దుబాయ్: ఒమన్ లోని సుర్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత మహిళ ఒకరు మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతురాలు ఖదీజగా గుర్తించారు. గాయపడిన వారిలో ఆమె కుమారుడు, కారు డ్రైవర్, మరో ప్రయాణికురాలు ఉన్నారు. ఖదీజ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సుర్ నగరంలోని భారత సామాజిక కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.
ఒమన్ లో భారత మహిళ మృతి
Published Thu, Jan 29 2015 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement