నా పడవ మునగదు: మంఝి | In troubled waters, Bihar CM says 'Manjhi's boat never sinks' | Sakshi
Sakshi News home page

నా పడవ మునగదు: మంఝి

Published Sun, Feb 8 2015 2:25 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

నా పడవ మునగదు: మంఝి - Sakshi

నా పడవ మునగదు: మంఝి

న్యూఢిల్లీ: తన పడవ ఎన్నటికీ మునగబోదని ఉద్వాసనకు గురైన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝి దీమా వ్యక్తం చేశారు. తన సీఎం పదవి ఊడిపోయినప్పటికీ ఆయన ధైర్యంగా కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆదివారం ఆయన ఢిల్లీ వచ్చారు. సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రిని కలుస్తారు. బీహార్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై ప్రధానితో మంఝి చర్చించనున్నారు.

ఈ సందర్భంగా తన రాజకీయ భవితవ్యంపై విలేకరులు ప్రశ్నించగా.. 'మంఝి పడవ మునగబోదు' అంటు ఆయన సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ భేటీకి మంఝి హాజరుకావడాన్ని జేడీ(యూ) ఆమోదించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement