iran
-
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం
అబుదాబి: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు యూఏఈ చర్యలకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ అందించిన ‘ఐరన్ డోమ్’ను యూఏఈ మోహరించింది. ఇరాన్ నుంచి పెరుగుతున్న డ్రోన్, క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, యూఏఈ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అబ్రహాం ఒప్పందాల తర్వాత రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా, యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 4–70 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను అడ్డుకుంటుంది. మిర్ ఇంటర్సెప్టర్ అనే క్షిపణులు లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఎల్టా సిస్టమ్స్ రాడార్ ద్వారా వచ్చే ముప్పులను గుర్తించి, వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్లో ఈ వ్యవస్థ 90శాతం విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై డ్రోన్ దాడులు జరిపింది. 2025లో యూఏఈపై జరిగిన దాడుల్లో 2,200కి పైగా డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యూఏఈలో ఐరన్ డోమ్ను వినియోగంలోకి తెచ్చింది. యూఏఈ ఇప్పటికే అమెరికా నుంచి పాట్రియట్, థాడ్ రక్షణ వ్యవస్థలను పొందింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేరడంతో యూఏఈ రక్షణ మరింత బలపడనుంది. అమెరికా,ఇజ్రాయెల్,యూఏఈ త్రైపాక్షిక సహకారం ఇరాన్పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్,యూఏఈ,అమెరికా బలమైన కూటమి ఏర్పడుతోంది. తాజా పరిణామంతో యూఏఈలోని చమురు, వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు మరింత రక్షణగా ఉండనున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే, ఐరన్ డోమ్ వ్యవస్థ యూఏఈ భద్రతకు కీలకంగా మారుతుంది. మొత్తం మీద, యూఏఈలో ఐరన్ డోమ్ అమలు కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు .. ఇరాన్ ముప్పు పెరుగుతున్న ఈ సమయంలో, యూఏఈ భద్రతా వ్యూహంలో కీలక మలుపేనని నిపుణులు భావిస్తున్నారు. -
ఈసారి భీకర దాడే: ఇరాన్ వార్నింగ్
గల్ప్ దేశాలకు ఇరాన్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ నుంచి నాలుగింతలు దాడి చూడాలనుకుంటేనే అమెరికా మద్దతు విషయంలో ముందుకెళ్లాలని, ఈ తరుణంలో జరిగే పరిమాణాలకు మీరే బాధ్యత వహించాలని ఇరాన్ హెచ్చరించింది. యుద్ధానికి సంబంధించి రెండో విడత శాంతి చర్చలు ఇంకా అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో తమ పొరుగు గల్ఫ్ దేశాలు ఏమైనా అమెరికాకు మద్దతు ఇస్తే మాత్రం ఈసారి తమ నుంచి భీకర దాడి చూడాల్సి వస్తుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఎస్మాయిల్ సాగాబ్ ఎస్ఫహానీ హెచ్చరించారు. ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న నిర్బంధం కారణంగా తమ మౌలిక వసతులు, ముఖ్యంగా చమురు బావులు, దెబ్బతింటే మాత్రం నాలుగు రెట్లు ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వాలని భావించే గల్ఫ్ దేశాలు కాస్త వెనక్కి తగ్గితేనే మంచిదని, లేని పక్షంలో తమ నుంచి ఈసారి వచ్చే ప్రతిస్పందన మీ ఊహకు కూడా అందదని ఎస్ఫహానీ ముందస్తు సంకేతాలు పంపారు. ‘మా లెక్కలు వేరుగా ఉంటాయి. ఒక చమురు బావి అంటే నాలుగు చమురు బావుల నష్టం, అమెరికాకు మద్దతిస్తే మాకు భారీ నష్టాన్ని తేవడంలో మీ వంతు పాత్ర కూడా ఉందనే అనుకుంటాం. అందుకు ప్రతి స్పందన కూడా నాలుగింతలే ఉంటుంది’ అని పేర్కొన్నారు. గత వారం, తన ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్.. ఇరాన్ను కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థగా రాసుకొచ్చారు. ‘ ఇరాన్ ఆర్థికంగా కూలిపోతోంది. వారు హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని కోరుకుంటున్నారు . నగదు కోసం ఆకలితో ఉన్నారు. రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. సైన్యం, పోలీసులు జీతాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి’ అని తెలిపారు. -
దిగివచ్చిన ఇరాన్.. యుద్ధం ముగింపు, హార్మూజ్పై గ్రీన్సిగ్నల్!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు అందించింది అంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీంతో, యుద్ధంగా ముగుస్తుందా? అనే చర్చ మొదలైంది. అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ ప్రకారం..‘అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తానీ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ చేరవేసింది. వివాదాస్పద అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది’ అని వెల్లడించింది. కాగా, పశ్చిమాసియా సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన కీలక పరిణామంగా ఆ మీడియా కథనం అభివర్ణించింది. యాక్సియోస్ ప్రకారం.. వైట్హౌస్కు ఈ ప్రతిపాదన అందింది. కానీ, దీనిని పరిశీలించడానికి యునైటెడ్ స్టేట్స్ సుముఖంగా ఉందో లేదో స్పష్టంగా తెలియదు.Amid the deepening stalemate in peace talks, Iran has conveyed a fresh proposal to the United States through Pakistani mediators, prioritising reopening the Strait of Hormuz and bringing the ongoing war in West Asia to an end while deferring contentious nuclear negotiations to a… pic.twitter.com/DNRlZgKoZH— India Today Global (@ITGGlobal) April 27, 2026ఇదిలా ఉండగా.. చర్చలకు రెడీ అయితే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్కు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక, ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన శాంతి ప్రయత్నాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చింది.అణు చర్చలపై ఉత్కంఠ..అంతకుముందు.. ఇరాన్ కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే, నివేదిక ప్రకారం, ఈ డిమాండ్లకు ఎలా స్పందించాలనే దానిపై ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి మరియు ప్రధాన సంధానకర్త అబ్బాస్ అరఘ్చి వారాంతంలో మధ్యవర్తులతో చెప్పారు. ఇక, పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిన రెండు దశల ప్రణాళికలో మొదట హార్మూజ్ జలసంధిపై సంక్షోభాన్ని పరిష్కరించడం, అమెరికా దిగ్బంధనాన్ని ముగించడంపై ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమో చేయాలి. జలసంధిని తిరిగి తెరిచి, దిగ్బంధనాన్ని ఎత్తివేసిన తర్వాత, తదుపరి దశలో మాత్రమే అణు చర్చలు ప్రారంభించాలి. -
పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఇరాన్!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్పై ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ తగిన మధ్యవర్తి కాదంటూ బాంబు పేల్చారు. అమెరికాకు మాత్రమే పాకిస్తాన్ వత్తాసు పలుకుతోందని ఘాటు విమర్శలు గుప్పించారు. దీంతో, చర్చలపై కొత్త ట్విస్ట్ నెలకొంది.అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం నెలకొన్న వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఎంపీ ఇబ్రహీం రెజాయీ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇబ్రహీం ఎక్స్ వేదికగా..‘ఇరాన్కు పాకిస్తాన్ మంచి మిత్రుడే. కానీ, చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్కు లేదు. చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి, ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇస్లామాబాద్ వాషింగ్టన్ను బహిరంగంగా విమర్శించకుండా ఉంటోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చినట్టు అయ్యింది. కాగా, అరఘ్చి ఇటీవల మూడు రోజుల్లో రెండోసారి ఇస్లామాబాద్లో పర్యటించారు. అక్కడ ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో సంఘర్షణ, భవిష్యత్ కార్యాచరణ మార్గాలపై చర్చలు జరిపారు.ఫోన్లో చర్చలు: ట్రంప్ సూచనఇదిలా ఉండగా.. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి పరిష్కారం కోసం ఫోన్లో మాట్లాడుకోవచ్చని ట్రంప్ ఆదివారం సూచించారు. 17 గంటల విమాన ప్రయాణంలో ప్రతినిధి బృందాన్ని పంపే బదులు తానే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. "అన్ని అవకాశాలు మా చేతిలోనే ఉన్నాయి. వారు మాట్లాడాలనుకుంటే మా వద్దకు రావచ్చు, లేదా మాకు ఫోన్ చేయవచ్చు" అని ట్రంప్ అన్నారు. అయితే, ఆ ఫోన్ కాల్ ఎప్పుడు జరుగుతుందో మాత్రం సూచించలేదు.ట్రంప్ వార్నింగ్రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితిపై ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్.. దిగ్బంధనం కారణంగా వారివద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. -
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. దశాబ్ధానికిపైగా కరువుతో అల్లాడుతున్న ఇరాన్లో క్రమంగా వాతావరణం మారుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంపై ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చిందిసోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇరాన్లో మార్పుల వెనుక అసలు సీక్రెట్ అదేనా. ఇరాన్లో కరువు పరిస్థితులు శతృదేశాల కుట్రే పూరితంగా సృష్టించినవేనాఅమెరికా ఇరాన్ యుద్ధం మొదలై యాబై రోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్పై అమెరికా భారీ దాడులే చేసింది. క్షిపణులు, వైమానిక దాడులతో బీభత్సమే సృష్టించింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ఆయుధ శక్తిని ఉపయోగించింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న ఇరాన్ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా,ఇజ్రాయెల్కు ఇరాన్ అదే స్థాయిలో బదులిస్తోంది.ఇలాంటి సమయంలో ఇరాన్ వాతావరణం మారిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే ఇరాన్లో ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు, మంచు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక్కడే ఓ ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. దేశ వాతావరణాన్ని తారుమారు చేయడానికి వాడటానికి వినియోగించే రాడార్లను, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడం వల్లే ఈ వాతావరణ మార్పు సంభవించిందన్న వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దశాబ్ధానిపైగా ఇరాన్ కరువుతో అల్లాడుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సులే అక్కడి నీటి సంక్షోభం గురించి చెప్పడానికి ఉదహారణలుగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో యాభైరోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, మంచు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ పచ్చదనం చిగురులు తొడుగుతోంది. ఆనకట్టలు వాటి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్ మీడియా కుట్ర సిద్ధాంతాలతో హోరెత్తుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ వాతావరణ ఇంజినీరింగ్ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడమే వాతావరణంలో ఆకస్మిక మార్పులకు కారణమన్నది వారి వాదన.ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చెందిన అధునాతన రాడార్ వ్యవస్థలపై, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలపైన దాడి చేసిన మాట నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణి వ్యవస్థలు కేవలం ముందస్తు అలెర్ట్ కోసమే కాకుండా మధ్యధరా సముద్రంలోని తేమను ఇరాన్ పొరుగు ప్రత్యర్ధుల వైపు మేఘాలను మళ్లించడానికి వీటిని ఉపయోగించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.నిజానికి వర్షపు నీరు దొంగతనం అనే చర్చ ఇరాన్లో ఎప్పటి నుంచో ఉంది. 2018 నుంచి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. ఇజ్రాయెల్,అమెరికా, యూఏఈ జియో ఇంజినీరింగ్ను ఉపయోగించి వాతావరణ సరళిని తారు మారు చేస్తున్నాయనేది ఇరాన్ వాదన. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
ఇరాన్లో నిర్ణయాలు వీళ్లే తీసుకుంటున్నారా? ఇలాగైతే యుద్ధం..
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదురుతుందా? యుద్ధం మళ్లీ మొదలవుతుందా? అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇరాన్ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అమెరికాలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం తరఫున అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలీ ఖమేనీ (ఇరాన్ దివంగత సుప్రీం లీడర్)ను అమెరికా-ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత అతడి కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారని ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, మొజ్తబా ఖమేనీ తీవ్రగాయాలతో బాధపడుతున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా అతడికి లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అమెరికాతో చేస్తున్న యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై మొజ్తబా ఖమేనీని కాదని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోందని పలు నివేదికలు కూడా వచ్చాయి.నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తోంది ఇరాన్. మరి ఈ యుద్ధానికి ఇరాన్లో బాధ్యత తీసుకుంటోంది ఎవరు? ఆధికారికంగానైతే సుప్రీం లీడరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనే బాధ్యత వహిస్తున్నారని ఆ దేశం చెబుతోంది. ఫిబ్రవరి 28న (యుద్ధం తొలి రోజే) అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యత స్వీకరించాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో ఆ పదవిలో ఉన్న వారే తుది నిర్ణయం తీసుకుంటారు. యుద్ధం, శాంతి, దేశానికి సంబంధించిన వ్యూహాలు వంటి ముఖ్య విషయాలపై తుది మాట ఆ సుప్రీం లీడర్దే. అయితే, ఇరాన్కు సంబంధించిన నిర్ణయాలు నిజంగానే మొజ్తబా ఖమేనీనే తీసుకుంటున్నారా? ఇరాన్ నాయకత్వంలో అంతర్గతంగా ఏకాభిప్రాయం లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒకే నిర్ణయం మీద లేరని, వేర్వేరు వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నాయని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో, స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వాలని అమెరికా కోరుతోందని అన్నారు. అప్పుడు మాత్రమే చర్చలు సరిగ్గా ముందుకు వెళ్తాయని చెప్పారు.సుప్రీం లీడర్ ఎక్కడ?పదవి చేపట్టిన తర్వాత మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆయన పేరిట లిఖితపూర్వకంగా కొన్ని ప్రకటనలు రావడం తప్ప ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇరాన్ వ్యూహాలకు ఆమోదం తెలుపుతున్నారని గానీ చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తబా గాయపడ్డాడని ఇరాన్ అధికారులు అంగీకరించారు. కానీ, అందుకు సంబంధించిన వివరాలు తక్కువగా ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మొజ్తబా ముఖం సహా శరీరంలోని పలు అవయవాలకు గాయాలు తగిలి మాట్లాడటానికి కష్టంగా మారిందని పేర్కొంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధికారం కేవలం సంస్థాగతం కాదు. మొజ్తబా తండ్రి అలీ ఖమేనీ ప్రసంగాలు, ప్రత్యక్షంగా పలు కార్యక్రమాలకు హాజరు కావడం, పలు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం జరిపేవారు. అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరగడం లేదు.కొందరు యుద్ధ సమయంలో పదవీ స్వీకరణ వల్ల అతను తన అధికారాన్ని స్థాపించలేకపోయాడని అంటున్నారు. మరికొందరు గాయాల కారణంగా వ్యవస్థను నిర్వహించగలడా అన్న ప్రశ్న వేస్తున్నారు. పరిస్థితుల గురించి స్పష్టత లేదు. ఎవరు ఏమి నిర్ణయిస్తున్నారు? అసలు అధికారంలో ఎవరు బలంగా ఉన్నారు? అన్న దానిపై గందరగోళం ఉంది.క్లిష్టమైన సమయంలో బాధ్యతలు మొజ్తబా బాధ్యతలు చేపట్టిన సమయం చాలా క్లిష్టమైనది. ఆ సమయంలో యుద్ధం జరుగుతోంది. అందుకే తన నాయకత్వాన్ని పూర్తిగా అమలు చేయడానికి, తన మాట నిలబెట్టుకోవడానికి సరైన స్థిరత్వం, సమయం దొరకలేదు. ఫలితంగా, ఇరాన్లో ఇతర వర్గాలు/నాయకులు కూడా ప్రభావం చూపుతూ ఉండవచ్చు. పాలనలో మొజ్తబా పూర్తి నియంత్రణను స్థాపించుకోలేకపోయాడని తెలుస్తోంది. యుద్ధానికి ముందు నిర్ణయాలు సుప్రీంలీడర్ చుట్టూ ఉన్న వ్యవస్థ చేతిలో ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నిర్ణయాలు ఒక్కరే తీసుకోవడం లేదు. పలు వర్గాలు/నాయకులు కలిసి లేదా వేర్వేరు విధాలుగా ప్రభావం చూపుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరిగింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ వ్యూహాలు రచించడం అనేది వీరి చేతల్లో లేదని తెలుస్తోంది. పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ నేతృత్వంలో ప్రతినిధి బృందానికి ప్రస్తుతం ఉన్న అధికారాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇరాన్లో అరాఘ్చీ పాత్ర ఇతరుల నిర్ణయాల అమలు స్థాయిలోనే ఉంది. హార్మూజ్ విషయంలో ఆయన వెను వెంటనే చేసిన ప్రకటనలు సందేహాలు లేవనెత్తాయి. పెజెష్కియన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇస్లామాబాద్లో అమెరికాతో జరగాల్సిన రెండో దశ చర్చలు నిలిచిపోవడం దీన్నే సూచిస్తుంది.హార్మూజ్ జలసంధి నియంత్రణ ఇరాన్కు ఒత్తిడి సాధనంగా మారింది. దీని ద్వారానే అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. కానీ, దాన్ని మూసి ఉంచే నిర్ణయం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ – ఇరాన్ విప్లవ గార్డ్ సైనిక విభాగం) చేతిలో ఉంది. ఇరాన్లో ఒకే వ్యక్తి వ్యూహాన్ని స్పష్టంగా నడిపిస్తున్నట్టు కనిపించడం లేదు. చర్యలు, వాటికి సంబంధించిన సందేశాల మధ్య జాప్యం కనపడుతోంది. సుప్రీం లీడర్కు పూర్తిగా అధికారాలు ఉన్నాయి. కానీ, స్పష్టంగా అవే అమలు అవుతున్నట్లు కనపడడం లేదు. అధ్యక్షుడు నాయకత్వం వహించడం లేదు. రాజనీతిక చర్యలు నిర్ణయాత్మకంగా జరగడం కాదు. ఇలాగైతే యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే చరిత్రలో ఎవరూ చూడనంత విధ్వంసాన్ని చూస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. యుద్ధం భీకరంగా జరిగితే ఇరాన్లో అంతా బూడిదే మిగులుతుంది. -
పాక్ ప్రధానితో ఇరాన్ ఫోన్ కాల్..
ఇస్లామాబాద్: ఇరాన్, అమెరికా మధ్య చర్చల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్కు పంపించడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక కామెంట్స్ చేశారు.పెజెష్కియాన్ తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన కుండబద్దలు కొట్టారు.కాగా, ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పేజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అరాగ్చీ స్పందన..ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్ వర్క్ను పాకిస్తాన్కు అందించామని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన చెప్పారు. అయితే, శాంతి చర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ అరాగ్చీ ఒమన్ పర్యటనలో ఉన్నారు. అయితే, చర్చల కోసం ఆయన తిరిగి పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. -
అయ్యో ఇరాన్.. ఎంతటి గడ్డు పరిస్థితులు..
వెనకటికి ఒక సామెత ఉండేదంటారు.. పైన పటారం.. లోన లొటారం.. అని.. ఈ సామెత ఇప్పుడు అచ్చు గుద్దినట్టు ఇరాన్కు వర్తించేలా ఉంది. ఎందుకంటే అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పైకి అంత బాగానే ఉన్నట్టు మేనేజ్ చేస్తున్న ఇరాన్.. వాస్తవంగా మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అది ఎంతలా అంటే.. ఆహార ద్రవ్యోల్బణం 112 శాతానికి చేరుకుంది. వంట నూనెల ధరలైతే 200% పైగా పెరిగాయి. నిత్యావసరాలే కాదు.. చివరికి అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయి. దీంతో, ఇరాన్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.అమెరికా, ఇజ్రాయెల్ మార్చి యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం, పరిశ్రమలకు జరిగిన నష్టం.. ఇలా అన్నీ కలిసి పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2026 ఏప్రిల్ నాటికి పాలు, గుడ్లు, చికెన్, బియ్యం వంటి ఆహార పదార్థాలు 70–130% వరకు పెరిగాయి. ముఖ్యమైన ఔషధాలు అయితే 300% నుండి 2,700% వరకు పెరిగి సాధారణ కుటుంబాలకు అందని స్థాయికి చేరాయి. ఇన్సులిన్ కొరత కారణంగా రేషన్ విధానం అమలు చేస్తున్నారు. సాధారణ నొప్పి నివారణ మందులు కూడా రేషన్లోనే అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య మందులు లభ్యం కావడం కష్టమైంది. దీంతో, సామాన్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి ద్రవ్యోల్బణం 80% నుంచి 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.అయితే, 2025 చివరి నాటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ద్రవ్యోల్బణం 50% పైగా కొనసాగింది. రియాల్ విలువ 20 రోజుల్లో 20% కంటే ఎక్కువ తగ్గింది. బ్యాంక్ అయాందె కుప్పకూలడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లోనే యుద్ధం ప్రారంభమైంది. దీంతో, ఇరాన్ రియాల్ విలువ ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. ఒక డాలర్ విలువ 16 లక్షల రియాల్స్కు దగ్గరలో ఉంది. దీంతో పౌరుల పొదుపు ఆవిరవుతోంది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ మూతపడుతున్నాయి. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించడంలేదు సరి కదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోంది. చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీంతో బ్యాంక్లు చాలా ఖాతాలను మూసివేస్తున్నాయి.గుడ్డు, మాంసం ఎంతంటే.. గత రెండు నెలల్లో ఇరాన్లో గుడ్లు, మాంసం, వంట నూనె ధరలు నిరంతరం పెరిగాయి. గుడ్ల ధరలు 2026 ఏప్రిల్ నాటికి రూ.333(భారత కరెన్సీ ప్రకారం)కి చేరాయి. మాంసం ధర కిలోకు రూ.574 వరకు పెరిగాయి. 2025లో మాంసం ధర రూ.313గా ఉంది. ఇక, వంట నూనె ధరలు కూడా 100% పైగా పెరిగి 380 వరకు చేరాయి. 2025లో వంట నూనె ధర రూ.180గా ఉంది. ఇక, 2025లో బియ్యం ధర రూ.34 ఉండగా.. తాజాగా 67కు చేరుకుంది.ఉద్యోగుల పరిస్థితి ఇదీ.. అధికారిక లెక్కల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 20 నుంచి 30 లక్షల వరకు ఉండొచ్చని ఓ అంచనా. 1.5 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆదాయం లేక అల్లాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే నెలవారీ సబ్సిడీ, ఫుడ్ వోచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి నెలకొంది.కారణాలు..ఇంటర్నెట్ బ్లాకౌట్ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం.యువత, చిన్న వ్యాపారాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.పేదరికం, నిరుద్యోగం పెరుగుతూ ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.ప్రభావిత రంగాలుఈ-కామర్స్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, మీడియా, విద్య, సర్వీస్ రంగాలు ప్రభావితమయ్యాయి.నిరంతర కనెక్టివిటీ అవసరం ఉండటంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి.పెద్ద కంపెనీలు: ఉద్యోగాల కోతలు ఇప్పుడు పెద్ద వాణిజ్య సంస్థలలో కూడా ప్రారంభమయ్యాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం, ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుకోవడం, అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ చర్యలు తీసుకుంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా, కనీస స్థాయిలో అయినా నిలబడే అవకాశం ఉంటుంది.ప్రధాన లక్ష్యాలు..ఆర్థిక స్థిరీకరణ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, కరెన్సీ విలువను నిలబెట్టడం.ప్రజల జీవన ప్రమాణాలు: ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం.పరిశ్రమల పునరుద్ధరణ: పెట్రోకెమికల్స్, మెటల్స్, వ్యవసాయం, నిర్మాణ రంగాలను తిరిగి నిలబెట్టడం.బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణ: బ్యాంకుల లిక్విడిటీ, డిపాజిట్లపై నమ్మకం కాపాడుకోవడం, రుణాలపై నియంత్రణ.సామాజిక స్థిరత్వం: నిరుద్యోగం తగ్గించడం, ప్రజల్లో అసంతృప్తి తగ్గించడం.అంతర్జాతీయ సంబంధాలు: నిర్బంధం, బ్లాకేడ్ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు కనుగొనడం. యూఏఈ, టర్కీ వంటి ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా పరిమిత ఎగుమతులు కొనసాగించడం. -
వెనుతిరిగిన ఇరాన్, ముందుకు రాని అమెరికా... రెండో విడత ప్రత్యక్ష చర్చలపై వీడని పీటముడి
-
మూడు విశ్వాసాల కేంద్రం
ఇటీవలి ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల్లో కొంతకాలం నిర్బంధాలకు గురైన జెరూసలేం నగరంలోని ప్రార్థనా స్థలాలు, కాల్పుల విరామ సమయంలో మళ్లీ తెరుచుకున్నాయి. ‘వెయిలింగ్ వాల్’గా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోడ వద్ద యూదులు; అల్–అఖ్సా మసీదులో మహమ్మ దీయులు; పరిశుద్ధ సమాధి ఆలయంలో క్రైస్తవులు– ఇలా మూడు ముఖ్య మతాలవారూ ఒకేసారి ప్రార్థనలు చేస్తున్న ఈ చిన్న నగరం ఎందుకు ప్రపంచాన్ని ఇంతలా ఆకర్షిస్తోంది? యుద్ధ మేఘాల మధ్య కూడా ఆధ్యాత్మిక ఆకర్షణను ఎలా నిలబెట్టుకోగలుగుతోంది?క్రీ. పూ. 1000 ఏళ్ల ప్రాంతంలో పాత ఇశ్రాయేలును పాలించే యూదురాజు దావీదు ‘జెబూసులు’ అనే స్థానిక తెగల నుంచి జెరూసలేం నగరాన్ని జయించి, దానిని ఏకీకృత ఇశ్రాయేలు రాజ్య రాజధానిగా చేశాడు. అతని కుమారుడు సాలమన్ ఆ నగరంలో నేడు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తున్న కొండపై మొట్ట మొదటి యూదు ఆలయం నిర్మించాడు. ఆ ఆలయాన్ని తరువాతి కాలంలో బాబిలోనియన్లు, ఆ తరువాత రోమన్లు ధ్వంసం చేశారు. మిగిలిన అవశేషమైన గోడను ఈ రోజు ‘ఏడ్పుల గోడ’గా పిలుస్తున్నారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ కొండ, దానిపై ఒకప్పుడున్న ఆలయం గుర్తుగా మిగిలిన అవశేషం యూదులకు పరమ పవిత్రమైన ప్రార్థనా స్థలాలు.క్రైస్తవ మతానుయాయులకు, జెరూసలేం యేసుక్రీస్తు జీవితంతో ముడిపడి ఉంది. యేసు ఇక్కడే బోధించాడు, శిలువ వేయబడ్డాడు, పునరుత్థానం చెందాడు. నాలుగవ శతాబ్దంలో ‘పరిశుద్ధ సమాధి’ నిర్మాణంతో ఇది క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మారింది. ‘గోల్గతా’ లేదా ‘కల్వరి’గా పిలిచే శిలువ వేయబడిన స్థలం, క్రీస్తు సమాధి అయ్యి పునరుజ్జీవం పొందిన అనంతరం ఖాళీ అయిన సమాధి, శిక్షాస్థలి నుండి శిలువ వరకు క్రీస్తు నడిచి వెళ్ళిన ‘వేదన మార్గం’ (లేదా డోలోరోసా), సమాధికి వెళ్ళే మార్గంలో, క్రీస్తు అనుభూతులను జ్ఞప్తికి తెచ్చే 14 ముఖ్య ప్రాంతాలు– క్రైస్తవులకు పరమ పూజనీయాలు.ముస్లింలు అల్–ఖుద్స్గా పిలుచుకునే జెరూసలేం నగరం వారికి మక్కా, మదీనాల తరువాత అత్యంత పవిత్రమైన స్థలం. ఇస్లాం మొదటి రోజుల్లో జెరూసలేం వైపే ఖిబ్లా, అంటే ‘నమాజు చేసే దిక్కు’ ఉండేది; తరువాతి రోజుల్లో కారణాంతరాల వల్ల ఈ దిక్కు మక్కాలోని ‘కాబా’ వైపునకు మారింది. మహమ్మద్ ప్రవక్త ఒక రాత్రి మక్కా నుంచి జెరూసలేం వచ్చి; హరామ్ అల్ షరీఫ్ (అదే ప్రాంతాన్ని యూదులు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తారు)లోని ‘పునాది శిల’ నుంచి స్వర్గారోహణ చేశాడని మహమ్మదీయులు విశ్వసిస్తారు. అదే శిలపై తరువాతి కాలంలో నిర్మించబడిన ‘రాతి గుమ్మటం’, దాని పరిసరాలలోని ‘అల్–అఖ్సా మసీదు’... ఇవన్నీ మహమ్మదీయులకు ఎనలేని ప్రాధాన్యం కలిగిన స్థలాలు. మహమ్మద్ ప్రవక్త స్వర్గారోహణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన ఇస్రా, మిరాజ్లకు కూడా ఈ ప్రాంతం కేంద్ర బిందువు.ఒకే మూల పురుషుడుఆరాధనా స్థలాలలోనే కాదు, ఆవిర్భావంలో కూడా ఈ మూడు మతాలకు విశేషమైన సారూప్యత, సామీప్యత ఉన్నాయి. ‘ఒకే దైవం’ అనే సిద్ధాంతాన్ని విశ్వసించి, బోధించిన ప్రప్రథమ ప్రవక్త ‘అబ్రహమ్’ లేదా ‘ఇబ్రహీమ్’. ఆ ప్రవక్త కుమారుడైన ఇసాక్కు జాకబ్ జన్మించాడు. ‘ఇజ్రాయెల్’ అనే దైవదత్త నామాంతరం కలిగిన జాకబ్ నుండి యూదులు ఉద్భవించటంతో, వారి ప్రాంతం ‘ఇజ్రాయెల్’గా పేరొందింది. జన్మతః యూదు మతస్థుడైన క్రీస్తు మరణానంతరం... ఆయనను విశ్వసించే యూదు సమూహం వారి అసలు మతాన్నుండి విడివడటంతో క్రైస్తవులుగా వారిని పిలుస్తున్నారు. అబ్రహమ్ మరో కుమారుడైన ఇస్మాయిల్ నుండి ఇస్లాం ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. ఇలా ఒకే మూల పురుషుడు గలిగిన మూడు మతాలవారు, ఒకే భౌగోళిక ప్రాంతంలో తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్థనలు నిర్వహించడం అసాధారణం కాదు.ఒకే ప్రవక్త నుండి ఉద్భవించి, ఒకే చరిత్రను పంచుకోవడం వల్ల జెరూసలేం మూడు మతాలవారికీ ముఖ్య కేంద్రంగా ఖ్యాతికెక్కింది. చిత్రంగా, అదే చారిత్రక వాస్తవం శతాబ్దాలుగా సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు – ఒక్కోసారి మానవ హననానికి కూడా కారణమవుతోంది. యుద్ధ విరామంలో ఈ పవిత్ర స్థలం తిరిగి అందరినీ అక్కున జేర్చుకోవడం సుస్థిరమైన శాంతిని స్థాపించే సుదీర్ఘ ప్రస్థానంలో చిన్న ఆశాకిరణం.కృష్ణబాలాజీ పల్లపోతువ్యాసకర్త ఎస్బీఐలో, పశ్చిమాసియా దేశాల్లో విధులు నిర్వహించిన విశ్రాంత ఉన్నతాధికారి -
మళ్లీ మొదటికి!
ఇస్లామాబాద్/వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో హార్మూజ్ దిగ్బంధం ఏ స్థాయిలో కొనసాగుతోందో పాకిస్తాన్ వేదికగా రెండో దఫా ప్రత్యక్ష చర్చలపై ప్రతిష్టంభన అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒకడుగు ముందుకేసి పాకిస్తాన్కు స్వయంగా విచ్చేసి ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్లతో చర్చిస్తున్న వేళ సంతోషం వ్యక్తంచేసిన అమెరికా తన బృందాన్ని సైతం పంపేందుకు సంసిద్ధమవుతుండగా అరాఘ్చీ హఠాత్తుగా పాక్కు వీడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కోపం తెప్పించారు.దీంతో ఇరాన్ బృందంలేని పాకిస్తాన్లో తాము మాత్రం ఎలా ప్రత్యక్ష చర్చలకు కూర్చోగలమనే అసహనంతో ట్రంప్ వెంటనే తన బృందం ప్రయాణాన్ని రద్దుచేశారు. దీంతో రెండోదఫా ప్రత్యక్ష చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ అంశంలో ఇరాన్ ఒక స్పష్టతనిచ్చింది. అమెరికాతో మరోమారు ప్రత్యక్షచర్చలకు కూర్చోబోమని తెగేసి చెప్పింది. పరోక్ష చర్చలకే తాము సుముఖంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ శనివారం ప్రకటించారు. పాక్ ప్రధాని, ఫీల్డ్ మార్షల్తో మంతనాలు పాక్ నుంచి ఒమన్కు వెళ్లిపోయే ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషక్ దార్లతో విస్తృతస్థాయిలో చర్చించారు. శాంతి చర్చలకు సంబంధించిన తమ దేశ డిమాండ్లను అమెరికాకు తెలియజేయాలని సంబంధిత ప్రతిపాదనల చిట్టాను షెహబాజ్కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తరఫున ఉప విదేశాంగ మంత్రి కజీమ్ ఘరీబ్అబాదీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్, పాక్ తరఫున పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.అయితే చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల వివరాలను అటు పాక్గానీ ఇటు ఇరాన్గానీ అధికారికంగా బహిర్గతంచేయలేదు. ప్రాంతీయ అస్థిరత, శాంతి చర్చల అంశాలపై నేతలు చర్చించారని సామాజిక మాధ్యమంలో ఇరాన్ రాయబార కార్యాలయం ఒక పోస్ట్పెట్టింది. ఇరాన్ పెట్టిన షరతులను ఇస్లామాబాద్కు విచ్చేసే అమెరికా ప్రతినిధుల ఎదుట పాక్ పెట్టనుందని, వాటికి సమ్మతిస్తేనే ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ బృందం పాక్కు రానుందని పాక్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ వివరాలను తుర్కియేతో పాక్ పంచుకుంది. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.. తమ బృందం రాకముందే ఇరాన్ మంత్రి పాక్ నుంచి వెళ్లిపోయారనే వార్త తెల్సి ట్రంప్ వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులనూ పాక్కు పంపబోమని తెగేసి చెప్పారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘18 గంటలు ప్రయాణించి ఇస్లామాబాద్కు వెళ్లేందుకు నా బృందం సిద్ధమవుతుంటే వెంటనే ఆగిపొమ్మని చెప్పేశా. పాక్కు అన్ని గంటలపాటు ప్రయాణంచేయడం వృథా. అనవసర శ్రమ. పాక్లో మనతో మాట్లాడ్డానికి ఎవరూ లేనప్పుడు, ఎలాంటి చర్చల్లేనిదానికి అంతదూరం వెళ్లడం దండగ.అసలే ఇరాన్లో ఎవరు తమ నేతనో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. వాళ్లలో ఇన్చార్జ్ ఎవరో వాళ్లకే తెలీడంలేదు. ఆట మనచేతుల్లోనే ఉంది. వాళ్లకు అంతగా మాట్లాడాలనుకుంటే ఇరాన్ నాయకులు మనకు ఫోన్చేసి మాట్లాడతారు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. పశి్చమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్లను పాక్కు కొద్దిసేపట్లో పంపబోతున్నామని శ్వేతసౌధంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అంతకుముందే ప్రకటించగా కొన్ని నిమిషాలకే ట్రంప్ విరుద్ధమైన ప్రకటన చేశారు.దీంతో అమెరికా ప్రతినిధి బృందం పాక్ పర్యటన చివరినిమిషంలో వాయిదాపడింది. ఈ బృందం ఇక ఎప్పుడు పాక్కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యక్ష చర్చల కోసం తమ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్దార్ పునరుద్ఘాటించారు. అమెరికా చిత్తశుద్ధిచూద్దాం.. పాక్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్కు చేరుకున్న ఇరాన్ మంత్రి అరాఘ్చీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘పాక్లో పర్యటన సత్ఫలితాలనిచ్చింది. యుద్ధం శాశ్వత పరిసమాప్తికి మేం చేసిన ప్రతిపాదనలను పాక్ ముందుంచాం. వాటిని వినేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఏపాటి చిత్తశుద్ధిచూపుతుందో చూద్దాం’’అని అన్నారు. ఒమన్ తర్వాత రష్యాలో అరాఘ్చీ పర్యటిస్తారు. తిరిగి ఆయన శనివారం లేదా ఆదివారం పాక్కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇంధనాన్ని ఆదా చేసుకోవాలి: మసూద్ యుద్ధకాలంలో ఇరాన్ ఇంధన వనరులు, మౌలికవసతులను అమెరికా సేనలు దారుణంగా దెబ్బతీయడంతో వాటిని ఇప్పుడు పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. ‘‘ఇంట్లో పది లైట్లు ఉంటే అన్ని వెలిగించాల్సిన అవసరమేంటి? ఒక రెండు వెలిగిస్తే సరిపోతుంది’’అని సలహా ఇచ్చారు. కరెంట్ వృథా ఖర్చును భారీగా తగ్గించుకోవాలని ఇరాన్ విద్యుత్ సంస్థ సీఈవో తవానిర్ ఇరానియన్లను కోరారు. -
ఇరాన్కు అమెరికా షాక్.. ఆ డబ్బు మొత్తం ఫ్రీజ్!
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. ఇరాన్తో చర్చల కోసం ఇస్లామాబాద్కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధుల బృందం పర్యటనను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నపళంగా రద్దు చేశారు. ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఇరాన్కు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఇరాన్కు సంబంధించిన 344 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3242 కోట్ల) విలువైన క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్ చేశామని ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకునేలా ఇరాన్పై ఒత్తిడి తీసు కువచ్చేందుకు అమెరికా ఈ తరహా ప్రయత్నాలు చేస్తోంది. 'నిధులు సమకూర్చుకోవడం, వాటిని తరలించడం వంటి విషయాల్లో ఇరాన్ సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాం. దానిలో భాగంగానే ఇరాన్తో సంబంధం ఉన్న పలు వాలెట్లపై ఆంక్షలు విధిస్తున్నాం. దాంతో నిధులు ఫ్రీజ్ అవుతాయి' అని బెసెంట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. -
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్కు, అమెరికా, ఇజ్రాయెల్లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్పై యుద్ధ ప్రభావం⇒ డాలర్తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
చర్చల వేళ మరో ట్విస్ట్.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
టెహ్రాన్: మరోసారి అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా 'సముద్రపు దోపిడీ' కొనసాగిస్తే.. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ సైన్యం తేల్చిచెప్పింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మధ్య సమన్వయం వహించే అత్యున్నత సైనిక విభాగం 'ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ఈ ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తమ సాయుధ బలగాల నుండి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటూ ఇరాన్ పేర్కొంది.ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా, గరిష్ట స్థాయి సంసిద్ధతతో ఉన్నాయని.. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ(శనివారం) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్లో జరగాల్సిన ఈ చర్చల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నౌకాదళం ముందుగా హార్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ స్పష్టమైన షరతు విధించింది. ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
దాదాపు 50 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. ఇరాన్ కీలక నిర్ణయం
టెహ్రాన్: యాభై రోజుల ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానా సేవలను పునరుద్ధరించారు. వాణిజ్య విమానాల రాకపోకలను శనివారం నుంచి ప్రారంభించినట్లు ఇరాన్ వెల్లడించింది. తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్లీ విమాన సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం.. ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో విమానా సేవలను పునరుద్ధరించారు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని విమానయాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించడానికి అధికారులు నాలుగు దశల ప్రణాళికను అమలు చేస్తున్నారు.'ఫ్లైట్ రాడార్ 24' డేటా ప్రకారం.. శనివారం ఉదయం టెహ్రాన్ నుండి ఇస్తాంబుల్కు మూడు విమానాలు బయలుదేరాయి. వీటితో పాటు మస్కట్, మదీనాకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కీలకమైన మార్గాల్లో సేవలను పునరుద్ధరించారు. యుద్ధం కారణంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ను కూడా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం తర్వాత తన వైమానిక మార్గాలను పాక్షికంగా తెరవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే విమాన సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతం నేరుగా సైనిక దాడులు నిలిచిపోయినప్పటికీ, పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఒక్కో దశలో విమాన రాకపోకల సామర్థ్యాన్ని పెంచుతూ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు. -
హార్ముజ్ లో హై టెన్షన్.. అటు అమెరికా.. ఇటు ఇరాన్ నౌకలు సీజ్
-
చర్చల్లో ఇరాన్ బిజీ.. యుద్ధం బహుమతి అంటూ అమెరికా వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్కు చేరుకోగా, వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్లు పాకిస్తాన్ బయల్దేరారు. మరోవైపు.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. అలాగే, ఇరాన్ యుద్ధంపై ఈజిప్టు, పాక్ అధికారులు చర్చించారు. అమెరికా, ఇరాన్ల మధ్య మరో విడత చర్చలు ప్రారంభించే ప్రయత్నాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు.ఈ క్రమంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం ప్రపంచానికి పెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్ సముద్ర రవాణాపై అమెరికా దిగ్బంధనం అవసరమైనంత కాలం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక వైఖరి బలహీనపడిందని, సముద్రంలో క్రమరహిత వ్యూహాలపై ఎక్కువగా ఆధారపడుతోందన్నారు. అవసరమైనంత కాలం ఒత్తిడిని కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దెబ్బతిన్న ఇరాన్ సైన్యం, ప్రత్యేకించి ఐఆర్జీసీ సముద్రపు దొంగల ముఠాగా మారిపోయిందని తెలిపారు. విచక్షణారహితంగా మందుపాతరలు పాతేది, యాదృచ్ఛికంగా ఓడలపై కాల్పులు జరిపేది, కొన్ని వారాల వ్యవధిలో 45,000 మంది తమ సొంత ప్రజలను అమాయక నిరసనకారులను చంపింది వారేనని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అనుమానాస్పద డ్రగ్స్ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యూఎస్ సదరన్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో నీటిలో తేలియాడుతున్న ఒక పడవ పేలుడు ధాటికి పూర్తిగా మంటల్లో కాలిపోతున్నట్టు ఉంది. స్మగ్లింగ్ మార్గాల్లో వెళ్తున్న డ్రగ్స్ సరఫరాదారులనే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది.ఇరాన్ కౌంటర్.. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు వరకు ఇజ్రాయెల్ గగనతలంపై తాము పూర్తి పట్టును సాధించామని ఇరాన్ రక్షణశాఖ అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ రజా తలాయీ నైక్ వెల్లడించారు. దాడులు చేసేందుకు మరిన్ని అధునాతన ఆయుధాలు ఇరాన్ అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఇరాన్ స్వయంగా అధునాతన ఆయుధాలను తయారుచేస్తోందని, ఇదే పేర్కొన్నారు. -
అమెరికాకు ఇరాన్ షరతులు.. హార్ముజ్ లో హై టెన్షన్
-
అమెరికాతో చర్చలు.. ఇరాన్ కొత్త ట్విస్ట్!
-
అమెరికాతో చర్చలు.. ఇరాన్ కొత్త ట్విస్ట్!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమెరికాను దురాక్రమణదారుగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. దీంతో, చర్చల విషయమై పాకిస్తాన్కు టెన్షన్ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా మరికొన్ని గంటల్లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాగా, అమెరికా నుంచి ప్రత్యేక రాయబారులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అరాగ్చీ బృందం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగబోవని స్పష్టంచేసింది. ప్రాంతీయ శాంతి ప్రయత్నాల మధ్య ఈ పర్యటన కొనసాగుతున్నప్పటికీ, అమెరికా-ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని తెలిపింది. తమ అభిప్రాయాలను పాకిస్తాన్ అధికారులకు మాత్రమే వివరిస్తామని తెలిపింది. దీంతో, చర్చలపై మరోసారి సందిగ్ధం నెలకొంది.మరోవైపు.. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10వేల మంది భద్రతాసిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్ను పూర్తిగా మూసివేసి, కార్యాలయ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. కాగా, ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్తో చర్చల కోసం పాక్కు వెళ్లనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదు. చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
హార్ముజ్ లో రణరంగం.. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
-
చర్చలపై కొత్త ఆశలు!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో హార్మూజ్జలసంధి దిగ్బంధంతో రెండో దఫా చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాకిస్తాన్ చేరుకోవడం శాంతి చర్చలపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. పాకిస్తాన్తోపాటు ఒమన్, రష్యాల్లోనూ పర్యటించి శాంతి చర్చల్లో తేల్చుకోవాల్సిన కీలకాంశాలపై ఒక అవగాహనకు రానున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘‘టెహ్రాన్ నుంచి ఇస్లామాబాద్(పాకిస్తాన్), మస్కట్(ఒమన్), మాస్కో(రష్యా) పర్యటనకు శ్రీకారం చుడుతున్నా. ద్వైపాక్షిక అంశాలపై మా భాగస్వాములతో సహకారం కోసం ఈ మూడు దేశాల్లో పర్యటించబోతున్నా. పొరుగుదేశాలే మాకు ముఖ్యం’’అని అరాఘ్చీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స’ఖాతాలో శుక్రవారం ఒక పోస్ట్పెట్టారు. దీంతో రెండోదఫా చర్చలకు సన్నాహకాలు మొదలయ్యాయని తెలుస్తోంది. అరాఘ్చీ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్కు చేరుకున్నారు. అమెరికా దౌత్యవేత్తలకు సాయపడే బృందాలు, భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇస్లామాబాద్లో సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సాంకేతిక బృందంతో ఇరాన్ మధ్యవర్తులు మాట్లాడి షెడ్యూల్ను ఖరారుచేశాక అసలైన అమెరికా ప్రతినిధుల బృందం శనివారం రాత్రికల్లా ఇస్లామాబాద్కు చేరుకుంటుందని పాక్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. స్టీవ్ విట్కాఫ్, కుష్నర్లు శనివారం పాకిస్తాన్ చేరుకుంటారని అమెరికా కూడా ధ్రువీకరించింది. కొనసాగుతున్న దిగ్బంధం‘‘ట్రంప్ సూచనమేరకు సముద్రమందుపాతరలను పెట్టే పడవలను పేల్చేందుకు కాచుకుని కూర్చున్నాం. దశాబ్దాల్లో తొలిసారిగా పశ్చిమాసియాజలాల్లో ఒకేసారి మూడు అమెరికా యుద్ధవిమానాల వాహక నౌకలు యూఎస్ఎస్ అబ్రహాం లింకన్, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్, యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ లు చక్కర్లు కొడుతున్నాయి. 200 యుద్ధవిమానాలు, 15,000 మంది నావికాదళసభ్యులు హార్మూజ్ను దిగ్బంధించాయి’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ శుక్రవారం వెల్లడించింది. మరోవైపు అమెరికాయేతర నౌకలు సైతం అమెరికా నౌకాశ్రయాల్లోకి ముడిచమురు, సహజవాయువులను సరఫరాచేసేందుకు వీలుగా జోన్స్ చట్టం అమలును మరో 90 రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ స్వాదీనంచేసుకున్న ఎపామినోండాస్ నౌకలోని భారతీయ నావికుడు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర పోర్ట్లు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రణ్ధావా శుక్రవారం చెప్పారు. -
చైనాకు షాకిచ్చిన అమెరికా!
ఇరాన్తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాలపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా ఆచరణలోకి తీసుకొచ్చింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం చైనాలోని హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీ సహా ఇరాన్ చమురుతో సంబంధం ఉన్న సుమారు 40 షిప్పింగ్ సంస్థలు, ట్యాంకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్కు కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను నిలిపేయడానికి ట్రంప్ చేసిన ఎత్తుగడలో ఇదొక భాగమని చెప్పొచ్చు. అంతేకాదు ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన పర్షియన్ గల్ఫ్ జలమార్గమైన హర్మూజ్జలసంధిని అమెరికా దిగ్భంధనం చేసిన సంగతి తెలిసిందే. కాగా చైనాకు చెందిన హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీలో రోజుకు సుమారు 400,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది చైనాలోనే అతిపెద్ద స్వతంత్ర రిఫైనరీల్లో ఒకటిగా నిలిచింది. ఇక 2023 నుంచి హెంగ్లీ రిఫైనరీ ఇరాన్ నుంచి ముడి చమురును సరఫరా చేసుకుంటూ ఇరాన్ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నట్లు సమాచారం. ప్రపంచ మార్కెట్లకు చమురును తరలించడానికి ఇరాన్ ఆధారపడే నౌకలు, మధ్యవర్తులు, కొనుగోలుదారుల నెట్వర్క్ను మరింత కఠినతరం చేస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ మొదటివారంలో ఇరాన్తో వ్యాపారం చేస్తున్న చైనా, హాంగ్ కాంగ్, యూఏఈ, ఒమన్లోని ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తూ ఆంక్షలు విధిస్తామని లేఖలు పంపించింది. కాగా మరికొన్ని వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన కీలక రిఫైనరీపై ఆంక్షలు విధించడం ఎలాంటి చర్చకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది. -
క్యాన్సర్తో బాధపడుతున్న నెతన్యాహు!
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని నెతన్యా హునే స్వయంగా పేర్కొన్నారు అయితే తనకు వచ్చిన ముప్పేమీ లేదని, ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. ఇటీవల తొలిదశ ప్రొస్టేట్ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నట్లు నెతన్యాహు తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్వయంగా ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తన ఆరోగ్య నివేదిక బయటకు రాకుండా ఉండేందుకు తానే అడ్డుపడినట్లు వెల్లడించారు. ఒకవేళ ఈ విషయం బయటికొస్తే ఇరాన్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసే అవకాశముందని, అందుకే 2 నెలల పాటు తన వార్షిక ఆరోగ్య నివేదికను వాయిదా వేయాలని అధికారులను అభ్యర్థించినట్లు ట్వీట్లో తెలిపారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. తనకు ప్రారంభ దశలోనే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే విజయవంతమైన చికిత్స పూర్తయిందని స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై వివరిస్తూ, ప్రోస్టేట్లో చిన్న స్థాయి సమస్యను వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. అది ఇతర అవయవాలకు వ్యాపించకముందే చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ సమస్య ఎదురయ్యిందని, అప్పటికే ప్రొస్టేట్లో ఒక సెంటీమీటర్ కంటే చిన్న సైజులో మచ్చ గుర్తించినట్లు చెప్పారు. దీనిని టెస్ట్ చేయగా, క్యాన్సర్ తొలి దశలో ఉన్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలోనే జెరూసలేంలోని హదస్సా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రజలు తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. అయితే ఇరాన్తో యుద్ధం సమయంలో నెతన్యాహు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన మరణ వార్తలను ఖండించిన నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజలతో కాఫీ తాగుతున్న వీడియోలను షేర్ చేసుకున్నారు. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఏఐతో నెతన్యాహు వీడియోను సృష్టించారని పేర్కొంది. దీంతో నెతన్యాహు మరోసారి స్వయంగా తన ఫోన్లో తీసిన వీడియోనూ సామాజిక మాధ్యమంలో షేర్ చేసుకుంటూ తాను ఇంకా బతికే ఉన్నానని, ఇరాన్ తప్పుడు ప్రచారం మానుకోవాలని పరోక్షంగా ఎద్దేవా చేశారు.היום התפרסם הדו״ח הרפואי השנתי שלי. ביקשתי לעכב את פרסומו בחודשיים כדי שהוא לא יפורסם בשיא המלחמה על מנת שלא לאפשר למשטר הטרור באיראן להפיץ עוד תעמולת כזב נגד ישראל. אני מבקש לשתף אתכם בשלושה דברים:1 - ברוך השם, אני בריא.2 - אני בכושר גופני מצויין.3 - הייתה לי בעיה…— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) April 24, 2026 -
మలి విడత చర్చలు.. పాక్కు అమెరికా ప్రతినిధులు!
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న మలి విడత శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు పాకిస్తాన్కు వెళ్లనున్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్తో జరిగే చర్చల్లో పురోగతి కనిపిస్తే వాన్స్ పాకిస్తాన్కు వెళ్తారని అధికారులు తెలిపారు. కాగా మలి విడత చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఆయన పాకిస్తాన్కు బయల్దేరి వెళ్లడానికి ముందు పాకిస్తాన్ డిప్యూటీ సీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో వరుస హెచ్చరికలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న ఇరాన్, అమెరికాకు చెందిన ప్రతినిధులు పాక్కు చేరుకోవడం చూస్తుంటే రెండో విడత శాంతి చర్చలు ఉంటాయనే అంచనాలు బలపడుతున్నాయి. -
అమెరికా సంచలన ప్రకటన : ఆ నేతను పట్టిస్తే రూ.94 కోట్లు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం ఇరాన్ మద్దతు ఉన్న మిలిషియాపై తన ఒత్తిడిని మరింత పెంచుతోంది. తాజాగా 'ఖతైబ్ సయ్యిద్ అల్ శుహదా' (KSS) ఉగ్రవాద సంస్థ అధినేత హషీమ్ ఫిన్యాన్ రహీమ్ అల్-సరాజీ (అలియాస్ అబూ వాలా అల్ వేలీ) గురించి సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 94 కోట్లు పైమాటే) బహుమతిని ప్రకటించింది. మిలీషియాలను అదుపులోకి తీసుకురావడానికి మరింతగా కృషి చేసే అవకాశం ఉన్న కొత్త ప్రధానమంత్రిని నియమించేలా బాగ్దాద్ను ప్రోత్సహించేందుకు, ఇరాక్లోని ఇరాన్ మద్దతుగల మిలీషియాలపై అమెరికా ఒత్తిడిని పెంచుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.సమాచారం అందించిన వారికి నగదు బహుమతితో పాటు, అవసరమైతే వేరే ప్రాంతానికి పునరావాసం (Relocation) కల్పించే అవకాశం కూడా ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' ప్రోగ్రామ్ కింద ఈ ప్రకటన చేసింది. ముఖ్యంగా ఇరాక్, సిరియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక బలగాలపై దాడులు చేయడం, ఇరాక్ పౌరుల మరణాలకు ఈ గ్రూపు బాధ్యత వహించిన నేపథ్యంలో ఆ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇరాన్ నిర్దేశించిన విధంగా ఇరాక్, సిరియా మరియు సౌదీ అరేబియాపై కూడా దాడులకు పాల్పడటం. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు అబూ వాలా అల్ వేలీ బహిరంగంగా మద్దతు ప్రకటించడం గమనార్హం.గత దశాబ్ద కాలంగా, ఈ మిలీషియాలు ఇరాక్లోని అమెరికా బలగాలపైనా, దౌత్యవేత్తలపైనా దాడులు చేశాయి. ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ సమయంలో, ఈ మిలీషియాలు తమ దాడులను తీవ్రతరం చేశాయి. సౌదీ అరేబియాపై కూడా దాదాపు 1,000 దాడులు నిర్వహించాయి. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్ఎవరీ అబూ వాలా అల్ వేలీ?అబూ వాలా అల్ వేలీ ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న కేఎస్ఎస్ సాయుధ గ్రూపుకు సెక్రటరీ జనరల్గా ఉన్నాడు. ఈ సంస్థ ఇరాన్ యొక్క 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) కు అత్యంత విధేయంగా ఉంటూ, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుంటుంది. గతంలో ఇతను అమెరికా వ్యతిరేక సంస్థ అయిన 'ఖతైబ్ హెజ్బుల్లా' (KH)లో సభ్యుడిగా ఉండేవాడు. ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా అమెరికా ఇతడిని అరెస్టు చేసి జైలులో ఉంచింది. అయితే, 2010లో ఇతను విడుదలయ్యాడు. 2010వ దశకం ఆరంభంలో సిరియా అంతర్యుద్ధం సమయంలో, ఖతైబ్ హెజ్బుల్లా నుంచి విడిపోయిన మిలీషియాలోని అబు హుస్సేన్ , అబు ఫదక్ విభాగాలకు చెందిన KH సభ్యులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశాడు. 2023, నవంబరులో వేలీని 'ప్రత్యేకంగా గుర్తించిన ప్రపంచ ఉగ్రవాది' (SDGT)గా అమెరికా ప్రకటించింది. ఇదీ చదవండి: అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు -
ఇరాన్ మాజీ యువరాజుపై దాడి..
ఇరాన్ బహిష్కృత యువరాజుపై బెర్లిన్లో దాడి జరిగింది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపురంగు ద్రవాన్ని మీద చల్లారు. అయితే వెంటనే ఆయన రక్షణ సిబ్బంది స్పందించి ఆందోళనకారుడిని ప్రక్కకు తోశారు.రెజా పహ్లావి గురువారం బెర్లిన్లో ఒక భవనం నుండి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో పహ్లావి తన భద్రతా సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుండి వచ్చిన ఒక వ్యక్తి తన బ్యాగ్ నుంచి ఎరుపు రంగు ద్రవాన్ని (ఇది టమోటా జ్యూస్ అని భావిస్తున్నారు) ఆయనపై విసిరాడు. దీంతో ఆ ఎరుపు ద్రవం పహ్లావి తల వెనుక భాగం, మెడ మరియు ఆయన ధరించిన బ్లేజర్పై పడింది. అయితే ఈ హఠాత్ పరిణామంతో ఏ మాత్రం సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే రెజాపహ్లవిపై దాడి చేసిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే పహ్లవి విలేకరుల సమావేశం నిర్వహించారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు: ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల్ని గూండాలు, ఉగ్రవాదులుగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశాలన్ని ఇరాన్ పాలనపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, కేవలం యధాతథ స్థితిని కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల, ఉరిశిక్షల నిలిపివేత విషయంలో ఐరోపా దేశాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ పాలన అంతం కోసం ఆయన పోరాడుతున్నారు. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక జోక్యాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ఇరాన్ లోపల ఆయనకు ఎంతవరకు మద్దతు ఉందనేది తెలియాల్సి ఉంది. -
ఖమేనీ అజ్ఞాతవాసానికి కారణం ఇదేనా?
ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఇరాన్ దాగుడు మూతలు ఆడుతోంది. పుకార్లను ఖండిస్తూ.. ఆయన క్షేమంగా ఉన్నారని మాత్రమే ప్రకటనలు ఇస్తోంది. ఫొటోలు, వీడియోలు, ఆఖరికి వాయిస్ రికార్డింగ్లు కూడా ఒక్కటి రిలీజ్ చేయలేదు. ఆయన ఆరోగ్యస్థితి ఏమాత్రం బాగోలేదని.. పైగా పాలన మొత్తం కరడుగట్టిన సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని వెస్ట్రన్ మీడియా కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా సంచలన విషయాలను పబ్లిష్ చేసింది. ‘ఖమేనీ సజీవంగానే ఉన్నారు. రహస్య ప్రదేశంలో ఆయనకు చికిత్స అందుతోంది. దాడుల్లో ఖమేనీ ముఖం, పెదవులు కూడా తీవ్రంగా కాలిపోయాయి. అందుకే మాట్లాడటం కూడా కష్టంగా మారింది. స్పృహలోనే ఉంటూ అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆయనకు ఏదైనా చెప్పాలంటే రాసి చూపిస్తున్నారు. అలాగే.. ఆయనకు ఏదైనా సమాచారం చేరవేసేందుకు.. చేతితో రాసిన ఉత్తరాలను మాత్రమే వాడుతున్నారు. వాటిని ఖమేనీ ఉన్న ప్రాంతానికి బైక్లపై చేరవేస్తున్నారు. అక్కడి నుంచి బదులు కూడా అలాగే వస్తోంది. ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా ఉండేందుకు ఇదంతా చేస్తున్నారు..దాడుల్లో కాలికి గాయం కావడంతో దానికి మూడుసార్లు ఆపరేషన్ జరిగింది. కృత్రిమ కాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతికి కూడా సర్జరీ జరిగింది. ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రు సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గం కూడా అని ఆయన అనుకుంటుఉన్నారు’’ అని ఆ కథనాలు సారాంశం.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా దాడులకు దిగాయి. ఆనాటి దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుటుంబం మరణించింది. ఆయన తనయుడు ఖమేనీ గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత ఆయన్నే ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇరాన్ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఆయన్ని కలవడానికి వెళ్లడం లేదు.పాలన చేజారిందంటూ.. దేశాన్ని నడిపేందుకు ముజ్తాబా ఖమేనీ ఓ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఆ దేశ రాజకీయవేత్త అబ్దుల్రెజా దవారీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ బోర్డుకి ఖమేనీ డైరెక్టర్గా ఉండగా.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ జనరల్స్ సభ్యులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వారి సలహాలు, మార్గదర్శకాల పైనే ఖమేనీ ఎక్కువగా ఆధారపడుతున్నారని అన్నారాయన. అంతేకాదు అమెరికా-ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధం, దౌత్య ప్రయత్నాలు, జాతీయ భద్రత విషయాల్లో వారు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే..ఈ వ్యవహారంలో సుప్రీం లీడర్ పరిమితంగా వ్యవహరిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనం ఇచ్చింది. సుప్రీం లీడర్కి చేరుకోవడం కష్టమవడంతో.. నిర్ణయాధికారం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కమాండర్ల చేతుల్లోకి వెళ్లిందని.. వాళ్లే యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని.. ఇది ఇరాన్ గత సుప్రీంల పాలనకు భిన్నంగా ఉందని ఆ కథనం పేర్కొంది. అంతేకాదు.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి డమ్మీలుగా మారిపోయారని.. అమెరికాతో జరగాల్సిన చర్చలు కూడా సైనికాధికారుల వ్యతిరేకత కారణంగానే విఫలమయ్యాయని తెలిపింది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ జీవచ్ఛవంగా ఉండిపోయారని.. ఇరాన్లో “రెజీమ్ చేంజ్”(పాలన పగ్గాలు మారాయని) వ్యాఖ్యానించినప్పటికీ.. ఇరాన్ మీడియా మాత్రం ఆ కథనాలను ఖండిస్తూ వస్తోంది. -
యుద్ద సంక్షోభాన్ని ముందే పసిగట్టిన చైనా..?
డ్రాగన్ కంట్రీ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన స్వార్థం కోసం ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి సిద్ధం కానీ తను మాత్రం ఎన్నడూ ఇబ్బందులకు గురి కాదు.ప్రస్తుతం ఇదే విషయం మరోసారి రుజువైంది. ఇరాన్- అమెరికా యుద్ధం వస్తుందని ముందే ఉహించిన చైనా ఆ దేశంలో భారీగా చమురు నిల్వలు ఉంచుకుందట.. అవీ ఏకంగా IEA అంతర్జాతీయ ఇంధన సంస్థ నిల్వల కంటే కూడా అధికంగా ఉన్నాయని సర్వేలు తెలిపాయి.ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దంతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రధాన అంశం చమురు. ఆయిల్ రవాణాకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని ముందే ఉహించిన చైనా తమ దేశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీగా చమురునిల్వలు ఉంచుకుందట.. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాలు ఈ వివరాలే చెబుతున్నాయి.ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం చైనా వద్ద సుమారుగా 1.4 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి.అయితే ఇది అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) లోని 32 సభ్య దేశాల మొత్తం నిల్వలు (1.2 బిలియన్ బారెళ్లు) కంటే అధికమని సర్వేలు చెబుతున్నాయి. అదే అమెరికా వద్ద ప్రస్తుతం 405 మిలియన్ బారెళ్ల నిల్వలు మాత్రమే ఉన్నాయని.. యుద్ధం కారణంగా పెరిగిన ధరలను తగ్గించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే 172 మిలియన్ బారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించారని పేర్కొన్నాయి..అయితే యుద్దం అంచనాని ముందే పసిగట్టిన చైనా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనా తన చమురు దిగుమతులను ఏకంగా 15.8% పెంచుకుందని సర్వే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రస్తుతం యుద్దం నేపథ్యంలో చమురు సంక్షోభాన్ని పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. అందుకే ఇది వరకూ ప్రపంచ దేశాలు చమురు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా చైనా మాత్రం ఎటువంటి ఆందోళన చెందలేదు. -
ఇరాన్తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్పై ట్రంప్ క్లారిటీ
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్ వాడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ దాడులద్వారానే ఇరాన్ సైన్యం చిన్నాభిన్నమైందంటూ వ్యాఖ్యానించారు. పర్మినెంట్ డీల్ కోసమే చూస్తున్నామని.. ప్రస్తుతం ఇరాన్ నేవీ, ఎయిర్ఫోర్స్ దెబ్బతిన్నాయంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంలో మునిగిపోయిన ఇరాన్ను ఆర్థిక సుడిగుండంలో నిండా ముంచేందుకు హార్మూజ్ జలసంధిని గుప్పిట పట్టామని ట్రంప్ పునరుద్ఘాటించారు. జలసంధిపై తమ ఆధిపత్యాన్ని కొనసాగేంచేందుకు అగ్రరాజ్య నావికాదళాలకు ఆయన గురువారం కీలక ఆదేశాలిచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘హార్మూజ్ జలసంధిలో మన యుద్ధ నౌకలు, విదేశీ నౌకల రాకపోకలను పెను ప్రమాదంలోకి నెట్టేసే సముద్రమందుపాతరను వెనువెంటనే ఏరిపారేయండి...కొత్తగా మందుపాతరలను పెట్టేందుకు సముద్రజలాల్లో సంచరించే ఇరాన్ పడవలను వెంటనే పేల్చేయండి. అవి చిన్నపడవలు అనే కనికరం అస్సలు చూపకండి. ఇప్పటికే మన దెబ్బకు ఇరాన్ నావికాదళంలోని కీలక 159 నౌకలు మునిగిపోయి సముద్రగర్భంలోకి చేరాయి. మన మైన్ ‘స్వీపర్లు’ ఇప్పటికే సీమైన్స్ను ఏరిపారేయడంలో నిమగ్నమ య్యాయి. ఈ పనిని మూడు రెట్లు అత్యధిక వేగంతో పూర్తిచేసే బాగుంటుంది.హార్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది. ఇరాన్ మనతో ఒప్పందం కుదుర్చుకునేదాకా మన అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఐఆర్జీసీ ఆధిపత్యం, పాలకులతో విబేధాలతో తమ అసలైన అత్యున్నత నేత ఎవరు అనేది తేల్చుకోవడం ఇరానియన్లకు కష్టంగా మారింది. అతివాద నేతలేమో మన దాడుల్లో చనిపోతు న్నారు. ఉదారవాదులకు కాస్తంత గౌరవం దక్కుతోంది. ఇది నిజంగా క్రేజీ విషయం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.‘‘ఇరాన్తో శాంతి ఒప్పందం కోసం ఆత్రంగా ఎదురుచూడట్లేము. మాకు తొందరేం లేదు. యుద్ధాన్ని త్వరగా ముగించి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే జలసంధి దిగ్బంధించామని అమెరికాæ ఆర్థిక మంత్రి స్కాట్బీసెంట్ అన్నారు. ‘‘ఈ విషయంలో మా అధ్యక్షుడు స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. హార్మూజ్ సహా ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధిస్తే ముడిచమురు సరఫరా ఆగిపోతుంది.దీంతో ఖర్గ్ ద్వీపంలోని ముడిచమురు నిల్వకేంద్రాలన్నీ క్రూడా యిల్లో నిండిపోతాయి. చమురుబావుల నుంచి సరఫరా అయ్యే ముడిచమురును నిల్వచేయడానికి చోటే ఉండదు. అప్పుడు తప్పనిపరిస్థితుల్లో చమురుబావుల నుంచి వెలికితీత ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆపేస్తే మళ్లీ మొదలెట్టడం శ్రమతోకూడిన సంక్లిష్ట ప్రక్రియ. దీంతో ఆదాయం లేక ఇరాన్ చేతులెత్తేస్తుంది’’ అని హెచ్చరించారు. -
డేటా వార్!.. కేబుళ్లను కత్తిరిస్తామంటూ ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. పర్షియన్ గల్ఫ్లోని కీలక డిజిటల్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జీసీ) బాంబు పేల్చింది. సముద్రంలోని ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచంలోని అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రయాణిస్తోంది. కేబుల్స్కు ముప్పు వాటిల్లితే నష్ట ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. చాలా దేశాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలుగా మారిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే. -సాక్షి, స్పెషల్ డెస్క్హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను, వాటికి ఉన్న ముప్పును ఐఆర్జీసీకి అనుబంధంగా ఉన్న తస్నీమ్ వార్తా సంస్థ ప్రచురించిన నివేదికలో వివరించింది. ఇంధన రవాణాకే గాక ప్రపంచ డేటా ప్రవాహానికీ ఈ జలసంధి అత్యంత కీలక మార్గమని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాలు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ సముద్ర కేబుల్ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాయని నొక్కి చెప్పింది. కేబుళ్ల ల్యాండింగ్ స్టేషన్స్, క్లౌడ్ హబ్లను శత్రువుపై ఒత్తిడి పెంచే వ్యూహాత్మక కేంద్రాలని తెలిపింది. ఎలాంటి అంతరాయం కలిగినా ఆయా దేశాల ఆర్థిక, సమాచార వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డేటా సెంటర్లు కేంద్రీకృతమై ఉన్నాయి. మూల స్తంభాలుగా.. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి గుండా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ భారీ నెట్వర్క్ ఉంది. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య కీలక అనుసంధానంగా నిలుస్తుంది. పశ్చిమ దేశాలతో భారత్ను అనుసంధానించే ఐదు ప్రధాన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలు మన దేశ డిజిటల్ కమ్యూనికేషన్లకు మూల స్తంభాలుగా ఉన్నాయి. వీటిలో ఫాల్కన్ నెట్వర్క్, ఆసియా–ఆఫ్రికా–యూరప్–1, టాటా టీజీఎన్–గల్ఫ్, సౌత్ఈస్ట్ ఆసియా–మిడిల్ ఈస్ట్–వెస్టర్న్ యూరప్–4, ఇండియా–మిడిల్ ఈస్ట్–వెస్టర్న్ యూరప్ ఉన్నాయి. కేవలం ఎర్ర సముద్రం గుండానే 15–20 కేబుల్స్ వెళ్తున్నాయి. రిలయన్స్ అభివృద్ధి చేస్తున్న ఇండియా–యూరప్–ఎక్స్ప్రెస్, ఇండియా–ఆసియా–ఎక్స్ప్రెస్, గూగుల్కు చెందిన ధివారు సముద్ర కేబుల్ ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. సేవలకు అంతరాయం.. ఒకటి లేదా రెండు కేబుల్స్ దెబ్బతింటే ఆ అంతరాయాన్ని సాధారణంగా సరిచేయొచ్చు. అనేక కేబుల్స్ తెగిపోతే ఇంటర్నెట్ వేగం తగ్గడం, వెబ్సైట్స్ పనిచేయకపోవడం, బ్యాంకింగ్, క్లౌడ్ సిస్టమ్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన దేశంలోని ఇంటర్నెట్ ట్రాఫిక్లో సుమారు 60% ముంబై నుంచి గల్ఫ్ ప్రాంతం మీదుగా యూరప్ వైపు వెళ్లే మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మిగిలిన ట్రాఫిక్ చెన్నై నుంచి సింగపూర్ మీదుగా పసిఫిక్ మహాసముద్రం వైపు సాగే మరో మార్గం ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల నుంచి ఆసుపత్రి డేటా వరకు అన్నీ ’క్లౌడ్’లో భద్రపరచి ఉన్నాయి. కనెక్టివిటీ పోతే ఈ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. భారత్ ఒక ’డిజిటల్ ద్వీపం’ లాంటిది. మన అంతర్జాతీయ డేటాలో 97% సముద్ర మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మరమ్మతులకు నెలలు.. తరచుగా నౌకల లంగర్ల వల్ల జరిగే ప్రమాదవశాత్తు నష్టాలు కూడా ఇంటర్నెట్ అంతరాయాలకు కారణమవుతాయి. భారీ స్థాయిలో నష్టం జరిగితే వాటిని సరిచేయడానికి వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు. 2024, 2025లో ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో ఎర్ర సముద్రంలోని పలు సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతిన్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వేగం తగ్గడంతోపాటు అనేక దేశాల్లో సేవలకు అంతరాయం కలిగింది. ఆ ప్రాంతంలోకి ప్రవేశం పరిమితంగా ఉండటం వల్ల మరమ్మతులు చేయడానికి నెలలు పట్టింది. రిస్క్ అనాలసిస్.. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం దిగ్గజాలు తమ అంతర్జాతీయ డేటా ప్రసారం కోసం ఈ హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాలపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. హార్ముజ్ గుండా వెళ్లే కేబుల్స్కు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడటానికి ఇరాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరపాలని ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విజ్ఞప్తుల నేపథ్యంలో టెలికం శాఖ ఆపరేటర్లందరినీ తమ డేటా మార్గాల భద్రతపై ’రిస్క్ అనాలిసిస్’ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ కేబుల్స్ దెబ్బతింటే డేటాను ప్రత్యామ్నాయ మార్గాల (సింగపూర్ లేదా పసిఫిక్ రూట్) ద్వారా ఎలా మళ్లించాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. -
‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’
భారత్, చైనా నరకాలు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్లోని నాగరికతను నాశనం చేస్తామంటూ ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్న ట్రంప్ ఉంటున్న అమెరికానే నరకం అంటూ ఇరాన్ రిప్లై ఇచ్చింది. భారత్, చైనాలు మానవాళికి మహోన్నత దేశాలు అంటూ ఇరాన్ పేర్కొంది. భారత్, చైనాలను నాగరికతకు పుట్టినిల్లు అని పేర్కొంటూ ట్రంప్పై విరుచుకుపడింది. చైనా, భారత్ నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి అమెరికా దేశ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఇరాన్లో నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన చోటే ఆ నరకమనేది ఉంది’ అంటూ ఇరాన్ బదులిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారత్, చైనాలను నరక కూపాలు అని అభివర్ణిస్తూ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా స్పందించింది. ట్రంప్ ప్రకటనలకు సంబంధించి కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. తాము కొన్ని నివేదిలైతే చూశామని, ఈ వ్యాఖ్యల వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్పై విషం కక్కిన ట్రంప్ -
హర్ముజ్ వద్ద మరోసారి టెన్షన్ టెన్షన్
ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధిని బ్లాకేడ్ చేశాం అని అమెరికా ప్రకటించడం.. అదే సమయంలో ఇరాన్ సైతం హర్ముజ్ నుంచి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్లో తొలిసారిగా టోల్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్రేజా హాజీ ఈ మేరకు ప్రకటన చేసినట్లు అల్ జజీరా కథనం పేర్కొంది. " ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకల నుండి ఇరాన్ టోల్ వసూలు చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మొదటి విడత ఆదాయాన్ని ఇప్పటికే దేశంలోని సెంట్రల్ బ్యాంక్లో జమ చేశాం" అని ఆయన అన్నట్లు పేర్కొంది. అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ పన్నును అమలు చేస్తోన్నట్లు తెలిపింది.కాగా ఇదివరకే హర్ముజ్ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మరియు నౌకాదళ ఒత్తిడి కొనసాగినంత కాలం ఈ చమురు రవాణా మార్గాన్ని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న రాయబార ప్రయత్నాలను ఇరాన్ గుర్తించినప్పటికీ, అమెరికా తీరును మాత్రం తప్పుబడుతూ వస్తుంది.కాగా ఇదివరకే అమెరికా బెదిరింపులకు ఏ మాత్రం తగ్గేది లేదని ఇది వరకే ఇరాన్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్కు తరచుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే హర్ముజ్ వద్ద టోల్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
హర్మూజ్ జల సంధిలో భారత్ నౌకను సీజ్ చేశాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డుకుంటూ, స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఇరాన్ నౌకాదళం రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారత్కు చెందిన నౌక కూడా ఉంది. ఈ నౌక దుబాయ్ నుంచి బయలుదేరి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇరాన్ కమాండోలు గన్బోట్ల ద్వారా భారత్ నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎస్ఈ పేరుతో పనామా జెండాతో వెళ్తున్న మరో ఫ్రాన్స్ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు నౌకలను ఇరాన్ తీరానికి తీసుకెళ్లారు.ఇరాన్ విడుదల చేసిన వీడియోలో ముసుగులు ధరించిన కమాండోలు తుపాకులతో నౌకపైకి ఎక్కి తనిఖీలు చేపట్టిన దృశ్యాలు చూడొచ్చు. నౌకపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసరడంతో బ్రిడ్జ్ (కమాండ్ సెంటర్) దెబ్బతింది. అయితే సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.ఈ ఘటనకు ముందు అమెరికా మెరైన్లు రెండు ఇరాన్ జెండా కింద నడుస్తున్న నౌకలను స్వాధీనం చేసుకోవడంతో, ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధికారులు ఇరాన్ ‘మస్కిటో ఫ్లీట్’ అనే చిన్న, వేగవంతమైన పడవలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.భారత్కు వెళ్తున్న వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్గం కావడంతో, ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 🇮🇷⚡️BREAKING: IRGC releases footage showing their Navy forces seizing the 'MSC Epaminondas' vessel in the Strait of Hormuz earlier today. pic.twitter.com/Mx8Jt6QIAB— IRGC (@IRGC_Press) April 22, 2026 -
టెహ్రాన్ వీధుల్లో ఉరేగింపు.. వేల సంఖ్యలో జనం
టెహ్రాన్: ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని రాబోయే 36 నుంచి 72 గంటల్లోపూ మరో దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ బలప్రదర్శన చేసింది. తన బాలిస్టిక్ క్షిపణితో టెహ్రాన్ వీధుల్లో ఉరేగింపు జరిపింది. ఈ ఊరేగింపులో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధంలో సీజ్ఫైర్ నడుస్తున్నందున ఇరాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సాధారణ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తమ దేశ ఆయుధ సంపత్తిని తెలియజేస్తూ టెహ్రాన్ వీధుల్లో ఓ ర్యాలీ నిర్వహించింది. ఒక భారీ వాహనంపై తన దేశానికి చెందిన ఆధునాతన బాలిస్టిక్ క్షిపణి ఖదర్ను ప్రదర్శనకు ఉంచి ఊరేగింపు జరిపింది.ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయిలు దేరారు. ఖదర్ అనే క్షిపణి పాత షహాబ్-3A క్షిపణికి ఆధునాతన వెర్షన్ ఇది. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ ప్రధానంగా వీటినే వినియోగించింది.అయితే ఇటీవల ట్రంప్ తరచుగా ఇరాన్ ఆయుధ సామాగ్రిపై ట్రంప్ తరచుగా కామెంట్స్ చేశారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సామాగ్రి లేదని తరచుగా మాట్లాడారు. కాగా ఇటీవల యుఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు.మరోవైపు గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్లు ఆయుధాగారంలోనే దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ర్యాలీ సైతం తమ వద్ద ఇంకా బలమైన ఆయుధాలు ఉన్నాయని పరోక్షంగా హెచ్చరించడానికే అన్న కోణంలో ఉంది.Iran publicly displays 2000 km range ballistic missile in Tehran pic.twitter.com/HnKXAyPis9— Iran Headlines (@Iran_Headlines) April 23, 2026 -
50 డేస్.. అమెరికా అట్టర్ ప్లాప్ షో..
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ వేదిక చర్చల్లో కూడా సందిగ్ధత నెలకొంది. సీజ్ఫైర్ను ట్రంప్ పొడిగించినప్పటికీ అరకొరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇరాన్ సైతం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరోవైపు.. ఇరాన్పై దాడుల కారణంగా అమెరికా ఆయుధాల సంఖ్య రోజురోజుకి తరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది. ఇంతకీ అమెరికా వద్ద ఇంకా ఎన్ని క్షిపణులు, ఆయుధాలు ఉన్నాయనే అంశం ఓ నివేదిక బయటకు వచ్చింది.అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై 50 రోజులు దాటింది. యుద్ధంలో ఇరాన్పై అమెరికా భారీగానే దాడులు చేసింది. భారీ క్షిపణులు, వైమానిక దాడులతో విధ్వంసమే సృష్టించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఆయుధాలను ఉపయోగించింది. దీంతో, ఇరాన్ సైనిక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, అమెరికా ఆయుధ నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి. ఆయుధ నిల్వలు భారీగా తరిగిపోయాయి. అయితే, అమెరికా వద్ద ప్రస్తుత యుద్ధాన్ని కొనసాగించడానికి సరిపడా మిసైళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో కొత్త యుద్ధాలు తలెత్తితే నిల్వల కొరత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.అమెరికా ఆయుధ నిల్వల పరిస్థితి..టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు: యుద్ధానికి ముందు 3,100 ఉండగా.. యుద్ధం కోసం 850 వినియోగించబడ్డాయి. దీంతో, దాదాపు 25% నిల్వలు తగ్గాయి.JASSM (జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండాఫ్ మిసైళ్లు): 4,400 ఉండగా.. ఇరాన్ యుద్ధం కోసం 1,000 వినియోగించబడ్డాయి.THAAD ఇంటర్సెప్టర్లు: 360 ఉండగా.. 190–290 వినియోగించబడ్డాయి. ఇప్పుడు 70 మాత్రమే మిగిలి ఉన్నాయి.పాట్రియట్ PAC-3: 2,330 ఉండగా.. 1,060–1,430 వినియోగించబడ్డాయి. కేవలం 900 మాత్రమే మిగిలాయి.SM-6: 600 ఉండగా..200 వినియోగించారు. 400 వరకు ఉన్నాయి. SM-3: 150 ఉండగా.. 40 వరకు వినియోగం. ఇంకా 110 మిగిలి ఉన్నాయి.భవిష్యత్తు ప్రణాళిక.. భారీగా ఖర్చు..2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది.టోమాహాక్: 55 నుంచి 785కి పెంపు( ఒక్క దానికి ఖర్చు: తయారీకి $2.6 మిలియన్ డాలర్లు).Patriot PAC-3: 357 నుంచి 3,203కి పెంపు ( $3.9 మిలియన్)THAAD: 55 నుంచి 857కి పెంపు($15.5 మిలియన్)SM-6: 166 → 540కి పెంపు($4.3 మిలియన్)SM-3: 12 → 136కి పెంపు($9–10 మిలియన్)ప్రధాన సమస్యలు..ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారు చేసే డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు అమెరికా ఖరీదైన రక్షణ వ్యవస్థలను బలవంతంగా వినియోగింపజేస్తున్నాయి.THAAD, Patriot లాంటి రక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.ఉత్పత్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కారణం (టోమాహాక్ – 47 నెలలు, THAAD – 53 నెలలు, SM-36 నెలలు, SM-36 నెలలు) కావడంతో నిల్వలను తిరిగి భర్తీ చేయడం కష్టతరం అవుతుంది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం.. యుద్ధంలో ప్రధానంగా షాహెడ్ డ్రోన్లు మరియు క్రూయిజ్ మిసైళ్లు వినియోగిస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, పెద్ద సంఖ్యలో తయారు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటంతో అమెరికా మరియు మిత్రదేశాల రక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నాయి. ఇరాన్ ఒకేసారి వందల డ్రోన్లను పంపి, అమెరికా THAAD మరియు Patriot వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. ఇరాన్ ఉపయోగిస్తున్న డ్రోన్లుShahed-136 ("కమికాజే" డ్రోన్)ఒకే దిశలో దాడి చేసే UAV (Unmanned Aerial Vehicle).ఖర్చు: సుమారు $20,000–$50,000 మాత్రమే.లక్ష్యం: శత్రు రక్షణ వ్యవస్థలను అధిక సంఖ్యలో దాడులతో అలసటకు గురి చేయడం.“పేదవాడి క్రూయిజ్ మిసైల్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో క్రూయిజ్ మిసైల్ లాంటి ప్రభావం చూపుతుంది.UAE రక్షణ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభం నుండి 941 డ్రోన్లు గుర్తించబడ్డాయి, వాటిలో 65 UAEలో పడిపోయి మౌలిక వసతులకు నష్టం కలిగించాయి.Shahed-131 / Shahed-238 (అప్గ్రేడ్ వెర్షన్లు)Shahed-136 కంటే చిన్నవి లేదా వేగవంతమైనవి.కొన్ని జెట్-ఇంజిన్ ఆధారిత డ్రోన్లు కూడా వినియోగించబడ్డాయి, ఇవి మరింత వేగంగా ఉండి Patriot లాంటి రక్షణ వ్యవస్థలకు సవాలు విసురుతున్నాయి.ఇరాన్ క్రూయిజ్ మరియు బాలిస్టిక్ మిసైళ్లు1. Zolfaghar బాలిస్టిక్ మిసైల్700 కిమీ పరిధి.1,100 పౌండ్ల వార్హెడ్ మోసే సామర్థ్యం.ఇరాక్లోని ఎర్బిల్ ప్రాంతంలో పలు దాడుల్లో వినియోగించబడింది.2. Soumar క్రూయిజ్ మిసైల్రష్యా KH-55 ఆధారంగా అభివృద్ధి చేయబడింది.దీర్ఘదూర దాడులకు ఉపయోగపడుతుంది.3. Quds-1 / Quds-2 క్రూయిజ్ మిసైళ్లుతక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే సామర్థ్యం.గల్ఫ్ ప్రాంతంలోని మౌలిక వసతులపై దాడులకు వినియోగించబడ్డాయి.ఇదిలా ఉండగా.. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. -
ఓ మై గాడ్.. ఇరాన్ ఎంత పని చేసింది?
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ ఆధిపత్య ప్రయత్నాలతో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఓ క్లారిటీ ఇచ్చింది.హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి కనీసం మరో ఆరు నెలల టైం పట్టవచ్చని తాజాగా పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులతో ఆ విభాగం రహస్యంగా ఓ సమావేశం నిర్వహించిందని.. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలకమైన నివేదికను అక్కడి సభ్యులకు వివరించిందన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఈ జాప్యానికి శాంతి చర్చలతో సంబంధం లేదని తెలుస్తోంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే ఈ ఆలస్యం జరగవచ్చని ఆ నివేదిక తెలిపింది. హర్ముజ్ రూట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 కంటే ఎక్కువ మైన్స్నే అమర్చి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఇరాన్ జీపీసీ (Global Positioning Capability/Control) టెక్నాలజీ వాడింది. అందుకే వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. కాబట్టి.. వాటిని తొలగించడానికి టైం పట్టవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే..ఇరాన్తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో వాటి తొలగింపు ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుందని కూడా పెంటగాన్ నివేదిక స్పష్టం చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే పెంటగాన్ ఈ కథనాలను ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ ఇటీవల హర్ముజ్ జలసంధి సముద్ర మైన్స్ (Sea Mines) గురించి పలు ప్రకటనలు చేసింది. ముఖ్యంగా, నౌకలు మైన్స్తో ఢీకొనే ప్రమాదం ఉందని హెచ్చరించి.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పలు దేశాల వాణిజ్య నౌకలకు సూచించింది. అయితే డీల్ కుదిరాక ఇరాన్ సహకారంతోనే సీ మైన్స్ను తొలగిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది జరిగే పని కాదంటూ ఇరాన్ ట్రంప్ ప్రకటనపై సెటైర్లు కూడా వేసింది. ఏయే యుద్ధాల్లో వాడారంటే..సీ మైన్స్ (Sea Mines) అనేవి సముద్రంలో ఉంచే పేలుడు పరికరాలు. ఇవి నౌకలు లేదంటే జలాంతర్గాములు (submarines) దగ్గరికి వచ్చినప్పుడు పేలిపోతాయి. చరిత్రలో అనేక యుద్ధాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు. 14వ శతాబ్దంలో చైనా సామ్రాజ్యంలో జపాన్ దొంగలపై వీటిని ఉపయోగించినట్లు చరిత్రలో ప్రస్తావన ఉంది. అమెరికన్ రెవల్యూషన్-సివిల్వార్ టైంలో అమెరికా తొలిసారిగా వాడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో.. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు కొరియా, వియత్నాం యుద్ధాల్లోనూ వీటిని వాడారు. రష్యా నౌకల కదలికలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్.. తాజాగా హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరులో ఇరాన్ వీటిని ఉపయోగించాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు అంతరాయం కలుగుతూ వస్తోంది. హర్ముజ్పై పూర్తి ఆధిపత్యం తమదేనని ఇరాన్.. అలా కుదరదు స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అమెరికా వాదిస్తూ వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల(అణు ఒప్పందం ప్రధానంగా) కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో.. హర్ముజ్ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. కానీ, అమెరికా డిమాండ్లను ఇరాన్ తోసిపుచ్చడం, చర్చలకు(రెండో దఫా) ముందుకు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. -
హార్ముజ్ లో భారత్ నౌక సీజ్.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
-
నౌకలపై ఇరాన్ దాడి
వాషింగ్టన్/టెహ్రాన్/ఇస్లామాబాద్/దుబాయ్: పాక్ ప్రాయోజిత శాంతి చర్చల ప్రక్రియకు తూట్లు పొడుస్తూ ఇరాన్ హార్మూజ్ జలసంధిని మరోమారు కాల్పులమోతకు వేదికగా మార్చేసింది. శాంతి చర్చలకు ఫలవంతమైన ప్రతిపాదనలతో ఇరాన్ వచ్చేవరకు కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే విదేశీ నౌకలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ బలగాలు దాడులపర్వానికి తెరలేపాయి. ఇటీవల కొన్ని గంటలపాటు హార్మూజ్ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనతో పర్షియన్ గల్ఫ్ నుంచి ఆశగా బయల్దేరిన నౌకలు గురువారం హార్మూజ్ జలసంధిని దాటే క్రమంలో వాటిపైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు తుపాకులు ఎక్కుపెట్టాయి. దీంతో మూడు నౌకలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మూడింటిలో రెండింటిని ఇరాన్ స్వా«దీనంచేసుకుని తమ తీరానికి తీసుకెళ్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్కు బయల్దేరని కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం సైతం పాకిస్తాన్కు బయల్దేరలేదు. దీంతో రెండో దఫా చర్చలు సాధ్యపడలేదు. అయితే చర్చలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయేగానీ రద్దుకాలేదని అమెరికా వ్యాఖ్యానించింది. శుక్రవారంలోపు రెండోదఫా చర్చలు జరిగే వీలుందని ట్రంప్ చెప్పినట్లు ‘ది న్యూయార్క్ పోస్ట్’తన కథనంలో పేర్కొంది. మరోవైపు బుధవారంతో ముగిసిపోతున్న కాల్పుల విరమణ గడువును ట్రంప్ హఠాత్తుగా పొడిగించడంపై మధ్యవర్తిత్వ దేశం పాకిస్తాన్ హర్షం వ్యక్తంచేసింది. సత్ఫల ప్రతిపాదనలతో ముందుకొచ్చేలా ఇరుపక్షాలను ఒప్పించేందుకు తమకు గడువు, సువర్ణావకాశం దక్కాయని పాకిస్తాన్ వెల్లడించింది. ‘‘మా దాడుల ధాటికి ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పొడచూపాయి. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ల అభ్యర్థన మేరకు ఇరాన్పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నా. ఇరాన్ నుంచి ఆమోదయోగ్య ప్రతిపాదనలు వచ్చేదాకా కాల్పుల విరమణ గడువు పొడిగిస్తున్నా. గడువు పొడిగించినా హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ నౌకాశ్రయాల గుండా నౌకల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది’’అని ట్రంప్ అన్నారు. రెండో దఫా చర్చలు జరిగి శాశ్వత శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్ తెరచుకుని ముడిచమురు సంక్షోభం సమసిపోయి క్రూడ్ ఆయిల్, పెట్రో ధరలు దిగొచ్చేవి. ఇవేవీ సాకారంకాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగి పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ప్రియమైన పెనుప్రమాదం అలాగే పొంచి ఉంది. ముంద్రా పోర్ట్కు వస్తుంటే మెరుపుదాడిఒమన్కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్లదూరంలో హార్మూజ్ జలాల్లో ఉన్న లైబీరియా జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘ఎపామినోండాస్’పైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వాస్తవానికి ఈ నౌక గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు రావాల్సి ఉందని నౌకల స్థితిగతులపై నిఘా పెట్టే ‘మెరైన్ ట్రాఫిక్’సంస్థ వెల్లడించింది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కేంద్రంగా పనిచేసే పనామా జెండాతో వెళ్తున్న ‘యుఫోరియా’నౌక మీద ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నౌకలోని నావికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాన్ తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు యుఫోరియాపై కాల్పులు జరిపారని వ్యాన్గార్డ్, యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) వెల్లడించింది. ఇరాన్ తీరానికి కేవలం ఆరు నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు పనామా జెండాతో ఉన్న ‘ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా’నౌక మీదా బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో నౌక కిందిభాగం స్వల్పంగా దెబ్బతింది. ఎపామినోండాస్, ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌకలను స్వా«దీనంచేసుకుని ఇరాన్తీరాలకు బలగాలు తీసుకెళ్తున్నాయి. ఎలాంటి సరైన ధృవీకరణ పత్రాలు, అనుమతులు లేకుండా, రహస్యంగా ఇవి హార్మూజ్ను దాటుతున్నాయని ఇరాన్ నేవీ ఆరోపించింది. ట్రాకింగ్ను సైతం ఏమార్చి పారిపోతున్నాయని పేర్కొంది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌక శ్రీలంకలోని హంబన్»ొటా నౌకాశ్రయానికి, యుఫోరియా నౌక జెడ్డాకు వెళ్లాల్సి ఉందని వాటి ట్రాకింగ్డేటా ప్రకారం తెలుస్తోంది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ తర్వాత ఇప్పటిదాకా 30కిపైగా నౌకలపై దాడులు జరిగాయి.గడువు పెంపుపై పెదవి విరిచిన ఇరాన్ గడువు పెంపును అమెరికా వేసిన మరో ఎత్తుగడగా ఇరాన్ అభివర్ణించింది. ‘‘సదభిప్రాయంతోనే సీరియస్గా తొలి దఫా చర్చలకు కూర్చున్నాం. కానీ అమెరికా అవిశ్వాసం చూపింది. అసంబద్ధ, అతి డిమాండ్ల చిట్టా విప్పింది. ఈ వారాంతంలోపు అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై మేం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ చెప్పారు.క్షిపణుల ప్రదర్శన మరోవైపు తమపై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ జంకుతున్నాయంటూ ఇరాన్ పాలకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వసూచనల మేరకు ఇరాన్ సాయుధబలగాలు బుధవారం టెహ్రాన్ వీధుల్లో భారీ క్షిపణులు, మిస్సైల్ లాంఛర్లను ఊరేగింపుగా ప్రదర్శించారు. తమ వద్ద ఇంకా భారీసంఖ్యలో క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. క్షిపణులను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. జెండాలను చేతబూని ఇరాన్ పాలకులకు అనుకూలంగా నినాదాలుచేశారు.సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లు కత్తిరిస్తాం: ఇరాన్గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ సేవలు అందించే అత్యంత కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను తప్పదనుకుంటే కత్తిరించేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ఒక హెచ్చరిక జారీచేసింది. ఈ వార్తను ఇరాన్ వార్తాసంస్థ టాస్నిమ్ ప్రచురించింది. ‘‘ఈసారి హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే పలు ప్రధాన కేబుళ్లు ఏకకాలంలో ‘ప్రమాదవశాత్తు’ పాడైపోవచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా మారొచ్చు. దీంతో పర్షియన్ గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయే ప్రమాదముంది. గల్ఫ్ అరబ్ దేశాల ఇంటర్నెట్ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది’’ అని టాస్నిమ్ తన కథనంలో పేర్కొంది. హార్మూజ్ గుండా పలుదేశాల ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఎర్రసముద్ర జలాల్లో ఇప్పటికే ఇవి పలుమార్లు కత్తిరింపులకు గురయ్యాయి. తమ పరిధిలోనూ వాటిని కత్తిరిస్తామని ఇరాన్ దన్నుతో పనిచేస్తున్న యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు పలుమార్లు హెచ్చరించారు.ఎలాంటి చెల్లింపులు జరపలేదునగదు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల వార్తలను ఖండించిన భారత్ న్యూఢిల్లీ: ఇండియా దిశగా వస్తున్న నౌకలు సురక్షితంగా హార్మూజ్ జలసంధిని దాటేలా ఇరాన్కు భారత్ నగదు లేదా క్రిప్టోకరెన్సీ చెల్లింపులు జరిపిందన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధం తర్వాత ఏ దేశానికి చెందిన నౌకనూ రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అనుమతించట్లేదు. అయితే తమ నౌక ఇప్పటికే తమ వద్ద అనుమతి పొందిందని, అనుమతి పొందిన జాబితాలో రెండో నంబర్ తమ నౌకదేనని ‘సన్మార్ హెరాల్డ్’నౌకలోని సిబ్బంది చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ బయటకురావడంతో భారత్పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మోదీ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర పోర్ట్లు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముఖేశ్ మాంగళ్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘హార్మూజ్ను దాటేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ అధికారులకు సన్మార్ హెరాల్డ్ నౌక కెప్టెన్ డాలర్ల రూపంలో నగదు చెల్లింపులు జరిపాడని వస్తున్న వార్తలో నిజంలేదు. ఈ విషయాన్ని మేం నౌక యజమానితో మాట్లాడి రూఢీచేసుకున్నాం. ఈ ఉదంతంతో భారత్కు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’అని ముఖేశ్ స్పష్టంచేశారు. ఏప్రిల్ 18వ తేదీన రెండు భారత్కు వచ్చే నౌకలపై ఆర్ఆర్జీసీ నేవీ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పులు ఆపేస్తే వెనక్కి వెళ్లిపోతామని సన్మార్ హెరాల్డ్ నౌకలోని సిబ్బంది చెప్పినట్లుగా ఆనాడు మీడియాలో వార్తలొచ్చాయి. -
శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు 'న్యూయార్క్ పోస్ట్’ పేర్కొంది. ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ అభ్యర్థన మేరకు.. ఇరాన్తో కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏడు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ కీలక ప్రకటన వెలువడింది. దీంతో పాకిస్తాన్కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధి బృందం పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన బృందం మంగళవారం ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే, హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఇరాన్ ఒక సమగ్ర ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చర్చల కోసం ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనను తెచ్చే వరకు మాత్రమే అమెరికా దాడులకు దూరంగా ఉంటుందని.. కానీ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఓడరేవులను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇది ఒక ‘యుద్ధ చర్య’గా ఆయన అభివర్ణించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అన్యాయమని, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో ఇరాన్కు తెలుసని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఆసియాలో ఇరాన్ ముడి చమురును అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్న 'M/T టిఫానీ' అనే చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుతో అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు 30 శాతం పెరిగి, బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన మొదటి విడత చర్చలు విఫలం కావడంతో, ఇప్పుడు రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
టెహ్రాన్: ఇరాన్ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్లో జరగాల్సిన అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఇరాన్ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్టాపిక్గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్కి చెందిన అలీ వాయేజ్ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.ఇరాన్ ప్రభుత్వంలో కుమ్ములాటఇరాన్లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు -
పశ్చిమాసియా యుద్ధంపై రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
బెర్లిన్: శాంతి చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని.. పశ్చిమాసియా యుద్ధంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపాలని ఇప్పటికే ఇరుదేశాలను ప్రధాని మోదీ కోరారని గుర్తు చేశారు. బెర్లిన్(జర్మనీ)లోని భారత రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడంలో న్యూఢిల్లీ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.పశ్చిమాసియా సంక్షోభంలో భారతదేశానికి ఏదైనా పాత్ర ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా రాజ్నాథ్ మాట్లాడుతూ రేపు ఒక సమయం రావచ్చు.. అప్పుడు భారత్ ఈ విషయంలో తన పాత్రను పోషించి విజయం సాధించడం కూడా సాధ్యమేనని తేల్చిచెప్పారు. ‘‘యుద్ధాన్ని ముగించాలని ప్రధాని మోదీ రెండు వైపులా విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మా ప్రధానికి చాలా సమతుల్యమైన దృక్పథం ఉంది’’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు.కాగా, ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమంపై తలెత్తిన విభేదాల కారణంగా పాకిస్థాన్లో జరగాల్సిన ఇరాన్-అమెరికా రెండో రౌండ్ శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో రెండు వారాల కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించారు. ఇరుపక్షాలను తిరిగి చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు, ఇరాన్ నాయకులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్లో రాసుకొచ్చారు.అయితే, ఈ కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ త్రోసిపుచ్చింది. ఇది అకస్మాత్తుగా దాడి చేయడానికి సమయాన్ని పొందేందుకు పన్నుతున్న కుట్రగా ఇరాన్ అభివర్ణించింది. ఓడిపోయే పక్షం షరతులు విధించలేదు. దిగ్బంధం కొనసాగితే దానికి సైనికపరమైన సమాధానం తప్పదంటూ ఇరాన్ ప్రతినిధి మహదీ మొహమ్మదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
హర్ముజ్లో మళ్లీ టెన్షన్: భారత నౌకను దిగ్బంధించి..
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్లో వెళ్తున్న కంటైనర్ షిప్లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్ నౌకలుగా వాటిని గుర్తించారు. తొలుత.. ఈ ఉదయం గ్రీక్ ఆపరేటెడ్ కంటైనర్ షిప్పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్లపై దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్ మీడియా.. హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.భారత నౌకపై కూడా.. భారత్కు చెందిన నౌకలకు స్వేచ్ఛా రవాణా ఉంటుందని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాటి పరిణామాలు మరోలా ఉన్నాయి. గుజరాత్ వైపు వస్తున్న ఓ నౌకను ఇరాన్ అడ్డగించింది. దిగ్బంధించిన ఆ నౌక పరిస్థితి.. సిబ్బంది క్షేమసమాచారాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొన్నీమధ్య కూడా హర్ముజ్లో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఏప్రిల్ 18న ఐఆర్జీసీ రెండు భారత-పతాక నౌకలపై కాల్పులు జరిపింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు, కానీ నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత నౌకల భద్రత విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ కోరింది.ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్లో తమ బ్లాకేడ్(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు. -
"ఇరాన్ ఆయుధాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే"
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆయుధ సంపత్తిపై మాట్లాడారు. టెహ్రాన్ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సంపత్తి లేదని ఆ దేశ నావికాదళం, వైమానిక దళం దాదాపుగా తుడిచిపెట్టుకపోయిందన్నారు. అయితే తాజా సర్వే కథనాలు మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఇప్పటికీ వేలాదిగా క్షిపణులు, డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.ఇరాన్పై అమెరికాతో పాటు ఇజ్రాయెల్ ఏక కాలంలో విరుచుకపడ్డాయి. ఆ దేశంలోని రక్షణ,మౌళిక స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలోనే వైమానిక దళం తుడిచిపెట్టుకుపోయిందని, వారి నౌకాదళం సముద్ర గర్భానికి చేరుకుందని ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్కు తమతో యుద్దం చేసే సీన్ లేదని బిల్డప్ ఇచ్చారు. అయితే ఇరాన్పై తీవ్రమైన వైమానిక దాడులు చేసినప్పటికీ వారి వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, కామికేజ్ డ్రోన్లు నిఘా నివేదికలు చెబుతున్నాయి.అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్లు ఆయుధాగారంలోనే దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది.అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్నప్పటికీ.. యుద్ధం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా డిమాండ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని ఇరాన్ తెగేసి చెబుతుంది. మరోవైపు ట్రంప్ సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయుధ సంపత్తిపై నివేదికలు చూస్తుంటే మరోసారి యుద్దం తలెత్తితే తీవ్రపరిణామాలు తలెత్తి అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా.. మొదటికే ముప్పు?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా, ఇరాన్ వద్ద ఉన్న యురేనియం కోసం అధ్యక్షుడు ట్రంప్ ఎదురుచూస్తున్నారు. అయితే, సుసంపన్నం చేసిన యురేనియంను అప్పగించడానికి అమెరికా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ పదార్థాన్ని దేశం నుండి బయటకు తీసుకురావడం అనేది చర్చల కంటే చాలా కష్టతరం కావచ్చు అంటూ పలు నివేదికలు చెబుతున్నారు. అమెరికాకు ఇది అంత సులభం కాదని హెచ్చరిస్తున్నాయి. దీంతో, ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా? అనే అనుమానాలు చర్చకు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. మాజీ అధికారులు, అణు నిపుణులు ఈ ఆపరేషన్ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన యురేనియం తొలగింపు ఆపరేషన్గా ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే.. ఇరాన్ యురేనియంలో అధిక భాగం ఇస్ఫహాన్ మరియు నతాంజ్ వంటి కేంద్రాలలో నిల్వ చేయబడిందని భావిస్తున్నారు. ఈ రెండూ ఇటీవలి నెలల్లో అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు గురయ్యాయి. దీంతో, అక్కడికి చేరుకోవడం కష్టమైంది. సొరంగాల ప్రవేశ మార్గాలను కూడా పూడ్చివేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయ తనిఖీ అధికారులు కొన్ని నెలలుగా ఈ ప్రదేశాలను సందర్శించలేదు.ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉంది. యురేనియం గురించిన దానిలో ఎక్కువ భాగం భారీ సిలిండర్లలో వాయు రూపంలో నిల్వ చేయబడింది. ఆ కంటైనర్లు చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో బృందాలు మొదట తనిఖీ చేయాలని నిపుణులు అంటున్నారు. అవి దెబ్బతిన్నట్లయితే, ప్రమాదాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఆ పదార్థాన్ని సురక్షితంగా అంచనా వేయడానికి మరియు వెలికితీయడానికి రిమోట్-ఆపరేటెడ్ పరికరాలు మరియు రోబోట్లతో సహా ప్రత్యేక పరికరాలు అవసరం కావచ్చు. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితులలో కార్యకలాపాలకు వారాలు పడుతుంది. దెబ్బతిన్న, దాడి అనంతర వాతావరణంలో, కాలపరిమితులు అనిశ్చితంగా మారతాయి. దాన్ని బయటకు తరలించడం సులభం కాదు. ఇక, అణ్వాయుధ పదార్థాల రవాణా ఒక సున్నితమైన పని. సంఘర్షణలతో కూడిన ప్రాంతం నుండి దీన్ని చేయడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.ÚLTIMA HORA: Un periodista iraní afirma que se registraron nuevas explosiones en una instalación subterránea de almacenamiento de misiles en Isfahán (Irán), previamente atacada por EE.UU. antes del alto el fuego, con ondas expansivas sentidas en la zona.pic.twitter.com/RqZxZGZJL6— Isaac (@isaacrrr7) April 20, 20261990లలో కజకిస్తాన్ నుండి ఆయుధ సామగ్రిగా ఉపయోగపడే యురేనియంను తొలగించడంతో సహా, గతంలో అమెరికా చేపట్టిన మిషన్లు నియంత్రిత వాతావరణంలో జరిగాయి. అయితే, ఇరాన్ విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. భద్రత, విమాన రవాణా ఏర్పాట్లు వంటివి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.యురేనియం ఎక్కడికి పంపాలి?అయితే, శుద్ది చేసిన యురేనియాన్ని యునైటెడ్ స్టేట్స్కు పంపడాన్ని ఇరాన్ వ్యతిరేకించింది. చర్చలో ఉన్న ప్రత్యామ్నాయాలలో రష్యా లేదా కజకిస్తాన్లో సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ ఆ పదార్థాన్ని పలుచగా చేసి అంతర్జాతీయ పర్యవేక్షణలో నిల్వ చేయవచ్చు. ఒకవేళ ఇరాన్ బదిలీకి అంగీకరించినప్పటికీ, ధృవీకరణ చాలా కీలకం. కొంత పదార్థం దాచడం లేదా ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు. యురేనియం తరలించబడిందా లేక ఉన్నచోట ఉందా అని నిర్ధారించడానికి పర్యావరణ తనిఖీలతో సహా, ఏ ఒప్పందానికైనా లోతైన తనిఖీలు అవసరం కావచ్చు.ఇరాన్ వద్ద 440 కిలోల యురేనియం..అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) గణాంకాల ప్రకారం.. 2025 జూన్లో అమెరికా దాడులకు ముందు ఇరాన్ వద్ద 60 శాతం సుసంపన్నమైన యురేనియం సుమారు 440 కిలోల వరకు ఉంది. అణుబాంబు తయారీకి అవసరమైన 90 శాతానికి ఇది చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ నిల్వల భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే దాడులకు గురైన ప్రాంతాల్లో తనిఖీలకు ఐఏఈఏ ఇన్స్పెక్టర్లను ఇరాన్ అనుమతించడం లేదు.యురేనియం శుద్ధి ఇలా.. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది. 2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అదే విషయంలో ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారు.అయితే, కజకిస్తాన్ (1994), లిబియా (2003) యురేనియం/అణు పదార్థాల తొలగింపు ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. కానీ ఇరాన్ పరిస్థితి వాటితో పోలిస్తే చాలా క్లిష్టమైనది. యురేనియం తరలింపునకు కజకిస్తాన్, లిబియా ప్రభుత్వాలు సహకరించాయి. ఇరాన్ మాత్రం ప్రతిఘటనతో, భూగర్భ సదుపాయాల్లో పదార్థాన్ని దాచిపెట్టింది.కజకిస్తాన్ – Project Sapphire (1994)స్థితి: సోవియట్ యుగం తర్వాత 600 కిలోల weapons-grade HEU (Highly Enriched Uranium) ఉల్బా మెటలర్జికల్ ప్లాంట్లో నిల్వ.ఆపరేషన్: అమెరికా–కజకిస్తాన్ రహస్య సహకారంతో 31 నిపుణుల బృందం 6 వారాల పాటు పని చేసి, 1032 కంటైనర్లలో ఉన్న యురేనియాన్ని 448 సురక్షిత కంటైనర్లలో ప్యాక్ చేసింది.తరలింపు: 3 C-5 విమానాల ద్వారా Oak Ridge (USA)కి తరలించి, IAEA పర్యవేక్షణలో low-enriched uranium గా మార్చారు.ప్రధాన అంశం: కజకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది, అందువల్ల ఆపరేషన్ సురక్షితంగా, రహస్యంగా పూర్తయింది.లిబియా – Disarmament (2003–2004)స్థితి: గడాఫీ పాలనలో అణు, రసాయన, జీవ రసాయన ఆయుధాల ప్రోగ్రామ్లు కొనసాగాయి.తీర్మానం: 2003 డిసెంబర్ 19న గడాఫీ స్వచ్ఛందంగా WMD ప్రోగ్రామ్లను నిలిపివేస్తానని ప్రకటించాడు.ఆపరేషన్: అమెరికా, యుకే, IAEA పరిశీలకులు కలిసి యురేనియం సదుపాయాలు, సెంట్రిఫ్యూజ్లు, రసాయన ఆయుధాలను తొలగించారు.ప్రధాన అంశం: లిబియా అంతర్జాతీయ ఒత్తిడి, ఆంక్షలు, ఇరాక్ యుద్ధం తర్వాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి స్వచ్ఛందంగా సహకరించింది. -
ట్రంప్ ప్లాన్ బీ.. ఉక్కిరి బిక్కిరి నడుమే ఇరాన్ కౌంటర్
పశ్చిమాసియా యుద్ధంలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కాల పరిమితిని లేకుండా యుద్ధ విరమణను పొడిగించారు. అయితే ఇరాన్ దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉందని అంటోంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంతో ఇరాన్ ఆర్థికంగా బాగా దెబ్బ తిందని ట్రంప్ అంటున్నారు. ‘‘ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నౌకాదళ నిర్బంధం కారణంగానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. సైన్యానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతోంది. సైన్యంతో పాటు పోలీసులకు జీతాలు అందడం లేదు. నగదు కోసం ఇరాన్ ఆకలితో ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటం వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. దానిని తిరిగి తెరవాలని తహతహలాడుతోంది’’ అని ట్రూత్ సోషల్ ఆయన వ్యాఖ్యానించారు.అయితే ఇరాన్ తొలి నుంచి హర్ముజ్ మూసివేతకే మొగ్గుచూపుతూ వస్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ దానిని తెరవాలని కోరుకుంటోందని అంటున్నారు. ‘‘ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదించేది. ఇప్పుడు అదే మొత్తాన్ని కోల్పోతోంది. కాబట్టి తెరవాలనే చూస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొంటున్న మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఇప్పటికే సంకేతాలు పంపిందని.. కానీ, తగిన రాజకీయ రాయితీలు లేకుండా జలసంధి తెరిస్తే చర్చల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారాయన. ట్రంప్ వాదనలో నిజం లేదా?ఇరాన్ సైన్యం పూర్తిగా ధ్వంసమైందని అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అలాగే.. యుద్ధంతో సైన్య వ్యవస్థ ఘోరంగా దెబ్బ తిందని ట్రంప్ అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. ప్లాన్ బీ ఇదే.. ప్రాంతీయ మిత్రపక్షాల సహకారంతో ఇరాన్ యుద్ధంలో బలంగానే కనిపిస్తున్నా.. ఆర్థికంగా మాత్రం బలహీనంగానే ఉందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చర్చల కోసం ఇరాన్ మెడలు వంచాలని అమెరికా అడుగులేస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఇరాక్కు డాలర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ చర్య ద్వారా ఇరాన్ మద్దతు పొందిన మిలీషియాలను బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇరాన్ సముద్ర వాణిజ్యాన్ని అడ్డుకోవడం.. వారి ప్రధాన ఆదాయ వనరులను కత్తిరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. చమురు ఎగుమతులే ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరు. అయితే ప్రస్తుతం అక్కడి పోర్టులపై అమెరికా నిర్బంధం కొనసాగుతోంది. దీనివల్ల చమురు బయటకు వెళ్లడం లేదు. ఈ ప్రభావంతో ఖార్గ్ దీవి (ఇరాన్ చమురు ఎగుమతుల 90% నిర్వహించే కేంద్రం) నిల్వలు నిండిపోయి ఉన్నాయి. కొత్తగా చమురు తీయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో చమురు బావులను తాత్కాలికంగా మూసేసే పరిస్థితికి దారి తీసింది. ఇది.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అంటున్నారు. ఇరాన్ కౌంటర్సీజ్ ఫైర్ పొడిగింపు.. అమెరికా ఏకపక్ష నిర్ణయంగానే కనిపిస్తోంది. పాకిస్తాన్ నాయకత్వం అభ్యర్థన మేరకు దాడుల్ని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై ఇరాన్ కౌంటర్ వేసింది. ‘‘ సీజ్ ఫైర్ వంకతో ఈ గ్యాప్లో అమెరికా మళ్లీ దాడులు చేయాలని చూస్తోంది. అయినా ఓడిపోయేవాళ్లు నిబంధనలు పెట్టడం ఏంటి?’’ అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ చర్చల ప్రతినిధి మహ్మద్ బాగేర్ ఖలీబాఫ్ ఓ ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ పొడిగింపు కేవలం వ్యూహాత్మక ప్రయోజనం కోసమే. నౌకాదళ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. పోర్టులకు వచ్చే నౌకలను ఆపడం కాల్పుల ఉల్లంఘన కాదా?. ఇది యుద్ధ చర్య కాకుండా మరేమిటి?. ఇలాంటి బెదిరింపుల మధ్య మేం చర్చలు జరపం అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. ఇరాన్ చర్చలకు దూరంగా ఉండటం.. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ పర్యటనను రద్దు చేసుకోవడం.. ఈ రెండు పరిణామాలు కలిపి శాంతి చర్చలపై తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి. -
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన.. గల్ఫ్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
-
గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్తో శాంతి చర్చలు కోసం తపిస్తున్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ ఎలాగైనా దానిని ముగించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సీజ్ఫైర్ని మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇరాన్తో ఏకీకృత ఒప్పందం వచ్చే వరకూ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై దాడి చేయడానికి అమెరికాకు సహకరిస్తే చమురు ఉత్పత్తి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు సీజ్ఫైర్ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం గల్ఫ్ దేశాల పాలిట శాపంగా మారింది. అమెరికా ఎయిర్బేస్లకు సహకరిస్తున్నారని నెపంతో ఇరాన్ గల్ఫ్ దేశాల టార్గెట్గా దాడులు జరిపింది. అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్న నేపథ్యంలో అమెరికా గల్ఫ్ దేశాల్లోని తన స్థావరాలను మరింత బలోపేతం చేస్తుందేమోనని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో ఆ దేశాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో "ఇరాన్ దేశంపై దాడి చేయడానికి శత్రువుల పక్కన చేరి దేశ భూభాగాన్ని, సౌకర్యాలని వారు ఉపయోగించుకునేలా సహకరిస్తే దక్షిణ పొరుగు దేశాలు చమురు ఉత్పత్తికి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందని తెలుసుకోవాలి " అని గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసావి పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి.అయితే ఇది వరకూ యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలే లక్షంగా దాడి చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ (UAE), కువైట్, బహ్రెయిన్, ఖతార్లలోని చమురు నిల్వ ఉంచిన డిపోలు, రిఫైనరీలు, మరియు గ్యాస్ ఫెసిలిటీలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్నింగ్ ఇచ్చింది. -
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు.ఇరాన్ తమతో ఏకీకృత ఒప్పందానికి వచ్చే వరకు, శాంతి చర్చలు ముగిసేవరకు కాల్పుల విమరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం యాథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అని తెలిపారు. అయితే ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన రెండో విడత శాంతి చర్చలకు వచ్చేందుకు ఇరాన్ విముఖత చూపడంతో ట్రంప్ మంగళవారం సీఎన్బీసీ ‘స్వాక్బాక్స్’ కార్యక్రమంలో ఇరాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇరాన్ మాతో ఒప్పందానికి రావడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం.కాల్పుల విరమణ గడువు పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారంతో ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగియనుంది. అయితే ఇంతలో ట్రంప్ కాల్పుల విరమణపై యూటర్న్ తీసుకోవడంతో కొంతమేర ఉపశమనం లభించినట్లయింది.ఫలించిన పాక్ ప్రయత్నం..హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్యప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఒక మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్కు హితబోధ చేస్తోంది. కనీసం కాల్పుల విరమణ గడువును అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పాక్ అభ్యర్థనపై ఒక అడుగు ముందుకేసి కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. -
చర్చలపై తొలగని ఉత్కంఠ
వాషింగ్టన్/ఇస్లామాబాద్/టెహ్రాన్: హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో రెండో దఫా శాంతి చర్చలపై సందిగ్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని ఏర్పాట్లూ చేశాక అతిథులు రాబోరన్న వార్త తెల్సి కంగుతున్న అతిథ్య పాకిస్తాన్ మరోమారు తమ దౌత్యమంత్రాంగాన్ని ముమ్మరంచేసింది. ఓ మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్కు హితబోధ చేస్తోంది. గత 24 గంటలుగా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా కొత్తగా హిందూమహాసముద్రంలో ఇరాన్ నౌకను అమెరికా తమ అదీనంలోకి తెచ్చుకోవడంతో ఇరాన్ పాలకుల్లో కోపం మరింత ఎక్కువైంది.కనీసం గడువు తేదీని అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాయబారం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ‘‘ఇరాన్ మాతో సంప్రతింపులు జరపాలి. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ గొప్పదేశంగా అవతరించవచ్చు. అద్భుత దేశంగా ఎదగవచ్చు. మంచి ఒప్పందంతోనే అమెరికా ప్రతినిధి బృందం సంతోషంగా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరుగుతుందని ఆశిస్తున్నా.రెండోదఫా చర్చలకు ఇరాన్ ముందుకు రాక తప్పదు. ఆ దేశానికి మరో మార్గమే లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ గడువును పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు’’అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సీఎన్బీసీ ‘స్వా్కక్ బాక్స్’కార్యక్రమంలో స్పష్టంచేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో బుధవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత ఎక్కువైంది మేమింకా వేచిచూస్తున్నాంఇరాన్ స్పందన కోసం పాక్ వేచిచూస్తోంది. ‘‘ప్రతినిధి బృందం పంపుతుందోలేదో అనే సందేశం కోసం మేం ఆశగా ఎదురుచూస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపే రెండోదశ చర్చలు మొదలుకావడం అత్యంత కీలకం’’అని పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లాహ్ తరార్ మంగళవారం సాయంత్రం మీడియాతో చెప్పారు. అమెరికా వైఖరితోనే మేం రావట్లేదు చర్చలపై ఇరాన్ మంగళవారం స్పందించింది. ‘‘అమెరికా అధ్యక్షుడి చంచల మనస్తత్వం, అసంబద్ధ ప్రకటనలు, సంబంధంలేని వ్యాఖ్యానాలు, బెదిరింపులు, అమెరికా ప్రతినిధి బృందం చేసిన అతి డిమాండ్లతో మేం విసిగిపోయాం. ఫలవంతమైన చర్చలు జరుగుతాయనే నమ్మకం ఉంటేనే రెండోదశ చర్చలకు వస్తాం’’అని ఇరాన్ విదేశాంగ శాఖ పతినిధి ఇస్మాయిల్ బఘేల్ తెలిపారు.మరో నౌక స్వాదీనం: అమెరికా ఇండోనేసియా, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రజలాల్లో ఇరాన్కు చెందిన ‘ఎం/టీ టిఫానీ’నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెచ్చరికల తర్వాత తమ బలగాలు నౌకపైకి దిగాయని అమెరికా ప్రకటించింది. ఈ నౌకను అమెరికాకు తరలించాలా లేదంటే మిత్రదేశంలోకి తరలించాలా అనేది మరో నాలుగు రోజుల్లో తేలుస్తామని అమెరికా తెలిపింది. దిగ్భంధనాన్ని ఛేదించిన జీ సమ్మర్ఇరాన్కు చెందిన ముడిచమురు రవాణా నౌక ‘జీ సమ్మర్’విజయవంతంగా అమెరికా దిగ్బంధనాన్ని చేధించుకుని అరేబియా సముద్రం దిశగా పయనిస్తోందని వార్తలొచ్చాయి. ఏ ఒక్క నౌక కూడా తమ దిగ్బంధనం నుంచి తప్పించుకోబోదని గొప్పలుపోయిన అమెరికాకు ఈ వార్త తలనొప్పిగా మారింది. హార్మూజ్ను దాటేసి, ఏప్రిల్ 19వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్నూ దాటేసిందని నౌకల ట్రాకింగ్ డేటా పేర్కొంది.ఆ 8 మందిని విడిచిపెట్టండిఇరాన్కు ట్రంప్ పిలుపు వాషింగ్టన్: ఇరాన్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మహిళలను వదిలేయాలని ఆదేశ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇస్లామాబాద్లో అమె రికా–ఇరాన్ల చర్చలు ప్రారంభమవుతాయని భావిస్తున్న వేళ ఆయనీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఆరుగురు మహిళలు, ఇద్దరు యువతులకు సంబంధించిన ఫొటోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో విడుదల చేశారు. ‘మన మధ్య జరగబోయే చర్చలకు ఇది శుభారంభం అవుతుంది’అనే వ్యాఖ్యను జోడించారు. -
అమెరికా–ఇరాన్ డీల్పై ఆశలతో...
ముంబై: అమెరికా–ఇరాన్ల మధ్య శాంతి చర్చల పురోగతిపై ఆశలతో పాటు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్ల కిందకి దిగిరావడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ ఒక శాతం లాభపడింది. సెన్సెక్స్ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 212 పాయింట్లు బలపడి 24,577 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.క్యాపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ఆద్యంతం స్థిరమైన లాభాలతో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 79,367 వద్ద, నిఫ్టీ 237 పాయింట్లు ఎగసి 24,602 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.469 లక్షల కోట్లకు చేరింది. ⇒ ఆసియాలో దక్షిణ కొరియా (2.65%), తైవాన్ (1.72%), జపాన్(1%), హాంగ్కాంగ్(0.48%), సింగపూర్ (0.22%), చైనా (0.07%) లాభపడ్డాయి. యూరప్లో ఫ్రాన్స్ (–0.40%), బ్రిటన్ (–0.50%) మార్కెట్లు నష్టపోగా, అయితే జర్మన్ (0.10%) పెరిగింది. అమెరికా స్టాక్ సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో ఎఫ్ఎంసీజీ (2.23%), రియల్టీ (2.17%), ప్రైవేటు బ్యాంకులు (1.71%), ఫైనాన్షియల్ సర్వీసెస్ (1.32%), టెలికమ్యూనికేషన్ (1.14%), పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ (1%) పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు వరుసగా 0.79%, 0.29 శాతం లాభపడ్డాయి. ⇒ మార్చి త్రైమాసిక నికర లాభం 19% వృద్ధితో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 8% పెరిగి రూ.979 వద్ద స్థిరపడింది. 28 పైసలు క్షీణించిన రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 93.44 వద్ద ముగిసింది. పశ్చి మాసియా శాంతి చర్చలపై అనిశ్చితి, క్రూడ్ ధరల్లో ఒడిదుడుకులు వంటివి రూపాయిపై ఒత్తిడి పెంచాయి. నాన్–డెలివరబుల్ ఫార్వర్డ్(ఎన్డీఎఫ్) మార్కెట్లలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్పై ఆర్బీఐ నియంత్రణలను సడలింపు నిర్ణయమూ దేశీయ కరెన్సీపై ప్రభావం చూపిందని నిపుణులు తెలిపారు. -
ఇద్దరిలో ఓ మెట్టు దిగాల్సింది ఎవరు?
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నా.. ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తగ్గబోమని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా అంటోంది. అయితే..చర్చల విషయంలో సానుకూలంగానే ఉన్నా ఇరాన్ బెట్టు చేయడం సరికాదని అమెరికా అంటోంది. కొత్త ఒప్పందం అమలు అయితే అన్నీ సర్దుకుంటాయని.. ఆ ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే ఇరాన్ చర్చలకు దిగి రావాల్సిందేనని.. అప్పుడే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ఇరాన్ చర్చలకు వచ్చినా తుది ఒప్పందం కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆ ‘ఒక్క’ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేకపోవడమే ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది.2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయితే..అదే విషయమై.. అదే ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారాయన. యుద్ధం కన్నా ఒప్పందం మంచిదని పదేపదే పాట పాడుతున్నారు. ఇరాన్కు మరో దారి లేదని హెచ్చస్తూనే.. అవసరమైన సడలింపులు కూడా ఇచ్చేందుకు రెడీ అంటూ బుజ్జగిస్తున్నారు. అవసరమైతే.. డీల్ కుదుర్చుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య యురేనియం శుద్ధి (uranium enrichment) కాలపరిమితి విషయంలోనే కనిపిస్తోంది.ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం(20 ఏళ్లపాటు) నిలిపివేయడానికి అంగీకరించిందని, ఇది కొత్త ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. అయితే, అమెరికా ఏ రకమైన సడలింపులు ఇవ్వగలదో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ కాలం (5–7 సంవత్సరాలు) మాత్రమే అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చే సడలింపులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలని షరతు పెడుతోంది. ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు.అమెరికా ఏం కోరుకుంటోందియురేనియం శుద్ధి, అణు ఆయుధాల అభివృద్ధి పూర్తిగా ఆపడం.బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్పై నియంత్రణ.లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించడం.దేశీయ నిరసనలపై కఠిన చర్యలు తగ్గించడం.ఇరాన్ ఏం ఆశిస్తోందంటే..ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలి. అమెరికా ఆర్థిక ఆంక్షలు తగ్గించకపోతే, అణు కార్యక్రమంపై పెద్ద సడలింపులు ఇవ్వలేమని ఇరాన్ అంటోంది.అణు శుద్ధి అవసరం కూడా. అణు శక్తి ఉత్పత్తి కోసం అవసరమని వాదిస్తోంది.తక్కువకాల పరిమితి మాత్రమే: అమెరికా కోరుతున్న 20 సంవత్సరాలపాటు అణు కార్యక్రమం నిలిపివేయడం సాధ్యం కాదని, గరిష్టంగా 5–7 సంవత్సరాలు మాత్రమే అంగీకరించగలమని చెబుతోంది.ప్రాంతీయ ప్రభావం తగ్గించలేం. లెబనాన్, సిరియా, యెమెన్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం తమ భద్రతా వ్యూహంలో భాగమని ఇరాన్ అంటోంది.దేశీయ విధానాల్లో జోక్యం వద్దు. నిరసనలపై చర్యలు తమ అంతర్గత వ్యవహారమని, అమెరికా లేదంటే ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అంగీకరించలేమని చెబుతోంది.సమాన ఒప్పందం కావాలి: అమెరికా మాత్రమే లాభపడే ఒప్పందం కాకుండా, ఇరాన్కు కూడా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉండాలని కోరుతోంది.సాధ్యమైన సడలింపులు ఆర్థిక ఆంక్షల సడలింపు: చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తగ్గించడం లేదా ఎత్తివేయడం.వాణిజ్య అవకాశాలు: అంతర్జాతీయ మార్కెట్లలో ఇరాన్కు తిరిగి ప్రవేశం కల్పించడం.మానవతా మినహాయింపులు: ఔషధాలు, ఆహారం వంటి అవసరమైన వస్తువులపై ఆంక్షలు తగ్గించడం.సైనిక ఒత్తిడి తగ్గింపు: ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గిస్తే.. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించడం.ఒప్పందం కుదిరితేప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చు: మధ్యప్రాచ్యంలో యుద్ధం అవకాశాలు తగ్గి, స్థిరత్వం పెరుగుతుంది.ఆర్థిక లాభం: ఇరాన్పై ఉన్న ఆంక్షలు సడలితే, చమురు ఎగుమతులు పెరుగుతాయి.చమురు మార్కెట్పై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.రాజకీయ సంబంధాలు మెరుగుపడవచ్చు. అమెరికా–ఇరాన్ సంబంధాలు సానుకూల దిశలో కదిలి, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.ఒప్పందం కుదరకుంటేఉద్రిక్తతలు పెరుగుతాయి: మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఘర్షణలు.. సైనిక చర్యలు పెరిగే అవకాశంఆంక్షలు కొనసాగుతాయి: ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.చమురు ధరలు పెరిగే అవకాశం: సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.ప్రాంతీయ అస్థిరత: లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు పెరిగి.. ఘర్షణలు మరింత తీవ్రమవుతాయి.చర్చలు విఫలమైతే.. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరింత దూరమవుతాయి. రెండువారాల యుద్ధ విరమణ బుధవారంతో(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాటాక) ముగియనుంది. అంటే.. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. చర్చల్లో ఏదో ఒక పురోగతి కనిపిస్తేనే.. అది పొడిగింపు ఉండొచ్చు. అంటే.. ఈ చర్చలు మిడిల్ ఈస్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. -
పాకిస్థాన్కు ట్రంప్..? యుద్ధం ముగిసేనా..!
ఇరాన్ అమెరికా మధ్య చర్చల విషయంలో ప్రస్తుతం తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. ఇరాన్ చర్చలకు ససేమిరా అనడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్లో జరిగే రెండో విడత చర్చలకు ట్రంప్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఎటువంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తుండగా ఇరాన్ మాత్రం అంగీకరించట్లేదు. యుఎస్ఏ పెట్టే డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్గా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కీలక సమాచారం అందుతుంది. ఇరాన్ సైతం తొలుత చర్చలు జరపమని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానూకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా ముగిసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలు విఫలానికి కారణంట్రంప్.. ప్రధానంగా ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని, హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని కోరుతున్నారు. అయితే దీనికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని, ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులు చెల్లించాలని కోరుతుంది. ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది.సెక్యూరిటీ నీడలో ఇస్లామాబాద్చర్చల జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం ప్రస్తుతం సెక్యూరిటీ నీడలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల కోసం పాకిస్థాన్ సుమారు 20,000 మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్లో మోహరించింది. తొలిదశ చర్చల సమయంలో సైతం ఇరాన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. -
ఇరాన్కు సీక్రెట్ సాయం.. చైనా దొరికిపోయిందా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రికత్తల వేళ పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యుద్ధంలో ఇరాన్కు చైనా సాయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ మూలాల నాయకురాలు నిక్కీ హేలీ దీనికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో, చైనా అడ్డంగా బుక్కైనట్టు నీక్కి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చైనాను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉంది. పశ్చిమాసియా ఘర్షణల్లో చైనా ఇరాన్కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చైనా టెహ్రాన్కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మనిషి భుజం మీద పెట్టుకొని క్షిపణులను ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపాయి. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మీదుగా పంపుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పట్టుబడిన ఇరాన్ నౌక టౌస్కా అనే కంటైనర్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణకు ఆజ్యం పోసింది.దొరికిపోయినట్టేనా? కాగా, ఇటీవలే అమెరికా నౌకాదళం హార్మూజ్ సముద్ర మార్గంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న Touska అనే కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. ఈ నౌక ఇరాన్ షిప్పింగ్ లైన్స్ (IRISL)కు చెందినది. IRISLపై అమెరికా 2019లోనే ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇది ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన వస్తువులను తరలిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిక్కీ హేలీ.. ఈ నౌక చైనా నుండి ఇరాన్కు వస్తూ, క్షిపణుల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను తీసుకెళ్తోందని ఆరోపించారు. నౌకలను ఆపాలని అమెరికా పదేపదే ఆదేశాలు ఇచ్చినా ఇరాన్ మాత్రం దీన్ని ఆపలేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, యుద్ధంలో ఇరాన్కు చైనా సహాయం చేస్తోంది అనే వెల్లడి అయ్యింది. ఇది విస్మరించలేని వాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు.The ship the U.S. seized in the Strait of Hormuz this weekend was headed from China to Iran and is linked to chemical shipments for missiles. It refused repeated orders to stop. Another reminder that China is helping prop up Iran’s regime—a reality that can’t be ignored.— Nikki Haley (@NikkiHaley) April 20, 2026మరోవైపు.. నిక్కీ హేలీ ఆరోపణలపై ఇరాన్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. నౌక విషయంలో అమెరికా చర్యను సాయుధ దోపిడీగా అభివర్ణించింది. ఆ నౌక చైనా నుంచి ప్రయాణిస్తోందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ సమయంలో అమెరికా బలగాలను తాము ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నప్పటికీ నౌకలో సిబ్బంది కుటుంబ సభ్యులు ఉన్నందున తక్షణ ప్రతిస్పందన ఇవ్వలేకపోయామని తెలిపింది.ఇదిలా ఉండగా, ఆసియా నుంచి ప్రయాణం తర్వాత ఆ నౌక ద్వంద్వ ప్రయోజన వస్తువులను తీసుకువచ్చే అవకాశం ఉందని తమ ప్రాథమిక అంచనాలని అమెరికా భద్రతా వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి. ఆ నౌక గతంలో కూడా ద్వంద్వ ప్రయోజన వస్తువులుగా భావించే వాటిని రవాణా చేసిందని ఆ వర్గాల్లో ఒకరు తెలిపారు. అయితే, ఆ వస్తువుల వివరాలను మాత్రం ఆయా వర్గాలు వెల్లడించలేదు. అయితే, సైనిక, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉన్న లోహాలు, పైపులు, ఎలక్ట్రానిక్ విడిభాగాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) పేర్కొంది. 🚨 HOLY CRAP! The Iranian-flagged ship Touska, which the US military seized yesterday, was in-bound from China “loaded with dual-use chemicals used to manufacture ballistic missiles,” per WPUS Marines are now searching 5,000 containers on board.No wonder they tried to run the… pic.twitter.com/Vjl5Z1ynLR— Nick Sortor (@nicksortor) April 21, 2026 చైనాకు కష్టమే.. మొత్తంగా Touska నౌక స్వాధీనం అమెరికా–ఇరాన్–చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇది హార్మూజ్ సముద్ర మార్గం ఎంత సున్నితమైన జియోపాలిటికల్ ప్రాంతమో మరోసారి చూపించింది. దీంతో, చైనా–అమెరికా సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలు కఠినతరం కావడం, చైనా–ఇరాన్ వాణిజ్యం అంతర్జాతీయ పరిశీలనకు గురవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా చైనాపై మరిన్ని ఆంక్షలు లేదా వాణిజ్య పరిమితులు విధించే అవకాశం ఉంది. ఇది చైనా–అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వార్ను మరింత కఠినతరం చేస్తుంది. -
Magazine Story: యుద్ద కాండ
-
ట్రంప్ కొత్త రాగం.. మా కండీషన్ అదే..
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా అఖండ విజయం సాధించింది. ఇరాన్పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టెహ్రాన్ తీవ్రంగా నష్టపోయిందని, బలహీనపడిందని అన్నారు. ఇరాన్పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘యుద్ధంలో ఇరాన్పై మేము విజయం సాధించాం. ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ చాలా బలహీనపడింది. ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతింది. వైమానిక దళం కార్యకలాపాలు తగ్గాయి. రక్షణ వ్యవస్థలు కూడా బలహీనంగా మారాయి. అలాగే, ఆర్థిక పరంగా కూడా ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని వెల్లడించారు.ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్పై దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. కొన్ని ఫేక్ న్యూస్ మీడియా సంస్థలు దీనిని తప్పుగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలను ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ఇస్లామాబాద్ చర్చలు కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఒకవైపు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ చర్చల ఫలితం ఆధారంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది. -
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
-
హార్మూజ్ను దాటిన 10 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా భారతీయ జెండాతో ఉన్న 10 సరకు రవాణా నౌకలు హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్«దీర్ జైశ్వాల్ వెల్లడించారు. ‘‘భారతీయ నౌక ‘దేశ్ గరిమా’విజయవంతంగా హార్మూజ్ను ఆదివారం దాటేసింది. దీంతో జలసంధిని దాటిన మన నౌకల సంఖ్య పదికి పెరిగింది. ముడి చమురుతో బయల్దేరిన ఈ నౌక త్వరలోనే ముంబై నౌకాశ్రయానికి చేరుకోనుంది. పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా పలు నౌకలు భారత్ దిశగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని జైశ్వాల్ చెప్పారు. -
ఇరాన్ విదేశాంగ మంత్రికి పాక్ ఉప ప్రధాని ఫోన్!
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాఖ్ దర్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. చర్చల కొనసాగింపుకు సంబంధించి కీలక విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి కూడా అయిన దర్ టెలిఫోన్లో అరాఘ్చీతో మాట్లాడినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం ఎక్స్ పోస్టులో తెలిపింది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతను పెంపొందించేందుకు అన్ని పెండింగ్ సమస్యలను త్వరితంగా పరిష్కరించుకోవాలని, ఇందుకోసం చర్చలు ఎంతో అవసరమని దర్ పేర్కొన్నట్లు పాక్ తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మంగళవారం ఈ చర్చలు ఇస్లామాబాద్లో జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకు ప్రకటించారు. ఇక ఇరాన్ రెండో విడత చర్చలకు నిరాకరించిన సమయంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇరాన్తో మలి విడత చర్చల కోసం పాక్కు వెళ్లలేదన్న సమాచారం చర్చనీయాంశమైంది. -
చల్లారని పశ్చిమాసియా!
పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు. ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది. ఇరాన్ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది. ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది. తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి. -
అందుకే.. గోల్డ్ రేటు తగ్గింది!
గత కొంత కాలంగా.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు (ఏప్రిల్ 20) కొంత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి కారణం ఏమిటి?, ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి.భారతదేశంలో ఇలా..భారతదేశంలో కీలకమైన పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో జువెలరీ డిమాండ్ తగ్గింది. అయితే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు కొంత పెరిగింది. ఇతర లోహాల విషయానికి వస్తే, వెండి ధర 1.7% తగ్గింది. ప్లాటినం, పల్లాడియం కూడా స్వల్పంగా తగ్గాయి.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు..మరోవైపు.. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు సరిగ్గా ముందుకు సాగకపోవడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి.అమెరికా ఒక ఇరానియన్ కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవడం, దానికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇప్పటికే అమలులో ఉన్న తాత్కాలిక ఒప్పందం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే అనుమానాలు పెరిగాయి. అంతే కాకుండా.. ఇరాన్ తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించడం కూడా అనిశ్చితిని పెంచింది.ద్రవ్యోల్బణ భయం!అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ పరిస్థితులు తాత్కాలికంగా ద్రవ్యోల్బణం పెంచవచ్చని చెప్పారు. అయితే పరిస్థితి త్వరగా సద్దుమణిగితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...
-
అప్పుడు మాత్రమే హర్మూజ్ను దాటండి: భారత్
హర్మూజ్ జలసంధిని దాటే క్రమంలో రెండు వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో భారత్ అప్రమత్తమైంది. మొన్నటి వరకూ హర్మూజ్ను జలసంధిని దాటే క్రమంలో భారత్కు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, రెండు రోజుల క్రితం భారత్ నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాస్త ఆందోళన కల్గించింది. ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ నౌకలు హర్మూజ్ను దాటుతున్నప్పటికీ ఒక్కసారిగా దాడి జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా-ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడమ హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఇరాన్ మరింత పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హర్మూజ్ను తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసిన ఇరాన్.. అందుకు అమెరికా వైఖరే కారణమని ధ్వజమెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో విసుగెత్తిపోయిన ఇరాన్.. ఇక చేసేది లేక హర్మూజ్ను దిగ్బంధనాన్ని కొనసాగించడమే కాకుండా దానిని మరింత పటిష్టంగా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏ నౌకలకు ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదు. ఆ క్రమంలోనే భారత నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అప్పటివరకూ హర్మూజ్ను దాటకండిఈ పరిస్థితుల నడుమ భారత్ కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ ఆదేశాలు వచ్చే వరకూ హర్మూజ్ను భారత నౌకలు దాటే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే లారక్ దీవి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని తమ ఆదేశాల్లో పేర్కొంది, భారత నౌకాదళం సూచించినప్పుడు మాత్రమే హోర్ముజ్ జలసంధి దాటాలని పేర్కొంది. ఏప్రిల్ 18వ తేదీన ఐఆర్జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ )రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది భారత నౌకాదళం.ఇప్పటివరకు పదకొండు భారత నౌకలు జలసంధిని విజయవంతంగా దాటాయి. చివరి ట్యాంకర్ దేశ్ గరీమా ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ నౌకలు.. ఇరాన్ కాల్పుల కారణంగా వెనక్కి తిరగాల్సి వచ్చింది. పర్షియన్ గల్ఫ్లో తమ దేశ నౌకల భద్రతకు సంబంధించి లారక్ దీవి వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బారత నౌకాదళం. దీనిలో భాగంగానే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లారాక్ ద్వీపంఇరాన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన మార్గం. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి నియంత్రణలో భాగంగా ఇరాన్ ఈ ద్వీపాన్ని సైనికంగా ఉపయోగిస్తుంది. -
అమెరికా నౌకలపై ఇరాన్ దాడి!
-
పాక్కు ఇరాన్ సరికొత్త మెలిక
పశ్చిమాసియా సంక్షోభంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ వాణిజ్య నౌకను అమెరికా దళాలు సీజ్ చేయడం.. అటుపై కౌంటర్ దాడులతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శాంతి చర్చలకు తమ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్కు వెళ్లదని ఇరాన్ ప్రకటించడంతో.. పరిస్థితి మొదటికి వచ్చింది. అయితే చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఇరాన్ కొత్త షరతులతో మధ్యవర్తి పాకిస్తాన్ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ కుదర్చడం ద్వారా ట్రంప్నకు మరింత దగ్గర కావాలని.. తమ దేశం చివర ‘శాంతిదూత’ అనే ట్యాగ్ తగిలించుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. అయితే తొలి దఫా చర్చల కోసం పేలవమైన నిర్వహణ.. డీల్ కుదర్చడంలో విఫలం కావడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్ నవ్వులపాలైంది. దీంతో రెండో దఫా చర్చలను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే.. ఇరాన్ మాత్రం పాక్ను మిత్రదేశంగా కాకుండా.. మధ్యవర్తిగానే చూస్తూ చర్చల విషయంలో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇరాన్ను ఇబ్బంది పెట్టే ఏ ప్రయత్నాన్ని తాము అంగీకరించబోమని అంటోంది. అమెరికా డిమాండ్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టింది. ఇదే విషయంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఫోన్లో ప్రస్తావించారు. ఈ ఫోన్కాల్లో ఆయన.. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. అయితే ఆఖర్లో ఇరాన్ భద్రతా ప్రయోజనాలను కాపాడే షరతులపై మాత్రమే చర్చలకు తాము ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ‘‘మా అణు కార్యక్రమం శాంతి ప్రయోజనాల కోసం. దాన్ని వదులుకోవడం అసాధ్యం’’ అని పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే.. ఈ విషయంలో అమెరికా ఓ మెట్టు పైనే ఉంటోంది. ఇరాన్ అణు ప్రోగ్రామ్ తగ్గించాలని, శుద్ధి చేసిన యురేనియంను అంతర్జాతీయ పర్యవేక్షణ కోసం తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఇరాన్ను ఒప్పించే పూచీ తమదని ట్రంప్నకు తొలి నుంచి పాక్ చెబుతూ వస్తోంది. ఈ హామీ ఆధారంగానే ట్రంప్ బాహాటంగా ఇరాన్ అన్నింటికీ అంగీకరిస్తుందంటూ వరుస స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే.. ఇరాన్ మాత్రం ఆ కండిషన్లకు ససేమీరా అంటోంది. వాటిని ‘అసాధ్యమైనవి’గా పేర్కొంటూ అవసరమైతే చర్చలనే బహిష్కరిస్తామని హెచ్చరిస్తోంది. ఈ కఠిన వైఖరి ట్రంప్నకు మరింత మంట పుట్టిస్తోంది. అదే టైంలో.. పాక్కు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది.ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. ఇరాన్–అమెరికా మధ్య చర్చలు జరగడం ప్రాంతీయ శాంతికి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ తన అణు హక్కులను వదులుకోదనే స్పష్టమైన సంకేతం ఇస్తూ.. అమెరికాను ఢీ కొట్టి తీరతామనే వైఖరిని ప్రదర్శిస్తోంది. -
గల్ప్ దేశాలకు గుణపాఠం..
ఇరాన్పై అమెరికా-ఉక్రెయిన్ దాడుల కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే ఇరాన్, అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఇటు ఇరాన్ ప్రతి దాడులతో గల్ప్ దేశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలకు అమెరికా ఇచ్చిన ప్రధాన భరోసా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ THAAD (Terminal High Altitude Area Defense) విఫలం కావడంతో గల్ప్ దేశాలకు కునుకు పట్టడం లేదు. భారీగా డబ్బులు వెచ్చించి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసినప్పటికీ ఇలా జరగడంతో పలు దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.ఇజ్రాయెల్-అమెరికాలతో ఇరాన్ తనకున్న పరిమితి వనరులతోనే ధైర్యంగా పోరాటం చేస్తూ వ్యూహాత్మకంగా ఎదురుదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడి, శత్రువుల ఆయుధాలను నాశనం చేసింది. ఇదే సమయంలో గల్ప్ దేశాల్లో ఉన్న రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్షిపణులు చేధించడం చర్చనీయాంశంగా మారింది. గల్ప్ దేశాలకు అమెరికా అందించిన అత్యాధునిక టెక్నాలజీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ థాడ్, Patriot PAC-3 లాంటి వ్యవస్థలను ఇరాన్ మట్టికరిపించింది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2025 మేలో రియాద్ వేదికగా గల్ప్ దేశాలతో 142 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.11.8 లక్షల కోట్)లు విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో THAAD, Patriot అప్గ్రేడ్లు, డ్రోన్లు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తయారు చేయబడ్డాయి. కానీ, ఇరాన్ క్షిపణి దాడులకు ఇవి నిలవలేకపోయాయి. అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేయగా, ఇరాన్ ప్రతీకారంగా 400 క్షిపణులు, 1000 డ్రోన్లు గల్ఫ్ దేశాలపై ప్రయోగించింది. దీంతో.. THAAD రాడార్లు (AN/TPY-2) జోర్డాన్, సౌదీ, యూఏఈలో నాశనం అయ్యాయి. Patriot వ్యవస్థలు కొంతమేర అడ్డుకున్నా, భారీ సంఖ్యలో వచ్చిన డ్రోన్లు, క్షిపణులను తట్టుకోలేకపోయాయి. సౌదీ, యూఏఈలోని ఎయిర్బేస్లు, ఇంధన సదుపాయాలు, పట్టణాలు నేరుగా దెబ్బతిన్నాయి. రక్షణ కోసం గల్ఫ్ దేశాలు ఖర్చు చేసిన వందల బిలియన్ల డాలర్లు ఆశించిన మేరకు రక్షణ ఇవ్వలేకపోయాయి. అమెరికా కవచం “ఇనుప గోడ” అని చెప్పబడినా వ్యవస్థ వాస్తవంలోకి రాగానే తుస్సుమనిపించింది.ఇక, సెంటర్ ఫర్ స్ట్రాటజీక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం.. దక్షిణ కొరియా, గౌమ్ సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 8 థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఒక్కో దాని విలువ 300 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,760 కోట్లు). ‘ఇవి చాలా విలువైన వ్యూహాత్మక వనరులు.. వీటిని కోల్పోవడం ఒక పెద్ద ఎదురు దెబ్బ’ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో క్షిపణి రక్షణ నిపుణుడు టామ్ కరాకో అన్నారు. థాడ్ బ్యాటరీలో సాధారణంగా 90 మంది సైనికులు, ట్రక్కులపై అమర్చిన ఆరు లాంఛర్లు, మొత్తం 48 ఇంటర్సెప్టర్ క్షిపణులు (ప్రతి లాంచర్కు 8 వంతున), ఒక TPY-2 రాడార్తో పాటు టాక్టికల్ ఫైర్ కంట్రోల్, కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 13 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గగనతల, రక్షణ వ్యవస్థ ఏర్పాటుచేయాలంటే ఇదొక్కటే మార్గమని పసిఫిక్ ఫోరమ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణుడు విలియమ్ అల్బెర్క్యూ అన్నారు.🚨⚡️ BLINDED: Iranian strikes destroy the $1.1 Billion US Radar in Qatar! 🇶🇦🇺🇸🇮🇷Al Jazeera reveals the destruction of the AN/FPS-132 system at Al Udeid.Iran successfully neutralized the "Brain" of THAAD and Patriot defenses! pic.twitter.com/m5xi4sdBDb— RussiaNews 🇷🇺 (@mog_russEN) April 10, 2026ఇదిలాఉండగా.. ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు (US THAAD) ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలను ఉటంకిస్తూ ముందు సీఎన్ఎన్ నివేదించింది. అనంతరం, ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు అమెరికా అధికారి సైతం ధ్రువీకరించారు.THAAD బ్యాటరీ అంటే ఏమిటి? THAAD అనేది అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. స్వల్ప-శ్రేణి, మధ్యస్థ, దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనిని 'అమెరికన్ బ్రహ్మాస్త్ర' అని కూడా అంటారు. వాతావరణం లోపల, వెలుపలి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఏకైక వాయు రక్షణ వ్యవస్థ దీనికి కారణం. అందుకే అమెరికా THAAD సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుస్తుంది.THAAD ఎలా పని చేస్తుంది? THAAD అనేది ఇన్కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను వాటి ఫ్లైట్ టెర్మినల్ దశలో (లక్ష్యానికి దగ్గరగా) మాత్రమే అడ్డుకునేలా రూపొందించబడింది.THAAD షార్ట్, ఇంటర్మీడియట్ , ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా రక్షిస్తుంది.ఇందులో ఎలాంటి పేలుడు వార్హెడ్లు ఉండకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. ఇది గతిశక్తి (శక్తి వినియోగం) సహాయంతో లక్ష్యాలను నాశనం చేస్తుంది.THAAD ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ప్రత్యేకంగా అమెరికన్ సైనికులచే నిర్వహించబడుతుంది.THAAD ప్రధాన భాగాలు? THAADలో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి, ఇందులో ఇంటర్సెప్టర్లు, లాంచర్లు, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్లు ఉన్నాయి.ఇంటర్సెప్టర్ ఇంపాక్ట్ ఫోర్స్ని ఉపయోగించి ఇన్కమింగ్ క్షిపణులను నాశనం చేయడంలో సహాయపడుతుంది, అయితే లాంచ్ వెహికల్స్ ఇంటర్సెప్టర్ను మోసుకెళ్లి లాంచ్ చేస్తాయి.అదేవిధంగా, రాడార్ సాంకేతికతలు 870 నుండి 3,000 కి.మీ పరిధిలో బెదిరింపులను గుర్తించగలవు. అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు ఇంటర్సెప్టర్ల ప్రయోగ, లక్ష్యాన్ని సమన్వయం చేస్తాయి. IMO, this is the best shot of an Iranian missile attack in this war so far. This was at Prince Sultan Airbase in Saudi Arabia.The US lost a THAAD radar & an E-3 Sentry AWACS at this base. Both were executed by $20K drones. pic.twitter.com/UsrpcQWfol— Dr. Syed Mohd Murtaza مرتضیٰ (@syedmohdmurtaza) April 14, 2026చర్చలే కీలకం.. THAAD, Patriot లాంటి వ్యవస్థలు బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా, వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో బలహీనతలు బయటపడ్డాయి. ఈనేపథ్యంలో పొరుగు దేశాలతో శాంతి ఒప్పందాలు, చర్చలు, పరస్పర అవగాహన క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఉపయోగపడనుంది. అలాగే, గల్ఫ్ దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తే భద్రతా వ్యవస్థలు మరింత బలపడతాయి. ఇదే సమయంలో స్వదేశీ సాంకేతికత, స్థానిక రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తే ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్- అమెరికా మధ్య అసలేం జరగనుంది..?
ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఓ వైపేమో డొనాల్డ్ ట్రంప్ చర్చలకు రాకుంటే వినాశనం తప్పదని హెచ్చరిస్తుంటే మరోవైపేమో ఇరాన్ హర్మూజ్ బ్లాకేడ్ విరమించేదాకా చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగనుంది. అసలు యుద్ధం ముగింపు దశకు చేరుకుందా.. లేక మరింత ఉదృతమవుతుందా అనే సమాచారం తెలుసుకోవాలని ఉందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి..!యుద్ధం ఎందుకు మెుదలైందిఅమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్పై సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. అయితే దానికి మెుదటి కారణం ఇరాన్ తన అణు అణు బాంబును తయారు చేసే స్థాయికి చేరుకోవడమైతే మరోటి ఆ దేశంలోని ప్రజల అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టడం. ఈ రెండు కారణాలపై మెుదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్ చివరికి అనుకున్న పని చేశారు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించారు.మెుదటి రోజే ఖమేనీ హత్యదీంతో ఫిబ్రవరి 28 న ఇరాన్పై ఆపరేషన్ "ఎపిక్ ప్యూరీ" పేరుతో అమెరికా దాడులు ప్రారంభించింది. యుద్దం ప్రారంభించిన మెుదటిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని అంతం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ సైతం అధికారికంగా ధృవీకరించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యుద్దం తీవ్రంగానే ఉండబోతుందని ఆందోళన చెందింది. అయితే ఇరాన్ సైతం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఏకకాలంలో ధీటుగా ఎదుర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు టెల్ అవీవ్ పై మిసైల్స్ అటాక్ చేసింది. ఇరాన్ ఏంతకీ వెనక్కి తగ్గలేదు.హర్ముజ్ దిగ్భందనంప్రపంచ చమురు రవాణాకు ఏంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం చమురు ఈ జలసంధి గుండానే రవాణా జరుగుతుంది. అటువంటిది ఈ జలసంధిని ఇరాన్ బ్లాక్చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చమురు, గ్యాస్ సరఫరా లేక చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇంధన కొరతను తట్టుకోలేక లాక్డౌన్ సైతం విధించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది.ట్రంప్ అంచనాలు తలకిందులు.యుద్దం విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా తలకిందులైంది. యుద్ధాన్ని కేవలం వారం రోజుల్లో ముగిస్తానని అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తొలుత నుంచి చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్నకు ఆ రెండు విషయాల్లో చుక్కెదురైంది.. వారం రోజుల్లో కాదు కదా యుద్ధం ప్రారంభమై 40 రోజుల దాటినా ఇరాన్ వెనుకంజవేయలేదు.. మరో వైపు అక్కడి ప్రజలు ఇరాన్కు అండగా ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడ్డారు.ట్రంప్ చర్చల రాగంఅయితే మెుదటి నుంచి ఇటు ఇరాన్.. అటు అమెరికా ఎక్కడా తగ్గలేదు.. ఇరాన్లోని అణుస్థావరాలను విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశామని అమెరికా వాదిస్తుంటే.. అమెరికా ఫైటర్ జెట్స్ను కూల్చేసేమని తమతో యుద్దంలో అమెరికా ఓడిపోయిందని పరస్పరం వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో తాను చర్చలకు సిద్ధమని ట్రంప్ ఏప్రిల్ 8న ప్రకటించారు. అయితే చివరి వరకూ చర్చలపై ఏటూ తేల్చని ఇరాన్.. ట్రంప్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో కాస్త తగ్గింది. చర్చలకు రాకుంటే ఇరాన్ నాగరికతనే అంతం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండు వారాల పాటు సీజ్ఫైర్ ఒప్పందం జరిగింది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలుదీంతో ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 11, 12 తేదీలలో చర్చలు జరిగాయి. అయితే అమెరికా నిబంధనలు నేపథ్యంలో చర్చలు విఫలమయ్యాయి.ఇరాన్ అణుబాంబు తయారిని పూర్తిగా నిలపివేయాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించాలని డిమాండ్ పెట్టింది. దీంతో ఇరాన్ ఈ చర్చలకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.దీంతో అమెరికా హర్ముజ్ను బ్లాకేడ్ చేసింది. దీంతో ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించింది. తాను కూడా హర్ముజ్ను అష్టదిగ్భందనం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి తన దుందుడుకు స్వభావంతో వ్యాఖ్యానించారు. ఇరాన్ మిలటరీ సర్వనాశనం అయ్యిందని వారికి యుద్దం చేసే సత్తాలేదని ఆరోపించారు.యుద్ధం ముగుస్తుందా?ప్రస్తుతం యుద్దం ముగుస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే అమెరికా ప్రధాన లక్షం ఇరాన్కు అణుబాంబు లేకుండా చేయడం అయితే దానికి టెహ్రాన్ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేలా లేదు. మరోవైపు ఇతర విషయాలలోనే రెండు దేశాలు పరస్పర వైవిధ్యాలు కలిగి ఉన్నాయి. ఇరాన్ స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్ సైతం ఇటీవల ఈ వ్యాఖ్యలే చేశారు. అమెరికా ఒత్తిడి చేస్తున్న ఇరాన్ రెండో దఫా చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెబుతుంది. ఈ నేపథ్యంలో ఏవరో ఒకరు పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గితే తప్ప దీనికి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం కనిపించడం లేదు. దీంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
సీజ్ ఎఫెక్ట్.. ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్ నౌకలపై దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. అమెరికా యుద్ధ నౌకలపైకి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌకను అమెరికా సీజ్ చేసింది. దిగ్భంధనాన్ని దాటినందుకు తౌస్కా అనే వాణిజ్య నౌకపై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్టు చేసింది. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్ చేసినట్లు పేర్కొంది. దీంతో, ఈ చర్యకు ప్రతిస్పందించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అనంతరం, అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్ఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను ఐఆర్జీసీ తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసలు చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది. -
ప్రపంచానికి హెచ్చరిక భారీ షాక్ ఇచ్చిన ఇరాన్
-
రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగొచ్చు: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో సాగుతున్న పోరాటం ఇంకా ముగియలేదన్నారు. యుద్ధంలో ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటుచేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బెంజిమిన్ నెతన్యాహు తాజాగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో కలిసి మాట్లాడుతూ..‘ఇరాన్పై పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా మరిన్ని పరిణామాలు చోటుచేసుకోవచ్చు. రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’ అంటూ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించి తీరతాయని, ప్రపంచ స్వేచ్ఛా ప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అలీ రిడా అబ్బాస్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్లోని బింట్ జెబీల్ పట్టణానికి హెజ్బొల్లా కమాండర్గా అబ్బాస్ ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని తాము మూసేస్తామన్నారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ హుస్సేన్ పేర్కొన్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.చర్చలు లేవన్న ఇరాన్..అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది. -
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
-
‘ప్రతీకారం తీర్చుకుంటాం..’ అమెరికా-ఇరాన్ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. రెండో దఫా చర్చలపై ప్రతిష్టంబన కొనసాగుతుండగా.. అమెరికా నౌకాదళం ‘‘టౌస్కా’’ అనే ఇరాన్ వాణిజ్య నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చైనా నుండి ఇరాన్ వైపు ప్రయాణిస్తుండగా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ చర్యకు గట్టి ప్రతీకారమే ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. తమ సైన్యం హెచ్చరించినా ఆ నౌక ఆగలేదని.. అందుకే స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. ఇరాన్ సైనిక కమాండ్ ఖాతమ్ అల్-అన్బియా ఈ చర్యను.. సముద్ర దొంగతనంగా, ఆయుధ దోపిడీగా అభివర్ణించారు. అమెరికా రెండు వారాల కాలం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. అమెరికా దాడికి తగిన ప్రతిస్పందన ఇస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో.. నౌకను అమెరికా మెరైన్లు స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుతం నౌకపై పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. ఈ నౌకపై గతంలో అక్రమ కార్యకలాపాలు జరిపినందుకు అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించిందని ఆయన గుర్తు చేశారు.మొదట ఇరాన్ ఈ ఘటనను ఖండిస్తూ.. తమ నౌకాదళం సమయానికి స్పందించి అమెరికా దాడిని అడ్డుకుందని ప్రకటించింది. అయితే, తరువాత అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఈ సంఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.చర్చలపైనా ఉత్కంఠఇరాన్–అమెరికా మధ్య ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అమెరికా ప్రతినిధుల బృందం పాక్కు వెళ్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఇరాన్ మాత్రం ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదని అంటోంది. హర్ముజ్లో అమెరికా కవ్వింపు చర్యలు, తమకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రకటనల నేపథ్యంలో చర్చలకు వెళ్లబోమని ప్రకటించింది. దీంతో ట్రంప్ ఇరాన్పై భగ్గుమన్నారు. చర్చలకు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఈ నెల 22తో ముగియనుంది. ఇరాన్ దిగిరాకుంటే కాల్పుల విరమణ పొడిగింపు ఉండదని.. భీకర దాడులు జరుపుతామని ట్రంప్ అంటున్నారు. -
చర్చలకు వచ్చేది లేదు ఇరాన్.. రాకుంటే వినాశనమే ట్రంప్
-
మార్కెట్కు హార్మూజ్ టెన్షన్!
పశ్చిమాసియా యుద్ధ ఆందోళనలకు తాత్కాలికంగా తెరపడినట్లు గత వారాంతాన వెలువడిన వార్తలు ఒక్క రోజులోనే రివర్స్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహానికి బ్రేక్ పడనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు తిరోగమన పథం పట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముడిచమురు ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపగల యూఎస్, ఇరాన్ యుద్ధ ఆందోళనలు తిరిగి పెరగనున్నాయి. హార్మూజ్ జలాలపై యూఎస్, ఇరాన్ బలప్రయోగ వార్తలు అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితికి దారితీయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రధానంగా చమురు రవాణాకు విఘాతం కలగడంతో ధరలు మళ్లీ ఊపందుకునే వీలుంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చమురు ధరలు, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్కు కీలకమైన ఇరాన్, యూఎస్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్. తెలియజేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఈ నెల 22న ముగియనుంది. రిజల్ట్స్ సీజన్.. గత వారాంతాన బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐతోపాటు యస్ బ్యాంక్ క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ ప్రభావం నేడు ఆయా స్టాక్స్పై కనిపించే వీలుంది. ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి ఫలితాల సీజన్ మరింత ఊపందుకోనుంది. ఈ వారం పలు దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో ఐటీ దిగ్గజాలు హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాసహా.. హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, పీఎన్బీ హౌసింగ్, నెస్లే, పెర్సిస్టెంట్, ఒరాకిల్, ఎస్బీఐ లైఫ్, ఎల్టీ టెక్, ఎల్టీఎం, ఎల్అండ్టీ ఫైనాన్స్ తదితరాలున్నాయి. గణాంకాలు కీలకం మార్చి నెలకు నేడు(20న) ఇన్ఫ్రా ఔట్పుట్ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో గురువారం(23న) హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. గత వారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ పాలసీ నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వీటికితోడు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు తదితర అంశాలు దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు.గత వారమిలా వరుసగా రెండో వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ నికరంగా 943 పాయింట్లు(1.2 శాతం) బలపడి 78,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 303 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,354 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మరింత అధికంగా 3.2 శాతం, 4.6 శాతం చొప్పున ఎగశాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పాక్కు ట్రంప్ ప్రతినిధులు.. ఇరాన్ వెళ్లట్లేదా?
టెహ్రాన్: అమెరికా ప్రతినిధులు ఇరాన్తో చర్చల కోసం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు సోమవారం (ఏప్రిల్ 20) సాయంత్రం వెళ్తున్నారని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమెరికా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా ఇరాన్ మాత్రం కనీసం ఇస్లామాబాద్కు వెళ్తున్నామా? లేదా? అన్న విషయాన్ని కూడా చెప్పడం లేదు. ఇరాన్ ఇప్పటి వరకు పాకిస్థాన్కు చర్చల కోసం తమ టీమ్ను పంపే విషయంలో నిర్ణయం తీసుకోలేదని తస్నీమ్ వార్తా సంస్థ తెలిపింది. నౌకాదళ నిర్బంధం కొనసాగుతుండడంతో ఇస్లామాబాద్కు చర్చల బృందాన్ని పంపే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇరాన్ తెలిపింది. “ట్రంప్ ప్రకటించిన నౌకాదళ నిర్బంధం కొనసాగుతున్నంత వరకు ఎలాంటి చర్చలు ఉండవు అని ఇరాన్ టీమ్ స్పష్టం చేసింది” అని తస్నీమ్ ప్రతినిధి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్తో రెండో దఫా చర్చలు సోమవారం పాకిస్థాన్లో జరుగుతాయని మొదటి నుంచి చెబుతున్నారు.అమెరికా ప్రతినిధులు ఇప్పటికే ఇస్లామాబాద్ వెళ్తున్నారు. సోమవారం సాయంత్రంలోగా అక్కడికి చేరుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సీరియస్గా ఉన్నారు. ఈ రెండో దశ చర్చలు సఫలం కాకపోతే దాడులు చేస్తామని తెలిపారు. తాము చాలా న్యాయమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నామని అన్నారు. ఇరాన్ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నానని ట్రంప్ చెప్పారు. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. -
తుది చర్చలు చాలా దూరం.. ఇరాన్ స్పీకర్
ఇరాన్- అమెరికా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిభాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలలో ప్రాథమిక అంశాలలో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. తుదిదశ చర్చలకు రెండు దేశాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయన్నారు.ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సరైన సయోధ్య కుదరకపోవడంతో చర్చలు ఎటువంటి సానూకూల ఫలితాలు లేకుండానే ముగిశాయి. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్ఫైర్ ఒప్పందం ఈ నెల 21తో ముగుస్తోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మరో దపా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు.మహ్మద్ గాలిఫ్ మాట్లాడుతూ " ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొన్ని విషయాల్లో తీవ్ర అభ్యంతరాలున్నాయి. తుదిదశ చర్చలకు ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించింది. అందుకే కాల్పుల విరమణకు అంగీకరించాం". అన్నారు. శత్రుదేశం తమ స్వలాభం కోసం ఎన్నో డిమాండ్లను ఇరాన్పై రుద్దే ప్రయత్నం చేసింది. కానీ మేము వాటిని ఎదుర్కొన్నాం. పోరాటంలో చర్చలు కూడా ఓ భాగమే అని మహ్మద్ గాలిఫ్ అన్నారు.తదుపరి చర్చల మాట్లాడే అంశాలపై చివరి దశ ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తున్నామని ఇరాన్ ప్రతినిధులు ఈ అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలిపారు. మరోవైపు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ ప్రస్తుతం రెండు దేశాల మధ్య చాలా మంచి సంభాషణలు జరుగుతున్నాయి.ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అంశంపై మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగానే ఉన్నాయని, అయితే ఇరాన్ తమను "బ్లాక్మెయిల్" చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మళ్ళీ బాంబుల దాడి మొదలుపెడతామని అంతకుముందు ఆయన హెచ్చరించారు.ఇస్లామాబాద్ భేటీఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ , గాలిబాఫ్ నేతృత్వంలోని బృందం మధ్య చర్చలు జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి. అనంతరం మరోదఫా చర్చలు పాకిస్థాన్ వేదికగా రేపు ( సోమవారం) జరగనున్నట్లు సీఎన్ఎన్ నివేదిక వెల్లడించింది.మరోసారి టెన్షన్అయితే ఇరు దేశాల మధ్య సానూకూల వాతావరణం వచ్చినట్లే వచ్చి మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ తొలుత హర్ముజ్పై విధిస్తున్న దిగ్భందం తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ మరోసారి జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో దఫా చర్చలలో ఏం జరగనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
భారత నౌకలపై ఇరాన్ దాడి.. ఆడియో టేప్ వైరల్
నిన్న (శనివారం) హర్ముజ్ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్గా మారింది.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయితే నిన్న భారత్కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్జ్ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్గా మారింది.ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఇది వరకూ భారత్కు చెందిన నౌకలకు హర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.ఏం జరిగింది?శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.#BREAKING Audio clip emerges from attacked Indian oil tanker!"You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!" — Audio from the Indian oil tanker fired on by the Iranian NavyClearance given. Ship fired on anyway https://t.co/FDAxliPc7Q pic.twitter.com/KH0Y4eYGCh— Nabila Jamal (@nabilajamal_) April 18, 2026 -
భారత్లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా?
న్యూఢిల్లీ: అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని అందుకే హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నౌకలపై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దీంతో భారత్లో ఇంధన సరఫరా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 రోజుల వరకు చమురు, పెట్రోల్, డీజిల్,ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం మూసుకుపోతే సరఫరా అంతరాయం, రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.భారత్ గత కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రెడ్ సీ–సూయజ్ కాలువ మార్గం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తోంది. అదనంగా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది. ప్రస్తుతం భారత్కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్ఎన్జీ నిల్వలు, 40 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు వరకు ఉంది.ప్రస్తుతం నిల్వలు ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే భారత్కి ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సరఫరా ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
బీటా హెమ్మతిని చంపేస్తామని ఇరాన్ బెదిరింపులు.. మౌనంగా డొనాల్డ్ ట్రంప్
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న మహిళ బీటా హెమ్మతికి మరణశిక్ష విధించాలని నిర్ణయించింది. నిరసనలకు గాను మరణశిక్షకు గురైన తొలి మహిళగా బీటా నిలిచింది. ప్రస్తుతం మరణశిక్ష ఖైదీలుగా ఉన్న నలుగురిలో ఆమె ఒకరు. బీటాతో పాటు ఆమె భర్త మహమ్మద్ రెజా మజీదీ-అస్ల్కూ మరణశిక్ష విధించాలని అధికారులు నిర్ణయించారు.వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన, పదుల వేల మంది అరెస్టులకు దారితీసిన నిరసనలలో పాల్గొన్నందుకు ఇరాన్ ఇప్పటివరకు ఏడుగురికి ఉరిశిక్ష అమలు చేసింది. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త యుద్ధం నేపథ్యంలో మరణశిక్షల అమలుపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహమ్మద్ రెజా మజీదీ-అస్ల్, అతని భార్య బీటా హెమ్మతి, బెహ్రూజ్ సమనేజాద్, కౌరోష్ సమనేజాద్లకు విధించనున్న మరణశిక్షపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.అమెరికా జోక్యం తర్వాత, జనవరి నిరసనల్లో అరెస్టైన ఇర్ఫాన్ సోల్తానీ (26)కి విధించిన మరణశిక్షను ఇరాన్ తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశ భద్రతకు హాని కలిగించడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం వంటి ఆరోపణలు ఉన్నప్పటికీ, అటువంటి నేరాలకు మరణశిక్ష విధించరాదని కొత్త వివరణ ఇచ్చారు.జనవరి 10న నిరసనల్లో పాల్గొన్నందుకు అరెస్టైన ఇర్ఫాన్ సోల్తానీకి జనవరి 14న ఉరిశిక్ష అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. అనంతరం అనూహ్యంగా వాయిదా వేసి, అతనిపై విధించిన ఆరోపణలు మరణశిక్షకు తగినవి కావని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం మరణశిక్షకు గురైన ఇతర ఖైదీల విషయంలో ట్రంప్ మౌనం వహిస్తున్నారు. -
హార్మూజ్ విషయంలో ఇరాన్ బిగ్ ట్విస్ట్..
-
హార్మూజ్పై ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్.. అమెరికా, ఇజ్రాయెల్పై నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. అయితే, వనరులు ఉన్నంత మాత్రాన యుద్ధంలో గెలవలేరు అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అంతర్జాతీయ ఇంధన రవాణాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం అమెరికా ప్రధాన లక్ష్యం. ఈ జలసంధిని తమ అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇరాన్ను ప్రపంచ దేశాల నుంచి వేరు చేయాలని వారు చూశారు. కానీ, ఇరాన్ నౌకాదళం, క్షిపణి దళాల పహారా ముందు వారి ప్రయత్నాలు సాగలేదు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. శత్రువుల దగ్గర వనరులు ఉన్నా, వాటిని ఉపయోగించే ప్రణాళికలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. యుద్ధంలో ఇరాన్ సాధించిన పైచేయిని చూసి అగ్రరాజ్యం భయపడి ఒప్పందానికి వచ్చింది. మొదట హెచ్చరికలు జారీ చేసిన శత్రువులు, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా విజ్ఞప్తులు పంపుతున్నారు’ అని సెటైర్లు వేశారు.Mohammad Bagher Ghalibaf:“We are fully prepared, if they make even the slightest mistake, we will respond with force.”The message is clear: escalation won’t go unanswered. The stakes just got higher. pic.twitter.com/SuOEkhH2wj— Irfan Ahmad (@Irfuu_) April 18, 2026ట్రంప్ ఆటలు సాగవు..ఇరాన్ను బలహీనపరచాలని శత్రు దేశాలు పన్నిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రజల దేశభక్తిని, సైనిక వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. వ్యూహాత్మక తప్పిదాలు చేశాయి. ఇరాన్ తన పరిమిత వనరులతోనే శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరాన్లో పాలన మార్పు తీసుకురావాలని ట్రంప్ కలలు కన్నారు. కానీ, ఇరాన్ గడ్డపై ట్రంప్ ఆటలు సాగవు. ఇరాన్ అంటే వెనిజులా కాదని, ఇక్కడ శత్రువుల బెదిరింపులకు లొంగిపోయే ప్రభుత్వం లేదు అనేది ముందుగా తెలుసుకోవాలి’ అని హెచ్చరించారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల విషయంలో ఇరాన్ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు హార్మూజ్ జలసంధిని మూసే ఉంటుందని స్పష్టం చేశారు.‘అమెరికా ఫస్ట్’ కాదు.. ఇజ్రాయెల్ ఫస్ట్.. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ట్రంప్ చెప్పిన అమెరికా ఫస్ట్ నినాదంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన.. ట్రంప్ పదేపదే చెబుతున్న ‘అమెరికా ఫస్ట్’ నినాదం గాలికి వదిలేశారు. ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం ఆచరణలో లేదన్నారు. ఆయన ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ అనే నినాదం ఎత్తుకున్నట్టు ఉన్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇచ్చే తప్పుడు సమాచారంతో అమెరికా తన విదేశీ విధానాలను నాశనం చేసుకుంటోంది అంటూ విమర్శించారు. -
‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!
అదేంటోగానీ రేలంగి మావయ్యకు అంతా మంచిగానే అనిపిస్తుంటుంది. అంతటా మంచే కనిపిస్తుంటుంది. చివరకు నిన్నమొన్నటి యుద్ధం టైమ్లో కూడా. ఆ వార్ తాలూకు కష్టాల్లోనూ మంచిని వెతుక్కుంటుంటాడు మన రేలంగి మామయ్య. ‘‘సార్... రేలంగి అంకుల్ సార్. యుద్ధమంటేనే చెడ్డది. ఆ చెడ్డదాంట్లో కూడా... ఆ యుద్ధాల వాకిట్లో... కష్టాల చెట్లనీ... చెట్లలో కూడా నీడను చూస్తున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కారు సార్’’ అన్నాడు రేలంగి మామయ్యగారి వూరి వ్యక్తి ఒకాయన. ‘‘కష్టాలను చెట్టుతో పోల్చారంటే... అసలు మీకంటే గొ΄్పోడెవరుంటార్సార్. ఈ మండు వేసవికాలంలో ఆ చెట్టు నీడకు క్రమంగా అలవాటయ్యామంటే అంతకంటే చల్ల గాలి ఏముంటుందీ. అంతకంటే నేచురాలిటీ ఏముంటుందండీ’’ అంటూ వాక్రుచ్చాడు రేలంగి మామయ్య. ఈ సంభాషణకు నేపథ్యం ఏమిటంటే... ‘‘ఈ ట్రంప్ ఉన్నాడే. వాడు మా చెడ్డవాడు సార్. అనవసరంగా కెలికి లోకమంతటికీ యుద్ధం కష్టాలు తెచ్చిపెట్టాడు. వార్ చేసుకుంటున్నవారు సరే... అసలా వార్తో ఏ సమ్మంధమూ లేనివారిక్కూడా ఎందుకండీ ఈ పాట్లూ... ఈ తిప్పలూ’’ అన్నాడు అక్కడి పల్లెవాసుల్లో ఒకడు. తండ్రికి ఇరువైపులా కూర్చున్న ఆయన కొడుకులు కూడా అదేమాటన్నారు. అంతే... ఒక్కపెట్టున వాళ్లకో క్లాసు తీసుకుంటూ చెలరేగి΄ోయాడు రేలంగి మామయ్య. ఇలా తన స్పీచందుకున్నాడు. ‘‘ఈ యుద్ధం కష్టాలు చూశావా? ఇందులో సీఎన్జీ గ్యాసు దొరకని ఆటోవాడున్నాడూ. టైమ్కు ఇంటికి గ్యాసు సిలెండర్ రానివాడున్నాడూ. రెండ్రోజులపాటు పెట్రోలు బంకుల్లో వరసగా బండ్లను పెద్ద... పే...ద్ద... క్యూల్లో నిలబెట్టినవారున్నారూ. మార్కెట్కెళ్లి పచారీసామాన్ల రేట్లు చూసి గుండెలు బాదుకున్నవారున్నారూ. వీళ్లందరిదీ ఒకటే మాట. ‘దేవుడా నేను మంచోణ్ణి. నాకు గ్యాసు దొరికేలా చూడూ... దేవుడా మేము మంచోళ్లం... మా స్టవ్వుకు గ్యాస్సిలెండరు లోటు రానివ్వకుండా చూడు. మాకు యుద్ధంతో సమ్మంధం లేదు. మాకెలాంటి సరుకుల కొరతా రానివ్వకు’ అని. కానీ ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. అందరికీ సరిసమానంగా కష్టాలు తెచ్చిపెట్టాడు. ఎప్పుడో మా చిన్నతనాన కట్టెల పొయ్యి మీద వండిన టేస్టీ వంటకాల రుచి చూశామా. మళ్లీ ఇన్నాళ్లకి మనందరికీ కట్టెల పొయ్యి మీద వండిన వంటకాల కమ్మటి రుచిని పరిచయం చేశాడు. మన నాస్టాల్జియా రోజుల తాలూకు వంటల రుచి మనకు మళ్లీ చూపించాడు. అందుకు మనమంతా ట్రంపుకి రుణపడి ఉండాల్రా. బజ్జీల బండ్లకూ, టిఫెన్ హోటళ్లకు బ్లాకులో తప్ప కమర్షియల్ సిలెండర్లు దొరక్కుండా చేశాడా... దాంతో కర్రీ΄ాయింట్ల నుంచి కూరలు తెచ్చుకోకుండా, బజార్నుంచి ఏ జంకుఫుడ్డో ఇంటికి తెచ్చుకోకుండా... అందరూ హెల్దీగా హాయిగా హోమ్ఫుడ్డు మాత్రమే వండుకునేలా చేస్తున్నాడు. ఇలా మనందరి ఆరోగ్యాలూ కాపాడుతున్నాడు. అందుకే ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. ఒరేయ్... భలే తెచ్చార్రా. భలేగా కట్టెలు కొట్టుకొచ్చారు గొడ్డలితో. ఏదేమైనా... టైముకు తగ్గట్లు – సిచ్యువేషన్ కు సింకయ్యేట్లుగా అలా అందుకోవాల్రా. అన్నట్టొరేయ్... ఈ వార్ వరకే రా – ఈ కష్టాలన్నీ! తర్వాత మరో సంక్షోభమేదో వెతుక్కుంటూ వస్తుంది కదా. మళ్లీ అప్పుడీ కష్టాలు ఉండవు రా. అప్పుడొచ్చేవన్నీ మళ్లీ ఫ్రెష్షు కష్టాలూ... చాలా పెద్ద పెద్ద కష్టాలున్నూ! అష్టకష్టాల్రా అవి. ఓ రకంగా చెప్పాలంటే ముందుముందొచ్చే పెద్ద పెద్ద కష్టాలకు ప్రీవ్యూల్లాంటివి రా... ఈ ట్రైలర్ కష్టాలన్నీ. రాబోయే పాట్లు పెద్దవిగా అనిపించకూడదని... ఇప్పుడే మనకీ శిక్ష–ణ దొరికేలా చూస్తున్నాడురా ట్రంపు. అందుకే ట్రంపు మంచోడ్రా. అసలు ట్రంపంటేనే మంచోడు’’ అంటూ తన మంచితనపు ఉపదేశాన్ని మంచిమంచి మాటల్తో... మంచిగా ముగించాడు మన రేలంగి మావయ్య. ఆ స్పీచ్ విని దారిన పోతున్న ఒక దానయ్య గారికి అకస్మాత్తుగా రావు రమేశ్ పూనాడు. అప్పుడా రావు రమేశ్ పూనిన వ్యక్తి అన్న మాటేవిటో తెలుసా... ‘‘ఈలోకంలో అన్నింటికీ సూత్రాలు కనిపెట్టారుగానీ... ఈ రేలంగి మాయ్యేవిటో... ఈడి విదానాలేవిటో మనకర్దంగావడం లేదు. మావయ్యగారిని ఎవరికన్నా సూపించండ్రా. వదిలేయకండ్రా బాబు అలాగ. సూపించండ్రా’’ అంటూ సవిలెంటుగా డవిలాగు అంటూ మాయమయ్యాడు తెగ మండిపోతూ ఉన్న అపరిచితుడొకడు!– యాసీన్ -
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
గత కొన్ని రోజులుగా అమెరికా, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ లేనంత స్నేహ బంధం కొనసాగుతోంది. పాక్ నేతలు అమెరికా వెళ్లడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కావడం, ఈ క్రమంలో పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం చూశాం. ప్రత్యేకంగా పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్పై ట్రంప్ దోస్తీ చేయడం అమెరికా నిఘా వర్గాలను టెన్షన్కు గురి చేస్తోంది. మునీర్తో స్నేహమంటే అమెరికాను రెడ్ జోన్లోని నెట్టేయడమేనని నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఇంటెలిజెన్స్ను భయపెడుతున్న అంశాలను పరిశీలిస్తే..అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్పై కొత్త చర్చలు మొదలయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ఆయనను ప్రియమైన ఫీల్డ్ మార్షల్ అని పిలిచారు. కానీ అమెరికా గూఢచార సంస్థలు, ప్రాంతీయ విశ్లేషకులు మాత్రం మునీర్కి ఇరాన్ సైనిక నాయకత్వంతో ఉన్న పాత పరిచయాలు ఒక రెడ్ అలర్ట్గా భావిస్తున్నారు.ఇరాన్తో సంబంధాలు..మునీర్ గతంలో ఇరాన్కి చెందిన ప్రముఖ సైనిక నాయకులు కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీమ్ సోలేమానీ, ఐఆర్జీసీ కమాండర్ హొసేన్ సలామీతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారని పాకిస్తాన్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ వెల్లడించారు. అలాగే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని ఉన్నత స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.మధ్యవర్తిత్వం అవకాశమా? ప్రమాదమా?మునీర్ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగపడవచ్చు. మరోవైపు వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.చారిత్రక అనుమానాలు..అమెరికా విధాన వర్గాల్లో పాకిస్తాన్పై అనుమానం కొత్తది కాదు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ, తాలిబాన్కి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) విశ్లేషకులు, ముఖ్యంగా బిల్ రోజ్జియో, పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించాలా, లేక గూఢచార సంస్థల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా అంతటా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధాన అంచనాలలో మునీర్ ఒక ఉపయోగకరమైన దౌత్య వారధిగా నిలుస్తారా? లేక ఒక సంభావ్య వ్యూహాత్మక భారంగా పరిణమిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇక, అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ వ్యూహాత్మక అవసరాల ఆధారంగా మారుతూ రావడం కొసమెరుపు. -
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు!
కైరో/న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ వద్ద ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరుతున్నాయి. ఆ జలసంధిని తెరిచినట్టు ఇరాన్ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్మూజ్ను దాటుతున్న రెండు భారత చమురు నౌకలపై శనివారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ)కి చెందిన స్పీడ్ బోట్లు కాల్పులకు దిగాయి. దాంతో అవి జలసంధిని దాటకుండానే వెనుదిరిగినట్టు అంతర్జాతీయంగా నౌకల రాకపోకలను ట్రాక్ చేసే టాంకర్ట్రాకర్స్ డాట్కామ్ తదితర సంస్థలు వెల్లడించాయి. వాటిలోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్లో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. అంతేగాక ఇరాన్ చర్యపై తీవ్ర నిరసన కూడా వెలిబుచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐఆర్జీసీ కాల్పులతో మరో నాలుగు భారత చమురు నౌకలు హార్మూజ్ను దాటకుండానే వెనుదిరిగాయి. చమురు, సహజవాయువు, ఎరువుల నిల్వలతో కూడిన 13 భారత నౌకలు ప్రస్తుతం జలసంధి వద్ద చిక్కుబడి ఉన్నాయి. అవి సురక్షితంగా హార్మూజ్ దాటేలా ఇరాన్తో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. అయితే ‘దేశ్ గరిమ’ అనే చమురు నౌక శనివారం హార్మూజ్ను దాటి భారత్వైపు బయల్దేరినట్టు తెలుస్తోంది. మరోవైపు హార్మూజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ఇరాన్ తాజాగా ప్రకటించింది. తమ ఓడరేవుల దిగ్బంధానికి అమెరికా స్వస్తి పలకని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దిగ్బంధం కొనసాగినంత కాలం హార్మూజ్ను తెరవబోమని ప్రకటించింది. దీనికి తోడు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. త్వరలో ఒప్పందానికి రానిపక్షంలో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. అంతేగాక ఇరాన్పై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అణు కార్యక్రమంతో పాటు అన్ని అంశాలపైనా ఇరాన్ తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేదాకా ఆ దేశ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని కూడా అధ్యక్షుడు స్పష్టం చేశారు. దాంతో పశి్చమాసియాలో పరిస్థితులు మళ్లీ విషమించేలా కన్పిస్తున్నాయి. త్వరలో చర్చలు! అమెరికా, ఇరాన్ నడుమ మరో దఫా శాంతి చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఆ రెండు దేశాల నడుమ కాల్పుల విరమణ ఏప్రిల్ 22తో ముగుస్తుండటం తెలిసిందే. ఆ లోపే చర్చలు జరిగే అవకాశమున్నట్టు పాక్ పేర్కొంది. చర్చల నిమిత్తం పంపిన అమెరికా నూతన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వెల్లడించింది. ఇప్పటిదాకా 23 నౌకలు వెనక్కు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించినప్పటి నుంచీ ఇప్పటిదాకా హార్మూజ్ జలసంధి వద్ద 23 నౌకలను అడ్డగించి వెనక్కు పంపినట్టు అమెరికా పేర్కొంది. ఆ దేశ సెంట్రల్ కమాండ్ ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించింది. ఇరాన్ ఓడరేవులతో పాటు ఆ దేశ తీర ప్రాంతమంతటా నౌకల రాకపోకలపై నిషేధం పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 13న అమెరికా సైన్యం ఇరాన్ ఓడరేవుల దిగ్బంధానికి దిగింది.తీవ్ర పోరుకు సిద్ధం: మొజ్తబా శత్రువులపై తీవ్ర పోరాటానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. వారికి భారీ ఓటమి రుచి చూపేందుకు ఇరాన్ నావికా దళం ఇప్పటికే సర్వ సన్నద్ధంగా ఉందని శనివారం విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం వ్యవస్థాపక దినం సందర్భంగా సాయుధ దళాలకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు. పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై సైన్యం చేపట్టిన డ్రోన్ దాడులను ప్రత్యేకంగా ప్రశంసించారు. లెబనాన్లో శాంతిదళాలపై కాల్పులు → ఒక ఫ్రెంచి సైనికుని మృతి → హెజ్బొల్లా పనేనన్న మాక్రాన్ పారిస్: లెబనాన్లో ఐరాస శాంతి పరిరక్షక దళంపై శనివారం జరిగిన కాల్పుల్లో ఒక ఫ్రెంచి సైనికుడు మృతి చెందాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ మేరకు వెల్లడించారు. తమ దేశానికి చెందిన మరో ముగ్గురు సైనికులు గాయపడ్డట్టు తెలిపారు. దక్షిణ లెబనాన్లో శనివారం ఉదయం ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇది హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ పనేనని ఇప్పటిదాకా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నట్టు సోషల్ మీడియా పోస్టులో మాక్రాన్ వివరించారు. ఇందుకు బాధ్యులైన వారిని లెబనాన్ ప్రభుత్వం తక్షణం అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.యురేనియం అప్పగించబోం: ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించే ప్రసక్తే లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. వాటిని అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందనే అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయీద్ ఖతీబ్జాదే పూర్తిగా ఖండించారు. అంతేగాక, ‘‘అమెరికా మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తోంది. కనుక ఆ దేశంతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు’’అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ వద్ద 440 కిలోలకు పైగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నట్టు అంచనా. -
రాడార్లకు చిక్కకుండా ఇరాన్కు చైనా విమానాలు..?
ఇటీవల అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు చైనాపై సంచలన ఆరోపణలు చేశాయి. ఇరాన్కు యుద్ధంలో చైనా సహకరిస్తోందని ఆ దేశానికి పరోక్షంగా ఆయుధాలు అందజేస్తుందన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని చైనా ఖండించింది. తాజాగా మధ్యప్రాచ్యంలో నాలుగు చైనా కార్గో విమానాలు రాడార్లకు చిక్కకుండా అదృశ్యమయ్యాయని నివేదికలు తెలిపాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు ఆందోళనకరంగా మారాయి. కొద్దిరోజుల క్రితం అమెరికా నిఘా వర్గాలు ఇరాన్కు చైనా భారీగా మ్యాన్పాడ్ ఆయుధాలను తరలిస్తోందని ఆరోపించాయి. మ్యాన్పాడ్ అంటే భుజంపై ఎక్కడికైనా మోసుకెళ్లగల ఆయుధాలు. వీటిసాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను సులభంగా కూల్చివేయవచ్చు. ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇవి ఎంతో కీలకంగా పనిచేశాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని నివేదికలు అమెరికా సీక్రెట్ ఏజెన్సీల సర్వేలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.చైనా కార్గో విమానాలుకొన్నిరోజుల క్రితం.. కేవలం 48 గంటల వ్యవధిలో నాలుగు చైనా కార్గో విమానాలు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేసి చైనా భూభాగంలో దిగాయని పలు నివేదికలు కథనాలు ప్రచురించాయి. ట్రాన్స్పాండర్ అనేది సాధారణంగా విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది. ఎంత వేగంతో వెళుతుంది అనే వివరాలని ప్రసారం చేసే ఒక పరికరం. దీనిని ఉద్దేశపూర్వకంగా ఆపివేయడాన్ని డార్క్ ఫ్లైట్ అంటారు. సాధారణంగా వెళ్లే గమ్యం వెల్లడించకుండా ఉండడానికి సైనిక కార్యకలాపాలు, రహస్య లావాదేవీల సమయంలో ఇటువంటి పద్దతులను ఉపయోగిస్తారు.ఆయుధాల తరలింపు?అయితే కొన్ని సామాజిక మాధ్యమాల కథనాల ప్రకారం.. ఆ విమానాలు ఇరాన్కు ఆయుధాలు తరలించడానికి ఉద్దేశించినవని అందులో మందుగుండు సామాగ్రితో పాటు ఇతర ఆయుధాలు తరలిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే చైనా, అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ దేశం బాధ్యతాయుతమైన దేశమని యుద్ధాన్ని ప్రోత్సహించే ఏ పనులు తాము చేయమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదికలు రావడం ఆందోళన కలిగించే అంశం.అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ రకమైన నివేదికలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. -
హర్ముజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్
ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు హర్మూజ్ జలసంధి వైపే. హర్మూజ్ జలసంధిని తెరవడం.. కీలక నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు దేశాలు నడుంబిగించిన వేళ.. మళ్లీ హర్మూజ్ జలసంధి మూతపడింది. నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) హర్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. రోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ మూసేసింది. అమెరికా వైఖరి కారణంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటకో మాట మాట్లాడుతున్న తరుణంలో అసలు ఏం జరుగుతుందో ఇరాన్కు అంతు చిక్కడం లేదు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మరి కాసేపటికి హర్మూజ్ జలసంధిని తాము మూసివేస్తున్నామని ప్రకటించారు ట్రంప్. దాంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ ట్రంప్ మాటల్లో స్పష్టత లేదని అభిప్రాయానికి వచ్చేసింది ఇరాన్. అంతే హర్మూజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసింది. నిన్న ఏం జరిగిందంటే..నిన్న శుక్రవారం ప్రపంచదేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. దాదాపు నెలరోజులకు పైగా పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే ఇంతకాలం హెచ్చరికలు జారీ చేసిన టెహ్రాన్ ఎట్టకేలకు బెదిరింపులకు స్వస్థి పలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉపిరి పీల్చుకున్నాయి. హర్మూజ్పై ఇరాన్ ప్రకటనతో నిన్న స్టాక్మార్కెట్లకు ఊపందుకున్నాయి. అమెరికా స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడవగా ముడిచమురు నేలచూపులు చూసింది. దీనికి కారణం హర్మూజ్కు ఇరాన్ విముక్తి కలిగించడమే అయితే ట్రంప్ చేష్టలతో ఇరాన్కు మరోసారి నమ్మకం చల్లగిల్లింది.ట్రంప్ కామెంట్స్ ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ అన్నింటికీ అంగీకరించింది ‘‘ అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి" అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సీరియస్దీనిపై ఇరాన్ సైతం ఘాటుగా స్పందించింది. ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ట్రంప్ ద్వంద్వ వైఖరిఇలా ఒకవైపు చర్చలు అంటూనే ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రకటించారు. హర్మూజ్ను ఇరాన్ తెరిచిన దానికి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. కాసేపటికి దాన్ని తాము మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ఇక తమది అనే సంకేతాలిచ్చిన ట్రంప్.. ఇరాన్ను మళ్లీ బెదిరించే యత్నం చేశారు. కథ మళ్లీ మొదటికిఈ పరిస్థితుల నడుమ హర్మూజ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఇరాన్ను బెదిరించే యత్నాలు చేశారు ట్రంప్. హర్మూజ్ తమది అనడంతోపాటు అణుకార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన ఇరాన్,.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. దాంతో హర్మూజ్ కథ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్లీ హర్మూజ్ను ఇరాన్ మూసేయడంతో ఇది ఎటువైపు పోతుందో అనే చర్చ మొదలైంది. -
హే అంకుల్ సామ్! బీబీకి దూరం : ట్రంప్పై సెటైర్ల జోరు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్ఫైర్ దాకా పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies') అంటూ విరుచుకు పడ్డారు. ట్రంప్ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందనఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.ప్రపంచానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్లో ట్రంప్ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది. "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్పై సెటైర్లు వేశాయి. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రంప్కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.New Lego video about Drunk Pete Hegseth.. pic.twitter.com/iLGGvBLtTl— PolitMemeAi🔥 (@MemesNoWords) April 17, 2026 ట్రంప్ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!" ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్ విషయం, ఇరాన్తో చర్చలు అంశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.కాగా, ఇరాన్ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ బాంబుల మోత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్ ఇరాన్ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హార్మూజ్ను మళ్లీ మూసి వేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.#WATCH | On being asked if he will extend the ceasefire, US President Donald Trump says, "Maybe I won't extend it. But the blockade is going to remain. So you have a blockade, and unfortunately, we'll have to start dropping bombs again..."(Source: The White House) pic.twitter.com/6HURzpzE0s— ANI (@ANI) April 18, 2026మళ్లీ మూసివేస్తాం: ఇరాన్ఇరాన్ పోర్టుల దిగ్బంధమనం కొనసాగుతుందని ట్రంప్ చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. హార్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్ధాలేనని ఘాలిబఫ్ తెలిపారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. జలసంధికి సంబంధించి ప్రతి నిర్ణయం తామే తీసుకుంటామని రాసుకొచ్చారు. తాము ఇప్పటికే ప్రకటించిన మార్గంలోనే నౌకల రాకపోకలు సాగుతాయని పేర్కొన్నారు.ఐఆర్జీసీ హెచ్చరిక.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగమంత్రి ప్రకటించగా, IRGC నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హార్మూజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టంచేసింది. ఈ నిబంధనలన్నీ.. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. -
గంటలో ట్రంప్ 7 అబద్ధాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది అసలు నోరేనా? అని అంటోంది ఇరాన్ మీడియా. పశ్చిమాసియా యుద్ధంపై వైట్హౌజ్ వేదికగా ఒక్క గంటలో ఆయన ఏడు ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్ అంటోంది. ఇంతకీ ఏ ఏడు ఏంటంటే.. ఇరాన్-అమెరికా మధ్య హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా నౌకా దళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తాము హార్ముజ్ను మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్.. డోనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. ఈ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఎక్స్ వేదికగా స్పందించిన ఘలీబాఫ్.. హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఇరాన్ అనుమతితోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దిగ్బంధనం కొనసాగితే, హార్ముజ్ జలసంధి ఎంతమాత్రం తెరిచి ఉండదంటూ ఆయన స్పష్టం చేశారు. "వారు ఈ అబద్ధాలతో యుద్ధంలో గెలవలేదు. చర్చల్లో కూడా ఎక్కడికీ వెళ్లలేరు. జలసంధి తెరిచి ఉందా లేదా అనేది క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయి కానీ సోషల్ మీడియా కాదు. ట్రంప్ ఒక గంటలో ఏడు ఆరోపణలు చేశారని.. అవన్నీ అబద్ధాలు’’ అంటూ ఘలీబాఫ్ కొట్టిపారేశారు. అయితే, ఆ ఏడు అవాస్తవాలు ఏమిటనేది ఆయన స్పష్టంగా వివరించలేదు.లెబనాన్లో కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకల కోసం హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా దాదాపు రెండు నెలల పాటు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఇరాన్ దీనిని తెరిచినప్పటికీ, వాణిజ్య నౌకలు భద్రతా హామీల కోసం వేచి చూస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.అయితే, ఇరాన్ యుద్ధంపై గతంలో ట్రంప్ ఏడు స్టేట్మెంట్లను పరిశీలిస్తే.. అవన్నీ అబద్ధాలేనని తేలింది. హార్ముజ్ పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టిన ఇరాన్.. మా అనుమతితో మాత్రమే తెరుస్తామని చెబుతోంది. నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ వ్యాఖ్యలు చేయగా.. ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అంటూ అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని ఇరాన్ చెప్పింది. ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యలను ఘలీబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ యుద్ధంలో నిలబడిందని పేర్కొన్నారు.అలాగే, చర్చలు దాదాపు పూర్తయ్యాయని ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. యురేనియం తరలింపు వంటి అంశాలు ఎప్పుడూ చర్చల్లో లేవని స్పష్టం చేసింది. ఇరాన్ యురేనియం అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని పేర్కొంది. హార్ముజ్ ఎప్పటికీ తెరిచి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ ఇస్తూ.. ఆంక్షలు కొనసాగితే హార్ముజ్ను మూసివేస్తామని హెచ్చరించింది. అమెరికా–ఇరాన్ ఒప్పందం త్వరగా కుదురుతుందని ట్రంప్ చెప్పగా.. ఇది అవాస్తమంటూ పేర్కొన్న ఇరాన్.. చర్చలు ఇంకా క్లిష్టంగా ఉన్నాయని తెలిపింది.హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పారు.. మా అనుమతితోనే తెరుస్తామని ఇరాన్ చెప్పిందినావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ అన్నారు.. అమెరికా బ్లాకేడ్ కొనసాగుతోందని ఇరాన్ అంటోందిఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ అన్నారు.. తాము యుద్ధంలో నిలబడ్డామని ఇరాన్ స్పష్టం చేసిందిచర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.. ఆయన చెప్పిన అంశాలపై చర్చలు జరగలేదని ఇరాన్ చెబుతోందిశుద్ధి యురేనియం ఇరాన్ అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని ఇరాన్ అంటోందిహర్ముజ్ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతోందని.. ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పడం.. అదంతా అబద్ధమేనని ఇరాన్ ప్రకటించిందిడీల్ త్వరలోనే అని ట్రంప్.. చర్చలు క్లిష్టదశలో ఉన్నాయని ఇరాన్ స్పష్టీకరణ -
ఇరాన్ కు 20$ బిలియన్లు.. అమెరికా భారీ ఆఫర్
-
ఇరాన్కు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహాయంతో ఇరాన్ జలమార్గం నుండి సముద్ర మైన్లను తొలగిస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మైన్లను తొలగించడానికి అమెరికా, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు.ఇక, అమెరికా నేవీ ఇప్పటికే ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్ను మైన్ క్లియరింగ్ ఆపరేషన్ల కోసం అక్కడ ఉంచారు. అలాగే, అదనంగా జపాన్ నుంచి రెండు మైన్ క్లియరింగ్ నౌకలు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరాయి. అయితే, యుద్ధం నేపథ్యంలో హార్మూజ్లో చిన్న పడవల సాయంతో ఇరాన్ మైన్లను అమర్చింది. కాగా.. గత వారం న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, హార్మూజ్లో ఇరాన్ వేసిన అన్ని మైన్స్ను గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని మైన్స్.. నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు తెలిపింది. దీంతో, నీటి నుంచి మైన్స్ను తీయడం కష్టంగా మారిందని పేర్కొంది.మరోవైపు.. బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలకు హార్మూజ్ జలసంధిలో ఉన్న మైన్లను తొలగించే సామర్థ్యం ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరీన్ వాట్రిన్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకలకు ఐరోపా దేశాలు పూర్తి మద్దతుతో కూడిన ఎస్కార్ట్ సేవలను అందించగలవని వాట్రిన్ తెలిపారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు.సమావేశానికి మాక్రాన్, స్టార్మర్ నాయకత్వంమరోవైపు ఇరాన్పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.సుమారు 40 దేశాల నాయకులు హాజరుకాగా మాక్రాన్తో కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పారిస్కు చేరుకోనున్నారు. అలాగే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని కూడా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతర ప్రపంచ నేతలు వర్చువల్గా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఇరాన్తో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సముద్ర మార్గం గుండా సురక్షిత ప్రయాణం లక్ష్యంగా సుమారు 40 దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని అంతర్జాతీయ మీడియా CNN పేర్కొంది. అయితే, ఆ జాబితాను ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు, సిబ్బంది భద్రతను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ (International Maritime Organization) చేస్తున్న పనికి మద్దతు ఇవ్వడంపై కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని పేర్కొంది. -
ఇరాన్ గుడ్ న్యూస్.. తెరుచుకున్న హార్ముజ్
-
ఇరాన్.. హర్ముజ్.. ట్రంప్.. అంతా గందరగోళమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలను ముగించేందుకు రెండో దఫా చర్చలకు అమెరికా-ఇరాన్లు సిద్ధపడుతున్నాయి. తేదీ ఇంకా ఖరారు కాకపోయినా మళ్లీ పాకిస్తాన్ వేదికగానే చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలు.. ఇటు ఇరాన్ వాటిని ఖండించుకుంటూ పోతుండడం ఈ సంక్షోభంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఓ మెట్టు కిందకు దిగింది. లెబనాన్ కాల్పుల విరమణ కుదరడంతో హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. ‘హర్ముజ్ను పూర్తిగా తెరిచాం. చమువురు నౌకల రాకపోకలను అడ్డుకోం. కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకలకు సురక్షితంగా మార్గం ఉంటుంది’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఈ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. పది శాతం దాకా రేట్లు తగ్గాయి. అయితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన గందరగోళానికి దారి తీసింది. ఇరాన్తో జరుగుతున్న చర్చల వ్యవహారం పూర్తయ్యే వరకు హర్ముజ్లో తమ బ్లాకేడ్(దిగ్బంధంనం).. అదీ ఫుల్ ఫోర్స్తో కొనసాగుతుందని ప్రకటించారు. అయితే.. చర్చల ప్రక్రియ త్వరగానే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు అంశాలపై చర్చలు జరిగాయని, వీలైనంత త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ అన్నింటికీ అంగీకరించిందని.. కానీ యురేనియంపై డీల్ కుదిరేవరకు ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ అన్నారు. ‘‘అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి అని వ్యాఖ్యానించారు.అయితే.. ఇరాన్ మాత్రం ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారని అంటోంది. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ఈ లెక్కన హర్ముజ్తో పాటు యురేనియం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గబోదని స్పష్టమవుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో.. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా.. ఇరాన్లో 3,000 మంది, లెబనాన్లో 2,100 మంది, ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ దేశాల్లో డజను మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.హర్ముజ్ జలసంధి.. శుద్ధి చేసిన యురేనియం, ఫ్రీజ్ చేసిన నిధులు.. ఈ విషయాల్లో రెండు దేశాల మధ్య చర్చల్లో ఎటూ తేలడం లేదు. ఈ నెల 11వ తేదీన పాక్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చల్లో అయినా ఈ అంశాలు ఓ కొలిక్కి వస్తేనే యుద్ధం ఆగేది. లేకుంటే.. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ -
అమెరికా - ఇరాన్ చర్చలపై.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
అమెరికా - ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. వారాంతం వరకు చర్చలు కొనసాగనున్నాయని తెలిపారు. ఫీనిక్స్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరు దేశాల మధ్య మంచి పురోగతి జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఇంకా పూర్తి ఒప్పందం కుదరలేదని, కానీ సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పారు.ఈ చర్చల్లో ముఖ్యంగా అణు కార్యక్రమం, సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ట్రంప్ ప్రకారం, ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్పై అమలు చేస్తున్న నావికాదళ ఆంక్షలను ఎత్తివేస్తామని తెలిపారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణ నేపథ్యంలో కొంతమేర వాణిజ్య నౌకలకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం.ఇరాన్ ఇప్పటికే అనేక విషయాలకు అంగీకరించిందని, ముఖ్యంగా యురేనియంను సంయుక్తంగా తొలగించి అమెరికాకు తరలించే అంశంపై కూడా అంగీకారం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనిని ఇరాన్ ఖండించింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఈస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, యురేనియం తమకు ఎంతో విలువైనదని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు తరలించబోమని స్పష్టం చేశారు. -
హార్మూజ్ తెరుచుకుంది
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ ప్రపంచదేశాలకు శుక్రవారం శుభవార్త విన్పించింది. పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే బెదిరింపులకు స్వస్తిపలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు హార్మూజ్ జలసంధిని బార్లా తెరుస్తున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ వార్త వినగానే ప్రపంచదేశాలు చమురుసంక్షోభం బారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నాయి. స్టాక్మార్కెట్లకు సైతం కొత్త ఊపొచ్చింది. అమెరికా స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అనూహ్య డిమాండ్తో ముందస్తు కొనుగోళ్లతో ముడిచమురు ధర కొండెక్కగా తాజా వార్తతో ధర నేలచూపులు చూసింది.మార్చి నెలలో గరిష్టంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 119 డాలర్లకు పెరగ్గా శుక్రవారం శుభవార్త తర్వాత ఒక్కసారిగా 90 డాలర్ల దిగువకు దిగొచ్చింది. ధర శుక్రవారం ఉదయం 98 డాలర్లు ఉండగా హార్మూజ్ వార్త వెలువడగానే 10 శాతం పడిపోయి 88 డాలర్లకు చేరుకుంది. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు మొదలుకానున్నాయని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘‘జలసంధిని తెరుస్తున్నామని ఇప్పుడే ఇరాన్ ప్రకటించింది. హార్మూజ్ గుండా రాకపోకలు ఊపందుకోనున్నాయి. థాంక్యూ. అయితే హార్మూజ్పై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది. హార్మూజ్ గుండా ఇరాన్, దాని మిత్రదేశాల నౌకల రాకపోకలను అడ్డుకుంటాం.ఇరాన్తో శాంతి ఒప్పందం 100 శాతం పూర్తయి, అమల్లోకి వచ్చేదాకా, యుద్ధం ముగిసేదాకా ఇరాన్కు చెందిన నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. ఇరాన్తో చర్చల్లో ఇప్పటికే చాలా అంశాల్లో ఏకాభిప్రాయం సాధించాం. లెబనాన్ ప్రస్తావన, దానితో సంబంధం లేకుండానే ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాం. అమెరికా సాయంతో ఇరాన్ జలసంధిలోని పాత సముద్ర మందుపాతరలను తొలగిస్తోంది. మరోసారి హార్మూజ్ను మూసేయబోమని ఇరాన్ మాకు హామీ ఇచ్చింది. ప్రపంచానికి వ్యతిరేకంగా హార్మూజ్ను ఆయుధంగా ఇరాన్ ఉపయోగించడం సాధ్యపడదు’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంతో హార్మూజ్ను తెరుస్తున్నాం.తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉండే ఈ పది రోజులపాటే హార్మూజ్ తెరచి ఉంటుంది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. హార్మూజ్ను తెరవాలంటే తొలుత లెబనాన్పై కాల్పులు ఆపేయాలన్న డిమాండ్కు ఇజ్రాయెల్, అమెరికా తలొగ్గడంతోనే హార్మూజ్ను తెరుస్తున్నట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. పాకిస్తాన్ సాయుధబలగాల సారధి, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ టెహ్రాన్లో ఇరాన్ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపిన మరుసటిరోజే హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన వెలువర్చడం గమనార్హం. క్షేమంగా రవాణాపై సమావేశం మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో ఉమ్మడిగా పనిచేయాలని డజన్లకొద్దీ దేశాలు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం పారిస్లోని దేశాధ్యక్షభవనంలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీసహా 30 దేశాల అధినేతలు, 20 అంతర్జాతీయ కూటముల అధ్యక్షులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి జర్మనీ చాన్స్లర్ ఫెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతదితరులు స్వయంగా, ఇతరులు వర్చువల్గా హాజరయ్యారు. నాటోపై ట్రంప్ ఆగ్రహం ‘‘ఇప్పుడు హార్మూజ్ జలసంధి వివాదం ముగిసిపోయింది. అంతా అయిపోయాక ఇప్పుడు తీరిగ్గా నాటో కూటమి నుంచి నాకు ఫోన్కాల్ వచ్చింది. మీకేమైనా సాయం కావాలంటే చేసిపెడతామని అడిగారు. మీ సాయం నాకు అస్సలు అక్కర్లేదని ముఖంమీదే చెప్పేశా. అవసరమైనప్పుడు సాయపడకుండా ముఖంచాటేశారు. నాటో కేవలం కాగితం పులి’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చించి ఇరాన్ను పాక్ ఒప్పించిందని ట్రంప్ ఆ దేశాన్ని పొగిడారు. ‘‘పాకిస్తాన్కు, పాక్ గొప్ప ప్రధానికి, ఫీల్డ్ మార్షల్కు కృతజ్ఞతలు. ఇద్దరూ గొప్ప వ్యక్తులు’’అని ట్రంప్ ఒక పోస్ట్చేశారు. -
మధ్యప్రాచ్యంలో కొత్త ఆశలు.. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ దౌత్య ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా మధ్య చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. ఈ రెండు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్లో సోమవారం సమావేశం కావచ్చని తెలుస్తోంది.ఇస్లామాబాద్లో జరగనున్న ఈ చర్చలు ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే అవకాశం ఉంది. గతంలో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసినప్పటికీ, ఈసారి పురోగతి సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో.. షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, షెహబాజ్ షరీఫ్ తో సమావేశమై, ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య పరిష్కారాలపై చర్చించారు. ఈ సమావేశం అంటాల్యా డిప్లమసీ ఫోరం సందర్భంగా జరిగింది. ఇదే సమయంలో, పాకిస్థాన్ సైన్యాధిపతి అసీమ్ మునీర్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్ ను కలుసుకోవడం కూడా ఈ చర్చలకు ప్రాధాన్యతను పెంచుతోంది.ఇక మరో ముఖ్య పరిణామంగా, డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్ - హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా భవిష్యత్తులో మరింత విస్తృతమైన శాంతి చర్చలకు మార్గం సుగమం కావచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద, ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది. -
నేను హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అమెరికా మాత్రం తన బ్లాకేడ్ను ఎత్తివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ‘హర్మూజ్ తెరిచి ఉంది.. కానీ ఇరాన్తో మా లావాదేవీ పూర్తయ్యే వరకు బ్లాకేడ్ కొనసాగుతుంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో ప్రకటించారు.ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపాయి. ఇరాన్ సముద్ర మార్గం తెరవడం వల్ల చమురు ధరలు తగ్గి ఊరటనిచ్చినా, అమెరికా బ్లాకేడ్ కొనసాగుతుండటం ఉద్రిక్తతలను తగ్గించలేకపోయింది. అమెరికా–ఇరాన్ చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు అణు అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను మాకు అప్పగించడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్తో కలిసి భూగర్భంలో దాచిన యురేనియాన్ని తొలగించనున్నాం’అని చెప్పారు. అంతకుముందు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కీలక ప్రకటన చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణ సమయంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధరలు 10 శాతం వరకు తగ్గాయి. -
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచానికి శుభవార్త అందిస్తూ హర్మూజ్ జలసంధిని ఎట్టకేలకు తెరిచింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ల సీజ్ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఆ దేశాల మధ్య సీజ్ఫైర్ కొనసాగేంతవరకూ హర్మూజ్ తెరిచే ఉంటుందని పేర్కొంది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటనతో నౌకల రాకపోకలు యధావిధిగా కొనసాగనున్నాయి. అదే సమయంలో హర్మూజ్ను తెరిచామన్న ఇరాన్ ప్రకటన అనంతరం చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇక హర్మూజ్ను తెరిచినందుకు ఇరాన్కు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్నిగురువారం రాత్రి(భారత కాలమాన ప్రకారం) ట్రంప్ తెలిపారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానంగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఫోన్ చేసి చర్చలు జరిపారు. అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం అవి సత్ఫలితాల్ని ఇవ్వడం గమనార్హం. -
హార్ముజ్ దిగ్బంధం వేళ.. యూఎస్ సంచలన వీడియో విడుదల
ఇరాన్ నౌకాశ్రయాలు, తీరప్రాంతాలు లక్ష్యంగా తాము చేపట్టిన దిగ్బంధం (Blockade) కార్యకలాపాలలో భాగంగా ఓ వాణిజ్య నౌకను అమెరికా నావికాదళ హెలికాప్టర్ పక్కకు మళ్లించిన దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ షేర్ చేసిన ఈ వీడియోలో యూఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ (DDG 112) నౌకలోని ఒక నావికుడి ఆడియో సందేశం ఉంది. ఒమన్ గల్ఫ్ మీదుగా ఆ డిస్ట్రాయర్ నౌకకు చెందిన హెలికాప్టర్ ఎగురుతున్నట్లు ఈ ఫుటేజీలో కనిపిస్తోంది.ఇరాన్ నౌకాశ్రయాల్లోకి రాకపోకలు సాగించే నౌకలపై ఆంక్షలను అమలు చేస్తున్న క్రమంలో అమెరికా దళాలు ఓ వాణిజ్య నౌకను నియంత్రిస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. కాగా, 10 వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హార్ముజ్ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’ అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు.Audio🔊of a Sailor aboard USS Michael Murphy (DDG 112), with video from the guided-missile destroyer’s embarked helicopter flying over the Gulf of Oman, as the U.S. Navy diverts a merchant vessel while enforcing the blockade on ships entering or departing Iranian ports. U.S.… pic.twitter.com/10QxlEoGkk— U.S. Central Command (@CENTCOM) April 16, 2026హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. -
ఇది నా పదో విజయం.. ట్రంప్ సంచలన పోస్ట్
-
ఆయనది పత్తి గింజల కలే!
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నామని చెప్పిన ఆయన.. అమెరికాకు ఈ డీల్ ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన గాల్లో కోటలు కట్టుతున్నాడంటూ ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది.శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ గురువారం వైట్హౌజ్లో ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని.. ఈ ఒప్పందం కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబీ (Islamic Republic of Iran Broadcasting) వెటకారంగా స్పందించింది.ట్రంప్ గాల్లో కోటలు కడుతున్నారంటూ ఆయన మాట్లాడిన వీడియోతో ఐఆర్ఐబీ ఓ పోస్ట్ చేసింది. దీనికి అదనంగా ఓ పర్షియన్ సామెతను ఉటంకించింది. ‘‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని ఒక్కసారిగా మింగేస్తుంది, కొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటుంది. ట్రంప్ కూడా అంతే. ఆయన ఊహాలోకంలో విహరిస్తున్నారు’’ అంటూ సెటైర్ వేసింది.Building castles in the air!Or in Persian we have a similar proverb:'The camel dreams of cottonseed; sometimes gulping it down, sometimes eating it grain by grain!'شتر در خواب بیند پنبهدانهگهی لپلپ خورد گه دانه دانه pic.twitter.com/HA15h1aQVU— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) April 16, 2026సాధారణంగా.. సాధ్యంకాని విషయాలను కలలు కనే వ్యక్తులను ఎగతాళి చేయడానికి ఈ పర్షియన్ సామెతను వాడుతుంటారు. విశేషం ఏంటంటే.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఈ సామెతను ఉపయోగించారు. ఆయన 2026 ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తనయుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు.యురేనియం విషయంలో ట్రంప్నకు ఎలాంటి మాట ఇవ్వలేదని ఇరాన్ మీడియా తాజా ప్రకటనతో స్పష్టమవుతోంది. ఆయన ఏవేవో క్లెయిమ్లు చేసుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు చెబుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీల్ కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో తానూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. అంతేకాదు.. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు కూడా తాను సిద్ధమేనని అంటున్నారు. ఈ నెల 22వ తేదీతో ఆ గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. -
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. గురువారం వైట్హౌజ్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అంతటితో ఆగకుండా.. ఈ డీల్ కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదన్న ఇంతకు ముందు ప్రకటించిన ట్రంప్ కాస్త చల్లబడ్డారు. పొడిగింపునకు తాను సిద్ధమేనని ఇప్పుడు చెబుతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ల యుద్ధ విరమణ గడువు ఈ నెల 22న ముగియనుంది.మరోవైపు.. ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని పొందకుండా తాము నిలువరిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉద్ఘాటించారు. తమతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోవడం మినహా వాళ్లు ముందు మరో దారిలేదన్నారు. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ తన అణు శుద్ధి ప్రయత్నాలను విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమేనని మొదటి నుంచి చెబుతున్నా.. అణ్వాయుధాల తయారీకి వీలుగా యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్ సహా అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలను బయటకు తీయాలని.. అణు ఒప్పందానికి ముందుకు రావాలని అమెరికా ఇరాన్ను డిమాండ్ చేస్తోంది. “ఇకపై యురేనియం ఎన్రిచ్మెంట్ ఉండదు” అన్నది ట్రంప్ తాజా మాట. దీనిపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. 2025 జూన్లో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అయితే.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) అంచనా ప్రకారం.. ఇరాన్ వద్ద దాదాపు 400 కిలోల 60% శుద్ధి యురేనియం, అలాగే 200 కిలోల 20% యురేనియం నిల్వ ఉంది. ఈ నిల్వలను సులభంగా 90% ఆయుధ స్థాయి యురేనియంగా మార్చుకోవచ్చు!.పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. ఇస్లామాబాద్లో ఈ నెల 11న జరిగిన తొలి దఫా చర్చలకు ముందు.. యురేనియం శుద్ధి పూర్తిగా ఆపే ఉద్దేశ్యం లేదని ఇరాన్ స్పష్టంగా పేర్కొంది. ట్రంప్ తాజా ప్రకటనతో అమెరికా–ఇరాన్ ‘అణు’ వివాదం కొత్త మలుపు తిరిగే చాన్స్ ఉంది. -
అద్భుతం జరగబోతుంది.. ఇక అంతా మంచి రోజులే..
-
విషమంగా నర్గీస్ మహ్మదీ ఆరోగ్యం
టెహ్రాన్: ఇరాన్లోని జైలులో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహ్మదీ(53) ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. జన్జాన్ జైలులో ఉన్న ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు నర్గీస్ మహ్మదీ ఫౌండేషన్ బుధవారం ఎక్స్లో వెల్లడించింది. బరువు కోల్పోయారని, పాలిపోయి చాలా బలహీనంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 24వ తేదీన జైలులో గుండెపోటుకు గురయ్యారని, ఆమెను పరీక్షించిన వైద్యుడు తెలిపారని ఫౌండేషన్ వెల్లడించింది.గుండెపోటుకు గురైన ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు గంటపాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. నర్గీస్ను గత నెలలో రెండు పర్యాయాలు కుటుంబసభ్యులు, లాయర్లు కలిసి మాట్లాడారని తెలిపింది. హక్కుల లాయర్ అయిన నర్గీస్కు 2023లో జైలులో ఉండగానే నోబెల్ కమిటీ శాంతి పురస్కారం ప్రకటించింది. ఇరాన్లోని మషాద్లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారన్న ఆరోపణలపై గతేడాది డిసెంబర్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. -
నాటో కూటమి కథ కంచికేనా?
ఇరాన్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమి ‘నాటో’లో అంతర్యుద్ధానికి కారణమవటం ప్రపంచ జియో పొలిటికల్ చదరంగాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నది. తమ దేశాల నౌకా బలగాలను హార్మూజ్ జలసంధి వద్ద మోహరింప చేయాలన్న యూఎస్ అధ్య క్షుడి విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. తమ దేశాలలోని సైనిక స్థావరా లను వినియోగించటానికి అంగీకరించ లేదు. ఈ యుద్ధం మా (నాటో) యుద్ధం కాదని తేల్చి చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు నాటో కూటమిని ‘కాగితపు పులి’గా అభి వర్ణిస్తూ యూఎస్ఏ దాన్నుండి వైదొలుగుతుందని బెదిరించాడు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని (ఇరాన్ యుద్ధాన్ని) సమర్థించని, యూఎస్ఏకు సహాయపడని మిత్ర దేశాలను యూఎస్ఏ రక్షించ బోదని ఆ దేశ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించాడు. ఐరో పాను రక్షించటానికి మాత్రమే నాటో కూటమి ఏర్పడలేదనీ, యూఎస్ ఏను సమర్థించటం కూడా నాటో ప్రధాన విధి అనీ యూఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అభిప్రాయ పడ్డాడు.ప్రపంచాన్ని శాసించిన శక్తిరెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1949లో పన్నెండు దేశాలతో ఆవిర్భవించిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమి ఇటీవల స్వీడన్ చేరికతో 32 దేశాలకు విస్తరించింది. సోవియట్ రష్యాను అడ్డుకోవటానికి యూఎస్ఏ నాయ కత్వంలో ఏర్పడిన ఈ సైనిక–రాజకీయ కూటమి గత 75 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలను శాసించిందనటంలో సందేహం లేదు. ఈ 32 సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా దానిని మొత్తం కూటమి మీద దాడిగా పరిగణిస్తుంది. 32 సభ్య దేశాలే కాకుండా, 40 ఇతర దేశాలతో కూడా ఈ కూటమి సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకున్నది. సోవియట్ రష్యాను నిలువరించటానికి స్థాపించబడిన ‘నాటో కూటమి’ని సోవియట్ విచ్ఛిన్నం తరువాత కొనసాగించాల్సిన ఆవశ్యకత లేదు. రష్యా బలహీనంగా ఉండటాన్ని ఆసరాగా చేసు కొని ఈ కూటమి సోవియట్ ప్రాబల్య ప్రాంతాలలోనికి విస్తరించింది. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి దారి తీసింది. నాటో సభ్య దేశాలలో యూఎస్ఏ నాయకత్వంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఈ స్థావరాలలో అత్యాధునిక యుద్ధ విమానాలు, శత్రు క్షిపణులను ఎదుర్కొనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను, అమెరికన్ సైనికులను మోహరించి ఆ యా దేశాలకు యూఎస్ఏ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. సైనిక, గూఢచర్య సమాచారాన్ని, సైబర్ సమాచారాన్ని పంచుకోవటమే కాకుండా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఈ దేశాలపై సోవియట్ యూనియన్ (రష్యా), ఇతర శత్రు దేశాలు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్నది.యూఎస్ఏ నీడన ఐరోపా1990వ దశకం నుండి క్రమంగా నాటో దేశాలలో అలసత్వం ప్రవేశించింది. తమ దేశాల సైనిక, రక్షణ బాధ్యతను పూర్తిగా యూఎస్ఏ పైన తోసివేశాయి. తమ రక్షణ ఖర్చులను తగ్గించి, పూర్తిగా సంక్షేమం, అభివృద్ధిపైన దృష్టి పెట్టాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు రష్యా ముప్పుగా కనప డటం ఆగిపోయింది. నాటో కూటమి ఒప్పందం ప్రకారం ప్రతి సభ్య దేశం తన జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగంపై ఖర్చు చేయా లనే నిబంధనను ఖాతరు చేయలేదు. మొత్తం రక్షణ వ్యయంలో 65 శాతం యూఎస్ఏ భరిస్తోంది. ఇదే సమయంలో ఈ ఐరోపా దేశాలు తమ తయారీ రంగాన్ని దాదాపుగా చైనాకు అవుట్సోర్సింగ్ చేశాయి. మానవ వనరుల కొరతను ఎదుర్కోవటానికి సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు, మొరాకో, అల్జీరియా వంటి దేశాల నుండి చౌక శ్రామికుల వలసలను ప్రోత్సహించాయి. ఇంధన అవసరాలకు రష్యా నుండి చౌకగా వచ్చే గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డాయి. స్థూలంగా పరిశీలిస్తే జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ మొదలగు ఐరోపా దేశాలు గత నాలుగు దశాబ్దా లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎగుమతి–దిగుమతి వ్యాపారం, విలాస వస్తువుల తయారీ వంటి రంగాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. తక్కువ ఖర్చుతో ఉన్నత జీవన ప్రమాణాలను అను భవిస్తున్నాయి.ట్రంప్ 2025లో అధికారంలోకి రాగానే ‘అమెరికా ఫస్ట్’ నినా దాన్ని అందుకొన్నాడు. నాటో రక్షణ వ్యయంలో కూటమి దేశాలు తమ వంతు వాటాను భరించాల్సిందేనని మెలిక పెట్టాడు. ఐరోపా దేశాల రక్షణ బాధ్యతను మోస్తున్నందుకు ప్రతిఫలంగా ఇరాన్ యుద్ధంలో మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అమెరికా కోణంలో ఆలోచిస్తే ఈ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం తమ యుద్ధం కాదనేది యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల వాదన. ఇదే కోణంలో ఆలోచిస్తే ఉక్రెయిన్ యుద్ధం కూడా యూఎస్ఏ యుద్ధం కాదు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కూడా కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఎదుర్కొంటున్నది యూఎస్ఏ సైనిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, యూఎస్ఏ ఆర్థిక సహాయమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.మాటలతో మారిన తీరు2003 ఇరాక్ యుద్ధంలో కూడా నాటో దేశాలు పాల్గొనటం విషయంలో ఇదేరకమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయిన ప్పటికీ యూకే, స్పెయిన్, ఇటలీ, పోలండ్ తమ సైనికులను యూఎస్ఏకు మద్దతుగా పంపించాయి. ప్రస్తుత ఇరాన్ యుద్ధం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించేముందు నాటో దేశాలతో చర్చించలేదు. గ్రీన్ల్యాండ్ విషయంలో ఐరోపా దేశాలను ట్రంప్ బేఖాతరు చేశాడు. వ్యక్తిగతంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాధినేతలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. వలసలను ప్రోత్సహిస్తూ ఐరోపా దేశాలు తమ నాగరికతను నాశనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యా నించాడు. ఉక్రెయిన్కు సహాయం అందించటంలో యూరోపియన్ యూనియన్కు అడ్డుగా వ్యవహరించిన హంగరీ దేశాధినేత విక్టర్ ఓబ్రామ్ను సమర్థించాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓబ్రా మ్కు యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ బహిరంగంగా మద్దతు పలి కాడు. అయితే ఈ ఎన్నికల్లో 16 ఏళ్లుగా హంగరీని పాలిస్తున్న ఓబ్రామ్ ఓడిపోయాడు. ఓబ్రామ్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు కూడా సన్నిహితుడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వైపు హంగరీ మొగ్గు చూపింది. పుతిన్ పరంగా ట్రంప్ మెతక వైఖరిని కొనసాగిస్తున్నాడు. ఇది ఐరోపా దేశాలకు మింగుడుపడటం లేదు. రష్యా నుండి చౌకగా లభించే గ్యాస్ దిగుమతులు ఆగిపోవటంతో ఐరోపా దేశాలు ఖతర్, యూఏఈ, సౌదీ నుండి ఎల్ఎన్జీ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. అందువలన హార్మూజ్ జల సంధి కేంద్రంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం కొనసాగటం వాటికి ఇష్టం లేదు. ఈ యుద్ధం కేవలం యూఎస్ఏ–ఇరాన్ మధ్య కాదు. ఇజ్రాయెల్ చేరికతో యుద్ధానికి ‘మతం రంగు’ అలుముకోవటం ఖాయం. ఫ్రాన్స్లో 6.7 మిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం జనాభాలో సుమారు 10 శాతం. జర్మనీలో సుమారుగా 5.7 శాతం (4.7 మిలియన్లు) ముస్లిం జనాభా ఉన్నది. ఈ యుద్ధంలో భాగస్వా ములయితే తమ దేశాలలోని ముస్లిం పౌరుల మద్దతు ప్రమాదంలో పడుతుంది. నాటో దేశాలు మారుతున్న పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ బడ్జెట్లను పెంచి, సైనిక సామర్థ్యం వైపు దృష్టి పెడుతు న్నాయి. ఐరోపా దేశాల మధ్య సైనిక సంబంధాలను పటిష్ఠం చేయాలని చూస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవనం చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత్, చైనాలతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఫోన్ చేశారు. హార్ముజ్ జలసంధిలో నావిగేషన్ భద్రత, స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించారు. ఇరువురు నేతలు పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. పశ్చిమాసియా స్థిరత్వం కోసం భారత్, ఫ్రాన్స్ సహకారాన్ని కొనసాగిస్తాయని ఇరువురు నేతలు అన్నారు.“నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించాం. హార్మూజ్ జలసంధిలో భద్రత, నావిగేషన్ స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరంపై ఉందని మాట్లాడుకున్నాం. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సహకారం కొనసాగిస్తాం” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మారుతూ ఉండడడంతో భారత్ ప్రపంచ నాయకులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు కొనసాగిస్తోంది. ముందుగా మార్చిలో కూడా ప్రధాన మంత్రి మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడి పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సమన్వయం కొనసాగిస్తామని చెప్పారు.ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మోదీ మాట్లాడి పశ్చిమాసియా భద్రతా పరిస్థితిపై చర్చించారు. హార్మూజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ప్రస్తావించారు.గురువారం ఢిల్లీలో మోదీ, ఆస్ట్రియా చాన్స్లర్ క్రిస్టియన్ స్టాకర్ పశ్చిమాసియాలో సముద్ర మార్గ రవాణా సురక్షితంగా, అంతరాయం లేకుండా కొనసాగాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. “ఇరు పక్షాలు పశ్చిమాసియా ప్రాంతంలో తాజా పరిణామాలపై కూడా చర్చించారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు, దౌత్య ప్రాముఖ్యతను ప్రస్తావించారు. అందులో సముద్ర రవాణా సురక్షితంగా, అంతరాయం లేకుండా సాగడం అనే అంశం కూడా ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) సీబీ జార్జ్ ప్రెస్ బ్రీఫింగ్లో తెలిపారు.40 దేశాల నేతల చర్చలు ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ఈ కాల్... ఫ్రాన్స్, యూకే కలిసి 40 పైగా దేశాలను ఒకే తాటికి తీసుకొచ్చి సంయుక్త సమావేశం నిర్వహించే నేపథ్యంలో వచ్చింది. దీని లక్ష్యం హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ ఉండేలా చేయడం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం (ఏప్రిల్ 17న) పారిస్లో జరుగుతుందని తెలిపారు. హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.Received a phone call from my dear friend President Emmanuel Macron. We discussed the situation in West Asia and agreed on the need to urgently restore safety and freedom of navigation in the Strait of Hormuz.We will continue our close cooperation to advance peace and stability…— Narendra Modi (@narendramodi) April 16, 2026 -
ఇరాన్పై ట్రంప్ గేమ్ ప్లాన్ మారింది..!
ఇరాన్తో అంత ఈజీ కాదనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పదే పదే బోధపడుతూనే ఉంది. ఇటీవల పాకిస్తాన్లో ఇరాన్తో జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ట్రంప్కు ఈ విషయం బాగానే అర్థమైంది. బెదిరింపులతో ఇరాన్ను దారి తెచ్చుకోవాలనుకుంటే ఏదీ కూడా వర్కౌట్ కావడం లేదు కాదు కదా.. కనీసం మిత్ర దేశాల సహకారం కూడా లభించడం లేదు. దాంతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇరాన్ను యుద్ధంతో వశపరుచుకోవడం వల్ల కాదు అనుకున్నారో ఏమో కానీ ట్రంప్ మాత్రం తన రూట్ మార్చుకున్నారు. ఇప్పటివరకూ సర్వనాశనం అంటూ ఇరాన్పై యుద్ధభేరీ మోగిస్తూ వచ్చిన ట్రంప్.. ప్రస్తుతం ఆర్థిక యుద్ధ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇరాన్తో యుద్ధాన్ని పక్కకు పెట్టి వారిపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత రాత్రి వైట్హౌస్లో డచ్ రాజు, డచ్ రాణిలతో జరిగిన ప్రైవేట్ డిన్నర్ కార్యక్రమంలో ఇదే విషయాన్ని ట్రంప్ చెప్పినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధాన్ని త్వరితగతిన ముగించడానికి టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఏకైక మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్లో ఇరాన్తో జరిగిన మొదటి విడత చర్చలు చేదు అనుభవంతో ముగిసిన తర్వాత,తి రిగి చర్చలను మళ్లీ పట్టాలు ఎక్కించాలంటే కచ్చితంగా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఒక్కటే మార్గమని ట్రంప్ ఓ స్పష్టతకు వచ్చారని, ఇదే విషయాన్ని డచ్ రాజు విల్లెం-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలకు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అనేది అత్యంత ఆందోళనకరమని, ఇది మరొక ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉండటంతో డచ్ ప్రభుత్వం.. యుద్ధంలో అమెరికాకు సహకరించడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే హర్మూజ్ జలసంధి విషయంలో ఓ స్పష్టతకు రావాలని, అందుకు ఇరాన్తో చర్చలు అవసరమని డచ్ ప్రభుత్వ ప్రతినిధులు.. ట్రంప్కు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. సైనిక దాడులకన్నా ఆర్థిక యుద్ధం మీద దృష్టి పెట్టడమే సరైనదిగా ట్రంప్ యోచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా చమురు ఎగుమతులను అడ్డుకోవడం, బ్యాంకులపై ఆంక్షలు విధించడంతో, మరియు నావికాదళ నిర్బంధం వంటి వ్యూహాలను ఉపయోగించి వారిని కట్టడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
ప్రపంచ యుద్ధ భయం.. కానీ స్టాక్ మార్కెట్లు ధ రికార్డులే కొడుతున్నాయి
-
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
టెహ్రాన్: మా మొదటి క్షిపణులకే మీ ఓడలు మునిగిపోతాయంటూ హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నిస్తే.. ఆ నౌకలను ఇరాన్ ధ్వంసం చేస్తుందని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణకు ఈ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. మొహ్సెన్ రెజాయీ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ.. మిస్టర్ ట్రంప్.. హార్ముజ్ జలసంధికి పోలీసు కావాలనుకుంటున్నారు. ఇది నిజంగా మీ పనేనా? అమెరికా వంటి శక్తివంతమైన సైన్యం చేసే పని ఇదేనా? మీ ఓడలు మా మొదటి క్షిపణులకే సముద్రంలో మునిగిపోతాయి" అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లో హార్డ్లైనర్గా పేరున్న రెజాయీ.. ఒకవేళ అమెరికా ఇరాన్పై భూతల దాడికి దిగితే.. తాము వేలమందిని బందీలుగా పట్టుకుంటామని.. ప్రతి బందీకి ఒక బిలియన్ డాలర్లు వసూలు చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలకు ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వం వహించారు. అయితే ఆదివారం ఆ చర్చలు విఫలమయ్యాయి. తిరుగు ప్రయాణంలో గాలిబాఫ్.. ట్రంప్ను ఉద్దేశించి, ‘‘మీరు పోరాడితే.. మేము కూడా పోరాడతాం" అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులు చేసి.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపిన తర్వాత ఆరు వారాల పాటు యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం రెండు వారాలుగా తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. పాకిస్థాన్లో వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులన్నింటినీ దిగ్బంధిస్తామని అమెరికా సైన్యం గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనిని ఇరాన్ చట్టవిరుద్ధమంటూ సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది.కేవలం 34 కిలో మీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ద్వారా ప్రపంచ సముద్ర చమురు వ్యాపారంలో 20 శాతం జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్ వంటి దేశాల ఇంధన ఎగుమతులకు ఇది కీలక మార్గం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా అడ్డుకుంది. కేవలం చైనా వంటి మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తోంది. -
వార్ అప్డేట్స్: హర్ముజ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా వీడలేదు. హర్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొసాగుతోంది. ఇరాన్ పోర్టులకు వచ్చిపోయే నౌకలపై నిఘా కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్కు సహించడం లేదు. మరోవైపు పాక్ వేదికగానే మరోసారి శాంతి చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
యుద్ధమైనా.. శాంతి చర్చలైనా.. మేం ఒక్కటే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా గౌరవించి తీరాల్సిందేనని పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అయినా.. శాంతి చర్చలైనా.. ఇరాన్, దాని మిత్ర శక్తులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయని స్పష్టం చేశారు. హెజ్బొల్లా ధైర్యం, రెసిస్టెన్స్ ఐక్యత వల్లే లెబనాన్లో కాల్పుల విరమణను సాధ్యమైందని అన్నారాయన. యుద్ధం జరిగినా, శాంతి ఒప్పందం వచ్చినా.. ఇరాన్, రెసిస్టెన్స్(మిత్ర శక్తుల) శక్తులు ఒక్కటిగానే ఉంటాయని.. ఈ శక్తులు కలకాలం ముందుకు సాగుతాయన్నారు. అలాగే.. ఇజ్రాయెల్కు ప్రాధాన్యత ఇవ్వడమే పనిగా పెట్టుకున్న అమెరికా ఆ విధానాన్ని వదిలేయాలని సూచించారు. శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని అమెరికాకు హితవు పలికారు. హర్ముజ్ జలసంధి అమెరికా దిగ్బంధనం(బ్లాకేడ్) కొనసాగుతోంది. ఈ చర్య అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ జోక్యాన్ని చూస్తూ ఊరుకోబోమని చెబుతోంది. లెబనాన్లో కాల్పుల విరమణ ఇంకా ఆచరణలోకి రాలేదు. అమెరికా మధ్యవర్తితత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తగ్గినా.. చిన్నపాటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఘలీబాఫ్ వ్యాఖ్యలు పశ్చిమాసియా సంక్షోభంలో రెసిస్టెన్స్ శక్తుల ఐక్యతను బలపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరాన్ చెబుతున్నట్లు.. అమెరికా గనుక ఇజ్రాయెల్ ఫస్ట్ విధానాన్ని వీడి శాంతి ఒప్పందాన్ని గౌరవించకపోతే ప్రాంతీయ స్థిరత్వం మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో మళ్లీ ఇస్లామాబాద్లోనే జరగనున్నాయి. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో.. ఎవరో ఒకరు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అటు అమెరికా.. ఇటు ఇరాన్ తగ్గేదే లే అంటున్నాయి. బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని అమెరికా అంటుంటే.. తమ డిమాండ్లలో ఏ ఒక్కటి తగ్గినా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ అంటోంది. పాక్ మధ్యవర్తిత్వంలో తొలుత ఇరాన్, అమెరికా ప్రతినిధులు పరోక్ష చర్చలు జరుపుతారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే ప్రత్యక్ష చర్చలు జరగొచ్చు. -
భారత్కు అమెరికా ఎనర్జీ షాక్
అమెరికా తన మిత్రదేశం భారత్కు షాకిచ్చింది. రష్యా, ఇరాన్ చమురుపై ఇప్పటివరకు ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేసింది. ఈ ప్రభావం భారత్కు లభిస్తున్న తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడే అవకాశం కనిపిస్తోంది.ఆ రెండు దేశాల నుంచి మార్చి 11కి ముందు లోడ్ చేసిన చమురు సరఫరాకు మాత్రమే అమెరికా భారత్ సహా కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ స్టాక్ ఇప్పుడు పూర్తయింది. ఇకపై రష్యా, ఇరాన్ చమురు కొనుగోలు చేసే దేశాలు(భారత్ సహా) సెకండరీ సాంక్షన్స్(ద్వితీయ శ్రేణి ఆంక్షలు) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది భారత్కు ఒక ఎనర్జీ షాక్ లాంటిదే. ఇప్పటివరకు రష్యా నుండి తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి భారత్ తన ఇంధన ఖర్చులను తగ్గించుకుంది. అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు చేయడంతో ఆ సరఫరా తగ్గిపోవచ్చు. దీని వల్ల దేశీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.భారత్ ప్రస్తుతం రష్యా నుండి భారీగా డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది గణాంకాల ప్రకారం.. రోజుకు సుమారు 2.08 మిలియన్ బ్యారెల్స్ వరకు చేరింది. అయితే కొన్నినెలలపాటు రష్యా నుండి దిగుమతులు తగ్గినా.. డిస్కౌంట్ ధరలు కారణంగా మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో భారత్ రష్యా నుండి 5.3 బిలియన్ యూరోల విలువైన(47,700 కోట్ల రూపాయల) క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి మాత్రం 7 సంవత్సరాల తర్వాత 2026లో మొదటిసారి సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసింది.తాజా పరిణామాల దృష్ట్యా భారత్ తన ఎనర్జీ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విభిన్న సరఫరా మార్గాలు (పశ్చిమాసియా.. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా) అన్వేషించుకోవాల్సి ఉంటుందని.. దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు.హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణా మార్గాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా "మాక్సిమమ్ ప్రెషర్" విధానాన్ని మళ్లీ అమలు చేస్తూ, ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం ప్రపంచ చమురు ధరలపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు..అమెరికా ఇరాన్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్పై కొత్త ఆంక్షలు విధించింది. సుమారు రెండు డజన్ల కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కొందరు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారుడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సమాచారం. -
యుద్ధం ముగిసినట్టే..!
వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో సాయుధ పోరుకు అతి త్వరలో తెర పడుతుందని బుధవారం ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు వెల్లడించారు. కనుక చమురు ధరలు త్వరలోనే భారీగా దిగి రానున్నాయని జోస్యం చెప్పారు. మరో రెండు రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవిచూడనుందని అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కానీ ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతానికి మరో 10 వేల మంది అదనపు సైనికులను పంపుతూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది! వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఈ మేరకు వెల్లడించింది. దీనికి తోడు చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇరాన్కు ట్రంప్ తాజాగా రెండు షరతులు విధించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలని, చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) పూర్తి అధికారాలివ్వాలని డిమాండ్ చేశారు. దాంతో యుద్ధానికి త్వరలో తెర పడనుందన్న ట్రంప్ ప్రకటన వాస్తవ రూపు దాల్చడం అనుమానాస్పదంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 50 వేల మంది అమెరికా సైనికులున్న విషయం తెలిసిందే. అమెరికా నావికా దళం ఆధ్వర్యంలో హార్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. లెబనాన్పై భీకర దాడులు టైర్ (లెబనాన్): లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. మంగళవారం ఇరు దేశాల నడుమ వాషింగ్టన్లో చర్చలు మొదలవడం తెలిసిందే. అయినా బుధవారం తీర నగరం టైర్పై క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్టు లెబనాన్ పేర్కొంది.బుర్జ్ అల్ అరబ్ హోటల్ మూత ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు మూతబడనుంది. యుద్ధం ప్రాంరంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బ తిన్నది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతబడటం ఇదే తొలిసారి. ఇది ప్రపంచంలోనే ఏకైక సెవన్ స్టార్ కావడం విశేషం!ఇరాన్కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా చెప్పింది: ట్రంప్ ఇరాన్కు ఇకపై ఆయుధాలు ఇవ్వబోనని చైనా అంగీకరించినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖకు రాసిన ప్రత్యుత్తరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. అంతేగాక అమెరికా హార్మూజ్ జలసంధిని తెరవనుండటంపై చైనా ఎంతో సంతోషం వెలిబుచ్చిందని కూడా చెప్పుకొచ్చారు! ‘‘త్వరలో నేను చైనా వెళ్తున్నా. ప్రెసిడెంట్ జిన్పింగ్ గాఢమైన ఆలింగనంతో నన్ను స్వాగతించనున్నారు’’అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఖండించారు. ఇరాన్కు చైనా ఎప్పుడూ ఆయుధాలివ్వలేదన్నారు.ఇరాన్కు పాక్ బృందం అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలకు పరిస్థితిని సానుకూలం చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం బుధవారం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితరులతో మంతనాలు జరిపింది. రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్లో ఇప్పటికే ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. -
అటు రణరంగం... ఇటు జయకేతనం
ఒకవైపు స్వదేశంలో భీకర యుద్ధం... మరోవైపు క్రీడాంగణంలో ఇరాన్ మల్లయోధుల ఆధిపత్యం... అన్ని ప్రతికూలతలను అధిగమించి ఇరాన్ రెజ్లర్లు మరోసారి ఆసియా చాంపియన్షిప్లో పతకాల పంట పండించారు. ఈ మెగా ఈవెంట్కు సన్నద్ధమవుతున్న దశలో ఇరాన్లో యుద్ధం జరుగుతోంది. అయినప్పటికీ దాని ప్రభావం పడకుండా ఇరాన్ రెజ్లర్లు కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో గతవారం ముగిసిన ఆసియా చాంపియన్షిప్లో ఏకంగా 18 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. దాంతో ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ స్టయిల్లో ఇరాన్కే టీమ్ టైటిల్స్ లభించాయి. ప్రాణభయం వెంటాడుతున్నా అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ మల్లయోధులు తమ జెండా రెపరెపలాడించిన తీరుపై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడావిభాగం ‘ఈ పతకం నాకు ఎంతో ప్రత్యేకం. నా దేశం ఉన్న పరిస్థితుల్లో దీన్ని సాధించడం అత్యంత సంతృప్తికరం. గతంలో ఎన్నో పతకాలు గెలిచినా దీని స్థానం వాటన్నింటికంటే ఎక్కువ’ ఇది ఇరాన్ స్టార్ రెజ్లర్ అమీర్ హుస్సేన్ జారే చేసిన వ్యాఖ్య. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సహా అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన అమీర్ హుస్సేన్... ఆసియా చాంపియన్షిప్లో సాధించిన పతకానికి అంత ప్రత్యేక స్థానం ఇవ్వడం వెనక... ఇరాన్ ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఉంది. పురుషుల 125 కేజీల ఫ్రీస్టయిల్లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత అమీర్ భావోద్వేగానికి గురవుతూ తన జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఒకవైపు దేశంలో ఎక్కడ చూసిన బాంబు దాడులు, మిస్సైల్ మోతలతో దద్దరిల్లుతున్నా... ఇరాన్ రెజ్లర్లు మాత్రం ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తమ ఆధిపత్యాన్ని వదులుకోలేదు. స్టేడియంపై బాంబుదాడితో ప్లేయర్లంతా పారిపోవాల్సిన పరిస్థితులు ఎదురైనా... ప్రాక్టీస్ వదలని ఇరాన్ రెజ్లర్లు ఈ పోటీల్లో తమ పోరాట పటిమతో పాటు గుండెధైర్యాన్ని సైతం ప్రపంచానికి చాటారు. సందిగ్ధత మధ్యే... ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనడంపై తీవ్ర సందిగ్ధత మధ్య అరకొర ప్రాక్టీస్తోనే ఇరాన్ రెజ్లర్లు ఈ టోర్నీ బరిలోకి దిగారు. ‘ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం పక్కన పెడితే... కనీసం సురక్షితంగా ఉంటే చాలు అనుకోవాల్సిన స్థితి. బాంబు దాడుల్లో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన మధ్య మా రెజ్లర్లు సాధనపై మనసు లగ్నం చేయలేకపోయారు. ఒకవైపు రెజ్లర్లు సురక్షితంగా ఉండటం... మరోవైపు వారి కుటుంబాల క్షేమంపై ఆందోళన వెరసి ప్రాక్టీస్ అంతంతమాత్రంగానే సాగింది’ అని పెజ్మాన్ చెప్పారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇరాన్ రెజ్లర్లు సత్తా చాటడం వెనక టీమ్ స్పిరిట్ దాగి ఉంది. కష్టకాలంలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ... ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగారు. అందుకు తగ్గ ఫలితం సాధించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కంటే... తమ పోరాటం పెద్దది కాదని ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ దేశ ప్రజల కోసం ఏదో సాధించాలనే తపనను పతకాల సాధనలో చూపెట్టారు. రోడ్డు మార్గం ద్వారా... ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనేందుకు రెజ్లర్లు కిర్గిస్తాన్లోని బిష్కెక్కు వెళ్లాల్సి ఉండగా... బాంబుదాడులతో అంతర్జాతీయ విమానాశ్రయం ధ్వంసం కావడంతో రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దాదాపు 22 గంటల పాటు బస్సులో ప్రయాణించిన అనంతరం రెజ్లర్లు పోటీలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ‘మా దేశంలో రెజ్లింగ్ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. లాంటి దాడులకు భయపడి మా అస్థిత్వాన్ని కోల్పోకూడదని భావించాం. అందుకే ఎంత కష్టమైనా ఈ టోర్నమెంట్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. దీని కోసం మా కోచ్లు మా కన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. దేశంపై మాకు ఎంతో ప్రేమ ఉంది. అదే మమ్మల్ని ఇక్కడి వరకు చేర్చింది. మ్యాట్పై అడుగు పెట్టిన ప్రతిసారి దేశ ప్రజలు నా వెంట ఉన్నారనే భావన కలుగుతుంది. అదే నాకు మరింత బలాన్ని ఇస్తుంది. ఈ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం అని కర్తవ్య బోధ చేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగినా మా దేశాన్ని ప్రేమించడం మాత్రం వదలం. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఎంతో మంది చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా అణచివేతను ఖండించాల్సిందే’ అని స్వర్ణం గెలిచిన అనంతరం అమీర్ హుసేన్ వెల్లడించాడు. ‘మైదానంపై దాడి హేయమైన చర్య’ తమ అస్థిత్వంపై జరిగిన ఈ దాడిని ఇరాన్ రెజ్లర్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ‘మీరు ఎంత ధనవంతులైనా, ఎంత బలీయులైనా... మరొకరిపై మీ శక్తిని ప్రయోగించాల్సిన అవసరం లేదు. మేము ఇరాన్ వాసులం. మా దేశంలో చిన్న భూభాగాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా లేము. మా దేశంపై దాడి చేసిన తర్వాత బదులివ్వకుండా ఎలా ఉంటాం. దేశ సరిహద్దులు క్షేమంగా ఉండాలని కోరుకోవడం ప్రతి పౌరుడి హక్కు. ఈ యుద్ధంలో ఇరాన్ తప్పక విజయం సాధిస్తుంది’ అని అమీర్ అన్నాడు. తమ మనసులోని మాటలను ప్రపంచం ముందు పెట్టడానికి ఈ టోర్నమెంట్ బాగా ఉపయోగపడిందని ఇరాన్ రెజ్లర్లు పేర్కొన్నారు. ‘ఐదు ప్రపంచకప్లు నిర్వహించిన ఆజాది మైదానంపై దాడి చేయడం హేయమైన చర్య. యుద్ధంలో ఇలాంటి స్థలాలపై దాడులు చేయడం సబబు కాదు. అయినా వారు మా గుండెధైర్యాన్ని దెబ్బకొట్టలేరు. ఆ స్టేడియం తిరిగి నిచ్చించుకుంటాం’ అని కోచ్ పెజ్మాన్ అన్నాడు.ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇరాన్ పతక వీరులుఫ్రీస్టయిల్ విభాగం: మిలాద్ జహంగీర్ (స్వర్ణం; 57 కేజీలు), అహ్మద్ మసూద్ (కాంస్యం; 61 కేజీలు), సినామెహదీ ఖలీలి (కాంస్యం; 70 కేజీలు), అమీర్ మొహమ్మద్ (కాంస్యం; 74 కేజీలు), కామ్రాన్ ఘసెమ్పూర్ (స్వర్ణం; 86 కేజీలు), మొహమ్మద్ మోబిన్ (స్వర్ణం; 92 కేజీలు), అమీర్ హమీద్ అజార్పిరా (రజతం; 97 కేజీలు), అమీర్ హుస్సేన్ అబ్బాస్ జారే (స్వర్ణం; 125 కేజీలు). గ్రీకో రోమన్ విభాగం: మొహమ్మద్ హాజీ అలీ (కాంస్యం; 55 కేజీలు), అలీ అబ్దుల్లా అహ్మదీ వఫా (కాంస్యం; 60 కేజీలు), ఇర్ఫాన్ బెహ్నామ్ జర్కానీ (రజతం; 63 కేజీలు), అహ్మద్ రెజా సైఫుల్లా (కాంస్యం; 67 కేజీలు), మొహమ్మద్ జావద్ సాదత్ (రజతం; 72 కేజీలు), అలీ జబీహుల్లా (రజతం; 77 కేజీలు), మొహమ్మద్ ఆమీన్ (రజతం; 82 కేజీలు), గులాం రెజా (రజతం; 87 కేజీలు), మొహమ్మదాదీ అబ్దుల్లా సరావి (స్వర్ణం; 97 కేజీలు), ఆమీన్ మీర్జాజాదే (స్వర్ణం; 130 కేజీలు).స్టేడియంపై బాంబు దాడిఅమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో ఇరాన్ అతలాకుతలం అయ్యింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా... లక్షలాది మంది తమ ఆనందమయ జీవనానికి దూరమయ్యారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం ప్రభావం రెజ్లర్లపై కూడా పడింది. ఆసియా చాంపియన్షిప్నకు ముందు ఇరాన్ రెజ్లర్లు పాల్గొనాల్సిన జాతీయ శిబిరంపై బాంబు దాడి జరిగింది. దీంతో క్యాంప్ను టెహ్రాన్ నుంచి మరో నగరమైన మజందరాన్కు మార్చాల్సి వచ్చింది. ఇరాన్ రెజ్లింగ్కు కేంద్ర బిందువైన టెహ్రాన్లోని ఆజాది ఇండోర్ స్టేడియం బాంబుదాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఒకప్పుడు వేలాది మంది అభిమానులు కూర్చొని మ్యాచ్లు వీక్షించిన మైదానం సిమెంట్ దిబ్బలా మారిపోయింది. ‘ఇది చాలా కఠినమైన పరిస్థితి. మా ప్లేయర్లు ప్రాక్టీస్ చేసే టెహ్రాన్ స్టేడియం బాంబు దాడికి గురైంది. మాపై బలవంతంగా మోపిన ఈ యుద్ధం... శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా దెబ్బతీసింది’ అని ఇరాన్ రెజ్లింగ్ కోచ్ పెజ్మాన్ దొరోస్తాకర్ అన్నారు. -
ట్రంప్కు కళ్లెం వేసే మార్గమేమిటి?
ఇరాన్తో 12వ తేదీన జరిగిన చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన గమనించదగ్గది. చాలా అంశాలలో ఇరాన్తో ఏకాభి ప్రాయం కుదిరిందనీ, అణ్వాయుధాల తయారీని ఆపటంపై వారు పట్టుదల విడవలేదనీ, అందుకే చర్చలు విఫల మయ్యాయనీ అన్నారు. వారికి అణ్వస్త్ర ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ దక్కనివ్వ బోమని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులలో ప్రపంచ నాయ కుల స్పందనలను గమనించగా, ఆయన మాటలను ఎవరూ విశ్వ సించటం లేదని అర్థమవుతున్నది. చర్చలు, ఒప్పందాల విషయమై తమను లోగడ రెండుసార్లు మోసం చేసిన ఆయన ఈసారి కూడా తమ విశ్వాసాన్ని పొందలేకపోయారన్న ఇరాన్ వ్యాఖ్యలు సరేసరి!ఒప్పందం రద్దు ట్రంప్ పుణ్యమే!చర్చల మినిట్స్ అందుబాటులో లేనందున అణుపరిశోధనలు, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల ఉత్పత్తి విషయమై నిర్దిష్టంగా ఎవ రేమి అన్నారో మనకు తెలియదు. అయినప్పటికీ ఈ కీలకమైన అంశంపై చర్చలకు ముందూ, తర్వాతా ఎవరేమన్నారో తెలిసిందే. అదే విధంగా గతంలో జరిగిందేమిటో కూడా. వాటన్నింటిని పరి గణనలోకి తీసుకున్నప్పుడు, ఇస్లామాబాద్ చర్చలు విఫలం కావటా నికి కారణం ట్రంప్ వైఖరి అని తేలికగా అర్థమవుతుంది. అందుకే ఆయనకు మిత్రదేశాల నుంచి కూడా మద్దతు లభించటం లేదు. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు, యురేనియం శుద్ధి విష యమై ఇరాన్కు, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం గల అమె రికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లతో పాటు జర్మనీకి మధ్య 2015 లోనే ఒప్పందం జరిగింది. దానిని ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ అన్నారు. దాని ప్రకారం ఇరాన్ శాంతియుత అవస రాల కోసం యురేనియంను 3.67 శాతం వరకు శుద్ధి జరపవచ్చు. అణ్వాయుధాల తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం. ఈ శుద్ధి కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయవచ్చు.ఆ ప్రకారం 2015 నుంచి 2018 వరకు సజావుగానే సాగుతుండిన ఒప్పందాన్ని ట్రంప్ తన మొదటి హయాంలో ఆకస్మికంగా రద్దు చేయటంతో సమస్యలు మొదలయ్యాయి. అట్లా రద్దు చేసినా తమ వైపు నుంచి కొంతకాలం పాటు ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండిన ఇరాన్, ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోక పోవటంవల్లనే యురేనియం శుద్ధి స్థాయిని 60 శాతం వరకు తీసుకువెళ్లి ఆపింది. అణ్వస్త్ర తయారీ మాత్రం తమ అజెండాలో లేదని అయతొల్లా ఖమేనీ ఫత్వా సైతం జారీ చేశారు. అటువంటి ఆయుధాల ఉత్పత్తి ఇస్లాంకు విరుద్ధమన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే గాక, ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు రోజు లలో అమెరికా, ఇరాన్ మధ్య ఒమాన్ మధ్యవర్తిత్వం ద్వారా తిరిగి చర్చలు, అవి దాదాపు ఒక కొలిక్కి రానుండగా దాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యాన్నంతా గుర్తు చేసుకోవటం ఎందుకంటే, అణ్వస్త్రాలను ఆపటమే తమ అత్యంత ప్రాధాన్య లక్ష్యమనీ,అందుకు ఇరాన్ కలిసి రానందునే చర్చలు ముందుకు సాగలేదనీ ట్రంప్ వాదించబూనటం తెంపరితనం మాత్రమే అవుతుంది. ప్రపంచం అందువల్లనే ఆయనను నమ్మటం లేదు.దిగ్బంధనం– గందరగోళంఇస్లామాబాద్ చర్చలకు ముందే ఇరువురు తమ తమ షరతులు ప్రకటించారు. అవి ఇంచుమించు గత నెల షరతుల వంటివే. అయి నప్పటికీ, రాజీ అంటూ జరగాలి గనుక చర్చల సమయంలో కొంత పట్టువిడుపులు ఉంటాయనే భావన కలిగింది. ఇటువంటి దౌత్య చర్చలు ఎపుడైనా పలు విడతలుగా సాగుతూ క్రమంగా కొన్ని రాజీ లతో అంతిమ ఒప్పందం జరుగుతుంది. ఈసారి కూడా చర్చలు 21 గంటలపాటు సాగిన తర్వాత, రాగల రోజులలో తిరిగి చర్చలు ఉండగలవనే సంకేతాలు రెండు దేశాల ప్రతినిధుల నుంచి వినిపించాయి. కానీ, ‘ఖలునికి నిలువెల్ల విషముగదరా సుమతీ’ అన్నట్లు తన నిలువెల్ల ‘ఆయుధాలు, సైనిక బలం’ అన్న మిడిసిపాటు తప్ప దౌత్యనీతి అనే మాటకు చోటులేని ట్రంప్ మాత్రం వెంటనే హార్మూజ్ దిగ్బంధం అంటూ హెచ్చరించటంతో ఆగక, దిగ్బంధనం కోసం తమ నౌకా దళాలకు ఉత్తర్వులు జారీ చేశారు.దానితో ఇరాన్ లొంగి వస్తుందని ఆయన అంచనా వేసిన ట్లున్నారు. కానీ, జరిగిందేమిటి? ప్రపంచమంతటా చమురు ధరలు పెరిగి, స్టాక్స్ పడిపోయాయి. చర్చలు నెరవేరగలవన్న ఆశాభావా లతో తగ్గిన చమురు, పెరిగిన స్టాక్స్, ఆయన పుణ్యమా అని తిరిగి గందరగోళంలో పడ్డాయి. నిజానికి హార్మూజ్ ద్వారా రవాణా అయ్యే చమురు, ఇతర సరకులు అన్నీ ఇరాన్వేమీ కాదు. అరబ్ దేశాలవి, బయటి దేశాలవి కూడా గణనీయంగా ఉన్నాయి. అది తర్వాత బోధ పడి కావచ్చు, మొత్తం హార్మూజ్ను కాకుండా ఇరాన్ రేవులను మాత్రమే దిగ్బంధిస్తామన్నారు. అందుకు ఇరాన్ తాము ఆ ప్రాంతంలోని అరబ్ రేవులన్నింటిపై దాడులు జరపగలమని హెచ్చరించింది. ఆ జలసంధిలో మైన్స్ మరొకవైపు ఉండనే ఉన్నాయి. ఈ హెచ్చరిక లతో మళ్లీ గందరగోళం మొదలైంది.చట్టాలకు లోబడేట్టుగా...ఒప్పందాలు, ఒప్పంద చర్చలను ప్రతిసారీ భంగపరుస్తున్న ఇజ్రాయెల్ ఈసారి కూడా ఆ పని చేస్తుండటం మొదటినుంచీ కనిపించిందే. యుద్ధ విరమణ లెబనాన్కు సైతం వర్తించాలన్న షర తును ఇరాన్ మొదటనే విధించగా, అందుకు ట్రంప్ పాకిస్తాన్ ద్వారా సమ్మతి తెలిపారు. కానీ ఇజ్రాయెల్ తమకు దానితో నిమిత్తం లేదంటూ దాడులు కొనసాగించగా, ట్రంప్ కూడా అది వేరే అంశమంటూ వాదించారు. చర్చలపట్ల ట్రంప్, నెతన్యాహూల ఆంతరంగిక ఆలోచనలకు అద్దంపట్టిన విషయాలలో ఇదీ ఒకటి. అందుకు తగినట్లుగానే ట్రంప్ ఇజ్రాయెల్కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తుండగా, మధ్యవర్తి పాకిస్తాన్ చేష్టలుడిగి మిన్నకుంటున్నది.అసలు వాస్తవం ఏమంటే, అమెరికాకు గానీ, ఇజ్రాయెల్కుగానీ ఇరాన్ అణు పరిశోధనలు వట్టి సాకు మాత్రమే. అమెరికాకు కావలసింది అక్కడ ఒక సామంత రాజ్యాన్ని నెలకొల్పి చమురు నిల్వలు తమ అధీనంలోకి తెచ్చుకోవటం. వెనిజులా వలెనే ఇరాన్ చమురు గురించి స్వయంగా ట్రంప్ చెప్పిందే. ఇజ్రాయెల్కు కావలసింది గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడి, ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక శక్తిగా మిగలక పోవటం. ప్రపంచమంతా ఇప్పటికే గుర్తించిన ఈ వాస్తవాలు తిరిగి రుజువవుతున్నాయి.ట్రంప్ అరాచకానికి కళ్లెం వేయగల మార్గం ఒకే ఒకటి కని పిస్తున్నది. ఇది ఇట్లానే అందరినీ చుట్టుముట్టరాదంటే రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఆసియాన్ కూటమి, ఆఫ్రికన్ యూనియన్, బ్రెజిల్ వంటి దక్షిణ అమెరికా దేశాలు కలిసి, అమెరికా పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఐక్యరాజ్యసమితి ద్వారా మాత్రమే వ్యవహరించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఒక నిర్ణీత వ్యవధిలో అందుకు అంగీకరించనట్లయితే అమెరికా, ఇజ్రాయెల్లతో దౌత్య సంబంధాలు రద్దు చేసుకోకున్నా, సస్పెండ్ చేయగలమని హెచ్చరించాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇరాన్లో అడుగుపెట్టిన పాక్ సైన్యాధిపతి మునీర్
టెహ్రాన్: పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఇరాన్ చేరుకున్నారు. ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. ఇరాన్-అమెరికా మధ్య చర్చల పునఃప్రారంభంపై ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. అందుకు సంబంధించిన పాక్ ప్రతినిధి బృందంతో మునీర్ ఇరాన్ వెళ్లినట్లు పాకిస్థాన్ సైన్యం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.యుద్ధం వేళ అమెరికాకు పాక్ టీమ్ పలు ప్రతిపాదనలు చేయనుంది. టీమ్లో ఆసిమ్ మునీర్తో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ తెహ్రాన్ కూడా ఉన్నారు. అమెరికా ఇచ్చిన ఆఫర్ను ఇరాన్కు ఆసిమ్ మునీర్ వివరిస్తారు. అమెరికా పంపిన సందేశాన్ని ఇరాన్కు ఇచ్చాక రెండో దశ చర్చల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అంతకుముందు టెహ్రాన్లోని విమానాశ్రయంలో ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్వాగతం పలికారు. కాగా, యూఎస్-ఇరాన్ మధ్య రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు, కాల్పుల విరమణ విషయంలో లెబనాన్ను చేర్చాలని అమెరికాపై ఇరాన్ ఒత్తిడి పెడుతోందని హెజ్బొల్లా ప్రతినిధి తెలిపారు. హార్మూజ్ జలసంధిపై ఆంక్షలను ఒత్తిడి సాధనంగా ఉపయోగించి, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ను చేర్చాలని ఇరాన్ ప్రయత్నించిందని తెలిపారు. “ఇరానీయులు అమెరికాపై అధిక ఒత్తిడి పెడుతున్నారు, అమెరికా కాల్పుల విరమణలో లెబనాన్ను చేర్చాలి అనే షరతులు పెట్టారు. అది చేయకపోతే, హార్మూజ్ ఆంక్షలను కొనసాగిస్తారు” అని తెలిపారు. -
అందుకు చైనా అంగీకరించింది.. ట్రంప్ ఆసక్తికర పోస్ట్
హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం.. దీంతో చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుంది. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. ఇరాన్కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది.’’ అంటూ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ కీలకమైన జలసంధి ఇకపై ఎన్నడూ మూతపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అయితే, తాము ఇరాన్కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా పదేపదే ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్కు మద్దతు ఇస్తోందని.. క్షిపణుల తయారీలో ఉపయోగపడే ద్వంద్వ-వినియోగ పారిశ్రామిక భాగాలను సరఫరా చేయడం ద్వారా ఇరాన్ను ప్రోత్సహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.మరోవైపు, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాన్నారు. అయితే, ఇరాన్తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు...కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
3 దశాబ్దాల తర్వాత ఆ 2 దేశాల మధ్య చరిత్రాత్మక చర్చలు
వాషింగ్టన్: ‘లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపాలి’.. ఇరాన్ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపలేదు. లెబనాన్లో తాజా యుద్ధం మార్చి 2న మొదలైంది. ఇరాన్ మద్దతుతో లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా ఇజ్రాయెల్పై కాల్పులు జరిపింది. దీంతో లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 2,000 మందికి పైగా మృతి చెందగా, అందులో 165 మంది పిల్లలు, 250 మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు జరిపాయి. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధులు అమెరికాలో ఉన్నారు.లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి దౌత్య చర్చలు నిర్వహించాయి. ఇజ్రాయెల్, లెబనాన్కు మధ్య దౌత్య సంబంధాలు లేవు. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మధ్య ఘర్షణను ముగించాలనే లక్ష్యంతో అమెరికాలో ఇప్పుడు ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇది చరిత్రాత్మక అవకాశమని చెప్పారు. హెజ్బొల్లా ప్రభావం లేకుండా చేసేందుకు ఇదో అవకాశమని అన్నారు.అమెరికా చేసిన ప్రకటన ప్రకారం.. లెబనాన్, ఇజ్రాయెల్ పక్షాలు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. ఇజ్రాయెల్ అన్ని ప్రభుత్వేతర ఉగ్రవాద గ్రూపులను నిరాయుధీకరణ చేయాలని కోరింది. అంటే ఇందులో హెజ్బొల్లా కూడా వస్తుంది.లెబనాన్ కాల్పుల విరమణ కోరింది. మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పింది. లెబనాన్లో హిజ్బుల్లాను నిరాయుధీకరణ చేయడం, ఆ గ్రూపు లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ తెలిపింది. గాజా యుద్ధం కొనసాగిన సమయంలో (2023, 2024లో) కూడా హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాడింది.అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. చర్చల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్, లెబనాన్ రెండు పక్షాలు హెజ్బొల్లా ప్రభావాన్ని తగ్గించే దిశగా పని చేయడానికి అంగీకరించాయి. హెజ్బొల్లా దాడుల నుంచి తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కుకు అమెరికా మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు. -
‘ట్రంప్ రండి.. కూర్చొని మాట్లాడుకుందాం’ : ఇరాన్ అధ్యక్షుడు
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాతో తమ దేశం యుద్ధాన్ని కాకుండా శాంతి చర్చలు కోరుకుంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (ఐఆర్ఎన్ఏ)ధృవీకరించింది.పశ్చిమాసియా యుద్ధం. ఆ యుద్ధం కారణంగా ఇరాన్కు వాటిల్లిన నష్టం, హర్మూజ్ జలసంధిని అమెరికా మూసివేత వంటి పరిణామాలు, పాకిస్థాన్లో అమెరికా-ఇరాన్ల మధ్య జరిగిన చర్చలతో పాటు ఇతర అంశాలపై పెజెష్కియాన్ ఐఆర్ఎన్ఏతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ తమ దేశం యుద్ధాన్ని కాకుండా చర్చలను కోరుకుంటోందన్నారు. అయితే అమెరికా తన ఇష్టాన్ని మా రుద్దడానికి లేదంటే లొంగిపోయేలా చేసేందుకు అమెరికా చేస్తున్న ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందన్నారు. అదే సమయంలో ఇరాన్లో అపార ప్రాణ నష్టానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ను అంతర్జాతీయ సమాజం ఖండించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టం, మానవతా సూత్రాల ప్రకారం పౌరులను, ఉన్నత వర్గాలను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కీలక కేంద్రాలను ధ్వంసం చేయడాన్ని సమర్ధించకూడదని స్పష్టం చేశారు. -
24 గంటల్లో హార్ముజ్ దాటిన 20 నౌకలు
-
మా అప్పు ఇస్తావా.. చస్తావా..! పాక్ చావుకొచ్చిందిగా..!
-
మెలోనీతో స్నేహానికి బీటలు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహ బంధానికి బీటలు వారుతోంది. ఇరాన్ యుద్ధంలో అగ్రరాజ్యానికి ఇటలీ మద్దతు ఇవ్వకపోవడం ఒక కారణం కాగా.. పోప్ లియో వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మద్దతు ప్రకటించాలని ట్రంప్ ఇటలీపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ దేశ ప్రధాని మెలోనీ అందుకు తలొగ్గలేదు. ఇటలీని ఈ యుద్ధంలోకి లాగడం తన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె భావించారు. ఇరాన్ యుద్ధంలో తమ దేశం పాల్గొనబోదని.. ఇది ప్రపంచంలోనే పెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఏప్రిల్ 14న ఇజ్రాయెల్తో తమ దేశానికి ఉన్న రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఈలోపు పోప్ లియో XIV ఇరాన్ యుద్ధంపై స్పందించడం.. ఆయనకు ట్రంప్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇరాన్ యుద్ధంపై పోప్ మాట్లాడటం తగదని, ఆయనకు పరిస్థితులు అర్థం కావడం లేదని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. అయితే ట్రంప్ పోప్పై చేసిన వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఈ రెండు పరిణామాలు ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ యుద్ధం, మధ్యధరా ప్రాంతంలో ఇంధన భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మెలోనీ ఏమాత్రం ధైర్యం చూపడం లేదని.. ఇటలీని రక్షించడంలో ఆమె విఫలమవుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఇరాన్కు అవకాశం వస్తే ఇటలీని రెండు నిమిషాల్లో పేల్చేస్తుంది. ఇటలీకి హర్ముజ్ జలసంధి ద్వారా చమురు వస్తున్నా.. యుద్ధంలో పాల్గొనడానికి ఆమె నిరాకరించడం ఆశ్చర్యం కలిగించింది’’ అని వ్యాఖ్యానించారాయన. ఇక మీదట యూరోపియన్ దేశాలు తమ ఇంధన అవసరాలను తామే చూసుకోవాలని.. అమెరికా సైన్యం ఇతరుల కోసం పోరాడబోదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో.. పోప్ లియో XIVపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని మెలోనీ అనడంపై స్పందిస్తూ.. వాస్తవానికి పోప్ కాదు మెలోనీనే కరెక్ట్ పర్సన్ కాదంటూ ట్రంప్ ఓ కామెంట్ చేశారు. జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ నుండి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. అమెరికా–యూరప్ మధ్య వారధిగా ఆమెకంటూ ఓ పేరు ముద్రపడింది. పైగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆమె ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ మధ్య ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం వేళ ఆమెను పొగడ్తలతోనూ ముంచెత్తారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు వీళ్ల మధ్య చిచ్చు రాజేసినట్లైంది. -
ఇరాన్ ప్రతినిధుల బృందంపై క్షిపణి దాడి ప్లాన్?
ఇటీవల ఇస్లామాబాద్లో ఇరాన్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలెవల్ డెలిగేషన్ మీటింగ్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మరాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిగి వెళ్లే సమయంలో తమ విమానంపై అటాక్ జరుగుతోందని తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.అమెరికా- ఇరాన్ మధ్య రేపు( గురువారం) రెండో సారి శాంతి చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్లో మెుదటగా జరిగిన చర్చలలో ఎటువంటి సానూకూల ఫలితాలు రాకపోవడంతో మరో దఫా చర్చలకు రెండే దేశాలు సమాయాత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ మారాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ముగించి తిరుగు ప్రయాణంలో వారి విమానానికి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.ప్రొఫెసర్ మారాండీ మాట్లాడుతూ " పాక్లో చర్చలు ముగించుకొని వెళుతున్న సమయంలో ఫ్లైట్లో అబ్బాస్ అరాఘ్చీ, స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్తో ఇతర కీలక నేతలు ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా మా విమానం క్షిపణి దాడికి గురువుతుందని బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ప్రత్యామ్నయ మార్గం ద్వారా తరలించాం. వాస్తవానికి టెహ్రాన్లో దిగాల్సి ఉండగా అత్యవసరంగా ఇరాన్ నగరం మషద్ నగరంలో ఫ్లైట్ ల్యాండ్ చేసి కార్లు, ట్రైన్ల ద్వారా టెహ్రాన్ నగరం చేరుకున్నాం".అని అన్నారు.అమెరికా జిత్తులమారని తమకు తెలుసని అందుకే ఆ దేశాన్ని ఎప్పుడు నమ్మదలుచుకోలేదని ప్రొఫెసర్ అన్నారు. మాతో చర్చలు జరుపుతూనే మరోవైపు తమ మిలటరీ బేస్లను మరింత బలపరుచుకుంటుందన్నారు. అయితే చర్చల సమయంలో పాకిస్థాన్ ఇరాన్కు అత్యంత పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఆదేశానికి చెందిన అత్యాధునికి విమానాలు ఇరాన్ ప్రతినిధుల బృందం ఉన్న విమానానికి ఎస్కార్ట్గా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. -
యుద్ధం ముగుస్తుంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అన్నారు. ముగింపు దశకు చాలా దగ్గరగా ఉన్నట్టు తాను భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే, ఇరాన్తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు. కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకు వచ్చేందుకు ఇరాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతిస్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకలను హార్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. -
సీజ్ ఫైర్ ఉల్లంఘన.. హిజ్బుల్లా.. ఇరాన్ బాంబుల మోత
-
అగ్నిగుండంలా ఇరాన్.. పాఠశాలలు, ఆసుపత్రులపై బాంబుల వర్షం
-
శాంతి చర్చలపై అసంతృప్తి.. జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జర్మన్ బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ.. చేసిన వ్వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం - మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతున్నాయి.జెలెన్స్కీ అమెరికా శాంతి చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూఎస్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ప్రస్తుతం ఇరాన్ చర్చలలో నిమగ్నమై ఉండటం వల్ల ఉక్రెయిన్ సమస్యపై తగిన శ్రద్ధ చూపలేకపోతున్నారని తెలిపారు. అంతే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin)పై అమెరికా కఠినమైన ఒత్తిడి తీసుకురాకపోతే యుద్ధం ముగిసే అవకాశాలు తగ్గిపోతాయి. కేవలం చర్చలు మాత్రమే చేస్తే, రష్యా నాయకత్వం భయపడదని ఆయన పేర్కొన్నారు.ఇక, ఉక్రెయిన్కు అమెరికా నుంచి వచ్చే ఆయుధాల సరఫరా కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా గాలి రక్షణ కోసం ఉపయోగించే PAC-2, PAC-3 మిసైళ్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ ఆయుధాలు పీయూఆర్ఎల్ కార్యక్రమం ద్వారా యూరోపియన్ దేశాల సహకారంతో కొనుగోలు చేస్తున్నారు. కానీ మధ్యప్రాచ్యంలోని యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ సరఫరాలు ఆలస్యంగా వస్తున్నాయని జెలెన్స్కీ చెప్పారు.జెలెన్స్కీ, నార్వే ప్రధానితో సమావేశమై రక్షణ రంగంలో సహకారం పెంపొందించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్ డ్రోన్లు నార్వేలో తయారవుతాయి. ఇది రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో మరింత బలమైన భాగస్వామ్యానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, జెలెన్స్కీ జర్మనీకి వెళ్లి చాన్సలర్ Friedrich Merzతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించడంతో పాటు రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించారు. -
మళ్లీ చర్చలు!
వాషింగ్టన్/బీజింగ్/బీరూట్: పశ్చిమాసియాలో యుద్ధానికి తెర దించే దిశగా అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవి బహుశా వచ్చే రెండు రోజుల్లో జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తొలి దశ మాదిరిగానే ఈ చర్చలకు కూడా పాక్ రాజధాని ఇస్లామాబాదే వేదిక కానున్నట్టు వెల్లడించారు. పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ కృషి వల్లే ఇది సాధ్యపడుతోదంటూ ట్రంప్ ప్రశంసించారు. ఆదివారం జరిగిన తొలి దఫా చర్చలు విఫలమవడం తెలిసిందే. ‘‘రెండో దఫా చర్చలకు ఇరాన్ కూడా అంగీకరించింది. ఆ దేశ ఓడరేవులన్నింటినీ అమెరికా దిగ్బంధించిన కారణంగానే దిగొచి్చంది’’ అని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.గత 24 గంటల్లో హార్మూజ్ జలసంధితో పాటు ఆ దేశ రేవులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో 10 వేల మందికి పైగా సైనికులు, 18 యుద్ధ నౌకలు, 100కు పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నట్టు తెలిపింది. అయితే చమురు, రసాయనాలను తీసుకెళ్తున్న రిచ్ స్టారీ అనే నౌక మంగళవారం హార్మూజ్ను దాటినట్టు సమాచారం. హార్మూజ్ జలసంధిని తెరిపించే లక్ష్యంతో శుక్రవారం పారిస్లో జరిగే సదస్సుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షత వహించనున్నారు.మరోవైపు హార్మూజ్ను అమెరికా దిగ్బంధించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. దాన్ని ప్రమాదకరమైన, బాధ్యతారహిత చర్యగా అభివరి్ణంచింది. అమెరికా, ఇరాన్ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటించాలని సూచించింది. ఇరాన్కు సైనికంగా సాయపడుతున్నామన్న ట్రంప్ ఆరోపణలను ఖండించింది. తమపై టారిఫ్లు పెంచితే దీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో అన్ని దేశాల సార్వబౌమత్వాన్నీ, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరముందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్, లెబనాన్ చర్చలు ఇజ్రాయెల్, లెబనాన్ 33 ఏళ్ల అనంతరం తొలిసారి ప్రత్యక్ష చర్చలకు దిగాయి. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు మంగళవారం వాషింగ్టన్లో సన్నాహక చర్చలు జరిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ కూడా వాటిలో పాల్గొన్నారు. నెల రోజులుగా లెబనాన్పై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తుండటం తెలిసిందే. వాటికి తెర దించడమే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే వాటి ఫలితాలకు కట్టుబడి ఉండబోనని లెబనాన్ సాయుధ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగినట్టు హెజ్బొల్లా పేర్కొంది. -
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. ఇరాన్ - అమెరికా యుద్ధం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని గురించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఐఎంఎఫ్ విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్' నివేదిక ప్రకారం.. 2026 సంవత్సరానికి గాను గ్లోబల్ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వృద్ధి సుమారు 3.1 శాతంగా ఉంటుంది పేర్కొంది. జనవరిలో ఇది 3.3 శాతం ఉంటుందని అంచనా వేసినప్పటికీ, మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారాయి.ఈ యుద్ధం ఇరాన్ - అమెరికా,ఇజ్రాయెల్ దాడుల మధ్య ఉద్రిక్తతలతో ప్రారంభమై.. ఆ ప్రాంతంలో తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసింది. ఈ పరిణామాల కారణంగా ముఖ్యంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇరాన్ హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాను అడ్డుకోవడం వల్ల ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంధన ధరల పెరుగుదలతో.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ ప్రకారం.. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4.4 శాతానికి చేరవచ్చని అంచనా. ఇది జనవరిలో చెప్పిన అంచనాల కంటే చాలా ఎక్కువ.అయితే.. 1970లలో జరిగిన చమురు సంక్షోభంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా చమురు మీద ఆధారపడటం తగ్గింది. పునరుత్పాదక శక్తి, అణుశక్తి వంటి ప్రత్యామ్నాయ శక్తి వనరులు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరంగా నిలబడే అవకాశం ఉంది.యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. అప్పుడు గ్లోబల్ వృద్ధి రేటు 2.5 శాతం లేదా 2 శాతానికి కూడా పడిపోవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ ప్రభావం అన్ని దేశాలపై సమానంగా ఉండదని ఐఎంఎఫ్ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు ఎక్కువగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్కు ఇరాన్ చమురు.. ఏడేళ్లలో తొలిసారి!మధ్యప్రాచ్యం - మధ్య ఆసియా ప్రాంతాల్లో వృద్ధి రేటు గణనీయంగా తగ్గి 1.9 శాతానికి చేరవచ్చని అంచనా. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కూడా ప్రభావితమవుతున్నాయి. అమెరికా వృద్ధి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, చైనాలో వృద్ధి కొంచెం మందగించనుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. -
మళ్లీ యుద్ధ మేఘాలు!
చరిత్రాత్మకం అన్నారు. ఉన్నతస్థాయి చర్చలన్నారు. దౌత్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. శాంతికి పశ్చిమాసియా చేరువలో ఉందన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్లో 21 గంటలపాటు కొనసాగిన అమెరికా–ఇరాన్ ప్రతినిధి బృందాల చర్చలపై ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చిన సమాచారం సారాంశమిది. తీరా బయటికొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపు భాష మొదలైంది. అమెరికా ఏకపక్ష వైఖరివల్ల 47 సంవత్సరాల తర్వాత ఆ రెండు దేశాలమధ్యా నేరుగా సాగిన చర్చలు చివరికిలా నీరుగారాయి. వచ్చేవారం మరోసారి చర్చలుంటాయని చెబుతున్నారు. కానీ అమెరికా వైఖరి మారకపోతే ప్రయోజనం శూన్యం. ట్రంప్ వచ్చాక చర్చల అర్థమే మారిపోయింది. చర్చలంటే ఆయన శాసిస్తే ఎదుటిపక్షం శిరోధార్యంగా స్వీకరించటం తప్ప మరేంకాదు. అసలు ఈ యుద్ధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వాన్స్ నాయకత్వాన ప్రతినిధి బృందాన్ని పంపటంలోనే ఆయన నిజాయితీలేమి వెల్లడైంది. ఏ అధికారమూ లేని, సొంతంగా ఎలాంటి చొరవా తీసుకోలేని ఆ అశక్త బృందం చివరకు ఉత్త డొల్లగా మిగిలిపోయింది. ట్రంప్ తీరు 90వ దశకం మొదట్లో సోవియెట్ యూనియన్ కుప్పకూలిననాటి పరి స్థితుల్ని తలపిస్తోంది. అంతవరకూ సోవియెట్ భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు జరగటం, దేశంనుంచి విడిపోతున్నట్టు ప్రకటించటం రివాజై పోయింది. నిజంగా అలా ప్రకటించేవారి బలాబలాలేమిటో, ఆ తీర్మానాలు అమలయ్యే అవకాశం ఉందో లేదో తెలియని స్థితి. ఇలాంటి అనిశ్చితే ఇప్పుడు అమె రికాను ఆవరించింది. నరమేథాన్ని సాగిస్తూ ఘనవిజయాలుగా ప్రకటించుకోవటం, ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతం కాబోతున్నదని ప్రకటించటం, అంతలోనే చర్చలకు రావాలంటూ బెదిరించటం ట్రంప్ అలవాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్తోపాటు ఈ యుద్ధానికి లోపాయికారీగా మద్దతిచ్చిన దేశాలన్నీ ఇరాన్నుంచి శరపరంపరగా వచ్చి పడుతున్న క్షిపణుల ధాటికి బెంబేలెత్తినా, అక్కడ పెనువిధ్వంసం చోటుచేసుకుంటున్నా ట్రంప్ బడాయి మాటలు ఆగలేదు. ఆయన ప్రకటనలకు భిన్నమైన స్థితిగతులున్నాయని సైనికా ధికారులే మీడియాకు రహస్యంగా చెప్పటం అమెరికాలో కుప్పకూలుతున్న వ్యవస్థలకు ఆనవాలు. సోవియెట్ కనుమరుగయ్యే ముందు కూడా ఇలాంటి ధోరణులే కనబడ్డాయి. ఇతర దేశాల సహకారంతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే, అందుకు తాము అంగీకరించబోమని నాటో భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్లు ప్రకటించి గాలి తీశాయి. ‘హార్మూజ్ దిగ్బంధం’ అంటూ చేసిన ప్రకటనకు అర్థం ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధమని అమెరికా సైన్యం ఆ వెంటనే తెలిపింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు. కానీ గల్ఫ్ దేశాలే దీన్ని నిరసిస్తున్నాయి. ట్రంప్ చర్య ఈ ప్రాంతం మొత్తాన్ని శాశ్వతంగా యుద్ధ ఊబిలోకి దించేస్తుందని సౌదీ అరేబియాతోసహా చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు మాదిరే రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు చేరు కున్నాయి. అవి ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నాయి. కానీ అమెరికా దుందుడుకు చర్యకు దిగితే యెమెన్లోని హౌతీలు ఆ ఎగుమతుల్ని దెబ్బతీస్తారు. తన నాయకత్వాన ఇన్ని దశాబ్దాలుగా సాగిన ఏకధ్రువ ప్రపంచం కళ్లముందు కుప్పకూలుతున్న వైనాన్ని అమెరికా గ్రహించకపోతే పోయిందిగానీ... చైనా నాయకత్వంలో కొత్త అమరిక మొగ్గతొడుగుతోందన్న సంగతైనా అది తెలుసుకోవాలి. ఈ యుద్ధం తనకూ, ఇరాన్కూ మధ్య పంచాయతీ కాదు. అది పశ్చిమాసియాకు పరిమిత మైంది అంతకన్నా కాదు. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ బలహీనపరుస్తున్న ఒక నిరర్థక యుద్ధం. అది చైనా నాయకత్వాన కొత్త కూటమికి పురుడు పోస్తున్న ప్రమాదకర యుద్ధం. ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే తాము సర్వశక్తిమంతులమని ఇరాన్తో చర్చలకు చాన్నాళ్లముందు జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్ ప్రభావం ఆయనపై ఎక్కువే ఉన్నట్టుంది. ఆ దృశ్యం మారుతున్న సంగతిని అమెరికా నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్
ఇస్లామాబాద్: ఏప్రిల్ 10-12 మధ్య ఇరాన్-అమెరికా చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లులను చెల్లించడంలో పాక్ విఫలమైందని.. అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చుకుందంటూ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చేయి దాటడంతో.. హోటల్ యజమాని స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. హోటల్ బిల్లు కూడా పాక్ కట్టలేకపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది.అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు ఈ వారంలోనే పాకిస్థాన్లో ప్రారంభం కానున్నాయి. అసలే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్కు రాబోయే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు సవాలుగా మారింది. వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 16న ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్యొంది. అయితే, ఈసారి కూడా గతంలో వచ్చిన స్థాయి ప్రతినిధి బృందాలు వస్తాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాక్.. ఇస్లామాబాద్లోని హోటల్ సెరెనాలో ఏర్పాట్లు చేసింది. తీరా ఈ చర్చలు విఫలమవ్వడంతో.. చివరకు చెల్లింపులు లేవు, డీల్ లేదన్నట్లుగా పరిస్థితి మారింది. చివరికి హోటల్ బిల్లుల భారం మాత్రం మిగిలింది.మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్కు మరో సమస్య వచ్చి పడింది. యూఏఈ ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తో వచ్చింది.. అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏకంగా 40 నిమిషాలు..
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. మోదీతో ట్రంప్ సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఇటీవల పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం కుదరలేదు. దీంతో అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. ఇరాన్ సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది.యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్తో మోదీ కీలక చర్చలు జరిపారు. “నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ అందింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి కూడా చర్చించాము. హార్మూజ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడం, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం” ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…— Narendra Modi (@narendramodi) April 14, 2026కాగా, ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత తదుపరి దౌత్య చర్యలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఇద్దరు నేతల మధ్య తొలిసారి జరిగిన చర్చ. ‘‘భారత ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు” అని ఫోన్ కాల్ సమయంలో ట్రంప్కు మోదీ చెప్పారు. వారి మధ్య జరిగిన చర్చ విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మోదీ, ట్రంప్ జరిపిన చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీకి తాజా సమాచారం అందిస్తుంటారు: సెర్జియో ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. “కొన్ని నిమిషాల క్రితమే వారు ఫోన్ సంభాషణ ముగిసింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా యాక్టివ్గా ప్రధానమంత్రి మోదీకి తాజా సమాచారం అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు వివరాలు చెప్పారు. అలాగే అమెరికా, భారత్ మధ్య వాషింగ్టన్లో జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది” అని గోర్ చెప్పారు. -
పాక్లో అమెరికా-ఇరాన్ మళ్లీ చర్చలు..! ఎప్పుడంటే?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో శాంతి గురించి చర్చించడానికి అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణకు పరిష్కారం కోసం చర్చల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటీవల ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. దశాబ్దానికి పైగా కాలంలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష భేటీ ఇది. అలాగే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపులు ఇవే.పాకిస్థాన్లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. తదుపరి దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.పాకిస్థాన్లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. -
హర్మూజ్ జలసంధిని మూసివేస్తారా.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్ : శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతున్నాయి. ఫలితంగా పశ్చిమాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టైల్లో అభి తొహ్ సిర్ఫ్ ట్రైలర్ హాయ్, పిక్చర్ అభి బాకీ హాయ్ అంటూ ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అందులో ఇరాన్ నావికాదళం ఉపయోగించే చిన్న, వేగవంతమైన క్షిపణి పడవల గురించి ప్రస్తావిస్తూ.. అవును, ఆ వేగవంతమైన క్షిపణి పడవలు వేడెక్కుతున్నాయి. ఇరాన్ నావికాదళం ‘నాశనమైపోయింది’ అని ట్రంప్ పదేపదే చెప్పడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు క్షిపణుల సమూహం మిమ్మల్ని ఎంత త్వరగా కట్టడి చేయగలదో తెలుసుకోబోతున్నారు’ అని పేర్కొంది. పశ్చిమాలో యుద్ధం కారణంగా ఇరాన్ రూ.25 లక్షల కోట్లు నష్టపోయింది. ఇరాన్ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేలా అమెరికా హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇందుకోసం ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన యూఎస్ఎస్ అబ్రహీం లింకన్ కూడా ఇరాన్ తీరప్రాంతంలో ఉంది. పరిస్థితులు ప్రతికూలమైతే దాడికి దిగే అవకాశం ఉంది. ఇరాన్ అణ్వాయుధాల జోలికి వెళ్లదని, వాటి తయారీకి అవసరమైన పరికరాలను సేకరించబోదని వారి నుంచి మాకు ఒక కచ్చితమైన హామీ కావాలి. ఇదే ట్రంప్ ప్రధాన లక్ష్యం. అందుకు అనుగుణంగా పాకిస్థాన్లో ఇరాన్ -అమెరికా దేశాలు శాంతి చర్చలు జరిపాయి. ఆ చర్చలు విఫలం కావడంతో ఇరాన్కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్క్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతాయి. తద్వారా చమురు అమ్ముకుని ఆర్థికంగా బలంగా ఉన్న ఇరాన్కు అమెరికా తీసుకుంటున్న చర్యలతో సతమతమవుతోంది. -
యుద్ద నష్టం ఇన్ని లక్షల కోట్లా..? ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు కలిసి ఇరాన్ మౌళిక సదుపాయాలతో పాటు ఆర్మీ బేస్, విద్యుత్ ప్లాంట్లపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అధికారికంగా ప్రకటించింది.ఇరాన్ ప్రభుత్వం యుద్ధం వల్ల ఇప్పటి వరకూ జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా విడుదల చేసింది. టెహ్రాన్పై జరిపిన దాడులలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 25 లక్షల కోట్లు నష్టం ఇరాన్కు వాటిల్లిందని తెలిపింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య మరింతగా పరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇంత పెద్ద మెుత్తంలో తమ దేశ ఆస్తిని ధ్వంసం చేసిన వారినే పరోక్షంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలని పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతామని తెలిపింది.అయితే ఇరాన్ తొలుత నుంచి అమెరికాను పరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చల్లోనూ యుద్ద నష్టపరిహరం తన డిమాండ్లలో ఉంచింది. ఇంత పెద్దమెుత్తంలో ఆస్తి నష్టం జరగడంతో ఒక వేళ పరిహారం చెల్లించకపోతే ఇరాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
యూఏఈ సంచలన కామెంట్స్
యూఏఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. హర్ముజ్ జలసంధి మీద అధికారం కేవలం ఒక్క ఇరాన్కే లేదని తెలిపింది. అది ఏమి టెహ్రాన్ ఆస్తి కాదని తెలిపింది. హర్ముజ్ జలసంధిని విముక్తి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు యుఏఈ మద్దతిస్తుందని ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా హర్మూజ్ను బ్లాకేడ్ చేయడంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు అమెరికాను రిక్వెస్ట్ చేస్తున్నాయి. హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని సౌదీఅరేబియా అమెరికాను కోరింది.ఈ నేపథ్యంలో యూఏఈ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ జలసంధి కేవలం ఇరాన్ సొత్తు కాదని తెలిపింది. హర్మూజ్ను విముక్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు గల్ఫ్ దేశాలు అండగా నిలుస్తాయని పేర్కొంది. ఈ అంశమై బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడు సమావేశమైనట్లు తెలుస్తోంది.దేశ సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి గానీ ఇటువంటి దిగ్భందనాలు చేయడటం మంచిది కాదని యూఏఈ పేర్కొంది. ఈ విషయమై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో యూఏఈ సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది. అయితే అమెరికా విపరీత డిమాండ్ల వల్లనే చర్చలు విఫలమయ్యాయని ఆయన యూఏఈతో తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం అమెరికా సైతం హర్ముజ్ను బ్లాకేడ్ చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరాన్ పోర్టుల నుండి నౌకలు ఎటు కదలడం లేదు. దీంతో రోజుకు సరాసరిన రూ. 4 వేల కోట్ల రుపాయల నష్టం జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ
-
తగ్గేదేలే.. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్
-
అమెరికాకు ఇరాన్ సైన్యం వార్నింగ్..
-
హర్ముజ్ బ్లాకేడ్తో భారత్పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రిక్వెస్ట్లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
ఇరాన్-అమెరికా మళ్లీ చర్చలుంటాయా?
ఇటీవల పాకిస్థాన్లో జరిగిన అమెరికా- ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో మరో కీలక ముందడుగు పడే అవకాశముంది. జెనీవా వేదికగా త్వరలో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే ఈ అంశమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మరో విడత చర్చలకు అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తోంది. అయితే హర్ముజ్ను దిగ్భందించింది. దీంతో అమెరికా ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ పోర్టుల వైపు వెళ్లకుండా అమెరికా నౌకలును అడ్డగిస్తూ బ్లాక్డేను ప్రారంభించింది. అయితే దీనిపై ఇరాన్ సైతం గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.జేడీవాన్స్ మాట్లాడుతూ" ఇరాన్తో చర్చలకు ఇంకా ఆస్కారం ఉంది. యుద్ధం ఆగడం మా చేతుల్లో లేదు. బంతి ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉంది. ఇరాన్ దిగిరావాలి. ఇంకా సరళమైన ధోరణి ప్రదర్శించాలి". అని అన్నారు. జలసంధిలో ఇరాన్ నౌకలను అడ్డుకోవడం ఆర్థిక ఉగ్రవాదమేనని పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ కనుక అలా చేస్తే వారి నౌకలను బయిటకి వెళ్లకుండా చేస్తామని హర్ముజ్ వద్ద ఇరాన్ చర్యలను అడ్డుకుంటాం" అన్నారు. హర్ముజ్ విషయంలో ట్రంప్ నాయకత్వంలో అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా అమెరికా మీడియా కథనాల ప్రకారం ట్రంప్ సైతం చర్చలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీజ్ఫైర్ ఒప్పందం ముగిసే లోగా మరోదశ చర్చలు జరపాలని భావిస్తోన్నట్లు సమాచారం. కొన్ని అంతర్జాతీయ కథనాల ప్రకారం ఈ నెల 16 (గురువారం) నాడు ఇరు దేశాల భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరాన్ ఇంతవరకూ స్పందించలేదు. -
హర్ముజ్ బ్లాకేడ్.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు
ఇరాన్ పోర్టులకు నౌకలు చేరకుండా హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం.. మరోవైపు ఇరాన్ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే ఈ పరిణామం మరోవైపు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘‘మాకు ఇరాన్తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. మా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని మేము ఆశిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యను వ్యతిరేకించిన ఆయన.. హర్ముజ్ చైనాకు తెరిచే ఉంటుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం బ్లాకేడ్ ప్రకటన చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చే–వెళ్లే అన్ని నౌకలను అమెరికా సెంట్కామ్ తనిఖీ చేస్తుందని.. అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను అడ్డుకోవడం, దారి మళ్లించడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచే హర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైంది. అయితే ఈ బ్లాకేడ్ చైనీస్ యువాన్(కరెన్సీ) వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఉండి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా చైనాకు 40 శాతం చమురు, 30 శాతం ఎల్ఎన్జీ సరఫరా జరుగుతోంది. అందుకే హర్ముజ్ గూండా నిర్బంధం లేని రవాణా అంతర్జాతీయ సమాజానికి అవసరమని చైనా మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మద్దతు కూడా ప్రకటించింది. అమెరికా, చైనా ఇరాన్పై విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే రహస్యంగా ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని మొత్తుకుంటోంది. -
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నౌకలు ఇప్పటికే హర్ముజ్ను తమ ఆధీనంలోకి తీసుకోగా.. తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. -
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
-
పోప్ దుర్బలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి పోప్ను కూడా వదలడం లేదు. ఇరాన్పై యుద్ధాన్ని తప్పుబడుతూ పోప్ లియో–14 చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. లియో ఓ బలహీన పోప్ అంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టడమే గాక మీడియాతో మాట్లాడుతూ కూడా పోప్పై పదునైన విమర్శలకు దిగారు. అసలు తనవల్లే ఆయనకు పోప్ పదవి దక్కిందని చెప్పుకొచ్చారు! ఈ విమర్శలపై పోప్ కూడా దీటుగా స్పందించారు. శాంతి సందేశాన్ని విన్పించే విషయంలో ట్రంప్ యంత్రాంగానికి తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘దైవ సందేశాన్ని ట్రంప్ అర్థం చేసుకోవడం లేదు. నేను ఆయన్నో, ఇంకెవరినో నేరుగా విమర్శించడం లేదు. ట్రంప్తో వాదనకూ దిగదలచుకోలేదు. కానీ వాస్తవాలు చెప్పేందుకు మాత్రం ఎప్పుడూ వెనకాడబోను. ఒక్కటి మాత్రం నిజం. శాంతి స్థాపకులు మాత్రమే ఆశీర్వాదానికి పాత్రులు’’అన్నారు. వారి మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది! అమెరికా అధ్యక్షులకు, పోప్ స్థానంలో ఉన్నవారికి నడుమ అభిప్రాయ భేదాలు కొత్తేమీ కాకున్నా ఈ స్థాయి వాద ప్రతివాదాలు మాత్రం ఇదే తొలిసారి. ఇలాంటి పోప్ నాకొద్దు! పోప్గా లియో–14 సరిగా పని చేయడం లేదని ట్రంప్ ఆదివారం ట్రూత్ సోషల్ పోస్టులో ఆక్షేపించారు. ‘‘నేరాలపై స్పందించడంలో మరీ బలహీనుడు. ఇక ఆయన విదేశాంగ విధానమైతే మరీ దారుణం! ఇరాన్ వద్ద అణ్వాయుధమున్నా పర్లేదనుకునే, వెనెజువెలాపై అమెరికా దాడి చేయొద్దనుకునే, ఇలా అమెరికా అధ్యక్షుడినే విమర్శించే పోప్ నాకొద్దు! ఆయన మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారు. నేరాలను ఇష్టపడే వ్యక్తిలా కూడా కన్పిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త ఇంగిత జ్ఞానం వాడాలి. వామపక్షవాదానికి దన్నుగా నిలవడం మానుకోవాలి. లియో తీరు ఆయనకే గాక క్యాథలిక్ చర్చికి కూడా చాలా చేటు చేస్తోంది. ఆయన ఇప్పటికైనా రాజకీయ నాయకునిగా ప్రవర్తించడం మాని గొప్ప పోప్గా రాణించడంపై దృష్టి పెడితే మంచిది! నేనైతే పోప్ లియోకు అస్సలు అభిమానిని కాను. నావల్లే ఆయనకు పోప్ పదవి దక్కింది. లియో పేరు తొలుత చర్చి పరిశీలనలో కూడా లేదు. నన్ను ఎదుర్కోవాలంటే ఆ పదవిలో ఒక అమెరికన్ ఉండాలనే భావనతోనే పోప్గా నియమించింది’’అంటూ తూర్పారబట్టారు. ఇరాన్పై ట్రంప్ యుద్ధాన్ని పోప్ తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నారు. ‘‘తాము సర్వశక్తిమంతులమని కొందరిలో నెలకొన్న భ్రమలే ఇరాన్పై యుద్ధానికి కారణం. కానీ యుద్ధాలకు దిగేవారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు’’అని గతంలోనూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాగరికతనే నాశనం చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను కూడా తీవ్రంగా తప్పుబట్టారు. క్రీస్తు మాదిరిగా దివ్య శక్తులతో అమెరికాకు తాను హీలింగ్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఏఐ ఆధారిత ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. -
హార్మూజ్ దిగ్బంధం
కైరో/దుబాయ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. చర్చల వైఫల్యంపై మండిపడుతున్న అమెరికా మరోసారి ఇరాన్పై తీవ్ర చర్యలకు దిగుతోంది. సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్ జలసంధితో పాటు ఇరాన్కు చెందిన ఓడరేవులన్నింటినీ దిగ్బంధించింది. హార్మూజ్ గుండా ఇరాన్ ఓడల రాకపోకలను కూడా అడ్డుకుంటోంది. చర్చలు విఫలమైతే హార్మూజ్ను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారమే హెచ్చరించడం తెలిసిందే. అమెరికా నావికా దళం సోమవారం సాయంత్రమే రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతాలన్నింటినీ పూర్తిస్థాయిలో పహారా కాస్తోంది. ఏ దేశానికి చెందిన నౌకలూ ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు జరపడానికి వీల్లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఇరానేతర రేవుల నుంచి వచ్చే నౌకలను మాత్రం హార్మూజ్ గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని వెల్లడించడం విశేషం! ఇరాన్ ‘ఫాస్ట్ అటాక్’షిప్లు గనక తమ నావికా దళం దిగ్బంధించిన ప్రాంతాల సమీపంలోకి వస్తే మరో ఆలోచనే లేకుండా వాటిని తక్షణం పేల్చేస్తామని ట్రంప్ అల్టిమేటమిచ్చారు. అమెరికా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. అంతేగాక ట్రంప్ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ కూడా బుట్టదాఖలయ్యేలా కన్పిస్తోంది. దాని గడువు ఏప్రిల్ 22 దాకా ఉంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ద్వారా అమెరికా సాధించబోయేది ఏమిటో అర్థం కావడం లేదంటూ అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అగ్ర రాజ్యం తాజా చర్యలపై ఇరాన్ మండిపడింది. గల్ఫ్ ప్రాంతంలోని ఓడరేవులన్నింటినీ పూర్తిస్థాయిలో లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతానని తీవ్రంగా హెచ్చరించింది. ‘‘పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర ప్రాంత రక్షణ బాధ్యత ఈ ప్రాంతంలోని ప్రతి దేశానిదీ. మాపై దాడులు, దిగ్బంధాలు జరిగితే ఈ ప్రాంతంలోని ఏ రేవూ సురక్షితం కాబోదు’’అని ఇరాన్ సైన్యం, రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) స్పష్టం చేశాయి. హార్మూజ్ ఇప్పటికీ పూర్తిగా ఇరాన్ అదుపులోనే ఉన్నట్టు చెప్పుకొచ్చాయి. ‘ట్రంప్కు యుద్ధమే కావాలనుకుంటే మేం సిద్ధమే’అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. అంతేగాక ‘ఆటలో ఇప్పటిదాకా వాడని సరికొత్త ‘వ్యూహా’లను ఇకపై బయటికి తీస్తా’మంటూ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఎబ్రాహీం రజెయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా నుంచి అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిందేనని ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగం చీఫ్ ఎస్మాయిల్ ఖానీ ఎద్దేవా చేశారు. గత వారం కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి 40 వాణిజ్య నౌకలు హార్మూజ్ను దాటాయి. అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధానికి తెర దించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఇరాన్ గమ్మత్తైన ‘గణిత’పోస్టు హార్మూజ్ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు గమ్మత్తైన గణిత సమీకరణాలతో ఎక్స్లో పోస్టు పెట్టింది. ‘‘హార్మూజ్ దిగ్బంధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతాయి. తర్వాత జరిగే చైన్ రియాక్షన్ వల్ల చూస్తుండగానే అవి చుక్కలనంటుతాయి’’అంటూ వాటి అర్థాన్ని కూడా వివరించింది!‘హార్మూజ్’పై భేటీ.. బ్రిటన్, ఫ్రాన్స్ వెల్లడి లండన్/పారిస్: పశ్చిమాసియా యుద్ధానికి తెర దించి హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిపించే ప్రయత్నాలను బ్రిటన్, ఫ్రాన్స్ ముమ్మరం చేశాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ఈ అంశంపై వారిద్దరూ ఫోన్లో చర్చలు జరిపారు. అమెరికా చేపట్టిన హార్మూజ్, ఇరాన్ రేవుల దిగ్బంధానికి బ్రిటన్ మద్దతివ్వబోదని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.100 మంది హెజ్బొల్లా ఫైటర్ల మృతి! బీరూట్: ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా దళాలు సోమవారం లెబనాన్లో పరస్పర దాడులకు దిగాయి. దక్షిణాదిన వ్యూహాత్మకంగా కీలకమైన కొండ ప్రాంత పట్టణం బింట్ బెల్ వద్ద ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బొల్లా తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. అయితే పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తున్నట్టు లెబనాన్ మీడియా తెలిపింది. బింట్ బెల్ వద్ద కనీసం 100 మంది హెజ్బొల్లా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. లెబనాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. రాజధాని బీరూట్పై దాడులకు ఇజ్రాయెల్ విరామం ఇచ్చింది. మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ నడుమ ప్రత్యక్ష చర్చలు జరగనుండటం తెలిసిందే. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు వాషింగ్టన్లో చర్చలు జరపనున్నారు. అయినా లెబనాన్పై దాడులు మాత్రం ఆగబోవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. చర్చలకు సిద్ధమే: ఇరాన్న్యూఢిల్లీ: అమెరికాతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధమేని భారత్లో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ప్రకటించారు. అయితే, ‘అమెరికా అక్రమ డిమాండ్లు చేయరాదు. ఇరాన్ షరతులకు అంగీకరించాలి’అని పేర్కొన్నారు. తమ శక్తి ఏమిటో అమెరికాకు బాగా తెలుసని ఆయనన్నారు. హార్మూజ్ ఇరాన్దేనని స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాలపై తీవ్ర చర్యలు: అమెరికా ఇరాన్కు చెందిన నిషేధిత చమురును కొనుగోలు చేసినా, విక్రయించినా తీవ్ర చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు/దేశాలను కోర్టుల్లో నిలబెట్టి తీరుతామని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ప్రకటించారు. -
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ను చుట్టుముట్టిన యుద్ధనౌకలు!
ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాల చుట్టూ సముద్ర నిర్బంధం అమలు చేయడానికి యునైటెడ్ స్టేట్స్ 15కు పైగా యుద్ధనౌకలను మోహరించింది. ఈ ఆపరేషన్లో భాగంగా.. అరేబియా సముద్రంలో F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్లు, MV-22 ఓస్ప్రేలను నడుపుతున్న యాంపిఫిబియస్ దాడి నౌక USS ట్రిపోలి (LHA 7) కూడా ఉంది.ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాలలోకి, అరేబియా గల్ఫ్.. ఒమన్ గల్ఫ్తో సహా అక్కడ నుంచి బయలుదేరే అన్ని నౌకలపై 1400 GMTకి దిగ్బంధనం నిష్పక్షపాతంగా అమలు చేయనున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధృవీకరించింది. అయితే.. ఇరాన్ యేతర లేదా ఇతర దేశాలకు చెందిన పోర్టులకు వెళ్లే నౌకలు హోర్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని అమెరికా స్పష్టం చేసింది.USS Tripoli (LHA 7) conducts night flight operations while sailing in the Arabian Sea. Tripoli is designed without a traditional well deck, which allows for more F-35B Lightning II stealth fighters, MV-22 Ospreys, helicopters, and extra maintenance space. During peak operations,… pic.twitter.com/zjQO1nOcmK— U.S. Central Command (@CENTCOM) April 13, 2026అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు యూఎస్ఎస్ ట్రిపోలి (ఎల్హెచ్ఏ 7) రాత్రిపూట విమాన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ నౌకలో లేటెస్ట్ F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్లు, MV-22 ఓస్ప్రే విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ నౌక ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ నౌకల లాగా కాకుండా ఎక్కువ యుద్ధ విమానాలను మోయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది 20కు పైగా F-35B విమానాలను మోహరించగలదు.ఇదీ చదవండి: వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సందర్భంలో కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్కు చెందిన చిన్న వేగవంతమైన యుద్ధ పడవలు ఈ నిర్బంధానికి దగ్గరగా వస్తే వాటిని వెంటనే నాశనం చేస్తామని తెలిపారు. ఇరాన్ నౌకాదళంలోని పెద్ద భాగం ఇప్పటికే యుద్ధంలో నాశనం అయిందని కూడా ఆయన పేర్కొన్నారు. -
వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!
పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (సోమవారం) తగ్గుదల వైపు పయనించింది. దీంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. దీనికి కారణం యూఎస్ డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు అని తెలుస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు మరో కారణం అయింది.శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా - ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ సంఘటనల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్కు 100 డాలర్లు దాటాయి.చమురు ధరలు పెరగడం అంటే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. అందువల్ల బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది.2026 ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే కియోసాకి వంటి విశ్లేషకులు గోల్డ్ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెడితే ధనవంతులవుతారని చెబుతున్నారు. -
‘హార్మూజ్ వద్ద భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదు’
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించాయని వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ కష్టకాలంలో భారత్-ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాలు ఒకే రకమైన ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా, ఇరాన్కు టోల్ చెల్లింపులు చేసే నౌకలను అడ్డుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.“ఇప్పటి వరకు ఇరాన్ ఏమైనా వసూలు చేసిందా? అని మీరు భారత ప్రభుత్వాన్ని అడగవచ్చు” అని మహమ్మద్ ఫతాలి ఇరాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.ఎల్పీజీ తీసుకెళ్తున్న 9 నౌకలు బయలుదేరేందుకు ఎలాంటి టోల్ చెల్లించలేదని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపింది. మరోవైపు, పర్షియన్ గల్ఫ్లో 15 భారత జెండా ఉన్న నౌకలు ఇంకా ఇరుక్కుపోయే ఉన్నాయని భారత్ చెబుతోంది. భారత్ ముడి చమురు, ఎల్పీజీ సరఫరాల్లో సుమారు సగం హార్మూజ్ జలసంధి గుండా వెళ్తుంది.కాగా, అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను అనుమతించలేదు. తమ మిత్రదేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చింది.నౌకలు వెళ్లాలంటే తమ అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటిని నాశనం చేస్తామని ఇరాన్ చెప్పింది. వాటి సురక్షిత ప్రయాణం కోసం ఫీజులు వసూలు చేస్తామని కూడా తెలిపింది. అయితే, టోల్ చెల్లించడం సరైన మార్గం కాదని ట్యాంకర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఇంటర్టాంకో సంస్థకు చెందిన ఫిలిప్ బెల్చర్ చెప్పారు. -
ఇరాన్ సముద్ర మార్గాల్లో అమెరికా ఆపరేషన్ ప్రారంభం
వాషింగ్టన్: ఇరాన్ సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ పోర్టులను అమెరికా సైన్యం నిర్బంధించడం ప్రారంభించింది. అంతేగాక, ఇరాన్ నౌకలకు ట్రంప్ హెచ్చరిక జారీచేశారు. “గల్ఫ్లో మా నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఏ నౌక వచ్చినా దాన్ని వెంటనే నాశనం చేస్తాం” అని అన్నారు.ఇరాన్ నౌకాదళం ఇక పనిచేయలేని స్థితిలో ఉందన్నట్లు ట్రంప్ అతిశయోక్తితో ట్రూత్లో పోస్ట్ చేశారు. “ఇరాన్ నౌకాదళం సముద్ర అడుగునే ఉంది. 158 నౌకలు పూర్తిగా నాశనమయ్యాయి. మేము దాడి చేయని వాటి సంఖ్య తక్కువగా ఉంది. ఇరాన్ వాటిని ‘ఫాస్ట్ అటాక్ షిప్స్’ అని పిలుస్తోంది.. కానీ, అవేమో చిన్న నౌకలు. అవి ప్రమాదమని మేము భావించడంలేదు. హెచ్చరిక చేస్తున్నాను.. ఈ నౌకల్లో ఏదైనా మేము చేపట్టిన మా నిర్బంధానికి దగ్గరగా వస్తే, సముద్రంలో పడవలపై మత్తు పదార్థాల వ్యాపారులను ఎదుర్కొనే విధానంలో వీటిని కూడా ఎదుర్కొని వెంటనే నాశనం చేస్తాం. ఈ చర్య వేగంగా, క్రూరంగా ఉంటుంది. పీఎస్ సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి వచ్చే మత్తు పదార్థాల్లో 98.2% ఆగిపోయాయి” అని ట్రంప్ తెలిపారు.కాగా, డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిని నిర్బంధించడానికి వేసుకున్న ప్లాన్లో తాము పాల్గొనబోమని నాటో మిత్ర దేశాలు సోమవారం తెలిపాయి. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే జోక్యం చేసుకుంటామని సూచించాయి, ఈ నిర్ణయం ట్రంప్కు అసహనం కలిగించి, కూటమిలో ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది.


