయడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో ఇరాన్పై యుద్ధంలో తనకు సహకరించని దేశాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కతూ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇరాన్ను విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించని దేశాలు తమకు కావాల్సిన చమురు అమెరికా నుంచి కొనుగోలు చేయాలి. లేదా హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లి మీకు కావాల్సి వెళ్లి స్వయంగా తెచ్చుకోవాల్సిందే’అని వ్యాఖ్యానించారు.హర్మూజ్ జలసంధి మూసివేతతో కొన్ని దేశాలు జెట్ ఇంధనం కొరతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా వద్ద ఇంధనం ఎక్కువగా ఉంది, కావాలంటే ఆ దేశాలు కొనుగోలు చేసుకోవచ్చు. ‘ధైర్యం చేసి హర్మూజ్కి వెళ్లి మీకు కావాల్సింది తెచ్చుకోండి’ అని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మీరు అమెరికాకు తోడుగా లేరు. ఇకపై అమెరికా సహాయం చేయదు. ఇకనైనా మీరు ఒంటరిగా పోరాడడం నేర్చుకోవాలి’ అని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి చమురు సరఫరా చేసే ప్రధాన మార్గం. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సాధారణ వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ట్రంప్ హెచ్చరిస్తూ ‘తక్షణమే కాల్పుల విరమణ జరగకపోతే, హర్మూజ్ జలసంధి తిరిగి తెరవకపోతే అమెరికా దాడులను విస్తరిస్తుంది. ఖార్గ్ దీవిలోని చమురు ఎగుమతి కేంద్రాన్ని, అవసరమైతే డీసాలినేషన్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు. -
ఆకాశాన్ని కమ్మేసిన కాకుల వనం..!
ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్.. సాధారణంగా రద్దీగా ఉండే ఈ నగరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. జనం తమ పనులను ఆపేసి ఆకాశం వైపు భయంతో చూస్తున్నారు. పగలు కాస్తా రాత్రిలా మారిపోయింది. దానికి కారణం సూర్యుడిని కమ్మేసిన మేఘాలు కావు.. వేల సంఖ్యలో ఆకాశంలో తిరుగుతున్న నల్లని కాకులు! ఈ దృశ్యం చూస్తుంటే ఏదో హర్రర్ సినిమా క్లైమాక్స్ లా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడమే ఆలస్యం, ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ ఆకాశంలో ఇన్ని కాకులు ఒకేసారి ఎందుకు వచ్చాయి? ఇది రాబోయే ముప్పుకు సంకేతమా? మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం.. కాకులు గుంపులుగా కనిపిస్తే ఏదో అశుభం జరుగుతుందని. ఇంగ్లీష్ లో కూడా కాకుల గుంపును ‘A Murder of Crows’ అని పిలుస్తారు. అంటే వాటి పేరులోనే ఒక రకమైన మరణం లేదా వినాశనం అనే అర్థం దాగి ఉంది. టెల్ అవీవ్ ఆకాశంలో ఈ కాకులు చేస్తున్న వింత ఆకారాలు చూస్తుంటే, స్థానికులు ఇది ఒక ‘చెడు శకునం’ (Bad Omen) అని నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి వింతైన పక్షుల ప్రవర్తన జరిగినప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన కేవలం ఒక పక్షుల వలసగా నెటిజన్లు చూడటం లేదు. దీనికి మతపరమైన కోణాన్ని జోడిస్తున్నారు. బైబిల్లో చెప్పబడిన ‘అంత్యకాలం’ (End Times) సంకేతాల్లో పక్షుల వింత ప్రవర్తన కూడా ఒకటి అని కొందరు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి పవిత్ర భూమిపై ఇలాంటి దృశ్యాలు కనిపించడం వెనుక దైవికమైన హెచ్చరిక ఉందని కొందరు భక్తులు నమ్ముతున్నారు. వినాశనం సమీపించినప్పుడు పక్షులు మరియు జంతువులు ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తాయని పాత నిబంధనలోని కొన్ని వాక్యాలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కాకుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందా? లేక ఏదైనా పెద్ద ఉపద్రవం రాబోతోందా? అనే ఆందోళన టెల్ అవీవ్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను మానవుల కంటే వేగంగా పసిగడతాయి. గాలిలోని పీడనం లేదా భూమి లోపల జరిగే మార్పులను అవి గుర్తించగలవు. మరి ఈ కాకులు దేనిని చూసి భయపడి ఇలా గుంపులుగా ఎగురుతున్నాయి? అయితే, ప్రతి మిస్టరీ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. పక్షి శాస్త్రవేత్తల ప్రకారం, దీనిని 'ముర్మురేషన్' (Murmuration) అని పిలుస్తారు. ఆహారం కోసం వెతుకుతూ లేదా సురక్షితమైన స్థావరం కోసం పక్షులు ఇలా వేల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో వలస పక్షులు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటాయి. టెల్ అవీవ్ నగరం పక్షుల వలస మార్గంలో ఉండటం వల్ల ఇది ఒక సహజ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కాకులు తెలివైన పక్షులు, అవి వేటాడే పక్షుల నుండి రక్షణ పొందడానికి కూడా ఇలా గుంపులుగా ఏర్పడతాయి.ఒకవైపు మూఢనమ్మకాలు, మరోవైపు శాస్త్రీయ కారణాలు.. ఈ రెండింటి మధ్య ప్రజలు అయోమయంలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజల్లో పెరిగిన 'అన్సర్టైనిటీ' (అనిశ్చితి). ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింత పరిణామాలు మనిషిని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేలా చేస్తున్నాయి. గూగుల్లో ‘Something bad is going to happen’ అని వెతకడం, ఆకాశంలో కాకులు కనిపిస్తే అది ప్రళయం అని నమ్మడం.. ఇవన్నీ మనిషి లోపల ఉన్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి.టెల్ అవీవ్ ఆకాశంలో కనిపించిన ఆ నల్లని నీడలు నిజంగానే ఏదైనా విపత్తుకు సంకేతమా? లేక ప్రకృతిలో జరిగే ఒక సామాన్య ప్రక్రియనా? అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం.. మనం ప్రకృతిని గమనించడం మానేసి చాలా కాలమైంది, అందుకే ఇలాంటి చిన్న మార్పులు కూడా మనల్ని వణికించేస్తున్నాయి. ఏది ఏమైనా, అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ, అనవసరమైన భయాందోళనలకు గురికావద్దు. -
పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్
-
అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
యుద్ధం వెనుక లాభాల ఆటా?
-
డీల్ కి ఇరాన్ ఒప్పుకోకపోతే..!ఎనర్జీ టార్గెట్ పై ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
-
చమురు ట్యాంకర్ పై డ్రోన్లతో ఇరాన్ దాడి.. నౌకలో 24 మంది సిబ్బంది
-
బంకర్ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లకు సంబధించి ఓ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్ నగరంలో చోటుచేసుకుంది.ఈ వీడియోలో వరుస పేలుళ్లు సంభవించడం.. ఆ తర్వాత ఆకాశమంతా నారింజ రంగు మంటలతో నిండిపోవడం కనిపిస్తోంది. అయితే, ట్రంప్ ఈ వీడియోకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఇస్ఫహాన్లోని ఆయుధ నిల్వలు ఉన్న డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని మీడియా నివేదికలు చెబుతున్నాయి. సుమారు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరంలో 'బదర్' సైనిక విమానశ్రయం కూడా ఉంది.మరోవైపు, ఇరాన్కు ట్రంప్ తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. -
గల్ఫ్ జలాల్లో మళ్లీ మొదలైన డ్రోన్ దాడులు
పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. -
పాకిస్థాన్ చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చే యత్నం చేస్తున్నామని పాకిస్థాన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ దీనిపై స్పందించింది. ఇస్లామాబాద్లో పాక్ నిర్వహించిన ఏ సమావేశంలోనూ పాల్గొనలేదని భారత్లోని ఇరాన్ రాయబారి స్పష్టం చేశారు.పాకిస్థాన్ ఉప ప్రధాని ఇటీవల ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అమెరికా, ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడితో కూడా తాము మాట్లాడామని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించింది.ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో తాము నేరుగా ఎటువంటి చర్చలు జరపడం లేదని మధ్యవర్తుల ద్వారా అమెరికా కేవలం అహేతుకమైన మితిమీరిన డిమాండ్లను మాత్రమే పంపుతోందని తెలిపారు.అమెరికా దౌత్య విధానం తరచుగా మారుతూ ఉంటుందని కానీ ఇరాన్ మాత్రం మెుదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు. అదే విధంగా పాకిస్థాన్ వారి సొంతంగా సమావేశం నిర్వహించిందని అందులో తాము పాల్గొనలేదని తెలిపారు. యుద్దం ముగింపుకు వారి ప్రయత్నం అభినందనీయమని అదే సమయంలో యుద్ధం ఎవరు మెుదలుపెట్టారో గుర్తుంచుకోవాలని ఈ సందర్బంగా ఇరాన్ రాయబారి అన్నారు. -
యుద్ధంపై రణభేరి!
రాత్రింబగళ్లు నిప్పులు కురుస్తున్నా భూగోళంపైనున్న జనారణ్యాలన్నీ నిశ్చలన చిత్రాలై నిర్లిప్తంగా ఉండిపోతున్నాయన్న నిరాశ సర్వత్రా ఆవరించిన తరుణంలో అమెరికా వ్యాప్తంగా శనివారం ఒక మానవ మహాసముద్రం పోటెత్తింది. దశాబ్దాలనాటి వియత్నాం యుద్ధ వ్యతిరేక ర్యాలీలను తలపిస్తూ, అంతకన్నా మరిన్ని రెట్లు ఎక్కువగా నగరాలు, పట్టణాలు, మారుమూల పల్లెలన్న వ్యత్యాసం లేకుండా– అమెరికాలోని అన్ని వర్గాలూ ఏకమై 3,300 నిరసన ప్రదర్శనలు నిర్వహించి ముక్తకంఠంతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని ఖండించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటా, బయటా తన అరాచకంతో ప్రజాస్వామ్యానికీ, మానవతకూ మహాపచారం చేస్తున్నారని ప్రదర్శకులు మండిపడ్డారంటే ఏడాది పాలనలో వారెంత విసిగిపోయారో అర్థమవుతుంది. ఖర్గ్ ద్వీపాన్ని బుగ్గి చేస్తానని, ఇరాన్ ఇంధన క్షేత్రాలకూ, విద్యుదుత్పాదన ప్లాంట్లకూ నిప్పెడతాననీ ట్రంప్ బెదిరిస్తున్న తరుణంలో ‘నో కింగ్స్’ పేరిట ఇంత పెద్దయెత్తున నిరసనలు ఎగిసిపడటం అసాధారణం. ఉత్తర ధ్రువప్రాంత అలస్కాలో కేవలం 3,000 మంది జనాభా నివసించే కోట్జెబు మొదలుకొని కరేబియన్ ద్వీపంలోని ప్యూర్టోరికో... న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో తదితర మహా నగరాల వరకూ ప్రదర్శకులు భారీయెత్తున పాల్గొనగా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాల్లో సైతం ‘నో కింగ్స్’ ర్యాలీలు జరిగాయి. ‘నో కింగ్స్’ ఒక్క ట్రంప్ పైన మాత్రమే కాదు... ఆయనకు అపరిమితమైన అధికా రాలు కట్టబెట్టిన, చట్టపరమైన రక్షణలిచ్చిన వ్యవస్థలన్నిటిపైనా మోగించిన రణభేరి. అధికారం అహంకరించినప్పుడూ, న్యాయం సైతం దానితో కుమ్మక్కయినప్పుడూ నడి వీధులే న్యాయస్థానాలవుతాయి. శనివారంనాటి నిరసనల సారాంశం అదే. రాచరిక, భూస్వామ్య వ్యవస్థలపై శతాబ్దాల క్రితం పోరాడి నిర్మించుకున్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కలిసి మరో ‘రాజు’ను ప్రతిష్ఠించటానికి పూనుకోవడంపై ‘నో కింగ్స్’ ఒక తిరుగుబాటు. స్వదేశంలో నియంతగా మారిన పాలకుడు ప్రపంచానికి సైతం శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నదని ట్రంప్ పోకడలు చాటుతున్నాయి. నియంతృత్వం రాజ్యమేలేచోట అరాచకాలు పెరిగినప్పుడు మౌనప్రేక్షకులుగా మిగిలే సాధారణ జనంలో సైతం ఆలోచనలు రేకెత్తించడానికీ, కార్యోన్ముఖుల్ని చేయటానికీ ఈ నిరసనలు పుట్టు కొస్తాయి. రిపబ్లికన్ల ఆధిక్యతగల రాష్ట్రాలూ, ‘మాగా’ ఉద్యమ ప్రాబల్యంగల ప్రాంతాలూ సైతం ఈసారి నిరసనలతో హోరెత్తటం గమనించదగ్గది. జనహననం కోసం పశ్చిమాసియాకు ట్రంప్ తరలించిన మెరైన్ల తల్లులు కూడా ఇందులో పాల్గొన్నారు. నెలక్రితంతో పోలిస్తే... వారం రోజులుగా ఇరాన్ ప్రతిదాడుల సంఖ్య తగ్గిందనీ, రోజుకు 30 మించటం లేదనీ అంటున్నారు. కానీ అవి నేరుగా లక్ష్యాన్ని గురి చూస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ప్రత్యర్థి పక్షాలు నిలువరిస్తున్నా అది కిందపడుతూ పదుల బాంబులై పేలటం, జననష్టంతోపాటు ఆస్తి నష్టం తీసుకురావటం కనబడుతూనే ఉంది. ఎదురుదాడుల క్రమంలోనే అంచనాలు పదు నెక్కించుకుని, నిఘా కార్యకలాపాలను సమన్వయపరుచుకుని ఇరాన్ దళాలు వ్యవహ రిస్తున్నాయని ఇది తేటతెల్లం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్లో లక్షలాదిమంది పౌరులు ఇప్పటికీ బాంబు షెల్టర్లలో తలదాచుకొనక తప్పని స్థితి ఉంది. ప్రత్యర్థి పక్షాల ప్రాంతాల్లో ఒకసారంటూ అస్థిర పరిస్థితుల్నీ, అభద్రతా భావాన్నీ తీసుకొచ్చాక దాడుల సంఖ్య గణించదగ్గది కాదు. గత జూన్లో 12 రోజుల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ విశ్రమించలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజల జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తోంది. వారి జీవికను దెబ్బతీస్తోంది. ఇరాన్పై యుద్ధం ఆపకుండా, హార్మూజ్ జలసంధి మాత్రం ప్రశాంతంగా ఉండాలనీ, ఇంధన రవాణా నిరాటంకంగా జరగాలనీ ట్రంప్ కోరుకోవటం దురాశ. ఇంధన ధరలు మిన్నంటితే తన కొలువుకు ఎసరొస్తుందన్న ఏకైక భయంతోనే పశ్చిమాసియాలో ప్రస్తుతం ఆయన వేలాదిమంది మెరైన్లను మోహరించారు. అమెరికా ప్రజల అభీష్టమేమిటో తెలిసింది గనుక ఇకనైనా ట్రంప్ తన దుష్ట పోకడలకు స్వస్తి చెప్పాలి. -
భూతల దాడులు తప్పనట్లేనా?
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికాలోని యూదు లాబీల ఒత్తిడి నుంచి అధ్యక్షుడు ట్రంప్ బయట పడలేకపోయి నట్లయితే, ఇరాన్తో పదాతి సేనల యుద్ధం తప్పక పోయేటట్లే కనిపిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28తో ఆరంభించి దాదాపు అయిదు వారాలుగా సాగిస్తున్న వైమానిక, నౌకా, క్షిపణి యుద్ధం ఇరాన్ను తీవ్రంగానే నష్టపర చినా, సమీప భవిష్యత్తులో ఓడించగల సూచనలు లేకపోవటంతో, కనీసం పదాతి యుద్ధంతోనైనా ఆ పని చేయగలమా అనే మీమాంసలో ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇరాన్ ప్రతిఘటనతో తమకు, ఇజ్రాయెల్కు, గల్ఫ్ రాజ్యాలకు, ప్రపంచ ఇంధన వ్యవస్థకు కలుగుతున్న నష్టాలు, అమెరికన్ ప్రజ లతో పాటు తన ‘మాగా’ మద్దతుదారులలో ఎదురవుతున్న వ్యతిరేక తలు కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నట్లు తోస్తున్నది.స్వభావమే సమస్యఅయినప్పటికీ ఏమీ చెప్పలేని స్థితి. అందుకు కారణం నెతన్యాహూ ఒత్తిడి అన్నది సరేసరి కాగా, స్వయంగా ట్రంప్ స్వభావం ఒక పెద్ద సమస్య అవుతున్నది. ఇరాన్ను తుదముట్టించాలన్నది తన ‘40 సంవత్సరాల కల’ అని, అందుకు తగిన అవ కాశం ఇప్పుడు వచ్చిందని నెతన్యాహూ అంటూ, అది నెరవేర్చగల నాయకుడు అమెరికన్ చరిత్రలో మొదటిసారిగా ఆవిర్భవించాడని చెప్తున్నారు. ఇరాన్పై ఈ తరహా యుద్ధం సాగించాలన్న ఒత్తిడులు ఒబామా, బైడెన్ కాలాలలోనూ వచ్చినా, వారు ఆంక్షలతో సరిపెట్టి యుద్ధానికి నిరాకరించారు. అణుశక్తి విషయమై చర్చల ద్వారా ఒప్పందం జరిగింది (2015) కూడా అప్పుడే. ఆ ఒప్పందాన్ని ఎటువంటి కారణం లేకుండా రద్దు చేసిన ట్రంప్, రెండవసారి అధ్యక్షుడైనప్పటినుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కనిపిస్తు న్నదే. ఆయనను నెతన్యాహూ అంతగా పొగడటం అందువల్లనే. ఒక్క ఇరాన్ విషయంలోనే కాదు, అనేక ఇతర అంశాలలోనూ ట్రంప్ మొదటినుంచి గత 14 మాసాలుగా ప్రవర్తిస్తున్న తీరు ఇదే విధంగా ఉంది. ఆయన ‘స్వభావం’ అనే మాట ఉపయోగించవలసి రావటం అందువల్లనే.ప్రస్తుతం గడువులు, షరతులు, చర్చలు అనే ప్రహసనం మరొకసారి సాగుతున్నది. ఇరాన్ లొంగుబాటుకు 48 గంటల గడు వన్నారు. ఆ సమయం పూర్తి కావస్తుండగా అయిదు రోజులన్నారు. అది ముగియకముందే పది రోజులకు పెంచారు. అది ఏప్రిల్ 6న గడవనున్నది. ఈలోగానే 15 షరతులతో ఒక రాజీ ప్రతిపాదన అమె రికా నుంచి వచ్చింది. అందుకు మారుగ ఇరాన్ 5 షరతులన్నది. ఆ రెండింటిలో ఏదీ రాజీకి వీలయ్యేది కాదని ఎవరైనా వెంటనే చెప్ప గలరు. అసలు అణుశుద్ధి కార్యక్రమాన్నే పూర్తిగా ఆపివేయాలనీ, క్షిపణుల సామర్థ్యం, సంఖ్య తాము చెప్పినట్లే ఉండాలనీ, (ఇరాన్) అనుబంధ మిలిటెంట్ సంస్థలకు మద్దతు పూర్తిగా నిలిపి వేయాలనీ, హార్ముజ్పై సార్వభౌమాధికారం వదలుకోవాలనీ షరతులు విధిస్తే అందుకు ఇరాన్ అంగీకరించగలదా? అదే విధంగా గల్ఫ్లోని సైనిక స్థావరాలన్నీ ఖాళీ చేసి పోవాలన్న ఇరాన్ షరతు అమెరికాకు సమ్మతం కాగలదా? కనుక అది కాలక్షేపపు వ్యవహారం మాత్రమే. ఆ మాట తెలిసి కూడా అమెరికా అధ్యక్షుడు, చాలా షరతులను ఇరాన్ అంగీకరించి వేసిందని ఈ 30వ తేదీన మరొకమారు ప్రకటించారు.గెలిచే యుద్ధమేనా?ఎంతో వెనుకకు పోనక్కర లేదు. అమెరికా, ఇరాన్ మూడవ విడత చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో ఫిబ్రవరి 26న జరిగాయి. పరస్పర అంగీకారం దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు ఒమన్తో పాటు అమెరికన్ ప్రతినిధులు ప్రకటించారు. తర్వాతి విడత చర్చలు మార్చి 2న జరగవలసి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆ మధ్యలోనే ఇజ్రాయెల్, దాని వెనువెంట అమెరికా కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ఏ ఇరాన్ నాయకుని అనుమతితో చర్చలు జరుగుతుండెనో అదే నాయకుడిని కుటుంబంతో సహా ప్రాణాలు తీశాయి. చర్చలు ఒక పక్క జరుపుతూనే మధ్యలో దాడులు చేయటం ట్రంప్కు అది రెండవసారి.అందుకే చర్చల నాటకాన్ని ఇరాన్ మాత్రమే కాదు, ఎవరూ నమ్మటం లేదు. అమెరికన్లు కూడా. నాలుగు వారాల వైమానిక యుద్ధం ట్రంప్ లక్ష్యాలను సాధించలేక పోయినప్పుడు పదాతి యుద్ధంతో అది జరిగేది కాదని అమెరికన్ రిటైర్డ్ జనరల్స్, యుద్ధ విషయాల చరిత్రకారులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అందుకు వారు గట్టి కారణాలు కూడా చెప్తున్నారు. లిబియా, ఇరాక్, అఫ్గాని స్తాన్లకు, ఇరాన్కు చాలా తేడాలున్నాయి. వాటికి భిన్నంగా ఇక్కడ విశాలమైన దేశం, పెద్ద జనాభా, బలమైన ప్రభుత్వం, భారీ సైన్యం, సైనిక సంపత్తి ఉన్నాయి. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహం భిన్నమైనది. ఇరాన్లో అధిక భాగం పర్వతాలమయం. వారి ఆయుధ నిల్వలు కొండల అడుగున చాలా లోతైన బంకర్లలో ఉన్నందునే అమెరికన్ బంకర్ బస్టర్లు సైతం వాటిని ఛేదించలేక పోతున్నాయి. వీటన్నింటికీ అదనంగా, ఇరానియన్ ప్రభుత్వం, ప్రజలు కూడా తమ అస్తిత్వాన్ని ఏ విధంగానైనా కాపాడుకుని తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అక్కడి ప్రజలు ప్రజాస్వా మికంగా ఎన్నుకున్న మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికా, బ్రిటన్ కలిసి 1953లో కూలదోసినప్పటి నుంచి గల 72 సంవత్సరాల చేదు అనుభవాల దృష్ట్యా పాశ్చాత్య దేశాలను, ఇజ్రాయెల్ను ఎంత మాత్రం నమ్మరన్నది ఆ నిపుణులు చెప్తున్నమాట.కపట నీతిఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు గత 12 రోజులలో మూడు సార్లు మార్చిన గడువులుగానీ, చర్చల కోసమంటున్న షరతులు గానీ, ఇస్లామాబాద్లో జరుగుతాయనే మధ్యవర్తిత్వాలు గానీ ప్రహసనం తప్ప మరొకటి కాదు. అయినా, ఇరాన్పై యుద్ధాన్నిఇంకా తీవ్రం చేయండంటూ ట్రంప్కు మూడు రోజుల క్రితం చెప్పిన సౌదీ అరేబియా, అంతలోనే ఈజిప్టు, టర్కీలతో కలిసి పాకిస్తాన్కు మధ్యవర్తి ప్రతినిధులను పంపటం కపట నీతికి పరాకాష్ఠ వంటిది. ఇటువంటి రాజీలేవీ కుదిరేవి కాదని ఒమన్ దౌత్య వైఫల్యంతో గ్రహించలేనిదేమీ కాదు పాకిస్తాన్. అయినప్పటికీ చొరవ తీసుకోవటంలో తమ ఆలోచనలేవో తమకుండవచ్చుగానీ, అది జరిగే కార్యం కాదని అందరికీ తెలుసు. అంతకన్న ముఖ్యంగా, దానిని జరగనివ్వరాదని ఇజ్రాయెలీ ప్రధానికి తెలుసు. వీటన్నింటికి ఇరాన్పై అరబ్ షేఖ్లకు చిరకాలంగా గల వ్యతిరేకత పనిచేస్తున్నది.అందువల్ల, వెనిజులాతో చర్చలు చర్చలంటూ సైన్యాలను మోహరించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు, ఇరాన్తో చర్చలు చర్చలంటూ సైన్యాలను సమీకరించి ఉన్నట్లుండి యుద్ధం మొదలు పెట్టినట్లు, ఇప్పుడు మళ్లీ ఒకవైపు రాజీ ప్రతిపాదనలు ప్రకటించి ఇస్లామాబాద్లో చర్చలంటూనే పదాతి సేనలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అకస్మాత్తుగా ట్రంప్ 30వ తేదీన తన బ్రాండ్ మాట ఒకటి ప్రకటించారు. తనకు ఇరాన్ చమురు కావాలట. అందుకు ఖర్గ్ దీవిని ఆక్రమించుకుని హార్మూజ్ను తెరిపిస్తారట. కార్యసాధన తర్వాతగానీ ఇరాన్ నుంచి వెనుకకు మళ్లరట. ఒకవేళ రాగల రోజు లలో వైమానిక దాడులు, భూతల యుద్ధం జమిలిగా సాగితే ఏమి జరగవచ్చునన్నది అంచనా వేయలేము.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
తేల్చకుంటే సర్వనాశనమే
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఇరాన్లో మేం చేపట్టిన సైనిక చర్యలను తక్షణం ఆపేసే అంశంపై ఇరాన్ దేశ నూతన పాలక వర్గంతో విస్తృతస్థాయిలో సమగ్రంగా సహేతుకంగా చర్చలు జరుపుతున్నాం. చర్చల్లో అద్భుతమైన పురోగతి సాధించాం. కానీ ఏదైనా కారణంతో ఈ ఒప్పందం గనక సఫలీకృతంకాకపోతే ఇరాన్ అంతుచూస్తాం. సరుకు రవాణా నౌకల రాకపోకల కోసం హార్మూజ్ను తెరవకపోతే ఇన్నిరోజులు ఇరాన్ విషయంలో మేం చూపించిన సహనం మాలో చచ్చిపోతుంది. వెంటనే ఇరాన్లోని అన్ని చమురు క్షేత్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీలు, ఖర్గ్ ద్వీపంసహా ఉప్పునీటిని తాగు నీటిగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లనూ సర్వనాశంచేస్తాం. ఇరాన్ గత 47 ఏళ్ల ఉగ్రపాలనలో వేలాది మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు తీసింది. వారి మరణాలకు తాజా దాడులతో మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’అని ట్రంప్ హెచ్చరించారు. ఖర్గ్ను స్వాధీనం చేసుకోవచ్చేమో.. ఇరాన్ చమురు మౌలికరంగంలో గుండెకాయ అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకునే ఆలోచన ఉందని ట్రంప్ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. ఈ విషయంలో మాకెన్నో ఆప్షన్లు ఉన్నాయి. మా పంతం నెగ్గాలంటే ఖర్గ్ ద్వీపం మా అ«దీనంలో ఉంటే మంచిదేమో. దానిని కాపాడుకునే వ్యవస్థ ఏదీ ఇరాన్ వద్ద లేదు. సులభంగా స్వా«దీనం చేసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. డిమాండ్లను తప్పుబట్టిన ఇరాన్ అమెరికా పంపిన 15 అంశాల డిమాండ్లను ఇరాన్ చెత్త ప్రతిపాదనలుగా అభివరి్ణంచింది. ‘‘గల్ఫ్ అరబ్ దేశాల్లోకి ఇప్పటికే అమెరికా సేనలు ప్రవేశించాయి. కానీ పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లోకి అమెరికా సేనలు అడుగుపెడితే ఆ ప్రాంతం మొత్తాన్నీ సముద్ర మందుపాతరలతో నింపేస్తాం. అమెరికా పంపిన డిమాండ్లు అన్నీ అతిగా, అవాస్తవంగా, ఏమాత్రం హేతుబద్ధత లేకుండా ఉన్నాయి’’ అని ఇరాన్ విదేశాంగశాఖ అధికారప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ వ్యాఖ్యానించారు. పాక్ మధ్యవర్తిత్వం మాకొద్దు.. ‘‘ఇప్పుడు నేరుగా అమెరికాతో చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా కేవలం అసంబద్ధమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. అమెరికా దౌత్యం మాటమాటకి మాటిమాటికీ మారుతోంది. మధ్యవర్తిత్వంపై అమెరికా పిల్లిమొగ్గలేస్తోంది. మేం స్థిరంగా ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. ప్రాంతీయ పోరు ఆగాలనే పిలుపు మంచిదే. కానీ అసలే పోరు మొదలెట్టింది ఎవరు?’’ అని ముంబైలోని కాన్సులేట్ జనరల్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఎలాంటి చర్చలు జరగట్లేదు. అమెరికా బలగాల కోసం ఇరాన్ సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాగానే కాల్చి బూడిదచేస్తాం. అమెరికా మిత్రదేశాలకూ ఇదే మా హెచ్చరిక’’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాహ్ అన్నారు. ఇరాన్ దాడుల పరంపర అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ సోమవారం సైతం దాడులను కొనసాగించింది. కువైట్లోని జల, విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా సిటీలోని భారీ చమురు రిఫైనరీపై ఇరాన్ బాంబులేసింది. దీంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు వెలువడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యాయి. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్పై క్షిపణులను ప్రయోగించగా ఐదింటిని గగనతల రక్షణవ్యవస్థలు కూల్చేశాయి. దుబాయ్లోనూ ఒక క్షిపణిని అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం మీదా ఇరాన్ దాడులుచేసింది. దీంతో ఆ ప్రాంతమంతా హెచ్చరికల సైరన్లతో మోగిపోయింది. అయితే ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,900 మంది చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలోముగ్గురు ఐరాస శాంతివిభాగ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. బీరుట్ శివారు టైర్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒక లెబనాన్ సైనికుడు చనిపోయారు. మరోవైపు ఇరాక్లోని మొహమ్మద్ అలా వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడి తమ ఆంటోనోవ్–132 ఆర్మీ రవాణా విమానం ధ్వంసమైందని ఇరాక్ రక్షణ శాఖ తెలిపింది.గగనతలాన్ని మూసేసిన స్పెయిన్ ఇరాన్పై దాడుల కోసం అమెరికా తమ గగనతలాన్ని వినియోగిస్తుండటంపై ఆగ్రహంతో ఉన్న స్పెయిన్ సోమవారం తమ ఎయిర్స్పేస్ను మూసేసింది. ‘‘సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనికస్థావరాలను యుద్ధం కోసం ఉపయోగించకూడదు. కానీ మా మాట అమెరికా వినట్లేదు. అందుకే మా గగనతలాన్ని మూసేస్తున్నాం. ఈ యు ద్ధం చట్టవ్యతిరేకం, అన్యాయం’’అని స్పెయిన్ రక్షణమంత్రి మార్గరీటీ రూబెల్స్ ప్రకటించారు. నేవీ చీఫ్ మరణాన్ని ద్రువీకరించిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)లోని నేవీ విభాగ సారథి అలీరెజా తంగసిరి ఇటీవల దాడుల్లో కన్నుమూశారని ఇరాన్ ఎట్టకేలకు అధికారికంగా ధ్రువీకరించింది. ఇరాన్ నేవీ రియర్ అడ్మిరల్ను గత గురువారమే అంతంచేశామని ఇజ్రాయెల్ ప్రకటించినా ఇప్పటిదాకా ఇరాన్ ధ్రువీకరించలేదు. ‘‘దాడుల్లో తీవ్రంగా గాయపడిన అలీరెజా అమరుడయ్యారు. దేశసేవలో అత్యున్నత త్యాగం చేశారు’’ అని ఇరాన్ నేవీ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తంచేసింది. కువైట్లో భారతీయుని దుర్మరణం కువైట్లో సముద్రనీటిని మంచినీరుగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లో పనిచేస్తున్న ఒక భారతీయుడు సోమవారం ఆ ప్లాంట్పై ఇరాన్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా పశ్చిమాసియా యుద్ధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ప్లాంట్లోని ఒక భవనం దెబ్బతినడంతో ఇతను చనిపోయాడని కువైట్ విద్యుత్, జల, పునరుత్పాదక ఇంధన శాఖ తెలిపింది. -
ఇరాన్తో చర్చలు.. వైట్హౌస్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ట్రంప్ అదనపు బలగాల్ని యుద్ధ క్షేత్రంలోకి తరలిస్తుంటే.. ఇరాన్ సైతం నరకానికి స్వాగతం అని సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. యుద్ధం ముగింపుకు చర్చలు సజావుగా సాగుతున్నాయని వెల్లడించింది.ఇరాన్లో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మట్లాడారు." ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయి. చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా చేసే ప్రకటనలకు, తెరవెనుక అమెరికా అధికారులతో జరుపుతున్న చర్చలకు చాలా తేడా ఉంది అని ఆమె పేర్కొంది.అదేవిధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలతో పాటు కొన్నిమీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు అని ఆమె కొట్టిపడేశారు. ఇరాన్ పాలకుల బహిరంగ హెచ్చరికలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చలు మాత్రం సజావుగానే జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.అయితే కరోలిన్ ప్రకటనకు వాస్తవ పరిస్థిలకు చాలా భిన్నంగా ఉంది. ఇరాన్ మాత్రం చర్చలు జరగట్లేదని గట్టిగా చెబుతోంది. ట్రంప్ సైతం వేల సంఖ్యలో అదనపు బలగాల్ని ఇది వరకే మధ్యప్రాచ్యానికి తరలించారు. హార్మూజ్ తెరవకపోతే దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
టెహ్రాన్పై అణుదాడి ప్లాన్? UNO మాజీ అధికారి సంచలన ఆరోపణ
ఐక్యరాజ్యసమితికి చెందిన సీనియర్ దౌత్యవేత్త, మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇరాన్పై అణు ఆయుధాలను ప్రయోగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం ఇరాన్ సైతం దానికి ధీటుగా ప్రతిస్పందించడంతో పరిస్థితులు చేజారిపోయాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యుఎన్కు చెందిన సీనియర్ దౌత్యవేత్త మహమ్మద్ సఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్పై అణుదాడి చేసే ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజం చేస్తోందన్నారు.ఈ మేరకు మహమ్మద్ సఫా తన రాజీనామా లేఖను X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు."ఇక్కడ మీరు చూస్తున్నది టెహ్రాన్ నగర చిత్రం. యుద్ధం కావాలని కోరుకునే వారు, ఎప్పుడూ యుద్ధ భూమిని చూడని వారు దీనిని ఏదో జనాభా లేని ఎడారి అని అనుకుంటున్నారు. కానీ, ఇది దాదాపు ఒక కోటి జనాభా కలిగిన నగరం. ఇలాంటి నగరంపై బాంబులు వేయాలని అనుకోవడం వికృతమైన ఆలోచన. వాషింగ్టన్ లేదా లండన్ వంటి నగరాలపై అణు దాడి జరిగితే ఎంతటి వినాశనం ఉంటుందో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది" అని హెచ్చరించారు.మానవత్వానికి వ్యతిరేకంగా జరగబోయే ఈ "నేరానికి" సాక్షిగా ఉండలేక, తన దౌత్య జీవితాన్ని త్యాగం చేసి ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు సఫా పేర్కొన్నారు. టెహ్రాన్ కేవలం ఎడారి కాదని, అక్కడ కోటి మందికి పైగా సామాన్య ప్రజలు, పిల్లలు నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితిలోని కొందరు ఉన్నతాధికారులు ఒక శక్తివంతమైన లాబీకి తొత్తులుగా మారారని సఫా ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నా, UN అధికారులు వారిని ప్రశ్నించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధ ముప్పు పొంచి ఉందని, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం ద్వారా మాత్రమే ఈ వినాశనాన్ని ఆపగలరని ఆయన పిలుపునిచ్చారు.I don't think people understand the gravity of the situation as the UN is preparing for possible nuclear weapon use in Iran.This is a picture of Tehran. For you uneducated, untraveled, never-served, warhawks licking your chops at the thought of bombing it. It's not some low… pic.twitter.com/BnzB4F3001— Mohamad Safa (@mhdksafa) March 29, 2026 -
అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?
-
ట్రంప్నకు షాక్ల మీద షాక్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా ఇరాన్ ఎంతకీ తగ్గకపోవడంతో డొనాల్డ్ ట్రంప్కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరింత దూకుడుగా వెళ్దామా అంటే ఇరాన్ నుంచి ఏ ముప్పు వస్తుందోననే భయం ట్రంప్లో నెలకొంది. అలాగని కొన్ని రోజుల పాటు వార్కు గ్యాప్ ఇచ్చారు ట్రంప్. అదే సమయంలో ఇరాన్కు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూనే మధ్యవర్తిత్వాన్ని జరుపుతున్నారు. ఇందుకు ట్రంప్.. పాకిస్తాన్ను మధ్యలో పెట్టుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం వీటికి ససేమేరా అంటోంది. యుద్ధానికి ఘనమైన ముగింపు ఏంటో తామే ఇస్తామని, ఇటువంటి అర్థం పర్థం లేని మధ్యవర్తిత్వాలు వద్దనే అంటోంది. మధ్యవర్తిగా తమ పాత్ర పట్ల అమెరికా, ఇరాన్లు రెండూ సంతృప్తిగా ఉన్నాయని పాకిస్తాన్ చెప్పిన రోజుల వ్యవధిలోనే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ వాదనలను తోసిపుచ్చింది. మధ్యవర్తి ద్వారా తమకు అసమంజసమైన డిమాండ్లు మాత్రమే అందాయని పేర్కొంది. అమెరికా తమతో నేరుగా చర్చలు జరపలేదని, మధ్యవర్తిత్వాల ద్వారా యుద్ధం ముగింపు అనేది ఉండబోదని తేల్చిచెప్పింది. ఒకవేళ అమెరికా తమతో తాము పెట్టే కండీషన్స్కు డైరెక్ట్గా మాట్లాడి ఒప్పుకుంటేనే అప్పుడు యుద్ధం ముగింపు ఆలోచిస్తామని స్పష్టం చేసింది. తమకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది వద్దే వద్దని, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అంటోంది, పాక్.. అమెరికా వదిలిన అస్త్రం!పాక్ అనేది అమెరికా వదిలిన అస్త్రమనే విషయమని ఇరాన్కు అర్థమైంది. ఇన్ని ప్రపంచదేశాలు ఉండగా పాకిస్తాన్నే మధ్యవర్తిగా అమెరికా పెట్టుకోవడంపై ఇరాన్ ఆగ్రహంగా ఉంది. తమకు ఏదో రకంగా నష్టం కల్గించాలనే యోచనతోనే పాకిస్తాన్ను అమెరికా వాడుకుంటుందని, ఆ పావులో తాము పడకూడదనే భావన ఇరాన్లో స్పష్టంగా కనబడుతోంది. మాట్లాడితే మీరు డైరెక్ట్గా మాట్లాడండి.. ఇలా మధ్యవర్తిత్వం, అందులోనూ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అంటే సహించలేకపోతోంది ఇరాన్. యుద్ధం ముగింపు విషయం తమ వైఖరి స్పష్టంగా ఉందని, దౌత్యం విషయంలో అమెరికా తరచు మాటమారుస్తుందని ఇరాన్ అంటోంది. ఒకవేళ తమ మధ్యవర్తిత్వం అనేది చేస్తే అమెరికా తలతూగే ఏ పెద్ద దేశమో చేయాలి కానీ ఇలా పాకిస్తాన్ను మధ్యలో తీసుకురావడం ఏంటనేది ఇరాన్ ప్రశ్నగా ఉంది. అందుకే యుద్ధం విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. డైలమాలో ట్రంప్..ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. పాకిస్తాన్తో రాయబారం నడుపుతుంది. ఇరాన్తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్.. అందుకు పాక్ను ఎన్నుకున్నారు. ఇరాన్ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్.. ఇక పాక్ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్ ఇచ్చారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్లో ట్రంప్ పడ్డారని, అందుకే ఇరాన్పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. మరొకవైపు అమెరికాలో తీవ్రస్థాయిలో నిరసనలు కూడా ట్రంప్ను డైలమాలోకి నెట్టేశాయి. ప్రస్తుతం ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్ మాట.. ఇరాన్ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్ నిపుణుల అభిప్రాయం. ఒకవేళ ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. అంటే నేరుగా అమెరికానే ఇరాన్తో చర్చలు జరిపితేనే ఇది ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. ట్రంప్కు స్పెయిన్ షాక్..ట్రంప్నకు మరోషాక్ తగిలింది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ అనమతి నిరాకరించింది. ఇరాన్పై యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తన వైఖరిని కఠినతరం చేస్తూ, అమెరికా యుద్ధ విమానాలకు తన గగనతలంతో పాటు సైనిక స్థావరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఇరాన్తో యుద్ధంలో పాల్గొనే అమెరికా యుద్ధ విమానాలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. -
ట్రంప్ కొత్త యుద్ధ వ్యూహం? ఇరాన్ ఆయిల్పై కన్ను
-
రాజకీయ నాయకులను లేపేస్తాం.. ఇరాన్ వార్నింగ్
-
తొలిసారి ఆ మిస్సైల్స్ వాడుతున్న US ఇక ఇరాన్ పని అయిపోయినట్టే..!
-
400 కేజీల యురేనియం ఎత్తుకొచ్చేయండి?! : ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే, ట్రంప్ నిప్పుతో చెలగాటం ఆడినట్లే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలు చేపట్టకూడదని ఆయన పలు మార్లు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా ఆయన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఇరాన్లోని 450 కిలోలకుపైగా యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనిక చర్యను పరిశీలిస్తున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించి అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ను నిర్వహించాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల్లో, ఇరాన్లో ఉన్న 453.5 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనిక దళాలను పంపే యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే, అమెరికా సైనికులు ఇరాన్లో కొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాల్సి రావచ్చు. -
యుద్దం వేళ.. పాక్లో కీలక భేటీ! శాంతి చర్చలకు రంగం సిద్ధం
-
పాక్ కు షాకిచ్చిన ఇరాన్ .
-
కువైట్ విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడి.. విదేశీ కార్మికుడు మృతి
-
ఇజ్రాయెల్ ధీమా.. తగ్గేదేలే అంటున్న ఇరాన్
-
అమెరికా 'కమాండర్లు, రాజకీయ నాయకుల’ ఇళ్లపై దాడి చేస్తాం: ఇరాన్
టెహ్రాన్: చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తన సైనిక శక్తిని మోహరిస్తున్నారు. అయితే, అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ భూభాగాల్లో భూతల దాడులు చేస్తే ఉపేక్షించబోమని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ మానసిక యుద్ధానికి తెరతీసిందిఇరాన్లోని ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సమన్వయంతో సైనిక దాడులు చేస్తామని తెలిపారు. ట్రంప్ ఇరాన్ భూభాగంపై దాడి చేసి ఆక్రమించాలనే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘యుద్ధభూమి నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా సైన్యం, ఇరాన్ యోధుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది’. అమెరికా చర్యలు చివరికి అవమానం, బంధనం, వినాశనం దిశగా తీసుకెళ్తాయి. పర్షియన్ గల్ఫ్లో సొరచేపలకు అమెరికా సైనికులు ఆహారం అవుతారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ కమాండర్ సయ్యద్ మజీద్ మౌసావీ మాట్లాడుతూ.. మా ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్లోని నియోట్ హోవావ్లోని కెమికల్ ప్లాంట్, ఒక రిఫైనరీ, రెండు స్టీల్ కాంప్లెక్స్లు, రెండు అల్యూమినియం కాంప్లెక్స్లు లక్ష్యంగా దాడులు చేస్తాం. మీరు (అమెరికా-ఇజ్రాయెల్) బాధను అనుభవించే వరకు మా దాడులు కొనసాగుతాయి’ అని అన్నారు.మొత్తం మీద, ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియా భద్రతా పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. -
ఇరాన్ యుద్ధం.. ఎనిమిది మంది భారతీయులు మృతి
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భయంకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు జరిపిన అమెరికా సైన్యం.. ఇకపై భూతల దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు.. ఇరాన్ సైతం ప్రతిదాడులు జరుపుతోంది. ఇక, తాజాగా కువైట్పై ఇరాన్ జరిపిన దాడుల్లో భారత కార్మికుడు మృతి చెందాడు.వివరాల మేరకు.. కువైట్లో ఇరాన్ చేసిన దాడుల్లో ఓ భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఇరాన్ దాడులలో భాగంగా కువైట్లోని ఒక ప్రధాన విద్యుత్, నీటి డీసాలినేషన్ ప్లాంట్లోని సర్వీస్ భవనం లక్ష్యంగా మారింది. ఈ దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందగా, భవనానికి భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి వల్ల ప్లాంట్లోని ఒక భవనం దెబ్బతింది. అత్యవసర బృందాలు వెంటనే స్పందించి నష్టం నియంత్రణ చర్యలు చేపట్టాయి.దీంతో పశ్చిమ ఆసియా యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య కనీసం ఎనిమిదికి చేరింది. ఇక, గత వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఒక భారతీయుడు క్షిపణి అవశేషాలు పడటంతో మరణించాడు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఏడు భారతీయులు మరణించారని, ఒకరు కనిపించలేదని తెలిపింది. తాజా ఘటనతో సంఖ్య పెరిగింది. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇరాన్ చమురు, ఖర్గ్ ద్వీపం మాదే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో చమురును స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్కు కీలక ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నిజం చెప్పాలంటే, ఇరాన్లోని చమురును స్వాధీనం చేసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు 'మీరెందుకు అలా చేస్తున్నారు?' అని అంటారు. కానీ వాళ్లే మూర్ఖులు’ అంటూ మండిపడ్డారు. అలాగే, ఇరాన్పై ఇప్పటికే 13,000 లక్ష్యాలపై బాంబింగ్ చేశామని.. మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని.. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ రక్షణ ఏర్పాట్ల గురించి అడగ్గా, ట్రంప్ స్పందిస్తూ.. వారికి ఎలాంటి రక్షణ ఉందని నేను అనుకోవడం లేదు. మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే, ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని వెల్లడించారు.అమెరికాకే ముప్పు..?మరోవైపు.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. మధ్యప్రాచ్యానికి వేలాది మంది అదనపు అమెరికన్ సైనికులు తరలివస్తున్నారు. ఈ సంఘర్షణలో ఖర్గ్ ద్వీపం ఒక వ్యూహాత్మక అమెరికా సైనిక ఎంపికగా ఉందని ఇటీవలి వారాల్లోని నివేదికలు కూడా సూచించాయి. ఇరాన్ చమురు ఎగుమతుల్లో అధిక భాగం జరిగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఇందులో భాగంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఖార్గ్ ద్వీపంపై ఎలాంటి దాడి అయినా అత్యంత ప్రమాదకరమని, అది అమెరికా సైనికుల ప్రాణనష్ణాన్నిపెంచుతుందని, సంఘర్షణను పొడిగించే అవకాశం ఉందని, అలాగే ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు మార్గాలలో ఒకదానికి ముప్పు వాటిల్లుతుందని సైనిక విశ్లేషకులు హెచ్చరించారు.JUST IN: 🇺🇸🇮🇷 President Trump confirms he is considering seizing Iran's Kharg Island, FT reports."My preference would be to take the oil…I don't think they have any defense. We could take it very easily." pic.twitter.com/W7Ze4jj4Zi— BRICS News (@BRICSinfo) March 30, 2026ఇక, పలు నివేదిక ప్రకారం, ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు నిలుపుకోవడం వంటి కార్యకలాపాల కోసం శిక్షణ పొందిన 10,000 మంది సైనికులను మోహరించాలని పెంటగాన్ ఇప్పటికే ఆదేశించింది. దాదాపు 2,200 మంది మెరైన్లతో సహా సుమారు 3,500 మంది సిబ్బంది శుక్రవారం ఆ ప్రాంతానికి చేరుకున్నారు, మరో 2,200 మంది మెరైన్లు మార్గంలో ఉన్నారు. వాషింగ్టన్ సాధ్యమయ్యే విస్తరించిన కార్యకలాపాలకు సిద్ధమవుతున్నందున, 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన వేలాది మందిని కూడా మోహరించాలని ఆదేశించారు.పెరుగుతున్న మరణాల సంఖ్యయుద్ధం కారణంగా ఇరాన్లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అటు ఇజ్రాయెల్లో 19 మంది మరణించారు. లెబనాన్లో 1,100 మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. -
పశ్చిమాసియా యుద్ధం.. ఎందరొచ్చినా మసి చేస్తాం : ఇరాన్
-
యుద్ధంలో అమెరికాకు కోలుకోలేని ఎదురుదెబ్బ..
-
భారత్కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
న్యూఢిల్లీ: ఇరాన్ అనుమతితో హార్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’, ‘బీడబ్ల్యూ టీవైఆర్’వేగంగా భారత్ దిశగా కదులుతున్నాయి. భారతీయ జెండాతో వస్తున్న ఈ నౌకలు శనివారం హార్మూజ్ను దాటేసి ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’దిశగా ముందుకెళ్తున్నాయని నౌకల ట్రాకింగ్ సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ‘బీడబ్ల్యూ టీవైఆర్’నౌక మార్చి 31వ తేదీకల్లా ముంబైకి చేరుకునే అవకాశముంది. ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’నౌక ఏప్రిల్ ఒకటో తేదీన న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకునే ఆస్కారముందని భారత ప్రభుత్వ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశ ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. మార్చి 16–17 తేదీల మధ్య ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ఉమ్మడిగా 92,712 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. మార్చి 26–28 తేదీల మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు 92,612 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చాయి.భారత 60 శాతం వంటగ్యాస్ అవసరాలను గల్ఫ్ దేశాలు తీరుస్తున్నాయి. గత ఏడాది భారత్లో 3.315 కోట్ల టన్నుల ఎల్పీజీని ప్రజలు వినియోగించారు. హార్మూజ్ గుండా ఇప్పుడు సరకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు తగ్గిపోవడంతో భారత అవసరాలను కొంతమేరకు అమెరికా, అర్జెంటీనాలు తీరుస్తున్నాయి. 485 మంది నావికులతో భారతీయ జెండాతో 18 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయని భారత అధికారులు వెల్లడించారు. -
ఈ నేరగాళ్లను గుర్తుంచుకోండి
టెహ్రాన్: అమెరికా దాడుల్లో ఓ ప్రాథమిక పాఠశాలలో 168 చిన్నారుల మరణాలకు కారకులైన ఆ దేశ అధికారుల ఫొటోలను ఇరాన్ ఆదివారం విడుదలచేసింది. ‘‘ఈ నేరగాళ్లను గుర్తించుకోండి. వీరి పేర్లు యూఎస్ఎస్ స్ప్రుయన్స్ యుద్ధనౌక కమాండర్ లీగ్ ఆర్ టేట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఇ.యార్క్. పాఠశాలపై తోమహాక్ క్షిపణులు ప్రయోగానికి ఆదేశాలిచ్చింది వీళ్లే’’ అంటూ భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఆదివారం ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ‘‘ఇంతటి దారుణానికి పాల్పడ్డాక కూడా వాళ్లు ప్రశాంతంగా ఎలా నిద్రపోయారో.బాధితుల కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం వారికుందా?’’ అని నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రశ్నించింది. మినాబ్లోని షజారాహ్ తయ్యబే స్కూల్పై జరిగిన ఆ దాడితో తమకు సంబంధం లేదని అమెరికా బుకాయించినా తర్వాత తన తప్పిదాన్ని ఒప్పుకుంది. ‘‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) స్థావరంపై దాడి చేయాలనుకున్నాం. కాలం చెల్లిన నిఘా మ్యాప్ల వల్ల పాఠశాల భవనాన్ని సైనిక స్థావరంగా భావించి పొరపాటున బాంబులేశాం’’ అంటూ తీరిగ్గా చింతించింది! -
ఆకాశంలో కమాండ్ సెంటర్!
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో ‘ఇ–3సీ సెంట్రీ’ అవాక్స్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేయడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బే! ఎందుకంటే దాని ప్రత్యేకతలు అలాంటివి. ఇది నిఘా, పర్యవేక్షణ, కమాండ్ బాధ్యతలను ఏకకాలంలో నెరవేర్చగలదు. నావిగేషన్, కమ్యూనికేషన్, కంప్యూటేషన్ సేవలూ అందించగలదు. ఎయిర్బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్)గా పిలుచుకునే ఈ ముందస్తు హెచ్చరికల విమానం గగనతలంలో చక్కర్లు కొట్టే కమాండ్ కేంద్రం! దీని తోకపై ఉండే 30 అడుగుల భారీ రాడార్ డిస్క్ అత్యంత శక్తిమంతమైనది.ఈ విమానం గాల్లో ఏకధాటిగా 9,300 కిలోమీటర్ల ప్రయాణిస్తూ వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధ విమానాలు, క్షిపణుల జాడను పసిగట్టి సెకన్లలో సమాచారం చేరవేస్తుంది. భూ, గగనతల యుద్ధక్షేత్రంలో తాజా పరిస్థితులపై ఇదిచ్చే సమాచారంతోనే సైన్యానికి ఓ స్పష్టత వస్తుంది. దీన్ని సైన్యానికి కళ్లు, చెవులుగా చెప్పవచ్చు! భూ, సముద్రతలాలతో పాటు స్ట్రాటో ఆవరణం నుంచి దూసుకొచ్చే క్షిపణులను కూడా ఈ విమానం పసిగట్టి వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. విమానంలోని 14 కంప్యూటర్ తెరలపై తాజా సమాచారాన్ని గ్రాఫిక్ల రూపంలో చూడొచ్చు.తద్వారా క్షిపణులు, బాంబుల ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం వీలవుతుంది. ఆర్సీ–135 నిఘా విమానాలు, విమాన వాహననౌకలతో ఏకకాంలో సమాచారం పంచుకుంటూ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. బోయింగ్ తమ 707–320బీ విమానాన్ని ఆధునీకరించి ఇ–3సీ సెంట్రీ విమానంగా రూపొందించింది. ఒక్కో విమానం ఖరీదు రూ.6,640 కోట్లు. దశాబ్దాల క్రితం అమెరికా అమ్ములపొదిలో ఇవి 30 దాకా ఉండేవి. వీటి తయారీని బోయింగ్ నిలిపేయడంతో ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. 46 మీటర్ల పొడవైన ఈ విమానం గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. భారీ నిఘా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లు అమర్చిన ఈ విమానం బరువు 1.57 లక్షల కిలోలు. ఇది గరిష్టంగా 29,000 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక భూతల యుద్ధం!
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం భూతలానికి విస్తరించేలా కనిపిస్తోంది. ముఖాముఖి పోరుకు అమెరికా, ఇరాన్ సై అంటే సై అంటున్నాయి. అమెరికా ఇప్పటికే వేలాది మంది జవాన్లను పశ్చిమాసియాకు తరలించింది. 3,500 మంది మెరైన్లు, సైనికులు ఆదివారం గల్ఫ్కు చేరుకున్నారు. ఇరాన్తో ప్రధాన భూభాగంతో పాటు ఖర్గ్ ద్వీపంపై దాడి చేసేంత దూరంలోనే మోహరించారు. పశ్చిమాసియాలో 50 వేల మందికి పైగా అమెరికా సైన్యం ఉన్నట్లు అంచనా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.వీరికి తోడు మరో 10 వేల మంది సైనికులను త్వరలో పశ్చిమసియాకు తరలించాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కు తగ్గడం లేదు. తమపై భూతల దాడులకు దిగితే తిరిగి వెళ్లేది శవాలేనంటూ హెచ్చరించింది. ఇరాన్ మిస్సైల్ లాంచింగ్, గగనతల రక్షణ వ్యవస్థలు, నౌకా మార్గాలను దెబ్బకొట్టి వెన్ను విరవాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్కు ఆర్థికంగా ఆయువుపట్టైన ఖర్గ్ దీవిని దిగ్బంధిస్తే విధి లేక చర్చలకు దిగొస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. ట్రంప్ బెదిరింపులతో సరిపెట్టబోరని, తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉన్నారని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. ఒప్పందానికి ముందుకు రాకపోతే ఇరాన్ పరిస్థితి నరకప్రాయం అవుతుందని హెచ్చరించారు. దుబాయ్లో రెండు స్థావరాలపై దాడులు పశ్చిమాసియా యుద్ధం 30 రోజులకు చేరింది. దాడులు, ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 3 వేల మందికిపైగా మరణించారు. ఆదివారమూ పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. దాడుల్లో అల్ అరబీ టీవీ చానల్ కార్యాలయం ధ్వంసమైంది. ప్రసారాలు ఆగిపోయాయి. ఇజ్రాయెల్పైనా ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్పై కూడా దాడులు కొనసాగించింది. క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి.యెమెన్ హూతీలు ఇరాన్, లెబనాన్ హెజ్»ొల్లాతో కలిసి ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడ్డారు. జోర్డాన్లో అమెరికా ఎయిర్బేస్తోపాటు ఇజ్రాయెల్ కెమికల్ ఫ్యాక్టరీపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. దుబాయ్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపైనా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులకు పాల్పడింది. ఒక స్థావరంలో 400 మంది, మరోదాంట్లో 100 మంది జవాన్లున్నారు. వారిలో చాలామంది దాడిలకు బలైనట్టు ఇరాన్ సైన్యం చెబుతోంది. మృతదేహాలను, క్షతగాత్రులను చేరవేస్తూ అంబులెన్స్లు బిజీగా తిరగాయని పేర్కొంది. అమెరికాకు తీవ్ర నష్టం ఇరాన్ దాడుల్లో అమెరికాకు అనూహ్య నష్టం జరిగింది. సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్పై క్షిపణులు, డ్రోన్ల దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక అవాక్స్ నిఘా విమానంతో పాటు పలు రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. అవాక్స్ విమానాన్ని అమెరికా సైన్యానికి అతిపెద్ద ఆస్తిగా పరిగణిస్తారు. దాడిలో అది పనికిరాకుండా పోయింది. అమెరికాకు ఎంక్యూ–9 డ్రోన్లతో పాటు ఎఫ్–16 యుద్ధ విమానం కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఇజ్రాయెల్ వర్సిటీలు, గల్ఫ్లోని అమెరికా వర్సిటీల శాఖలపైనా దాడులు చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ⇒ కీలకమైన అణు నిరాయు«దీకరణ ఒప్పందం (ఎన్పీటీ) నుంచి తప్పుకోవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు పెట్టింది. అణు శక్తి విషయంలో కొత్తగా అంతర్జాతీయ ఒప్పందం తేవాలని ఇరాన్ కోరుతోంది. ⇒ పశ్చిమాసియాలో శాంతి సాధనే ధ్యేయంగా పాకిస్తాన్లో ఆదివారం కీలక సమావేశం జరిగింది. సౌదీ అరేబియా, ఈజిప్టు, తుర్కియే, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. తాజా పరిస్థితులపై చర్చించారు.మేం వెయిటింగ్ : ఇరాన్ స్పీకర్ తమ భూతలంలోకి అమెరికా సేనల రాక కోసం ఎదురు చూస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ ప్రకటించారు. ‘‘అమెరికా, దాని మిత్రదేశాల సైన్యాన్ని మసి చేస్తాం. ఆ దేశాలను శాశ్వతంగా శిక్షిస్తాం’’ అని హెచ్చరించారు. ఇరాన్ లొంగిపోవాలని అమెరికన్లు కోరుకుంటున్నంత కాలం యుద్ధం కొనసాగుతుందన్నారు. ఇరాన్కు రష్యా సాయం: జెలెన్స్కీసౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి వెనుక రష్యా హస్తముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఎయిర్బేస్కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను రష్యానే అందజేసిందన్నారు. ‘‘అమెరికా స్థావరాలపై దాడులకు రష్యా ముమ్మాటికీ సహరిస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా సమాచారం చేరవేస్తోంది’’ అని చెప్పారు. -
సొర చేపలకు ఆహారంగా అమెరికా సైనికులు?!
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధానికి నెల రోజుల గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాకు ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్ సైన్యం ఆదివారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ప్రధాన కమాండ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహీం జోల్ఫఘారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యాన్ని పర్షియన్ గల్ఫ్లోకి పంపితే వారు ‘సొరచేపలకు ఆహారంగా’ మారతారని హెచ్చరించారు. ఇరాన్ సైనికులు ఈ అవకాశాన్ని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ట్రంప్ను ‘ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస’గా అభివర్ణించారు.అదే సందర్భంలో ట్రంప్ను ‘ప్రపంచ దేశాల మధ్య అత్యంత అసత్యవాది అధ్యక్షుడు’గా పిలుస్తూ, ఆయన నిర్ణయాలు స్థిరంగా లేవని విమర్శించారు. ఒక క్షణం చర్చల గురించి మాట్లాడతారని, వెంటనే యుద్ధం చేయాలని నిర్ణయిస్తారని ధ్వజమెత్తారు. ట్రంప్పై ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ ఒత్తిడి పెంచుతోందన్నారు. ట్రంప్ గత సంబంధాలు, ప్రత్యేకంగా జెఫ్రీ ఎప్స్టిన్ కేసుతో అనుబంధం కారణంగా ఈ ఒత్తిడి మరింత పెరిగిందని ఆరోపించారు.అమెరికా ఇరాన్లో భూతల దాడులకు సిద్ధమవుతోందంటూ పలు నివేదికలు వెలువడ్డాయి. ఖార్గ్ దీవి, హోర్ముజ్ జలసంధి సమీప ప్రాంతాల్లో దాడులు జరపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా తన సైన్యాన్ని వ్యూహాత్మక ప్రదేశాలకు భారీ ఎత్తున తరలిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘలీబాఫ్ కూడా ఇరాన్ సైన్యం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మిసైళ్ళు, వీధి నిరసనలు, హోర్ముజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఈ పరిణామాలు ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఇరాన్ స్పష్టంగా తెలిపినట్లుగా, భూ తల దాడి జరిగితే అది అమెరికాకు ఘోర పరాజయాన్ని తెస్తుందని, పర్షియన్ గల్ఫ్లోని సొరచేపలు అమెరికా సైనికుల కోసం ఎదురుచూస్తున్నాయని పునరుద్ఘాటిస్తోంది. -
ఇరాన్పై యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ
రియాద్: ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధంలో శత్రువుల రాకను ముందుగానే పసిగట్టి అమెరికా సైన్యానికి సమాచారం అందించే ఈ-3 సెంట్రీ ఎయిర్బోర్న్ విమానాన్ని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ విమానాన్ని మార్చి 27న రియాద్కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ క్షిపణి లక్ష్యంగా చేసిందని ది జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడిలో 10–12 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.దాడిలో ధ్వంసమైన విమానం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నష్టం తీవ్రంగా ఉండటంతో, దాన్ని మరమ్మతు చేసి తిరిగి ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అమెరికా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ కమాండ్ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించలేదు.ఈ-3సెంట్రీ ఎయిర్బోర్న్ కేవలం విమానం మాత్రమే కాదు. యుద్ధరంగంలో అమెరికాకు వెన్నెముకలాంటిది. తరచుగా ‘ఎగిరే కమాండ్ సెంటర్’గా వర్ణించబడే ఈ విమానం వందల మైళ్ల మేర గగనతలాన్ని పర్యవేక్షిస్తూ, దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గుర్తించి మిత్ర దళాలకు ముందస్తు సమాచారం అందిస్తుంది. నిఘా నుండి అడ్డుకోవడం వరకు మొత్తం యుద్ధ క్షేత్రాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ స్థావరంపై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘రోరింగ్ లయన్’ వంటి సైనిక ఆపరేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి అనేక సార్లు దాడులు జరిగాయి. ఈ వారం ఆరంభంలో జరిగిన మరో క్షిపణి దాడిలో 14 మంది గాయపడ్డారు. ఈ-3 సెంట్రీ ఎయిర్బోర్న్ ధ్వంసం కావడం చాలా పెద్ద విషయం అని మాజీ అమెరికా వైమానిక దళ కల్నల్ జాన్ జేవీ వెనబుల్ వ్యాఖ్యానించారు. ‘గల్ఫ్ ప్రాంతంలో ఏం జరుగుతుందో గమనించే సామర్థ్యానికి, అలాగే అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండే వీలుకు ఇది విఘాతం కలిగిస్తుంది’అని ఆయన పేర్కొన్నారు. 🚨 JUST IN: 🇮🇷🇺🇸Reports suggest a U.S. Air Force aircraft may have been damaged or destroyed following Iranian strikes at Prince Sultan Air Base in Saudi Arabia. pic.twitter.com/8Gigwrq7tx— IranDefenceForce (@IranDefenceForc) March 29, 2026అమెరికా ఖరీదైన విమానాలపై ఇరాన్ దాడులుఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. 21 రోజుల యుద్ధంలో కనీసం 17 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి.కూలిన విమానాల వివరాలుఈ దాడుల్లో ఎఫ్‑35 స్టెల్త్ ఫైటర్, ఎఫ్‑18 జెట్, అలాగే అత్యంత కీలకమైన ఈ‑3 సెంట్రీ అవాక్స్ వంటి విమానాలు ఉన్నాయి. ఇవి అమెరికా వైమానిక దళానికి అత్యంత ఖరీదైన, వ్యూహాత్మక ఆస్తులుగా గుర్తింపు పొందాయి. ధర అంచనాలుఎఫ్‑35 స్టెల్త్ ఫైటర్: ఒక్కో విమానం ధర సుమారు 80–100 మిలియన్ డాలర్లు (రూ.6,600– రూ.8,300 కోట్లు). ఎఫ్‑18 జెట్: ధర సుమారు 60 మిలియన్ డాలర్లు (రూ.5,000 కోట్లు).ఈ‑3 సెంట్రీ అవాక్స్ : అప్గ్రేడ్లతో కలిపి 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు)ఆర్థిక ప్రభావంఈ నష్టాల వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆర్థిక దెబ్బ తగిలింది. ఒక్కో విమానం ధర వందల మిలియన్ల డాలర్లలో ఉండటంతో, మొత్తం నష్టం విలువ విపరీతంగా పెరిగింది. -
‘వారిని తగలబెట్టేందుకు ఎదురుచూస్తున్నాం’
టెహ్రాన్: అమెరికా ఓ వైపు ‘చర్చలు’ జరుపుతున్నామని చెబుతూనే.. రహస్యంగా భూతల దాడులకు ప్రణాళికలు వేస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ అన్నారు. అమెరికా సైన్యం రాకను తిప్పికొట్టేందుకు ఇరాన్ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. “అమెరికా సైనికులు మా భూభాగంపైకి వస్తే వారిని తగలబెట్టేందుకు మా సైనికులు ఎదురుచూస్తున్నారు” అని అన్నారు.కాగా, ఇరాన్లో కొన్ని వారాల పాటు భూతలదాడులు చేసేందుకు పెంటగాన్ సిద్ధమవుతోందని అమెరికా మీడియా తెలిపింది. అమెరికా సైన్యం 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ నుంచి 3,500 సైనికులు పంపిందని చెప్పింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలు వ్యూహాత్మక ప్రణాళికలను మరింత వేగవంతంగా అమలు చేస్తున్నాయి. వైమానిక దాడులు, సముద్రంలో సైనిక మోహరింపులతో ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు భూతల దాడుల వైపు విస్తరించే దిశగా వెళుతోంది.ఇరాన్లోని కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని పెంటగాన్ దాడులు జరిపే అవకాశం ఉంది. అందులో తీర రక్షణ వ్యవస్థలు, చమురు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ పరిణామాలు సైనిక వ్యూహంలో మార్పును సూచిస్తున్నాయి. ఇరాన్పై నేరుగా ఒత్తిడిని పెంచడమే దీని లక్ష్యం.అయితే, భూతల చర్యలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదంపై ఆధారపడుతుంది. ప్రస్తుతం ప్రణాళికలు కొనసాగుతున్నాయని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.ఇరాన్లో భూతల దాడులకు ప్లాన్ నిజమేనా?పెంటగాన్ ఇరాన్ లోపల పరిమిత, లక్ష్యిత భూతల చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చనుందని ఇది సూచిస్తోంది. ఈ చర్యల్లో ప్రత్యేక దళాలు, సాధారణ సైన్యం ఉండే అవకాశం ఉంది.పూర్తిస్థాయి ఆక్రమణ ఇందులో లేదని అధికారులు స్పష్టం చేశారు. అందుకు బదులుగా కచ్చితమైన లక్ష్యాలపై అమెరికా దృష్టి పెట్టింది. నిర్దిష్ట సైనిక లక్ష్యాలను సాధించడమే దీని ఉద్దేశం. ఆయుధ వ్యవస్థలను నిలిపివేయడం లేదా ముఖ్య ప్రదేశాలను స్వాధీనం చేసుకోవడం ఇందులో ఉండవచ్చు. ఇలాంటి చర్యలకు భారీ సన్నాహాలు, సమన్వయం అవసరమని సైనిక నిపుణులు చెబుతున్నారు.హార్మూజ్ జలసంధిపై దాడి చేస్తుందా?హార్మూజ్ జలసంధికి ఉన్న ప్రపంచ వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా అమెరికా సైనిక ప్రణాళికలో ఇది కీలకంగా మారింది. ఈ జలసంధి సమీపంలో ఇరాన్ తీర ప్రాంతాల్లో లక్ష్యిత దాడులు చేయాలని అమెరికా ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం. ఈ దాడుల లక్ష్యం సముద్ర మార్గాలకు ముప్పు కలిగించే ఆయుధ వ్యవస్థలను గుర్తించి ధ్వంసం చేయడం. ప్రమాదాలను తగ్గించేలా ఈ చర్యలు వేగంగా, సమన్వయంతో జరుగుతాయి. -
యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్
-
US స్థావరాలపై ఇరాన్ దాడి? భారీగా ప్రాణనష్టం
-
యుద్ధానికి నెల రోజులు.. ఊహించని మలుపు అగ్నిగుండంగా మిడిల్ ఈస్ట్!
-
వైట్హౌస్ అధికారులకు ఇరాన్ హెచ్చరిక
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ను టార్గెట్ చేసిన యూఎస్ సైన్యం విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాన్లోని విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరాన్ విద్యాసంస్థలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా-ఇజ్రాయెల్ అనుబంధ విశ్వవిద్యాలయాలు సరైన లక్ష్యాలు అవుతాయని వార్నింగ్ ఇచ్చింది.ఈ సందర్భంగా ఐఆర్జీసీ స్పందిస్తూ.. ఇరాన్లో యూనివర్సిటీలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండిస్తున్నాం. దాడులు ఇలాగే కొనసాగితే అమెరికా-ఇజ్రాయెల్ యూనివర్సిటీలు మా లక్ష్యాలుగా మారతాయి. వైట్హౌస్లోని నిర్లక్ష్య పాలకులు ఈ విషయం తెలుసుకోవాలి. అమెరికా, ఇజ్రాయెల్కు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీలు అన్ని లక్ష్యాలుగా పరిగణిస్తామని పేర్కొంది. ప్రతీకార చర్యలలో భాగంగా రెండు యూనివర్సిటీలను ధ్వంసం చేయవచ్చని సూచించింది. విద్యార్థులు, సిబ్బంది, సమీప నివాసితులు ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలని తెలిపింది. ఆ విద్యా సంస్థలపై ప్రతీకార చర్యలు ఉండకూదని కోరుకుంటే అమెరికా ప్రభుత్వం సోమవారం (మార్చి 30) మధ్యాహ్నం లోపు ఇరాన్ విశ్వవిద్యాలయాలపై జరిగిన దాడులను అధికారికంగా ఖండించాలని తెలిపింది.మరోవైపు.. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయేల్ బఖాయి కూడా అమెరికా-ఇజ్రాయెల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, చారిత్రక కట్టడాలు లక్ష్యంగా మారాయి. శాస్త్రవేత్తలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది ఇరాన్ శాస్త్రీయ వ్యవస్థను దెబ్బతీయడానికే చేస్తున్న ప్రయత్నం అని ఆయన ఆరోపించారు. అలాగే, ఇజ్రాయెల్ తన సైన్యంలో ఉన్న బలహీనతలను దాచిపెట్టేందుకు ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఇరాన్ పరిశ్రమలపై దాడులు చేస్తున్నారని అన్నారు. -
భూతల దాడులకు అమెరికా రహస్యంగా ప్రణాళికలు: ఇరాన్
ఇరాన్ యుద్ధంలోకి హౌతీల రాకతో అమెరికా, ఇజ్రాయెల్పై విరుచుకుపడుతున్నాయి. -
రంగంలోకి హూతీలు!
దుబాయ్: పశ్చిమాసియాలో కల్లోలం నానాటికీ విస్తరిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెర తీసి నెల రోజులైనా ఉద్రిక్తతలు చల్లారకపోగా నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇరాన్కు దన్నుగా యెమన్కు చెందిన హూతీలు కూడా యుద్ధరంగంలోకి అడుగు పెట్టారు. దక్షిణ ఇజ్రాయెల్లోని కీలక సైనిక స్థావరాలపై శనివారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగినట్టు ప్రకటించారు. వారికి మద్దతుగా హెజ్బొల్లా ఉగ్ర సంస్థ కూడా ఇజ్రాయెల్పై ఎడాపెడా క్షిపణులు ప్రయోగించింది. దాంతో పరిస్థితి మరింతగా విషమించేలా కన్పిస్తోంది. ఎర్రసముద్రంలో ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్ల మేరకు వాణిజ్యం జరిగే కీలకమైన బాబ్ ఎల్మందెబ్ జలసంధిని కూడా హూతీలు మూసేసే సూచనలు కన్పిస్తున్నాయి.అదే జరిగితే అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన సరఫరా మరింతగా కుదేలవడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులను తీవ్రస్థాయిలో కొనసాగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ఏకంగా 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లు ప్రయోగించింది. దాంతో కనీసం 15 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు వారాల్లో గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 25 దాటింది. మొత్తమ్మీద ఈ యుద్ధంలో క్షతగాత్రులైన వారి సంఖ్య 300 దాటింది. మూడు రీ ఫ్యూయలింగ్ విమానాలతో పాటు అమెరికాకు చెందిన పలు యుద్ద విమానాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నట్టు స్థానిక అధికార వర్గాలు తెలిపాయి.దుబాయ్లో ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న యాంటీ డ్రోన్ సిస్టమ్స్ నిల్వ కేంద్రంపైనా దాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఆ సమయంలో అందులో 20 మంది దాకా ఉక్రేనియన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒమన్ సమీపంలో ఒక అమెరికా నౌకపై కూడా దాడి చేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా సైనికులు తలదాచుకున్నారన్న సమాచారంతో దుబాయ్లో ఒక హోటల్పై కామికాజ్ క్షిపణితో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. కువైట్పై దాడుల్లో పలు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయి.దక్షిణ లెబనాన్లో యుద్ధాన్ని కవర్ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు! యూఏఈలోని ఖలీఫా ఎకనామిక్ జోన్పై ఇరాన్ క్షిపణి దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ కూడా అల్లాడిపోయింది. జెరూసలేం, టెల్ అవీవ్, బీర్ షెబాతో పాటు పలు నగరాల్లో నిర్విరామంగా సైరన్లు మోగాయి. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఎషో్టల్లో కనీసం 11 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 3,500 మంది అమెరికా సైనికులు గల్ఫ్కు చేరుకున్నట్టు సమాచారం! దద్దరిల్లిన టెహ్రాన్ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు శనివారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. పలు ప్రాంతాల్లో మంటలు, పొగ కనిపించాయి. మీనాబ్ నగరంలో ఒక క్లినిక్పై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ప్రాణనష్టమేమీ సంభవించలేదని స మాచారం. తమ దేశంలో మృతుల సంఖ్య 1,900 దాటినట్టు ఇరాన్ పేర్కొంది. లెబనాన్లో 1,100కు పైగా, ఇజ్రాయెల్లో 19 మంది, గల్ఫ్ దేశాల్లో 20 మంది మరణించారు. లెబనాన్లోనూ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా క్షిపణి దాడుల్లో కనీసం 9 మంది సైనికులు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వారి్నంగ్ యుద్ధం ఆగి శాంతి నెలకొనాలంటే గల్ఫ్ దేశాలు తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్పై దాడులకు వారి గగనతలాలను వాడుకునేందుకు అమెరికాను అనుమతించరాదన్నారు. శత్రువుకు సహకరించేవారిని వదలబోమని పునరుద్ఘాటించారు. భూతల దాడులకు అమెరికా 10 వేల సైన్యాన్ని పంపుతోందన్న వార్తలపై ఇరాన్ మీడియా వ్యంగ్యంగా స్పందించింది. ‘నరకానికి స్వాగతం’ అనే శీర్షికలతో దీనిపై వార్తలు ప్రచురించింది. ఇరాన్ గడ్డపై అడుగు పెట్టే ప్రతి అమెరికా సైనికుడూ శవపేటికలోకి చేరడం ఖాయమని హెచ్చరించింది. మరోవైపు ఇంధన సంక్షోభం ఇరాన్కు వరంగా మారుతోంది. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశం రోజుకు ఏకంగా రూ.1,319 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభనఇరాన్తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా పరిస్థితిలో మాత్రం పెద్దగా పురోగతి కన్పించడం లేదు. చర్చల విషయంలో అమెరికా చిత్తశుద్ధిపై తమకు నమ్మకం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం కుండబద్దలు కొట్టారు! ఈ నేపథ్యంలో యుద్ధానికి తెర దించే మార్గాలను అన్వేషించేందుకు పలు గల్ఫ్ దేశాల నడుమ ఆదివారం కీలక సమావేశం జరగనుంది.ఇందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానుంది. మరోవైపు ఐరాస విజ్ఞప్తి మేరకు హార్మూజ్ గుండా మానవీయ సాయం, వ్యవసాయోత్పత్తులతో కూడిన నౌకలను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. హార్మూజ్ను తెరిచేందుకు ఆ దేశానికి విధించిన డెడ్లైన్ను ఏప్రిల్ 6 దాకా ట్రంప్ పొడిగించడం తెలిసిందే. ఇరాన్పై దాడి ద్వారా తాము ఆశించిన లక్ష్యాలను భూతల దాడులతో నిమిత్తం లేకుండానే సాధిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధీమా వెలిబుచ్చారు. -
సూపర్ ‘పవర్గేమ్’లో భారత్ డైలమా!
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు. గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై హఠాత్తుగా ఇజ్రాయె ల్తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది. అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.డాలర్కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్లో పెనుమంటలు చెలరేగవచ్చు. దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది. ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మా ఆశ, శ్వాస... అణ్వస్త్రమే!
అమెరికా-ఇజ్రాయెల్ కలసికట్టుగా తనపై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకు వీలు కల్పించే ఓ ‘ఫాస్ట్ ట్రాక్’ బిల్లును ఇరాన్ పార్లమెంటు చురుగ్గా పరిశీలిస్తోంది. ఎన్పీటీకి బైబై చెప్పే పక్షంలో ఇరాన్ అణు విధానంలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయి. అణుబాంబు ఇరాన్ వద్ద గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. అయినా ఎన్పీటీపై ఇరాన్ 1968 జులైలో సంతకం చేసింది. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనంటూ ఓ అణ్వస్త్రరహిత దేశంగా అది 1970 ఫిబ్రవరిలో ఆ ఒప్పందాన్ని ధృవీకరించింది కూడా. 1967 జనవరి 1 నాటికి అణ్వస్త్రాలను పరీక్షించిన ఐదు దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలను ఈ ఒప్పందం అణ్వస్త్ర దేశాలుగా గుర్తించింది. ఆ ఐదు దేశాలు క్రమంగా నిరాయుధం కావాలని, ఇతర అణ్వస్త్రరహిత దేశాలు అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని లేదా వాటిని సేకరించకూడదని ఎన్పీటీ ఉద్బోధిస్తోంది. ఈ ఒడంబడిక వివక్షాపూరితమని విమర్శకులు వాదిస్తారు. ఎన్పీటీలో 191 దేశాలు పార్టీలుగా ఉన్నాయి. ఆయుధ నియంత్రణలో ఈ ఒప్పందానికి విస్తృత ప్రాముఖ్యం ఉంది. విశేషమేంటంటే... అణ్వాయుధాలు కలిగిన భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఎన్పీటీలో భాగస్వాములు కాదు. భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, దక్షిణ సూడాన్ ఎన్నడూ ‘ఎన్పీటీ కూటమి’లో సభ్యదేశాలుగా చేరనేలేదు. ఉత్తర కొరియా మాత్రం 1985లో సభ్యత్వం స్వీకరించినా 2003లో నిష్క్రమించింది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ప్రోత్సహించడానికి, అణ్వాయుధాల విస్తరణను అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అతి ముఖ్యమైన ఒప్పందాల్లో ఎన్పీటీ ఒకటి. దీని ప్రకారం ఇరాన్ ప్రస్తుతం అణు పారదర్శకత, కఠిన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఎన్పీటీకి ఇరాన్ చెల్లుచీటీ ఇచ్చే పక్షంలో ఆ పరిణామం ప్రపంచ అణు రాజకీయాల్లో ఓ ప్రధాన మలుపు అవుతుంది. ఎన్పీటీ నుంచి బయటికొచ్చేస్తే అణు కార్యక్రమం పరంగా పలు కీలక బాధ్యతల నుంచి ఇరాన్ విముక్తమవుతుంది. అప్పుడిక అణ్వాయుధం తయారుచేయబోమని అది ఎవరికీ ప్రమాణాలు చేయాల్సిన పని లేదు. అంతేకాదు... ఇరాన్ అణుకేంద్రాలపై ఐక్యరాజ్యసమితి కాపలాదారైన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణ, నిపుణుల తనిఖీలు కూడా ఉండబోవు! అంటే... ఇరాన్ అణు కార్యకలాపాలు ఇకపై అంతగా ప్రపంచ దేశాల కంటబడవు. అసాధారణ పరిణామాలు తమ మహోన్నత జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడవేశాయని ఏ దేశమైనా భావించినప్పుడు మూడు నెలలు ముందుగా నోటీసు ఇచ్చి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి తప్పుకోవడానికి ఎన్పీటీలోని ‘ఉపసంహరణ క్లాజు’ వీలు కల్పిస్తోంది. ఒప్పందంలో 11 ఆర్టికల్స్ ఉండగా వాటిలో ఒకటి సభ్యత్వ ఉపసంహరణ గురించి వివరిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ఆరంభమైన గత నెల 28 నుంచి ఇరాన్ పార్లమెంటు ఇప్పటివరకు సమావేశమవలేదు. ఎన్పీటీ ‘ఉపసంహరణ బిల్లు’ను పార్లమెంటుకు సమర్పించారని ఇరాన్ ఎంపీ మాలిక్ షరియతి తాజాగా వెల్లడించారు. అయితే ఆ బిల్లుపై ఎప్పుడు లాంఛనంగా చర్చిస్తారు? అది ఎప్పుడు ఆమోదం పొందుతుంది? వంటి అంశాలపై అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా నిరోధించాలంటే అణ్వాయుధాలు కలిగివుండటం అవసరమా? అనే అంశంపై ఇరాన్ అంతర్గతంగా చర్చించింది. తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ అనూహ్య దాడులు చేసిన నేపథ్యంలో ఆ దేశంతో సైనిక ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నందున ఎన్పీటీ నుంచి వైదొలగాలని ఇరాన్ నిరుడే భావించింది. ఒకవైపు పౌర అణు కార్యక్రమానికి కట్టుబడుతూనే సాధ్యమైనంత త్వరగా ఎన్పీటీ నుంచి ఇరాన్ తప్పుకోవాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) అనుబంధ తస్నిమ్ వార్తాసంస్థ గురువారం ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్పీటీకి ఇరాన్ టాటా చెబితే అందరికీ అర్థమయ్యేదొకటే... ఆ దేశానికి అణుబాంబే ముఖ్యమని! అణ్వస్త్రాన్ని తయారుచేయడమే దాని లక్ష్యమని!!- జమ్ముల శ్రీకాంత్ -
అలా చేస్తేనే.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: శాంతి కావాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనని గల్ప్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ గగనతలాలను యూఎస్, ఇజ్రాయెల్ వినియోగించుకోకుండా నిషేధం విధించాలని.. తాము చెప్పినట్టు చేస్తేనే గల్ఫ్పై దాడులు ఆపుతామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. తమ దేశాల్లో అభివృద్ధి, భద్రతను కోరుకుంటే.. ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా-ఇజ్రాయెల్లు తమ భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. టెహ్రాన్లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా-ఇజ్రాయెల్లపై ఇరాన్ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.ఇరాన్ ముందస్తు దాడులు చేయదని మేము చాలాసార్లు చెప్పాం. కానీ మా మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మేము గట్టిగా సమాధానం ఇస్తాం. గల్ఫ్ దేశాలకు నేను చెప్పేది ఒక్కటే.. మీకు అభివృద్ధి, భద్రత కావాలంటే మా శత్రువులను మీ గడ్డల నుండి యుద్ధం చేయనివ్వకండి’’ అంటూ పెజెష్కియాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య దుబాయ్లోని రెండు అమెరికా సైనిక "దాగుడు స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' నివేదించింది.మరోవైపు, హార్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్ను దాటినట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి. ఇరాన్ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్లకు కూడా ఇలాగే ఇరాన్ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్ ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే. -
ఇరాన్ సరిహద్దులకు 17 వేల మంది అమెరికా సైనికులు
-
పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ.. సామాన్య ప్రజలు, రైతులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.‘‘నోయిడాలో సెమీ కండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనం. జేవర్ ఎయిర్పోర్ట్ ఉత్తర భారతాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తుంది. ప్రతి రెండు నిముషాలకు ఒక విమానం ఎగురుతుంది. గత యూపీఏ ప్రభుత్వం యూపీని దోచుకుంది. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్పోర్ట్ ఫైళ్లకి మాత్రమే పరిమితమైంది. యూపీలో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చింది’’ అని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.రైతులు పండించే పంటలు, ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలకు చేరుతాయి. అంధ విశ్వాసాలతో నోయిడాను పక్కన పడేశారు. ఎస్పీ హయాంలో ముఖ్యమంత్రి నోయిడా వచ్చే దైర్యం చేయలేదు. నోయిడా ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. రైతుల వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందంటూ తెలిపారు. -
తరుగుతున్న రక్షణ నిల్వలు ప్రమాదంలో ఇజ్రాయెల్
-
సౌదీపై భీకర దాడి.. 10 మంది అమెరికా సైనికులు..
-
యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదు
-
యుద్దంలో భారీ ట్విస్ట్.. హౌతీల సంచలన ప్రకటన
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో -
ఇరాన్ మిస్సైల్ పై థాంక్యూ ఇండియా
-
ఇరాన్ అణుక్షేత్రాలపై దాడి
దుబాయ్: పశ్చిమాసియా సంక్షోభానికి తెర దించే చర్చల విషయంలో సందిగ్ధత, ప్రతిష్టంభన యథాతథంగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ గడువు శుక్రవారంతో ముగిసింది. దాన్ని మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. ఇరాన్ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పడం విశేషం! ‘‘ఏప్రిల్ 6 నాటికి హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిస్థాయిలో తెరవాల్సిందే. లేదంటే ఆ దేశ ఇంధన క్షేత్రాలన్నింటినీ సర్వనాశనం చేస్తా’’ అంటూ హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు నిర్నిరోధంగా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఇరుపక్షాలు ముమ్మరంగా దాడులు చేసుకున్నాయి.ఇరాన్లోని యజ్ద్ ప్రావిన్స్లో అర్డకాన్ యురేనియం ప్రాసెసింగ్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది! సెంట్రల్ ఇరాన్లోని ఒక భార జల కేంద్రంపై కూడా దాడులు చేసింది. దాడులను మరింతగా విస్తరిస్తామని కూడా ప్రకటించింది. మరోవైపు 2,500 మంది మరైన్లు, 1,000 మంది పారా ట్రూపర్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకలు గల్ఫ్కు చేరువవుతున్నాయి. ఇంకో 10 వేల మంది సైనికులను గల్ఫ్కు తరలించాలని ట్రంప్ నిర్ణయించినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నడుమ చర్చల ప్రక్రియను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు టర్కీ, పాకిస్తాన్తో చర్చించినట్టు ఈజిప్టు పేర్కొంది. గల్ఫ్లో దాడుల మోత ఇరాన్లోని ఆయుధోత్పత్తి, నిల్వ కేంద్రాలే లక్ష్యాలుగా శుక్రవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్లోని పలు ప్రాంతాలు బాంబులతో దద్దరిల్లిపోయాయి. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి ఉత్పత్తి కేంద్రాలతో పాటు మరిన్ని ప్రాంతాలకు దాడులను విస్తారిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ పెద్ద పెట్టున దాడులు చేసింది. శుక్రవారం వేలాది మంది సైనికులను ఆ దేశంలోకి తరలించింది. లితానీ నదికి దక్షిణాన ఉన్న భూభాగం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుంటాని ప్రకటించింది! బీరూట్లో పలు ప్రాంతాల్లో భీకర దాడులు జరిగాయి. ఎటు చూసినా అగ్నికీలలు, పొగ కన్పించాయి. దాడులకు ఇద్దరు పౌరులు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ నగరాలు సైరన్ మోతలతో ప్రతిధ్వనించాయి. జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీస్తూ కన్పించారు. గల్ఫ్లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు, లక్ష్యాలపైనా ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. అష్దోద్లోని చమురు నిల్వ కేంద్రాలు, మొదీన్లోని సైనిక స్థావరాలతో పాటు అమెరికాకు చెందిన అల్ దాఫ్రా, అల్ ఉదెయ్రీ, అలీ అల్ సలేం ఎయిర్ బేస్, షేక్ ఇసా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కువైట్ సిటీలోని షువైక్ రేవు, ఉత్తరాన ముబారక్ అల్ కబీర్ రేవుపై దాడి జరిగినట్టు కువైట్ తెలిపింది. అల్ కబీర్ చైనా సహకారంతో నిర్మిస్తున్న రేవు కావడం విశేషం. మరోవైపు ఇరాన్కు మిత్ర దేశం రష్యా 313 టన్నుల మేరకు ఔషధ నిల్వలను పంపింది.హార్మూజ్ వద్ద ‘అధికారిక’ంగా టోల్!త్వరలో చట్టం చేసే యోచనలో ఇరాన్హార్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్ను దాటినట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి. క్షిపణులపై ‘థాంక్యూ ఇండియా’ఇజ్రాయెల్పై ప్రయోగించిన ఇరాన్ ఇరాన్ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్లకు కూడా ఇలాగే ఇరాన్ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్ ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే. ఇరాన్కు దన్నుగా జమ్మూ కశ్మీర్ వాసులు నగదు మొదలుకుని నగల దాకా పలురకాలైన మానవతా సాయాన్ని విరాళాల రూపంలో సేకరించి పంపడం తెలిసిందే.ఎఫ్బీఐ చీఫ్ ఈ మెయిల్ హ్యాకింగ్తమ పనేనన్న ఇరాన్ అనుకూల గ్రూపు వాషింగ్టన్: ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ మెయిల్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది. ఇది తమ పనేనని హందాలా అనే ఇరాన్ అనుకూల హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. అందులోని రెజ్యుమేతో పాటు పలు వ్యక్తిగత డాక్యుమెంట్లతో పాటు కాష్ పటేల్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అవన్నీ కనీసం పదేళ్ల నాటివిగా కనిపిస్తున్నాయి. హ్యాకింగ్ను ఎఫ్బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. -
పాక్కు షాకిచ్చిన ఇరాన్.. చమురు నౌకపై బాంబుల దాడి
పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. టెహ్రాన్ అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధి దాటుతున్న పాక్కు చెందిన చమురు షిప్ను పేల్చేసింది. యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాక్ బీరాలు పలుకుతున్న వేళ ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.పశ్చిమాసియా యుద్ధం ఇంతట్లో శాంతించేలా లేదు. ఇరాన్ చర్చలకు ఎట్టి ససేమిరా అంటూ దాడులకు తెగబడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మంత్రం జపించినా టెహ్రాన్ శాంతించడం లేదు. ఓ వైపు ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. అమెరికా ఆర్మీ సైతం తమ దేశంలో దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.తాజాగా పాకిస్థాన్కు చెందిన ఓ చమురు నౌకను ఇరాన్ ధ్వంసం చేసింది. దుబాయ్, అబుదాబీ సముద్ర తీరంలో ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెండురోజుల క్రితం హర్మూజ్లో పాకిస్థాన్ నౌకను ఇరాన్ అడ్డుకోవడం తెలిసిందే. అనుమతి లేకుండా నౌక జల సంధి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతోదానిని అడ్డుకున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. తాజాగా పాక్కు చెందిన మరో చమురు నౌకపై దాడి చేసి ధ్వంసం చేసింది. అయితే ఇరాన్తో తమకు సత్సంబంధాలున్నాయని యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశానికి చెందిన నౌకపైనే దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తోందో తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్కు చెందిన నౌకలకు ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటడానికి అనుమతిస్తోంది.🚨🚨 Just in Breaking 🇵🇰 Iran destroys Pakistan oil tanker that attempted to pass through the Strait of Hormuz without permission.....See more pic.twitter.com/kvYfaniJeJ— INN Iran National News (@INNewx) March 27, 2026 -
‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. ఇజ్రాయెల్పైకి..
టెహ్రాన్: ‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. వాటిని ఇజ్రాయెల్పైకి వదిలింది ఇరాన్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా ప్రెస్ టీవీతో పాటు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పోస్ట్ చేశాయి. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ సిబ్బంది క్షిపణులపై బ్లూ మార్కర్లతో “భారత ప్రజలకు ధన్యవాదాలు” వంటి వాక్యాలు రాస్తున్నట్లు కనిపించింది. స్పెయిన్, పాకిస్థాన్, జర్మనీ ప్రజలకు కూడా థ్యాంక్స్ చెబుతూ ఇలాంటి సందేశాలే రాసినట్లు సమాచారం. ఇరాన్కు అనుకూలంగా ఉన్న దేశాలకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.దీన్ని “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4”లో భాగంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన చర్యగా ఇరాన్ నెట్వర్క్ ప్రెస్ టీవీ తెలిపింది. పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలపై దాడులు చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఇందులో అష్డోడ్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, మోడీన్ సమీపంలోని సైనిక స్థావరాలు, అమెరికా సైనిక సమాచార మార్పిడి కేంద్రం ఉన్నట్లు ప్రెస్ టీవీ తెలిపింది.అల్-ధఫ్రా, అల్-ఉదైరి ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలు, అలాగే అలీ అల్-సలేం ఎయిర్ బేస్, షేఖ్ ఈసా బేస్లపై దాడులు జరిగాయని పేర్కొంది. ఇరాన్, దీర్ఘ శ్రేణి, మధ్య శ్రేణి క్షిపణులు, డ్రోన్లను వినియోగించిందని, ఆపరేషన్ విజయవంతమైందని తెలిపింది.భారత్కు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు?భారత్-ఇరాన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇరాన్ తాజాగా, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో, అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భారత్ను స్నేహపూర్వక దేశంగా పేర్కొని, యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత నౌకలను అడ్డుకోబోమని చెప్పారు.మరొక కారణం ఏంటంటే, భారత ప్రజల నుంచి ఇరాన్కు మానవతా సాయం అందింది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతం నుంచి. జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇరాన్కు సాయం అందించేందుకు విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. నగదు, ఆభరణాలు, గృహ సంబంధిత వస్తువులు వంటి సాయం అందించారు. ఒక కశ్మీరీ మహిళ తన భర్త జ్ఞాపకంగా దాదాపు 3 దశాబ్దాలుగా దాచుకున్న బంగారాన్ని ఇచ్చేసింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ చర్యలను గుర్తించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోమని పేర్కొంది. Iran launches WAVE 83 missile AND drone attack on ‘Zionist soldiers’ — IRIBTHANK YOUS written on missiles in English to people across globe pic.twitter.com/wjjVietkAo— RT (@RT_com) March 26, 2026 -
చంపే లిస్ట్లోనుంచి వారిని తీసేసిన అమెరికా -ఇజ్రాయెల్!
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై కాలుదువ్విన సంగతి తెలిసిందే. అయితే మూడు వారాల యుద్ధం తర్వాత ఈ యుద్దం నుంచి అమెరికా కాస్త విరామం తీసుకుంది. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని, అందుకే యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల క్రితం ప్రకటించారు .అదే సమయంలో పశ్చిమాసియాలో శాంతి స్థాపన లక్ష్యం అంటూ యూటర్న్ తీసుకున్నారు ట్రంప్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్- ఇరాన్ల యుద్ధమైతే ఆగలేదు. ట్రంప్ ప్రకటనతో అమెరికా వెనక్కి తగ్గినా, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అయితే ట్రంప్ను నమ్మడానికి వీలు లేదనే ఇరాన్ ప్రకటనను కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే అమెరికా దాడులు చేయకుండా ఆగిపోయి, ఇజ్రాయెల్తో యుద్ధం చేయిస్తుందనే వాదన ఒకటి తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంచితే, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధరీతిలో భాగంగా వారి హిట్ లిస్ట్లో నుంచి ఇద్దరు ఇరాన్ కీలక నేతల పేర్లను తొలగించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీతో పాటు పలువురు కీలన నేతలను, అధికారులను చంపేసిన ఆ ఇరు దేశాలు.. ఇప్పుడు తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్సాస్ అరగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘలిబాఫ్ పేర్లను హిట్ లిస్ట్ నుంచి తొలగించింది. ఇవే కారణాలు..వారిని అమెరికా-ఇజ్రాయెల్ హిట్ లిస్టులో నుంచి తొలగించడానికి కారణాలు లేకపోలేదు. ఒకవైపు ఇరాన్తో చర్చలు అంటున్న అమెరికా.. ఇంకా మిగిలి ఉన్న ఇరాన్ నేతలను కూడా చంపేస్తే ఎవరితో చర్చలు జరుపుతారు అనే చర్చ వచ్చింది. ఇరాన్లోఅబ్బాస్ అరగ్చీతో పాటు స్పీకర్ ఘలిబాఫ్లు ప్రస్తుతం కీలక నేతలు. ఒకవైపు చర్చలు అంటూ వారి పేర్లను ఇంకా హిట్ లిస్ట్లోనే ఉంచితే తప్పుడు సంకేతం అవుతుందని వారి పేర్లను ఇజ్రాయెల్ తొలగించింది. అమెరికా ఆదేశాలతో వారి పేర్లను హిట్ లిస్ట్ జాబితా నుంచి తీసేసింది. పాక్ రాయబారం..!ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. పాకిస్తాన్ ఆయా దేశాల మధ్య రాయబారం నడుపుతుంది. ఇరాన్తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్.. అందుకు పాక్ను ఎన్నుకున్నారు. ఇరాన్ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్.. ఇక పాక్ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్లో ట్రంప్ పడ్డారని, అందుకే ఇరాన్పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. ఆ క్రమంలోనే ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పేశారు. కానీ ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదని, తమతో ఎవరూ చర్చలకు రాలేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ను తెరపైకి తీసుకొచ్చింది అమెరికా. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించే క్రమంలో ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్న అరగ్చీ, ఘలిబాఫ్ల పేర్లను తీసేయమని అమెరికాకు విజ్ఞప్తి చేసింది.ఇరాన్.. పాక్ మాట వింటుందా..?ప్రస్తుతం ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్ మాట.. ఇరాన్ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనే చర్చ మొదలైంది. ఒకవేళ ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. మరి ఆ విషయంలో అమెరికాను పాక్ ఎలా ఒప్పిస్తుందనేది మరొక ప్రశ్న. ప్రస్తుతానికి హిట్ లిస్టులో నుంచి వారి పేర్లను తొలగించారు కానీ చర్చలు సఫలం కాకపోతే మాత్రం మరొకసారి తీవ్రస్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంటున్న సమయంలో మరి పరిస్థితి ఎటుపోతుందో అనే భయం కూడా ప్రపంచ దేశాల్లో ఉంది. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో వార్నింగ్..!
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాస్త విరామం ఇచ్చినా, ఇజ్రాయెల్-ఇరాన్ల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చమురు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంటే, ఇరాన్ సైతం అంతే ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా నేవీ బేస్లను పలు గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దేశాలపై దాడులకు దిగిన ఇరాన్.. మరోసారి వారిని హెచ్చరించింది. తమతో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, అవి మానుకోవాలని సూచించింది. ఒకవేళ అలా కాకుండా తమపై దాడి చేసే వారికి మీ(గల్ఫ్ దేశాల్లోని) హోటళ్లలో ఉండేందుకు అవకాశం కల్పిస్తే మాత్రం మరోసారి తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్పై దాడి చేసిన స్థావరాలను విడిచిపెట్టిన చాలా మంది అమెరికా సైనికులు, ఐరోపా అంతటా ఉన్న హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లి, దూరంగా ఉంటూనే యుద్ధంలో పాల్గొంటున్నారని మాకు సమాచారం ఉంది. మేం వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాం. ముందుగానే మీకు చెబుతున్నాం. అమెరికా సైనికులకు గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వొద్దు. కాని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఇరాన్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంచితే,. ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేసింది. ఇరాన్ ప్రధాన నావికా క్షిపణి, సముద్ర మైన్ల తయారీ కేంద్రంతో పాటు బాలిస్టిక్ క్షిపణి, వాయు రక్షణ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అదే సమయంలో ఇరాన్ సైతం దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ఇజ్రాయెల్ వాయు రక్షణ దళం సమర్థవంతంగా అడ్డుకుంది. -
ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు
-
ఇరాన్కి మద్దుతుగా జేకేఎన్సీ ఎమ్మెల్యేల ఆందోళన
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇరాన్కి మద్దుతుగా నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా జేఎన్ఎన్కే ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ లోపల, బయట కూడా నిరసనలు చేపట్టారు.జేకేఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇరాన్కు అండగా నిలుస్తుందని,.. ఈ దాడులను ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గతంలోనే అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించారు. ఇరాన్కు మేమంతా అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ఖమేనీ హత్య అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన.. ఒక సార్వభౌమ దేశంపై మరో దేశం ఇలాంటి చర్యలకు పాల్పడకూడదంటూ సాదిక్ నొక్కి చెప్పారు.‘‘అంతకుముందు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణను ఖండించారు. సైనిక బలంతో పాలన మార్పును సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి.. బాహ్య జోక్యం ఉండకూడదు. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల హత్యను నేను ఖండిస్తున్నాను. ఇలా చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్లకు ఏ చట్టం అధికారం ఇచ్చింది’’ అంటూ ఆయన ప్రశ్నించారు.J-K: National Conference MLAs protest in assembly, express solidarity with Iran over killing of Ayatollah Ali KhameneiRead @ANI Story |https://t.co/RphI1lVvvm#JammuKashmirAssembly #Khamenei #protest #NationalConference #JKNC pic.twitter.com/FTZOaZy5ML— ANI Digital (@ani_digital) March 27, 2026 -
పట్టు బిగించిన ఇరాన్.. ఇక భీకర యుద్ధమే
-
అమెరికాకు నరకం అంటే ఏంటో చూపిస్తాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సమీకరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా మిలియన్కు పైగా యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ఇదే సమయంలో, ఇరాన్ అణు విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే అణు ప్రతిస్పందన కూడా పరిశీలిస్తామని అమెరికాకు హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నీమ్.. ‘ఇరాన్లో లక్ష మందికిపైగా అమెరికాతో భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. బసిజ్, ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్, ఆర్మీ నిర్వహిస్తున్న కేంద్రాల్లో యువకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. అమెరికా సైన్యం ఇరాన్ నేలపై అడుగుపెడితే వారికి నరకం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.’ అని నివేదించింది. అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సమీకరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా మిలియన్కు పైగా యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. ఇదే సమయంలో, ఇరాన్ అణు విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే అణు ప్రతిస్పందన కూడా పరిశీలిస్తామని హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వ పాలనపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పట్టు సాధించింది.ఈ క్రమంలో ఇరాన్లో అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో దేశం తన న్యూక్లియర్ విధానాన్ని కఠినతరం చేయాలని ఐఆర్జీసీలోని ప్రముఖులు బహిరంగంగా ఒత్తిడి పెంచుతున్నారు. అధికారికంగా ఇరాన్ ఇంకా అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం లేదని చెబుతున్నప్పటికీ.. ఇరాన్లోని రాజకీయ, సైనిక వర్గాల్లో అణ్వస్త్రాల వైపు వెళ్లాలా? అనే ప్రశ్న ఇప్పటివరకు లేనంతగా బలంగా, బహిరంగంగా చర్చకు వస్తోంది. అంటే అణు విధానంలో కఠిన మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని తస్నీమ్ తెలిపింది. అమెరికా సైనిక కదలికలుఅమెరికా 82వ ఎయిర్బోర్న్ డివిజన్ దళాలు త్వరలో పశ్చిమాసియా భూభాగంలోకి అడుగు పెట్టనున్నాయి. ఇప్పటికే వేలాది మంది సైనికులు మెరైన్లతో అక్కడికి చేరారు. ఈ కదలికలు ఇరు దేశాల మధ్య భూతల దాడులు సంభవించే అవకాశాలను మరింత బలపరుస్తున్నాయి.ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించేలా ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ ఖండించింది. అమెరికా సైన్యం ఇరాన్ నేలపై అడుగుపెడితే తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. -
పశ్చిమాసియాలో ఇక భీకర యుద్ధమే.. చర్చలపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిష్టంభన... హార్మూజ్పై పట్టు బిగించిన ఇరాన్
-
250 మంది విద్యార్థులు, టీచర్లు మృతి: ఇరాన్
పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. -
గల్ఫ్ దేశాలకు మరో టెన్షన్.. ఇరాన్ అలా చేస్తే మాత్రం..!
తీర ప్రాంతాల్లోని నిర్లవణీకరణ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తే గల్ఫ్ దేశాల గొంతెండిపోతుంది. సముద్ర జలాల్లోని ఉప్పును తొలగించి, శుద్ధ జలంగా మార్చే ప్లాంట్లు ఇవి. ఈ నెల మొదట్లో బహ్రెయిన్ దేశంలోని ‘ముహార్రక్’పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ డీశాలినేషన్ ప్లాంటు దెబ్బతింది. దైనందిన తాగునీటి అవసరాల కోసం గల్ఫ్ దేశాలు ప్రధానంగా ఈ నిర్లవణీకరణ కేంద్రాలపై ఆధారపడుతున్నాయి. ఈ ప్లాంట్ల నిర్వహణ ఇప్పుడు భద్రతాపరమైన అంశంగా మారింది.నిర్లవణీకరణ జలాన్ని ప్రపంచంలో అధికంగా వినియోగిస్తున్నది గల్ఫ్ దేశాలే. వీటి తీరప్రాంతాల్లో వందలాది డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. కువైట్ ప్రాంతంలో 90 శాతం తాగునీరు ఇదే. తీర నగరాలు, విద్యుత్కేంద్రాలు, పారిశ్రామిక హబ్స్ వద్ద ఈ డీశాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇదిప్పుడు వాటి బలహీనతగా, ఇరాన్ ఆయుధంగా మారుతోంది. నిర్లవణీకరణ కేంద్రాల్ని లక్ష్యాలుగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరికలు పంపుతోంది.విద్యుత్ సరఫరాతోనే డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తాయి. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తే అవి మూతపడతాయి. ఉద్రిక్తతలు పెరిగితే డీశాలినేషన్ ప్లాంట్లు, విద్యుత్కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తుందేమోనని, అప్పుడిక గృహావసరాలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు నీరు అందదేమోనని గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఇది వాటి ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగించే పరిణామమే. అయితే ఈ రిస్క్ అన్ని గల్ఫ్ దేశాలకు ఒకేలా లేదు. మిగతా వాటితో పోలిస్తే సౌదీ, ఖతార్, యూఏఈల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.- జమ్ముల శ్రీకాంత్ Sources: SANA (Syrian Arab News Agency), Gulf News -
ఇరాన్ కు ట్రంప్ ఆఫర్
-
ఇరాన్ సుప్రీం లీడర్గా డొనాల్డ్ ట్రంప్?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్కి సుప్రీం లీడర్గా ప్రతిపాదించిందని, కానీ తాను తిరస్కరించానని ఆయన వెల్లడించారు. తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో కొత్త చర్చలకు దారితీశాయి.వాషింగ్టన్లో జరిగిన రిపబ్లికన్ ఫండ్రైజర్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్ నాయకత్వం నన్ను సుప్రీం లీడర్గా చూడాలని అనుకుంది. కానీ నేను వద్దన్నాను. ఆ పదవి ఎవరూ కోరుకోరు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్పై అమెరికా చర్యలను ‘మిలిటరీ డెసిమేషన్’గా వర్ణించారు. అంటే సింహ భాగం ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశాం. తద్వారా మేం ము సాధించిన విజయాన్ని ఎవరూ చూడలేదు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది, కానీ తమ ప్రజల భయంతో, అలాగే అమెరికా ప్రతీకార దాడుల భయంతో బహిరంగంగా చెప్పలేకపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ఖండించిన ఇరాన్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. యుద్ధం ఆపే ప్రయత్నాలు ఇరు దేశాల మధ్య జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ట్రంప్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి విరుద్ధ ప్రకటనలు అంతర్జాతీయ వర్గాల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. ఒకవైపు ఆయన ‘ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది’ అని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ ‘ఎలాంటి చర్చలు లేవు’ అని ఖండిస్తోంది. ఈ విరుద్ధ పరిస్థితులు యుద్ధం ముగిసే అవకాశాలను మరింత క్లిష్టం చేస్తున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులతో ఇరాన్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత నెలలో జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు.అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. శకలాలు మోజ్తబా కాలును ఛిద్రం చేయడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కాలును తొలగించి చికిత్స కొనసాగిస్తున్నారని నివేదికలు వెల్లడించాయి. ఖమేనీ మరణంతో మోజ్తబా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన ప్రజల్లో కనిపించకపోవడం ఇరాన్లో నాయకత్వ సంక్షోభాన్ని మరింతగా పెంచుతోంది. -
అమెరికా-ఇరాన్ యుద్ధం.. థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల వేళ భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ నాయకత్వం వహించడం భారత్కు ‘అవమానకరం’ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.భారత్కు దక్కిందేమిటి?ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆపై సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్య ప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన సంక్షోభం ముంచుకొస్తోంది. ఇలాంటి కీలక సమయంలో పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు దేశాలు శాంతి చర్చలకు చొరవ చూపుతుంటే, భారత్ వెనుకబడిపోవడంపై థరూర్ అసహనం వ్యక్తం చేశారు.‘ప్రధాని మోదీ ఎప్పుడూ చెప్పేవిధంగా.. భారత్ శాంతి దూతగా నిలుస్తుందని ఆశించి, ప్రభుత్వం వహిస్తున్న మౌనాన్ని సమర్థించాను. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా పాకిస్తాన్కు వెళ్తుంటే చూడటం బాధాకరం. ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తనకున్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు.‘దళారీ దేశం కాదు’: జైశంకర్ కౌంటర్విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విపక్షాల విమర్శలకు అత్యంత ఘాటుగా స్పందించారు. ‘భారత్ ఏమీ దళారీ దేశం కాదు" అంటూ విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. 1981 నుండి అమెరికా పాకిస్తాన్ను ఒక సాధనంగా వాడుకుంటూనే ఉందని, ఇందులో కొత్తేమీ లేదని ఎద్దేవా చేశారు. యుద్ధం వల్ల అన్ని పక్షాలు నష్టపోతున్నాయని, దీనిని త్వరగా ముగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్పష్టం చేశారని కేంద్రం వెల్లడించింది. ఇది కూడా చదవండి: పెట్రోల్కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం! -
యుద్ధం ఆగాలంటే.. ఇరాన్ అమెరికా వార్ కండిషన్స్
-
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ .. భారత్లో వీటి ధరలు పెరగనున్నాయా?
ఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత ఔషధ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ (ఇండియా) వెల్ఫేర్ అసోసియేషన్ (DCOIWA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తి, ఎగుమతి దేశాలలో ఒకటిగా ఉన్నందున అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో ముడిపడి ఉందని, గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మెడిసిన్ అ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతం కీలక రవాణా కేంద్రంగా ఉండటంతో, నౌకాయాన మార్గాల అంతరాయం, మధ్యవర్తి రసాయనాల సరఫరాను దెబ్బతీస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, సరుకు రాకలో ఆలస్యం తయారీదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ పాలిమర్స్, గ్లాస్ వైల్స్, రబ్బర్ స్టాపర్స్ వంటి ప్యాకేజింగ్ పదార్థాల కొరత, ధరల పెరుగుదల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి.గల్ఫ్ దేశాలకు ఔషధ ఎగుమతులు రవాణా సమస్యలు, పోర్ట్ ట్రాఫిక్, బీమా సమస్యల కారణంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక ఔషధాల దిగుమతులు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఎగుమతిదారులు డిమాండ్ మార్పులు, చెల్లింపుల సమస్యలు, రవాణా ఆలస్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగుమతిదారులు అధిక ఖర్చులు, అస్థిర సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశీయ వ్యాపారులు స్టాక్ కొరత, ధరల మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వినియోగదారులకు ఔషధాల లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యాంటీబయోటిక్స్, గుండె సంబంధిత ఔషధాలు, మధుమేహ ఔషధాలలో మెడిసిన్ పని చేసేందుకు వినియోగించే రసాయనాలు (APIs) కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్యాకేజింగ్ పదార్థాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గుదల, ప్రాణ రక్షక ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఐ, కీలక ముడి పదార్థాల స్వదేశీ తయారీని ప్రోత్సహించాలి. అవసరమైన ఔషధాలు, ముడి పదార్థాల భద్రతా నిల్వలను ప్రభుత్వ స్థాయిలో నిర్వహించాలి. గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయాలి. పోర్ట్ క్లియరెన్స్ వేగవంతం చేయడం, రవాణా, బీమా ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఔషధ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు నియంత్రణ సంస్థలు పర్యవేక్షణ చేయాలి. నియంత్రణ సంస్థలు, తయారీదారులు, పంపిణీదారుల మధ్య సమన్వయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి మారుతూ ఉన్నప్పటికీ, ప్రభుత్వం, ఔషధ రంగానికి చెందిన అన్ని భాగస్వాములు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు అవసరమైన ఔషధాల సరఫరాను నిరంతరంగా కొనసాగించగలమని జి. కోటేశ్వరరావు స్పష్టం చేశారు. -
పశ్చిమాసియా కల్లోలం.. కీలక పరిణామాలు
పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా బుధవారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాన్ని ఏదోలా ముగించే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ విషయమై ఇరాన్ ముందు 15 ప్రతిపాదనలుంచారు. వాటికి అంగీకరిస్తే తొలుత నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ వాటిని ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. -
‘అందరి కోసం ఓ ప్రతీకారం’: ఇరాన్
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు త్వరలో చల్లబడేలా కనిపించడం లేదు. యుద్ధాన్ని ఆపేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ను రెచ్చగొట్టేలా ఇరాన్ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను విడుదల చేసింది. ‘అందరి కోసం ఓ ప్రతీకారం’ అంటూ అమెరికా, ఇజ్రాయెల్కు హెచ్చరిక జారీ చేసింది.ఈ వీడియోలో అమెరికా చరిత్రలో జరిగిన యుద్ధాలు, అణు దాడులు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘర్షణలను చూపిస్తూ చివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాక్షస రూపంలో చిత్రీకరించారు. స్టాచ్యూని క్షిపణితో ధ్వంసం చేస్తామని హెచ్చరించేలా వీడియోని క్రియేట్ చేయడం గమనార్హం.అమెరికా గత చర్యలపై విమర్శవీడియోలో అమెరికా స్థానిక ప్రజల భూ స్వాధీనం, హిరోషిమాపై అణు బాంబు దాడి, వియత్నాం యుద్ధం, అలాగే యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, గాజా, పాలస్తీనా ఘర్షణలను ప్రస్తావించారు. ఈ సంఘటనలన్నింటినీ అమెరికా కారణమని చూపిస్తూ, బాధితుల తరఫున ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సందేశం ఇచ్చింది.స్టాచ్యూ ఆఫ్ లిబర్టీపై దాడి వీడియో చివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాక్షసుడిగా చూపించి, దానిపై క్షిపణి దాడి చేసిన దృశ్యం ఉంది. ‘అందరి కోసం ఓ ప్రతీకారం’ అనే నినాదంతో అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ వీడియో ఇజ్రాయెల్–అమెరికా దాడుల తర్వాత విడుదల కావడం గమనార్హం. ఇరాన్ ఇటీవల అమెరికాను పశ్చిమ ఆసియాలో అస్థిరతకు కారణమని ఆరోపిస్తూ, ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. మరోవైపు అమెరికా అదనపు సైనిక దళాలు, యుద్ధ నౌకలు, విమాన దళాలను ఇరాన్ ప్రాంతంలో మోహరించింది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ వీడియో కేవలం ప్రచార సాధనం మాత్రమే కాదు. ఇరాన్ తన ప్రతీకారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు చూపించడానికి ఉద్దేశించబడింది. ఇది ప్రాంతీయ శాంతి, భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. -
భారత్ కోసం హార్మూజ్ తెరుస్తాం: ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్మూజ్ విషయంలో భారత్, మరో నాలుగు దేశాలకు ఇరాన్ భారీ ఊరటను ఇచ్చింది. ఈ ఐదు దేశాల కోసం హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్టు తాజాగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘి చెప్పుకొచ్చారు. దీంతో, ఆయా దేశాలకు చమురు ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. ఈ సందర్బంగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధిలో భారత్తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఎటువంటి ఆంక్షలు విధించబోమని ప్రకటించారు. భారత్తో పాటు, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్లకు చెందిన నౌకలకు కూడా జలమార్గం గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇరాన్ మీడియాతో అబ్బాస్ మాట్లాడుతూ.. చాలా దేశాలు హార్మూజ్ విషయంలో మమ్మల్ని సంప్రదించి, జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వాలని అభ్యర్థించారు. మేము మిత్రదేశాలుగా భావించే కొన్ని దేశాలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. వీరికి మా సాయుధ దళాలు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాయి. భవిష్యత్తులో కూడా, యుద్ధం తర్వాత కూడా ఆయా దేశాల నౌకల ప్రయాణాలు కొనసాగుతాయి’ అని ఆయన తెలిపారు. #Iran FM Abbas #Araghchi: We permitted passage through the Strait of #Hormuz for friendly nations including China, Russia, India, Iraq, and Pakistan. pic.twitter.com/RvLtiwYB4v— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 25, 2026ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సు లేట్ జనరల్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో, హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు సరకులతో ఉండటం అవి స్వదేశం చేరేందుకు మార్గం సులువైంది. ఇప్పటికే ఐదు గ్యాస్ ట్యాంకర్లు హార్మూజ్ వద్ద అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. ఇరాన్ నిర్ణయంతో వీటి ప్రయాణంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని నౌకలు కూడా భారత్లోని గమ్యస్థానాలకు చేరవచ్చు. అయితే, ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చిచెప్పిన దేశాల నౌకలు మాత్రమే హార్మూజ్లో ప్రయాణించవచ్చని ఇప్పటికే ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
అమెరికా వార్ షిప్, ఫైటర్ జెట్లపై ఇరాన్ భారీ దాడులు..!
-
అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ మంత్రి సంచలన ప్రకటన
అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపునకు అమెరికా పంపిన ప్రతిపాదనలను కేవలం తమ దేశ నాయకత్వం పరిశీలిస్తుందని తెలిపారు. వీటిని ఎట్టిపరిస్థితుల్లో చర్చలు అనుకోకూడదని తేల్చిచెప్పారు.ఇరాన్పై యుద్దం చేసి తన లక్ష్యాలను చేరుకోవడంలో అమెరికా విఫలమైందని అరాగ్చీ విమర్శించారు. సులభంగా విజయం సాధించాలని, లేదా ఇరాన్లో ప్రభుత్వ మార్పు చేయాలని ట్రంప్ కలలు కన్నారని కానీ అవి నెరవేరలేదని తెలిపారు. అందుకోసమే అగ్రరాజ్యం బేరానికి వస్తుందని విమర్శించారు.ప్రస్తుతం యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన ప్రతిపాదనలను ఇరాన్ పరిశీలిస్తోందని అయితే మధ్యవర్తలు ద్వారా మాత్రమే ఆ సందేశాలు పరిశీలిస్తున్నామని అంతేగానీ చర్చలు జరపడం లేదని తేల్చిచెప్పారు. దేశ భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తేలేదన్నారు.ఇరాన్ను ఎవరూ బెదిరించలేరని విషయాన్ని ఇదివరకే ప్రపంచానికి చాటి చెప్పామని, తమ దేశం యొక్క దృఢత్వాన్ని నిరూపించుకున్నామని తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధాన్ని కొనసాగించాలని తాము కోరుకోవడం లేదని, అయితే తమ నిబంధనలకు అనుగుణంగా శాశ్వత పరిష్కారాన్ని మాత్రమే ఆశిస్తున్నట్లు అరాగ్చీ తెలిపారు. -
కాల్పుల విరమణకు షరతులు
దుబాయ్/వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా బుధవారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాన్ని ఏదోలా ముగించే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ విషయమై ఇరాన్ ముందు 15 ప్రతిపాదనలుంచారు. వాటికి అంగీకరిస్తే తొలుత నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ వాటిని ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ముఖ్యంగా అణు, క్షిపణి కార్యకలాపాలను కట్టిపెట్టడం, హార్మూజ్పై పెత్తనాన్ని వదులుకోవడం, హెజ్బొల్లా వంటి సాయుధ గ్రూపులకు ఆర్థిక, ఆయుధ సాయం నిలిపివేత వంటి షరతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదని కుండబద్దలు కొట్టింది. హార్మూజ్పై తన సార్వ¿ౌమాధికారాన్ని గుర్తించాల్సిందేనని డిమాండ్ చేసింది. ‘‘మాపై ఇంకెప్పుడూ యుద్ధానికి దిగరాదు. ఆర్థిక తదితర ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలి. మా నేతలు, సైనికాధికారుల హత్యలను మానుకోవాలి’’అంటూ అమెరికాకు 8 షరతులు విధించింది! గల్ఫ్ నుంచి అమెరికా బలగాలన్నీ వైదొలగాలని కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులను కొనసాగించింది. అమెరికా కూడా మరో 5,000 మంది మెరైన్లు, 1,000 మంది సైనికులను గల్ఫ్ ప్రాంతానికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలను చర్చలకు ఒప్పించేందుకు పలు దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన పట్ల ఇజ్రాయెల్ విస్మయం వెలిబుచ్చింది. ఇరాన్ పూర్తిగా కాళ్లబేరానికి వచ్చేదాకా దాడులు కొనసాగించాలని అభిప్రాయపడింది. మరోవైపు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ యత్నాలకు ఈజిప్టు, టర్కీ కూడా ముందుకొచ్చాయి. కొనసాగుతున్న చర్చల యత్నాలు అమెరికా, ఇరాన్ నడుమ చర్చల దిశగా పలు దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇరుదేశాలు అంగీకరిస్తే వాటి నడుమ ద్వైపాక్షిక చర్చలకు వేదికగా నిలిచేందుకు పాకిస్తాన్ సిద్ధమని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పునరుద్ఘాటించారు. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా తన 15 షరతులను పాక్ ద్వారానే ఇరాన్కు అందజేసినట్టు న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు ఇరాన్ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్ ప్రకటించింది. యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించాల్సింది ఇరానే తప్ప ట్రంప్ కాందంటూ మండిపడింది. అంతేగాక ఇరాన్ కూడా 8 షరతులతో కూడిన తమ ప్రతిపాదనలను పాక్ ద్వారానే అమెరికాకు పంపింది. వాటన్నింటికీ అంగీకరిస్తేనే యుద్ధానికి తెర దించడంపై నిర్ణయం తీసుకుంటామంటూ కుండబద్దలు కొట్టింది. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని పునరుద్ఘాటించింది. గల్ఫ్, పరిసర దేశాల మంత్రులు తదితరులు తమతో మాట్లాడుతున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చెప్పుకొచ్చారు. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు మాత్రం అబద్ధమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఖలీబాఫ్ అన్నారు. ట్రంప్ మాత్రం చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకొ చ్చారు. పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు జెరేద్ కుష్నర్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా వాటిలో పాల్గొంటున్నట్టు వైట్హౌస్లో మీడియాకు వెల్లడించారు. ఎలాగోలా ఒప్పందానికి రావాలనే ఇరాన్ ఆశ పడుతున్నట్టు కూడా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. అమెరికా ఎఫ్–18 కూల్చివేత! ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు బుధవారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్పై తీవ్రస్థాయిలో బాంబులు, క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై తీవ్ర స్థాయిలో దాడులకు దిగింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకపైనా దాడి చేసింది. దానిపైకి పలు క్షిపణులను ప్రయోగించింది. దాడిలో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు చెప్పుకొచ్చింది. ఈ నౌకపై దాడి చేసినట్టు ఇరాన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం, అమెరికా ఖండించడం తెలిసిందే. కువైట్ విమానాశ్రయంపైనా ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. దాంతో అక్కడ భారీ మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన ఎఫ్–18 యుద్ధ విమానంపై క్షిపణితో దాడి చేసినట్టు ఇరాన్ పేర్కొంది! ఇందుకు సంబంధించి వీడియో కూడా విడుదల చేసింది. అంతేగాక తమపై దాడులు కొనసాగితే యెమన్ సమీపంలోని బబ్ ఎల్ మందెబ్ జలసంధిని కూడా మూసేస్తానంటూ ఇరాన్ తాజాగా హెచ్చరికలు చేసింది. ఇది యెమన్, ఎరిత్రియా నడుమ ఉన్న 32 కి.మీ. వెడల్పుతో కూడిన జలసంధి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్, హిందూ మహాసముద్రాలతో కలుపుతుంది. -
ద్వీపాన్ని ఆక్రమించే ప్లాన్? ఇరాన్ స్పీకర్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధం కొలిక్కివస్తుందనే తరుణంలో మరోసారి సమస్యలు తీవ్రతరమైతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్న(బుధవారం) అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కాగా ప్రస్తుతం టెహ్రాన్కు చెందిన ఓ ద్వీపాన్ని శత్రుదేశం ఆక్రమించే యత్నం చేస్తుందని ఆ దేశ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు.ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ "ఇంటిలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ శత్రువులు ఒక ప్రాంతీయ దేశం మద్దతుతో ఇరాన్ దీవులలో ఒకదానిని ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మా బలగాలు శత్రువుల కదలికలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నాయి. వారు ఏ మాత్రం ముందడుగు వేసినా శత్రువుకు సహాయం చేసిన ప్రాంతీయ దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలన్నింటినీ ఏ మాత్రం కనీకరం లేకుండా ధ్వసం చేస్తాం. నిరంతరం దాడులు చేస్తాం" అని హెచ్చరించారు.కాగా ప్రస్తుతం ట్రంప్ వేలాది మంది వైమానిక దళాలను మరియు అదనపు మెరైన్లను గల్ఫ్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంబాట్ వార్కు తెరదించనున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఇదివరకే ట్రంప్ ఇరాన్ ముడిచమురు ఎగుమతుల్లో ప్రధానమైన ఖర్గ్ ద్వీపాన్ని "పూర్తిగా రక్షణ లేకుండా అక్కడ ఉన్న ఒక చిన్న చమురు ద్వీపం" అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
బంకులు.. బారులు
సాక్షి, హైదరాబాద్: ఇంధనం సెగ రాష్ట్రంలోని వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆయిల్ కొరత వార్తలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే దేశంలో ఎక్కడా చమురు కొరత లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయం పదేపదే చెబుతోంది. ఆయిల్ కంపెనీలు సైతం సరిపడా డీజిల్, పెట్రోల్ నిల్వలున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటనలిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడురోజులుగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరి కన్పిస్తున్నారు. గంటలకొద్దీ పడిగాపులు పడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు కిక్కిరిసి ఉంటున్నాయి. కొన్ని బంకులు నిరాటంకంగా పని చేస్తుంటే.. కొన్నిచోట్ల మాత్రం బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కన్పిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, చమురు, సహజ వాయువుల కొరత వార్తల నేపథ్యంలో ఈ నో స్టాక్ బోర్డులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాహనదారులు అవసరం ఉన్నా, లేకపోయినా డీజిల్, పెట్రోల్ ట్యాంక్ నిండా నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏరోజు కారోజు ఇంధనం నింపుకునే క్యాబ్ డ్రైవర్లు, ఇతర గిగ్ వర్కర్లు, సామాన్య ప్రజలు కూడా ఎంతో కొంత అదనంగా ట్యాంకు నింపుకోవాలని చూస్తుండటంతో తెరిచి ఉన్న బంకుల వద్ద క్యూలు పెరిగిపోతున్నాయి. కొందరు సీసాలు, పెద్దపెద్ద క్యాన్లు, డ్రమ్ముల్లో సైతం ఇంధనం నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని బంకులు మూతపడి కన్పిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. బంకులు మూత పడి ఉండటానికి ‘నో క్రెడిట్’ సమస్య ప్రధాన కారణమని తెలుస్తుండగా..ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీల ప్రకటనలను పట్టించుకోకుండా ప్రజలు ఎక్కడ పెట్రోల్, డీజిల్ దొరుకుతోందో తెలుసుకొని మరీ కొనుగోళ్లు చేస్తుండటంతో తెరిచి ఉన్న బంకులు కిక్కిరిసిపోయి కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం నుంచే.. పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడో మొదలైనా..సోమవారం సాయంత్రం నుంచే బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారులు క్యూలు కట్టడం ప్రారంభించారు. ఆ ఫొటోలు టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో చమురు కొరతపై భయాందోళనలు మొదలయ్యాయి. బంకులన్నీ వాహనదారులతో నిండిపోవడం మొదలయ్యింది. మంగళ, బుధవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. భారీగా పెరిగిన డిమాండ్ ఇంధన కంపెనీల లెక్కల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 3,600 పెట్రోల్ బంకులకు సాధారణంగా రోజుకు సగటున 13,752 కిలోలీటర్ల ఇంధనం అవసరం ఉంటుంది. తదనుగుణంగా ఆయిల్ కంపెనీలు సగటున 14,729 కిలోలీటర్లు సరఫరా చేసేవి. కానీ ప్రస్తుతం డిమాండ్ ఒక్కసారిగా 17,246 కిలోలీటర్లకు చేరింది. దీనికి అనుగుణంగా ఆయిల్ కంపెనీలు కూడా సరఫరాను 17,898 కిలోలీటర్లకు పెంచినట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటికీ కొన్ని బంకులు నోస్టాక్ బోర్డులతో మూతపడి కన్పిస్తున్నాయి. మరికొన్ని బంకులు వాహనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో రెట్టింపు స్థాయిలో పెట్రోల్ విక్రయాలు పెరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం విక్రయాలు జరగ్గా, 23న ఇది రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుంది. వచ్చిన స్టాక్ వచ్చినట్టు ఖాళీ హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇంధనానికి అగచాట్లు ఎదురవుతున్నాయి. పరిశ్రమలు, రవాణా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగం పెరగడంతో ఉదయం వచ్చిన స్టాక్ అదే రోజు ఖాళీ అవుతోంది. దీంతో పలు పెట్రోల్ బంకులు మధ్యాహా్ననికే ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేస్తున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లు హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఐటీ కారిడార్లోని మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ బుధవారం ఉదయం నుంచే వాహనదారులతో నిండిపోగా, ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గచ్చిబౌలిలోని ప్యారడైజ్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ను పోలీసులే మూసివేయించినట్లు ఖాన్ అనే వైద్యుడు ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని బంకుల వద్ద గంటల తరబడి వేచి చూసిన తర్వాత స్టాక్ అయిపోయిందని చెబుతున్న పరిస్థితి ఉంది. దీంతో సాధారణ ప్రజలతో పాటు హైదరాబాద్ నగరంలో వేల సంఖ్యలో ఉన్న ఆన్లైన్లో ఆహారం, నిత్యావసరాలు, ఇతర వస్తువులు చేరవేసే కార్మీకులు, ఉబర్, రాపిడోల వంటి ద్వారా సేవలందించే క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో సైతం వాహనదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. క్యాన్లలో పెట్రోల్తో ప్రమాదం డీజిల్, పెట్రోల్ కొరత లేదంటున్న ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు..ఈ విషయంతో పాటు వాస్తవ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారు ఇబ్బందులు పడకుండా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాన్లలో పెట్రోల్ పోయవద్దని బంకుల యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా కేవలం అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, క్యాన్లలో నిల్వ ఉంచుకోవడం ప్రమాదకరం, చట్ట విరుద్ధం అని పేర్కొంటున్నారు. నో క్రెడిట్..అడ్వాన్స్ పేమెంట్తో అసలు సమస్య! రాష్ట్రంలో ఇంధనం కొరత లేదని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఇక డీలర్లు కూడా సంక్షోభానికి కారణం కొరత కాదని, ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త నిబంధనలేనని పేర్కొంటుండటం గమనార్హం. వారి కథనం ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో.. గతంలో ఉన్న ‘క్రెడిట్’ సౌకర్యాన్ని రద్దు చేసి, ‘అడ్వా¯న్స్ పేమెంట్’ పద్ధతిని అమలు చేస్తుండటంతో బంకుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లక్షల్లో పేరుకు పోయిన పాత బకాయిలు కూడా సమస్య తీవ్రతకు కారణమవుతున్నట్లు తెలిసింది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామన్న కంపెనీల నిబంధనతో పలు బంకులు ఆర్డర్లు ఇవ్వలేకపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బంకులు మూత పడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇది చూసి తెరిచి ఉన్న బంకులకు వాహనదారులు రెండు, మూడు రెట్ల ఎక్కువ సంఖ్యలో పోటెత్తుతుండటంతో..క్రెడిట్, ఇతర సమస్యల్లేని ఆ బంకుల్లో స్టాక్ గంటల్లోనే ఖాళీ అవుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత లేదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ‘రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు 20 వేల కిలోలీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉంది. సరఫరా వ్యవస్థలో కూడా ఎలాంటి అంతరాయం లేదు. మంగళవారం ఒక్కరోజే 1,500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను పంపించాం. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దు..’ అని పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, అవసరం లేకుండా ఆయిల్ కొనుగోలు చేయవద్దని (ప్యానిక్ కొనుగోళ్లు) మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఇంధన నిల్వలపై సమీక్ష జరిపారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దు: హైదరాబాద్ సీపీ ‘హైదరాబాద్లో ఇంధనం కొరత లేదు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. నగర వ్యాప్తంగా చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు. కేవలం వదంతుల వల్లే రద్దీ ఏర్పడుతోంది..’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హెచ్చరించారు. నగరంలో తాజా పరిస్థితిపై బుధవారం టీజీసీసీసీలో వారు సమీక్ష జరిపారు. అవసరానికి మించి కొనుగోళ్లతో స్టాక్ ఖాళీ: డీలర్ల సంఘం ‘ఇంధన కొరత అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుండటంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. మళ్లీ ఆయిల్ దొరుకుతుందో లేదో అని అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్టాక్ త్వరగా అయిపోతోంది. ప్రజలు వదంతులు నమ్మొద్దు. ప్యానిక్ కొనుగోళ్లు నిలిపివేయాలి. కంటైనర్లు, సీసాల్లో కూడా తీసుకోకూడదు..’ అని తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం.అమరేందర్రెడ్డి సూచించారు. ‘పాత బకాయిలు చెల్లిస్తేనే ఆయిల్ కంపెనీలు ఇంధనం సరఫరా చేస్తున్నాయి. క్రెడిట్ (ఉద్దెర)లో పెట్రోల్, డీజిల్ ఇవ్వడం లేదు. ఇది కొన్ని బంకులు మూతపడటానికి, తెరిచి ఉన్నచోట క్యూలు పెరగడానికి కారణమవుతోంది..’ అని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. -
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
అమెరికా ఫైటర్ జెట్ను కూల్చేసాం.. ఇరాన్ కీలక ప్రకటన
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చల ప్రస్థావన నడుస్తోన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గి చర్చల జపం ఎత్తినా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇది వరకే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తమ దేశంపై చేసిన దురాక్రమణకు ప్రశ్చాతాప పడే వరకూ దాడులు ఉంటాయని ప్రకటించారు. హర్మూజ్ జలసంధిపై తాము తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. "యుఎస్కు చెందిన ఫైటర్ జెట్ను కూల్చేసాం. విజయవంతంగా టార్గెట్ని పూర్తి చేసాం". అని దానికి సంబంధించిన వీడియోని ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే దాడి ఎక్కడ చేశారు. ఆ ఫైలట్ పరిస్థితి ఏంటి అనే వివరాలు వెల్లడించలేదు. కాగా దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు.అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా ఇరాన్ శాంతించడం లేదు. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. యుద్ధంలో నష్టానికి పరిహారం చెల్లించి తమ షరతులు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Iran's Islamic Revolution Guards Corps (IRGC) announces that it has successfully targeted an American F-18 fighter jet.Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/E9nRJgnla3— Press TV 🔻 (@PressTV) March 25, 2026 -
పాక్లా మనం దళారి కాదు
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరినీ కష్టాలకడలిలో ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ఇకనైనా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ హితబోధ చేశారని అఖిలపక్ష సమావేశంలో విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. యుద్ధం మరింత విస్తరించకుండా భారత్ తన వంతుగా ఎలాంటి కృషిచేయట్లేదన్న విపక్షాల ఆరోపణలను ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. పాకిస్తాన్లా భారత్ దళారీగా వ్యవహరించబోదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టలు పెదవి విరిచాయి. ఈ అఖిలపక్ష భేటీకి బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్ వేదికగా నిలిచింది. బుధవారం సాయంత్రం కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలో మొదలైన ఈ అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్షా, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు పాల్గొన్నారు. విపక్షాల నుంచి తారిఖ్ అన్వర్, ముకుల్ వాస్నిక్(కాంగ్రెస్), ధరేంద్ర యాదవ్(ఎస్పీ), సస్మిత్ పాత్రా(బీజేడీ), సంజయ్ ఝా(జేడీయూ), శ్రీకాంత్ షిండే(శివసేన), సంజయ్సింగ్(ఆప్), జాన్ బ్రిటాస్ (సీపీఎం), సుప్రియా సూలే(ఎన్సీపీ–ఎస్పీ), అరవింద్ సావంత్(శివసేన–యూబీటీ), అసదుద్దీన్ ఒవైసీ(ఏఐఎంఐఎం) తదితర నేతలు పాల్గొని దాదాపు రెండు గంటలపాటు పశ్చిమాసియా అంశంపై చర్చించారు.యుద్ధం ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మనకన్నా చిన్నదేశం పాకిస్తాన్ ముందుకొచ్చిందని, భారత్ కనీసం నోరుమెదపలేదని విపక్షాలు చేసిన ఆరోపణలపై మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘దళారిలాగా మధ్యవర్తిత్వం కోసం అర్రులుచాచడం పాకిస్తాన్కు అలవాటే. 1981 నుంచి అమెరికా పాకిస్తాన్ను ఇలాగే ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్లా భారత్ దళారీ దేశం కాదు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఎప్పుడూ జోక్యంచేసుకోదు. మధ్యవర్తిత్వం వహించబోదు. యుద్ధం ముగింపు కోసం భారత్ తన వంతు కృషిచేస్తోంది. మౌనంగా కూర్చోలేదు. సందర్భానుసారం మన వైఖరి తెలియజేస్తున్నాం. ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ మరణవార్త తెలియగానే మోదీ సర్కార్ స్పందించలేదన్న విపక్షాల వాదనల్లో నిజం లేదు. ఇరాన్ ఎంబసీని తెరచిన వెంటనే విదేశాంగ కార్యదర్శి వెళ్లి సంతాపం తెలిపారు. అక్కడి సంతాపసూచిక పుస్తకంలో సంతకం కూడా చేసి వచ్చారు’’అని అన్నారు. మన వాళ్ల భద్రత, ఇంధన భద్రత ముఖ్యం ‘‘గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రతే మాకు ముఖ్యం. దీంతోపాటే దేశీయ ఇంధన అవసరాలను సంపూర్ణంగా తీర్చడం పైనా మేం దృష్టిసారించాం. ఈ విషయంలో దౌత్య విజయం సాధించాం. భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ నిల్వలపై ఆందోళన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ముడిచమురు, ఇంధన నౌకలు విదేశాల నుంచి వస్తూనే ఉన్నాయి. మరిన్ని నౌకలు మార్గమధ్యంలో ఉన్నాయి. హార్మూజ్ గుండా రావాల్సిన 18 నౌకలు అక్కడే చిక్కుకుపోయిన మాట వాస్తవమే. హార్మూజ్ గుండా సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టిసారించాం. ముడి చమురు, గ్యాస్లను వేరే దేశాల నుంచి తెప్పిస్తున్నాం. భారత్ కేవలం గల్ఫ్దేశాల నుంచేకాకుండా మొత్తంగా 41 దేశాల నుంచి ఆయిల్, గ్యాస్లను కొనుగోలుచేస్తోంది. మనకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇజ్రాయెల్ అతిపెద్ద సాంకేతిక భాగస్వామిగా ఉన్నాయి. మనకు ఇరాన్తోనూ సత్సంబంధాలున్నాయి’’అని ప్రభుత్వం విపక్షాలకు తెలియజేసింది. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై తక్షణం 193వ నిబంధన కింద లోక్సభలో, 176వ నిబంధన కింద రాజ్యసభలో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్చేశాయి. మరోవైపు విపక్షనేత రాహుల్గాంధీ అఖిలపక్ష భేటీకి రాకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. -
టెలిగ్రామ్లో ఎర, క్రిప్టోలో చెల్లింపులు, కట్ చేస్తే!
టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా విదేశీ శక్తులు యువతను ప్రలోభ పెడుతున్నాయనేందుకు నిదర్శనగా ఒక షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇరాన్ ఏజెంట్లతో చేతులు కలిపి గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ 14 ఏళ్ల ఇజ్రాయెల్ మైనర్ బాలుడిపై అభియెగాలు నమోదు కావడం నెట్టింట చర్చకు దారి తీసింది. టెలిగ్రామ్ ద్వారా ఇరాన్ గూఢచారులతో సంబంధాలు పెట్టుకుని, వారిచ్చిన పనులను పూర్తి చేస్తూ డబ్బులు (క్రిప్టోకరెన్సీ) తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.మధ్య ఇజ్రాయెల్కు చెందిన 14 ఏళ్ల బాలుడిపై ఇరాన్ కోసం గూఢచర్యం చేసినందుకు, ఇరాన్ గూఢచారుల కోసం డబ్బు తీసుకుని పనులు చేసినందుకు అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు బుధవారం తెలిపారని ఇజ్రాయెల్ ఆధారిత ఐ24 న్యూస్ నివేదిక పేర్కొంది. టెల్ అవీవ్ జిల్లా బాలల న్యాయస్థానంలోని స్టేట్ అటార్నీ కార్యాలయం దాఖలు చేసిన పత్రాల ప్రకారం, ఆ బాలుడు ఉద్యోగానికి ఆశపడి, గత ఏడాది ఏప్రిల్లో టెలిగ్రామ్ ద్వారా ఇరాన్ గూఢచారులతో సంప్రదింపులు జరిపాడు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటనఎలా మొదలైందీ అంటే..గత ఏడాది టెలిగ్రామ్లో వచ్చిన 'ఉద్యోగ ప్రకటన'కు మైనర్ బాలుడు స్పందించాడు. దీంతో హ్యాండ్లర్లు బాలుడితో పరిచయం పెంచుకున్నారు. టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లోపలు అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రతిఫలంగాజరిగే లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ రూపంలో జరిగేవని దర్యాప్తులో తేలింది. నిందితుడు తన హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో నాలుగు డిజిటల్ వాలెట్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పనులన్నిటికీ కలిపి సుమారు లక్ష రూపాయలు అందుకున్నాడు.ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలుఎలాంటి పనులు చేసేవాడుఇచిలోవ్ ఆసుపత్రి సమీప వీధులను చిత్రీకరించడం, రామత్ గాన్ ప్రాంతంలోని పరిసరాలను మ్యాపింగ్ చేయడం. 'కిర్యా' అనే కీలక మిలిటరీ కాంప్లెక్స్ను గుర్తించి, తెల అవీవ్ ఆకాశహర్మ్యాలను (skyline) వీడియోలు తీయడం.కిర్యా మిలిటరీ ప్రాంతం సమీపంలో ఒక అపార్ట్మెంట్ను వెతికి, దాని ఫోటోలను, యజమానుల వివరాలను తన హ్యాండ్లర్లకు పంపడం.మరో సందర్భంలో, విదేశాంగ మంత్రి గిడియన్ సార్ ఇంటి సమీపంలో గ్రాఫిటీ (గోడలపై రాతలు) వేసి, పరిసరాలను రికార్డ్ చేయమని అతడిని కోరారు, కానీ పాఠశాల పని కారణంగా ఆ పనిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు అరెస్ట్ తర్వాత సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. తన వాలెట్లో ఉన్న డబ్బు తన క్లాస్మేట్ పంపాడని అబద్ధం చెప్పమని తన స్నేహితుడిని కోరడం ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశాడని అభియోగపత్రంలో పేర్కొన్నారు. -
యుద్ధం మరో స్థాయికి.. గల్ఫ్ దేశాలకు 3 వేలమంది అమెరికా పారా ట్రూపర్లు
-
ఇరాన్పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?
వాష్టింగన్: ఇరాన్పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై దాడుల్ని ముగించేలా ట్రంప్ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఔన్స్కి 4,550 డాలర్లను దాటిందిదీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారుబెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావంచమరు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.కేంద్ర బ్యాంకుల ధోరణిగత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. -
పాకిస్థాన్కు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది. ఇరాన్లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.ఇరాన్లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పాక్ కు ఇరాన్ షాక్.. హర్ముజ్ లో నౌక అడ్డగింత
-
ట్రంప్ కు ఇరాన్ బహుమతి.. అది ఏంటంటే?
-
యుద్ధం ముగింపునకు ట్రంప్ బిగ్ ప్లాన్.. ఇరాన్కు కష్టమే?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇరాన్ యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని సూచనలు చేశారు. దీంతో, ట్రంప్ ప్రణాళికను ఇరాన్ అంగీకరిస్తుందా? అనే చర్చ నడుస్తోంది.కాగా, ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో చర్చలకు సిద్దమని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ సిద్దం చేసినట్టు ఇజ్రాయెల్ చానెల్ 12 పలు కథనాలను వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని, హార్మూజ్ సముద్ర మార్గాన్ని తెరిచి ఉంచాలని, ఒక నెల కాలం కాల్పుల విరమణ జరగాలని సూచించారు. అయితే, ఇరాన్ ఈ చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఖండించింది. కాబట్టి ఈ ప్రణాళిక అమలు అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, ఇరాన్కి ఉన్న మూడు ప్రధాన శక్తులను (అణు, క్షిపణి, ప్రాంతీయ ప్రభావం) వదులుకోవాలని ట్రంప్ కోరుతున్న నేపథ్యంలో ఇది అమలు కష్టమని విశ్లేషకులు అంటున్నారు.ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికలో ముఖ్యాంశాలు..అణ్వాయుధాలు: ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదు, అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి.క్షిపణి కార్యక్రమాలు: బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ను తగ్గించాలి.హార్మూజ్ సముద్ర మార్గం: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తెరిచి ఉంచాలి.కాల్పుల విరమణ: ఒక నెలపాటు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపాలి.ప్రాంతీయ ప్రభావం: ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించాలి.పాకిస్తాన్ మధ్యవర్తిత్వం: ఈ ప్రణాళికను ఇరాన్కి పాకిస్తాన్ ద్వారా పంపించారు.సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ: బుషెహర్ వద్ద ఇరాన్కి శాంతియుత అణు శక్తి అభివృద్ధికి సహాయం అందించవచ్చని సూచన.నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను నిలిపివేసి ధ్వంసం చేయాలి.ఇరాన్ సరిహద్దులలోని సమస్త సమాచారాన్ని పొందే పూర్తి అధికారం IAEAకు ఉంటుంది.ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్ను విడిచిపెట్టాలి.క్షిపణుల భవిష్యత్ వినియోగం: కేవలం ఆత్మరక్షణ ప్రయోజనాల కోసం మాత్రమేIsrael's Channel 12 (@yaronavraham) published the Trump Administration's 15-point plan (I counted 14) sent to Iran to end the war:1. All existing nuclear capabilities will be dismantled.2. A commitment that Iran will never strive to obtain nuclear weapons.3. No material will…— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) March 24, 2026మరోవైపు.. ఇరాన్పై ట్రంప్ మాటల దాడి కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ నౌకాదళం , వైమానిక దళం పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, సైన్యంపరంగా వాళ్లు చచ్చిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. అలాగే అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. అంతేకాకుండా.. ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. దాదాపుగా వారి వద్ద ఉన్న ప్రతీదీ పోయింది. టెహ్రాన్తో పాటు వారి దేశంలోని ఇతర ప్రాంతాలపై అమెరికా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి’ అని చెప్పారు. ఇదే సమయంలో అమెరికాకు ఇరాన్ హార్మూజ్ జలసంధికి సంబంధించిన ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ బహుమతి ఏమిటన్న వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. -
ఇరాన్పై యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఒక ‘రహస్య బహుమతి’ అందిందని ఆయన ప్రకటించారు. వైట్ హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘వారు మాకు ఒక బహుమతి ఇచ్చారు. అది చాలా పెద్దది. దాని విలువ అపారం. ఇది అణు సంబంధమైనది కాదు. చమురు, గ్యాస్కు సంబంధించినది. వారు చేసిన పని చాలా మంచిది’ అని పేర్కొన్నారు. అయితే, ఆ బహుమతి ఏమిటన్నది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై కొత్త చర్చలకు దారితీసాయి. చమురు సరఫరా, సముద్ర మార్గ భద్రత లేదా ఇతర వ్యూహాత్మక అంశాలకు సంబంధించినదా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.ట్రంప్ మరోసారి అమెరికాదే పైచేయి అని పునరుద్ఘాటించారు. అదే సమయంలో యుద్ధం త్వరగా ముగియడం పట్ల రక్షణశాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ నిరాశ చెందారని తెలిపారు. అమెరికా అధికారులు టెహ్రాన్లోని కీలక వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇరాన్ నాయకులు యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇరాన్ తరచుగా ఈ మార్గాన్ని మూసివేస్తానని హెచ్చరించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.గత కొన్ని వారాలుగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇప్పటికే హర్మూజ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించింది. మిత్రదేశాలను కూడా యుద్ధ నౌకలు పంపమని కోరింది. అయితే, చాలా దేశాలు దీనికి నిరాకరించాయి.ట్రంప్ చెప్పిన ‘రహస్య బహుమతి’ అసలు ఏమిటన్నది స్పష్టత లేకపోయినా, ఇది అమెరికా–ఇరాన్ సంబంధాల్లో తాత్కాలిక సర్దుబాటు సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు, భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా?
సాక్షి, చెన్నై: పశ్చిమ ఆసియాలో (ఇరాన్–ఇజ్రాయిల్ –అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పేముందు.. వారిని రక్షించడానికి ముందుగా తమరు సిద్ధంగా ఉన్నారా? ’అని పీఎంను ప్రశ్నించారు. సిద్ధమవ్వడం అంటే బాధ్యతను విస్మరించడమేనా? తన ఎక్స్పేజీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు: “సన్నద్ధతను ప్రజలకు వదిలివేయలేమని, మనం దేనికి సిద్ధపడాలి? నాయకత్వం వహించడానికా లేక నాయకత్వం లేని లోటును భరించడానికా? అని ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలనే సిద్ధంగా ఉండమన్నారని, ఇప్పుడు యుద్ధ ప్రభావాల విషయంలో కూడా అదే మాట అనడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయాల కోసం వేచి చూడకుండా, తమిళనాడు ప్రభుత్వం మార్చి 14నే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని స్టాలిన్ గుర్తు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్లను వాడితే, అదనపు విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు ఎలక్ట్రిక్ హీటర్లు, స్టవ్లు కొనుగోలు చేయడానికి వడ్డీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడే ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి కొత్తగా అనుమతులు అవసరం లేదని మినహాయింపు ఇచ్చామన్నారు. కూరగాయలు, పండ్లు పండించే రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 19 లక్షల మంది తమిళులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ ప్లాంట్లకు ఇంధన సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
పాకిస్తాన్కు బంపరాఫర్.. ట్రంప్ ప్లానేంటి?
అమెరికా, ఇరాన్ మధ్య చర్చల విషయమై ఉత్కంఠ నెలకొంది. అసలు చర్యలు జరుగుతాయా? యుద్ధం ముగుస్తుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ నేతలు బయటకు వచ్చి ట్రంప్తో చర్చల్లో పాల్గొంటారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్, అమెరికా మధ్య చర్చలను నిర్వహించేందుకు తాము సిద్ధమని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అనంతరం, షరీఫ్ పోస్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేయడం ఆసక్తిని పెంచింది. అంటే, చర్చలకు పాకిస్తాన్ వేదిక కానుందనే సంగతి దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా చర్చలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో..‘పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే ఈ సంప్రదింపులను నిర్వహించే అవకాశం పాకిస్తాన్కు లభిస్తే మేము.. దానిని ఒక గౌరవంగా భావిస్తాం. అమెరికా, ఇరాన్ల వైపు నుంచి ఉమ్మడి అంగీకారం లభిస్తే చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ప్రయత్నాలను పాకిస్తాన్ స్వాగతిస్తుందని అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన పోస్టును ట్రంప్ షేర్ చేయడం విశేషం. అంటే, పాకిస్తాన్ వేదికగా చర్చలకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్ను ట్రంప్ ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ట్రంప్ ప్లానేంటి అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇదిలా ఉండగా.. రహస్యంగా జరుగుతున్న అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఇటీవలే మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు పాక్ ప్రధాని చేసిన ప్రకటన, ఆ కథనాలకు బలం చేకూర్చేలా ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. అయితే, అంతకుముందే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు వేదికగా పాకిస్థాన్ను ఎంపిక చేస్తారంటూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. కాగా, ఈ ఊహాగానాలను నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు వెలువడే వరకు వేచి చూడాలని మీడియాకు పాక్ విదేశాంగ శాఖ సూచించింది.Pakistan welcomes and fully supports ongoing efforts to pursue dialogue to end the WAR in Middle East, in the interest of peace and stability in region and beyond. Subject to concurrence by the US and Iran, Pakistan stands ready and honoured to be the host to facilitate…— Shehbaz Sharif (@CMShehbaz) March 24, 2026 -
యుద్ధం తెచ్చిన కష్టాలు.. హైదరాబాద్ లో నో పెట్రోల్ ?
-
తమ షరతులు అంగీకరిస్తే కాల్పుల విరమణ: ఇరాన్
-
ఫలించని ట్రంప్ పిలుపు.. ఆగని ఇజ్రాయెల్,ఇరాన్ యుద్ధం
-
ఇరాన్ జాతీయ భద్రతా మండలికి కొత్త చీఫ్
దుబాయ్: ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు నూతన కార్యదర్శిగా మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ను నియమించారు. ఈయన గతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్స్ప్ (ఐఆర్జీసీ)లో గతంలో కమాండర్గా సేవలందించారు. ఐఆర్జీసీలో ఉంటూ ఈయన గతంలో బ్రిగేడియర్ జనరల్ స్థాయికి ఎదిగారు.ఇప్పటికే జోల్ఘదర్ ఇరాన్ పార్లమెంట్కు, 12 మంది సభ్యులుండే గార్డియన్ కౌన్సిల్కు మధ్య పొడచూపే విబేధాలను పరిష్కరించే ఇరాన్ ఎక్స్పిడియన్సీ కౌన్సిల్కు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలా లారిజానీ ఇటీవల దాడుల్లో చనిపోవడంతో జోల్ఘదర్ను ఎంపికచేశారు.


