హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి ఐదుగురికి తీవ్రగాయాలు | Five boys suffer burn injuries during Muharram procession | Sakshi
Sakshi News home page

హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి ఐదుగురికి తీవ్రగాయాలు

Nov 5 2014 4:00 PM | Updated on Sep 2 2017 3:55 PM

హైటెన్షన్ వైర్ తగిలి ఐదుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.

అతి ప్రమాదకరమైన ఓ హైటెన్షన్ విద్యుత్ వైర్ తగలడంతో ఐదుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నొ జిల్లాలో  మంగళవారం చోటుచేసుకుంది. మొహరం పండుగను పురస్కరించుకుని 'టాజియా' (పీర్ల పండుగ) ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఈ ఘటన సంభవించినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.

ఊరేగింపులో పాల్గొన్న చిన్నారులు పీర్ల జెండాను పట్టుకుని వెళుతుడంగా గంగా రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ సమీపంలో లోహాపు స్తంభానికి ఆ జెండా చిక్కుకుంది. అదే స్తంభానికి ఉన్న హైటెన్షన్ వైర్కు జెండా తగలడంతో విద్యుత్ ప్రసరించి విద్యుద్ఘాతం ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ తీగలు నుంచి ఎక్కువ మొత్తంలో విద్యుత్ ప్రసరిస్తుంటోంది. విద్యుత్ తాకిడికి ఆ ఐదుగురి శరీరం బాగా కాలిపోయింది. వారి పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం కాన్పూర్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement