ఇరాక్‌లో జంట పేలుళ్లు: 31 మంది మృతి | Baghdad blasts: Ice cream shop among attack targets, 31 killed | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో జంట పేలుళ్లు: 31 మంది మృతి

May 31 2017 1:23 AM | Updated on Sep 5 2017 12:22 PM

ఇరాక్‌లో జంట పేలుళ్లు: 31 మంది మృతి

ఇరాక్‌లో జంట పేలుళ్లు: 31 మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్లలో 31 మంది మరణించారు. తొలిదాడిలో...సోమవారం రాత్రి

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్లలో 31 మంది మరణించారు. తొలిదాడిలో...సోమవారం రాత్రి కరాదాలో రద్దీగా ఉండే ఐస్‌క్రీం దుకాణంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో 17 మంది చనిపోగా, 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు దుకాణం బయట సాయం కోసం అర్థిస్తున్న దృశ్యాలు కనిపించాయి. రెండో సంఘటనలో... మంగళవారం షవాకా ప్రాంతంలోని ప్రభుత్వ పింఛను కార్యాలయం సమీపంలో బాంబులు అమర్చిన కారు పేలడంతో 14 మంది మరణించగా 37 మంది గాయాలపాలయ్యారు. రెండు దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్‌  ప్రకటించింది. షియా ముస్లింలే లక్ష్యంగా పేలుళ్లు జరిపినట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement