న్యూఢిల్లీ: కాశ్మీరి గేట్ సమీపంలోని బస్సు టెర్మినల్ వద్ద స్కూల్ బస్ మంగళవారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారి విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. విద్యార్థులను బస్సులోని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. షహదార నుంచి తీస్ హాజారీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.