Indian woman
-
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
-
యూకేలో భారత సంతతి మహిళకు అవమానం
లండన్లో భారత మహిళకు (Indian Woman) అవమానం జరిగింది. ఒక బ్రిటిషర్ ఆమె పట్ల జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. లండన్ (London) నుంచి మాంచెస్టర్ వెళ్తున్న రైలులో ఆదివారం జరిగిన ఈ ఘటన తాలుకూ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. భారత సంతతికి చెందిన 26 ఏళ్ల గాబ్రియెల్ ఫోర్సిత్ రైలులో ఇంటికి వెళ్తూ తోటి ప్రయాణికుడితో పలు అంశాలపై చర్చిస్తున్నారు. వలసదారులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలో పని చేశానని ఫోర్సిత్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో అదే బోగీలో మద్యం సేవిస్తున్న ఓ బ్రిటిషర్ ఆమె మాటలకు అడ్డుతగి లారు. తోటి రైలు ప్రయాణికులను ‘వలసదారులు’గా అభివర్ణిస్తూ నీచమైన దూషణలకు దిగాడు. ఫోర్సిత్ను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంగ్లాండ్ (England) చారిత్రక విజయాల గురించి గొప్పగా చెప్పాడు. ‘‘నువ్వు ఇంగ్లాండులో ఉన్నావు. కానీ ఇంగ్లండ్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఆంగ్లేయులు ప్రపంచాన్ని జయించారు. భారత్ను కూడా జయించాం. కానీ మాకు వద్దంటూ తిరిగి ఇచ్చేశాం. ఇలాంటి దేశాలు చాలానే ఉన్నాయి. మీది సార్వభౌ మాధికారమా’’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్య లు చేశారు. వీడియో చివర్లో ఆ వ్యక్తి ఫోర్సిత్తో ‘‘నేను నిన్ను కొట్టబోవడం లేదు’’ అని అన్నాడు. అంతేకాదు.. ఆ ఘటనను వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. అతని జాత్యహంకార దూషణను ఫోర్సిత్ కూడా చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘అతని నోటి నుంచి వచ్చిన వలస అనే పదం, బాడీ లాంగ్వేజ్, కోపం, దూకుడు చూస్తే చాలా బాధేసింది. ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నేను శ్వేతజాతీయేతరురాలిని. ఇదే నా గుర్తింపు. అందుకు నేను గర్విస్తున్నా. జాత్యహంకార వీడియోను పోస్ట్చేసినందుకు శ్వేతజాతీయులు ఎందరో నన్ను ఆన్లైన్లో ట్రోల్ చేశారు. వేధింపులు ఎదుర్కొన్నా. నాకు తెలియని బూతులు తిట్టారు. బ్రిటన్లో శ్వేతజాతీయేతర వ్యక్తుల హక్కులపైనే నా ఆందోళన అంతా’’అని ఫోర్సిత్ తెలిపారు.చదవండి: ఫ్రాన్స్ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్తఈ ఘటనపై బ్రిటన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘వలస వచ్చిన భారతీయుడి కూతురిగా బతకడం, నా దేశ మూలాలంటే నాకెంతో ఇష్టం. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా కోసం, శ్వేతజాతీయేతర ప్రజల పక్షాన నిలబడి పోరాడతా. నాకు శ్వేతజాతీయేతర వర్గాల నుంచి ఇప్పుడు పూర్తి మద్దతు లభిస్తోంది’’అని ఆమె పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట అవంతి వెస్ట్ కోస్ట్ రైలులో ఓ శ్వేతజాతి మహిళ ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపొండి’ అని ఒక భారతీయ దంత వైద్యుడిని దూషించడం చర్చనీయంశమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సేవా నిరతికి ప్రతీక.. అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్
భారతదేశంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన తొలి మహిళ, అలాగే ఆధునిక వైద్యశాస్త్రంలో పట్టా గడించిన ఏడవ మహిళ అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్. 1874 జూలై 17న బెల్గామ్లో జన్మించిన ఆమె తండ్రి క్రైస్తవాన్ని స్వీకరించిన జొరాస్ట్రియన్ కాగా, తల్లి ఆదివాసీ. అలీస్ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందిన తర్వాత, మన దేశపు తొలి తరం మహిళా న్యాయవాదులలో ఒకరైన ఈమె అక్క కొర్నేలియా స్వరాబ్జీ ప్రోత్సాహంతో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో వైద్యశాస్త్ర పట్టాను 1905లో సాధించారు.భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత బహవల్పూర్లోని జనానా హాస్పిటల్లో డాక్టర్గా చేరారు. అక్కడే 1906లో బ్రిటిష్ మిషనరీ డాక్టర్ థియొడర్ లైటన్ పెన్నెల్ను కలవడం, 1908లో పెళ్లి చేసుకోవడం సంభవించింది. పిమ్మట ఢిల్లీలోని విక్టోరియా హాస్పిటల్ బాధ్యురాలిగా తరలి వచ్చారు. 1914–18 మధ్య కాలంలో సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బొంబాయి ప్రెసిడెన్సీలోని మహాబలేశ్వర్ దగ్గర సైనికుల ఆరో గ్యాన్ని కాపాడిన, పర్యవేక్షించిన తొలి మహిళా వైద్యులలో ఈమె కూడా ఒకరు.అఫ్గానిస్తాన్లోని గిరిజన తెగల వారితో జీవనం గడిపిన క్రిస్టియన్ మిషనరీ మిస్టర్ పెన్నెల్, తన తల్లి ఇచ్చిన సొమ్ముతో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న) బన్నులో మిషనరీ ఆసుపత్రిని ప్రారంభించారు. దాంతో అలీస్ పెన్నెల్ కూడా ఈ ఆస్పత్రికి తరలి వెళ్లారు. ఎంతో గౌరవ భావంతో వైద్య వృత్తిని కొనసాగించిన అలీస్ తన భర్తతో కలిసి ఉర్దూ, పష్తూన్ భాషలను నేర్చుకొని అక్కడి పఠాన్ల, పష్తూన్ల హృదయాలను చూరగొన్నారు. అంతే కాదు ఆ ప్రాంతాలలో ఈ దంపతులు జానపద నాయకులుపొందే గౌరవాలను పొందగలిగారు. ఈ సేవలకు ఆమె ‘కైజర్–ఇ–హింద్’ బంగారు పతకాన్ని కూడా పొందారు.చదవండి: అంతర్జాతీయ జీవ పరిణామ దినం.. ఎందుకు జరుపుకుంటారంటే?అయితే ఆమె భర్త 44 ఏళ్ల వయసులో చనిపోవడం విషాదం. ఆసుపత్రిలో పదవీ విరమణ చేసిన తర్వాత అలీస్ ఢిల్లీకి తరలివచ్చి సమాజ, ఆరోగ్య సేవా కార్యక్రమాలలో మునిగి పోయారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కాగానే లండన్లో స్థిరపడ్డారు. తన 74వ ఏట 1951 మార్చి 7వ తేదీన అలీస్ మాడే సొరాబ్జీ పెన్నెల్ అనారోగ్యంతో కనుమూశారు.– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? యువతి పోస్ట్ వైరల్
ఉద్యోగం కావాలంటే అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోక తప్పదు. సంబంధిత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే టీం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగ అర్హతలు, సామర్థ్యం, అనుభవం, ఫైనల్గా జీతం లాంటి ప్రశ్నలు సాధారణంగా ఉంటాయి. కానీ ఒక మహిళా అభ్యర్థి తన అనుభవాన్ని సోషల్మీడియాలో షేర్ చేసింది. ఈ వింత ప్రశ్న ఎదురు కావడంతో షాక్ అ అయ్యానంటూపేర్కొంది. దీంతో ఇది వైరల్గా మారింది.యూకేకు చెందిన భారత సంతతికి చెందిన జాన్హవి జైన్ తన అనుభవాన్ని ఎక్స్లో షేర్ చేసింది. దీని ప్రకారం ఓ జాబ్ ఇంటర్వ్యూలో సదరు కంపెనీ హెచ్ఆర్ ఉద్యోగి వయసు ఎంత అని అడిగారు. పాతికేళ్లు అని తను జవాబు చెప్పింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందాఅని అడగడంతో అవాక్కయ్యానంటూ చెప్పుకొచ్చింది జాన్హవి. తాను విన్నది నిజమేనా? లేక పొరబడ్డానా? అని ఒక్క క్షణం గందరగోళంలో పడిపోయానని తెలిపింది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు లక్ష 20వేల వ్యూస్, వందల కమెంట్లు వెల్లువెత్తాయి. భారత దేశంలో తమకూ ఇలాంటి అనుభవం ఎదురయ్యాయని చాలామంది సమాధానం ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి, పిల్లల ప్లానింగ్ గురించి కూడా అడుగుతారు కొన్ని మారవు అంతే కొందరు, ‘‘ఏం చేస్తాం మనం, గర్భసంచులతో పుట్టాం కదా, మనకి కొన్నితప్పవు’’ అని ఒక మహిళ వ్యాఖ్యానించారు. ‘‘నాకు ఇందులో తప్పు ఏమీ కనిపించడం లేదు. ఇది వారి ప్రాజెక్ట్ , టైమ్లైన్ కోసం. ఎక్కువ పనిచసేవాళ్లు కావాలి. వారి పనిని ప్రభావితం చేసేలా కుటుంబ బాధ్యతలు వద్దనుకుంటారు" అని మరో వినియోగదారు మద్దతివ్వడం గమనార్హం.This HR of an Indian company asked me how old I am and when I said 25, they asked me if I am looking to marry soon??? Is this still happening??— Janhavi Jain (@janwhyy) November 19, 2024 -
Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..!
దాదాపు ఏడాదిన్నర క్రితం ఆమె.. జీవితంలో అతి పెద్ద సవాల్ను ఎదుర్కొంది. అయితే అది రెజ్లింగ్ మ్యాట్పై కాదు.. ఢిల్లీ వీథుల్లో.. కొన్ని రోజుల పాటు ఫుట్పాత్పై పడుకోవడం.. పోలీసు దెబ్బలు, ఆపై అరెస్ట్, బహిరంగంగా అవమానాలు.. ఆన్లైన్లో చంపేస్తామనే బెదిరింపులు.. ప్రభుత్వ పెద్దల అబద్ధపు హామీలు.. జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, ఒక దశలో సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేయాల్సిన స్థితికి చేరడం.. ఇక కెరీర్ ముగిసినట్లే, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసినట్లే అనిపించిన క్షణం.. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే!సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిని తప్పించి తమకు న్యాయం చేయమని కోరడం వల్లే! కెరీర్ను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం వెంటనే సత్ఫలితాన్నివ్వలేదు. పైగా భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మళ్లీ రెజ్లింగ్పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయంతో ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా పట్టుదల వీడలేదు. గాయం నుంచి కోలుకొని మళ్లీ పోరాడింది.ఆరు నెలలు ముగిసేలోగా తనేంటో నిరూపిస్తూ వరుస విజయాలు అందుకుంది. దాంతో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. వరుసగా మూడో ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా రెజ్లర్గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. ఇప్పటికే వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ పతకాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న వినేశ్.. ఒలింపిక్స్ పతకంతో కెరీర్ను పరిపూర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.రియో ఒలింపిక్స్లో గాయపడి..‘గాయాలు నాకు కొత్త కాదు. కెరీర్లో ఎన్నోసార్లు వాటితో ఇబ్బంది పడ్డాను. కానీ శస్త్ర చికిత్సలతో కోలుకొని మళ్లీ మ్యాట్పై అడుగు పెట్టగలిగాను. ఇప్పుడు తగిలిన గాయం మాత్రం చాలా పెద్దది. నేను కాలు విరిగినప్పుడు కూడా బాగానే ఉన్నాననిపించింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగిపోయింది’ అంటూ ఢిల్లీ ఉదంతం తర్వాత కన్నీటితో వినేశ్ ఫొగాట్ చేసిన వ్యాఖ్య ఇది.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సహచరులు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్లతో కలసి వినేశ్ నిరసన చేపట్టింది. అయితే బ్రిజ్భూషణ్ అధికార పార్టీ ఎంపీ కావడంతో వారికి ఆశించిన మద్దతు లభించలేదు. దానికి తోడు తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు.ఈ పోరాటం ముగిసిన తర్వాత మళ్లీ ఆటపై అడుగు పెట్టేందుకు చేసిన క్రమంలో విమర్శలు ఇంకా తీవ్రమయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్కు హాజరు కాకుండా తన సీనియారిటీని ఉపయోగించి అడ్డదారిలో ఒలింపిక్స్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రాక్టీస్ కొనసాగించాల్సిన సమయంలో ఈ మనోవేదన. కానీ వినేశ్ బేలగా మారిపోలేదు. మరింత బలంగా నిలబడింది. గతంలోలాగే రెట్టింపు శ్రమించి మ్యాట్పైనే సత్తా చాటింది.2018 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భం..రెజ్లింగ్ కుటుంబం నుంచి వచ్చి..‘ఫొగాట్ సిస్టర్స్’.. అని వినగానే భారత క్రీడా, సినిమా అభిమానుల దృష్టిలో దంగల్ సినిమా కదలాడుతుంది. మాజీ రెజ్లర్, కోచ్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత విశేషాలతో ఆ సినిమా రూపొందింది. సినిమాలో ప్రధాన పాత్రలైన గీత, బబితలతో పాటు రీతూ, సంగీత కూడా మహావీర్ సింగ్ కూతుళ్లే. అతని సోదరుడైన రాజ్పాల్ ఫొగాట్ కూతురే వినేశ్. ఆమెకు ప్రియంకా అనే సోదరి కూడా ఉంది. తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి అనూహ్యంగా మరణించారు. ఆ తర్వాత పెదనాన్న వద్దే వినేశ్ కూడా రెజ్లింగ్లో ఓనమాలు నేర్చుకుంది. తన కజిన్ గీత కంటే వినేశ్ ఆరేళ్లు చిన్నది. గీత జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వస్తున్న దశలో వినేశ్ రెజ్లింగ్లోకి ప్రవేశించింది. అమ్మాయిలపై వివక్ష చూపించడంలో అగ్రస్థానంలో ఉండే హరియాణా రాష్ట్రంలో అందరిలాగే తాను కూడా ఈ ఆటలో ప్రవేశించే ముందు సూటిపోటి మాటలు ఎదుర్కొంది. కానీ పెదనాన్న అండతో వాటన్నంటినీ వెనక్కి తోసి రెజ్లింగ్లో తన పట్టును చూపించింది. జూనియర్, యూత్ స్థాయిలో వరుస విజయాలతో ఆపై వినేశ్ దూసుకుపోయింది. 2013లో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరిగిన యూత్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రజతపతకం గెలుచుకోవడంతో వినేశ్ అందరి దృష్టిలో పడింది.సీనియర్ స్థాయిలో విజయాలతో..న్యూఢిల్లీలో 2013లో ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ జరిగింది. 19 ఏళ్ల వినేశ్ మొదటిసారి అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. క్వార్టర్స్ వరకు చేరి అక్కడ ఓడినా.. రెపిచెజ్ రూపంలో మరో అవకాశం దక్కింది. ఇందులో థాయిలండ్ రెజ్లర్ శ్రీప్రపను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆమె సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఇది ఆరంభం మాత్రమే. వినేశ్ అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆసియా చాంపియన్షిప్లో ఆమె మరో 3 కాంస్యాలు, 3 రజతాలు, ఒక స్వర్ణం గెలుచుకుంది. తన సోదరీమణులను దాటి వారికంటే మరిన్ని పెద్ద విజయాలతో వినేశ్ పైకి దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక మూడు ఈవెంట్లలో ఆమె పతకాలు గెలుచుకోవడం విశేషం. వరుసగా మూడు కామన్వెల్త్ (2014, 2018, 2022)క్రీడల్లో వినేశ్ స్వర్ణపతకాలు గెలుచుకుంది. ఆపై ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన ఆమె తర్వాతి క్రీడలకు (2018) వచ్చేసరికి స్వర్ణంతో మెరిసింది. ఇక 2019, 2022 వరల్డ్ చాంపియన్షిప్లలో వినేశ్ గెలుచుకున్న కాంస్య పతకాలు ఆమె ఘనతను మరింత పెంచాయి.ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా..2016 రియో ఒలింపిక్స్లో జరిగిన ఘటన వినేశ్ కెరీర్లో ఒక్కసారిగా విషాదాన్ని తెచ్చింది. ఇస్తాంబుల్లో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో గెలిచి అమిత ఉత్సాహంతో ఆమె ఒలింపిక్స్లోకి అడుగు పెట్టింది. చక్కటి ఆటతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. అయితే 21 ఏళ్ల వినేశ్ ఒలింపిక్స్ పతకం కలలు అక్కడే కల్లలయ్యాయి. చైనాకు చెందిన సున్ యానన్తో ఆమె ఈ మ్యాచ్లో తలపడింది. బౌట్ మధ్యలో ఆమె కుడి మోకాలుకు తీవ్ర గాయమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె మ్యాట్పైనే ఏడ్చేసింది.స్ట్రెచర్పై వినేశ్ను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ మరింత ప్రేరణ పొందింది. శస్త్రచికిత్స, ఆపై రీహాబిలిటేషన్ తర్వాత మళ్లీ బరిలోకి దిగి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో 2021 టోక్యో ఒలింపిక్స్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. అప్పుడే అద్భుత ఫామ్లో ఉన్న ఆమె టాప్ సీడ్గా అడుగు పెట్టింది.పారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించి.., సర్జరీ తర్వాత..అయితే మరోసారి నిరాశను కలిగిస్తూ రెండో రౌండ్లో వెనుదిరిగింది. ఈ మెగా ఈవెంట్ వైఫల్యం తర్వాత జరిగిన ఘటనలు ఆమెను మానసికంగా మరింత కుంగిపోయేలా చేశాయి. ఓటమి తర్వాత వినేశ్పై క్రమశిక్షణా చర్యలు అంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ సస్పెన్షన్ విధించింది. టీమ్కి ఇచ్చిన యూనిఫామ్ను ధరించకుండా మరో లోగో వాడిందని, గేమ్స్ విలేజ్లో కాకుండా బయట ఉందని, భారత జట్టు సహచరులతో కలసి సాధన చేయలేదని ఆరోపణలు వచ్చాయి.అదృష్టవశాత్తు ఫెడరేషన్ కొద్ది రోజులకే సస్పెన్షన్ను ఎత్తివేసింది. గత ఏడాది ఆగస్టులో ఆమె మళ్లీ గాయపడింది. ఎడమ మోకాలుకు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయమైంది. దానికి మళ్లీ శస్త్ర చికిత్స, రీహాబిలిటేషన్.. ఆపై మ్యాట్పై పోరుకు సిద్ధమైంది. అన్నింటికి మించి ఒలింపిక్స్ కోసం వెయిట్ కేటగిరీ మారాల్సి రావడం ఆమెకు పెద్ద సవాల్ అయింది. సాధారణంగా రెజ్లింగ్లో వెయిట్ కేటగిరీ మారడం అంత సులువు కాదు. పైగా తక్కువకు మారడం మరీ కష్టం.ఆట ఆరంభంనుంచి ఆమె 53 కేజీల విభాగంలోనే పోటీ పడింది. అయితే వేర్వేరు కారణాలు, మరో ప్లేయర్ అదే కేటగిరీలో అర్హత సాధించడంతో తప్పనిసరిగా మారాల్సి వచ్చింది. తాను దేంట్లో అయినా నెగ్గగలననే పట్టుదలే మళ్లీ వినేశ్ను నడిపించింది. 50 కేజీల విభాగానికి మారి మరీ ఆమె పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇన్ని అవరోధాలను దాటి ఇక్కడి వరకు వచ్చిన వినేశ్ తన మూడో ప్రయత్నంలోనైనా ఒలింపిక్స్ పతకం గెలిచి తన కలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే
అమెరికాలోని న్యూజెర్సీలో పంజాబ్కు చెందిన ఇద్దరు మహిళలపై భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. న్యూజెర్సీలోని కార్టెరెట్లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్ జరిపిన కాల్పుల్లో జస్వీర్ కౌర్ (29) మరణించారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ కాల్పుల్లో మరో మహిళ,జస్వీర్ బంధువు గగన్దీప్ కౌర్ (20) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. నిందితుడు గిల్ నాకోదర్లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని, బాధితులు జలంధర్లోని నూర్మహల్కు చెందినవారని తెలుస్తోంది. నిందితుడు గౌరవ్ గిల్ను హత్య కేసులో అరెస్టు చేశారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.హత్యకు గురైన జస్బీర్ కౌర్ తన బంధువు గగన్దీప్ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సమయంలో అతడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. పంజాబ్లోని నకోదర్ పట్టణంలోని IELTS కోచింగ్ సెంటర్లో గగన్దీప్తో గిల్కు పరిచయమున్నట్టు తెలుస్తోంది. కాగా జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్గా ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. -
సమాజానికి ఎదురీదిన తొలి వైద్యురాలు
ఆధునిక భారతదేశంలో పాశ్చాత్య వైద్య శాస్త్రపు పట్టా పొంది, ప్రాక్టీస్ చేసి, విజయం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబినీ బోస్ గంగూలీ. వీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో మాట్లాడిన తొలి మహిళ కూడా! అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కోఫ్ ప్రకారం... కాదంబినీ గంగూలీ చాలా ఆధునికంగా ఆలోచించిన, తొలి తరం బ్రహ్మ సమాజపు భారతీయ మహిళ. భారతదేశానికి సంబంధించి మహిళల తొలి సంస్థ ‘భాగల్పూర్ మహిళా సమితి’ని ప్రారంభించినవారిలో ఒకరైన బ్రజా కిషోర్ బసుకు కాదంబిని 1861 జూలై 18న జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో కాదంబిని ఢాకాలోని బ్రహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్, అటు తర్వాత కలకత్తాలోని హిందూ మహిళా విద్యాలయలో చదువుకున్నారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1879లో విద్యార్థినులకు ప్రవేశం కల్పించగా, మరుసటి సంవత్సరం కలకత్తా విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థులకు డిగ్రీ చదువుకు అవకాశం లభించింది. అలా భారతదేశంలో పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు కాదంబినీ గంగూలీ కాగా, మరొకరు చంద్రముఖీ బసు. డిగ్రీ చదువు పూర్తి అయ్యాక 1883 జూన్ నెలలో ద్వారకానాథ్ గంగూలీతో కాదంబిని వివాహమైంది. ద్వారకానాథ్ మనదేశంలో మహిళల కోసం తొలి పత్రిక ‘అబలా బంధోబ్’ను నిర్వహించిన అభ్యుదయవాది. బహుభార్యాత్వానికి, అంధ విశ్వాసాలకు, పరదా పద్ధతికి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ద్వారకానాథ్ గంగూలీ తొలి భార్యను కోల్పోయిన తర్వాత, కాదంబినిని వివాహమాడారు. వారిద్దరి మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉంది. ద్వారకానాథ్ పోరాడిన తర్వాత కానీ కాదంబినికి కలకత్తా మెడికల్ కళాశాలలో ప్రవేశం లభించలేదు. దాంతో కాదంబినీ గంగూలీ భారతీయ విశ్వ విద్యాలయపు వైద్యవిద్యలో ప్రవేశించిన తొలి మహిళ అయ్యారు. విద్యాలయాల్లో మహిళల ప్రవేశం గురించి చాలామంది వ్యతిరేకిస్తూ కూడా పోరాడారు. అలాంటి వారిలో ఆ విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్ ఆర్సీ చంద్ర కూడా ఉన్నారు. కనుకనే కాదంబినీ గంగూలిని ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఫెయిల్ చేయగా బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభించలేదు. వివక్ష ఆ స్థాయిలో ఉండేది. నెలకు 20 రూపాయల చొప్పున ఉపకార వేతనం కాదంబినీ గంగూలికి జారీ చేసి, 1883 నుంచి ఒకేసారి పెద్ద మొత్తం ఇచ్చారు. దాంతో భర్త ప్రోత్సాహంతో 1892లో ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్బరో నుంచి ఎల్ఆర్సీ (లైసెన్షియేట్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్), గ్లాస్కో నుంచి ఎల్ఆర్సీ ఎస్ (లైసెన్షియేట్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్), ఇంకా డబ్లిన్ నుంచి జీఎఫ్పీఎస్ పట్టాలు పొందారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత కలకత్తాలోని లేడీ డఫ్రిన్ హాస్పిటల్లో నెలకు 300 రూపాయల జీతంతో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీ విభాగాలలో సేవలందించారు.డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్నా పిల్లలను శ్రద్ధగా పెంచారు. ఆమె కుమార్తె జ్యోతిర్మయి స్వాతంత్య్ర సమరయోధురాలు కాగా, కుమారుడు ప్రభాత్ చంద్ర జర్నలిస్టుగా తండ్రి నడిపిన ‘అబలా బంధోబ్’ పత్రికలో గొప్పగా రాణించారు. ఆమె సవతి కూతురు మనవడే ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే! ఆగ్నేయాసియాలోనే యూరోపియన్ వైద్యశాస్త్రాన్ని అభ్యసించి, పట్టా పొంది, ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ కాదంబినీ గంగూలీ. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాదంబిని మహిళల హక్కులకు సంబంధించి విశేషంగా పోరాడారు కనుకనే ఆనాటి సమాజం నుంచి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ‘బంగభాషి’ అనే పత్రిక ‘కులట’ అంటూ ఆమెను పరోక్షంగా విమర్శించే దాకా వెళ్ళింది. అయితే భర్త ద్వారకానాథ్ పోరాడి ఆ పత్రికా సంపాదకుడు మహేష్ పాల్ను కోర్టుకీడ్చి ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించేలా విజయం సాధించారు. అరవై రెండేళ్ల వయసులో 1923 అక్టోబర్ 3వ తేదీన కన్నుమూసిన కాదంబినీ గంగూలీ నేటికీ భారతీయ మహిళా లోకానికే కాదు, అందరికీ ప్రాతఃస్మరణీయులు. కనుకనే ఇటీవల అంటే 2020లో ‘స్టార్ జల్సా’లో వచ్చిన ‘ప్రోతోమా కాదంబిని’ అనే బెంగాలీ టెలివిజన్ సీరియల్; జీ బంగ్లాలో ‘కాదంబిని’ అనే బెంగాలీ సిరీస్ చాలా ప్రజాదరణ పొందాయి.డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి 9440732392 -
అటెన్షన్... లుంగీ ఇన్ లండన్
దక్షిణ భారతంలో లుంగీతో కనిపించడం వింతేమీ కాదు. అయితే లండన్లో కనిపిస్తే మాత్రం వింతే. ఆ వింతే ఈ వీడియోను వైరల్ అయ్యేలా చేసింది. వలేరి అనే తమిళియన్ రంగు రంగుల లుంగీలు ధరించి లండన్ వీధుల్లో, పాపుల్లో ‘రీల్స్’ చేసి అక్కడి ప్రజల రియాక్షన్ను రికార్డ్ చేసింది. ‘వియరింగ్ లుంగీ ఇన్ లండన్’ కాప్షన్తో ఆమె పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. -
నీలిరంగు చీరలోన జపాన్లో ఒక సందమామ
‘రోమ్లో రోమన్లా ఉండాలి’ అంటారు కొందరు. ‘అయినా సరే, నేను నాలాగే ఉంటాను’ అంటారు కొందరు. రెండో కోవకు చెందిన డిజిటల్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్ మహిశర్మ వీడియో వైరల్ అయింది. గోల్డెన్ బార్డర్స్ బ్లూ శారీ ధరించి జపాన్లోని టోక్యో వీధుల్లో చిద్విలాసంగా నడుస్తున్న ఆమె వీడియో ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్ దృష్టిని ఆకర్షించింది. ‘ఐ వోర్ ఏ శారీ ఇన్ జపాన్ రియాక్షన్స్ ఆర్’ కాప్షన్తో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో ఏడు మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. వీడియోలో ఆబాలగోపాలం మహిశర్మను ఆశ్చర్యంగా చూస్తున్న, సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. -
చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!
ప్రపంచ జనాభాను వణికిస్తున్న వ్యాధి కేన్సర్. ఇతర ప్రమాదకర కేన్సర్లతో పాటు, మహిళలు రొమ్ముకేన్సర్, సర్వైకల్ కేన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ కేన్సర్కు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. భారతీయ స్త్రీలకు చీరల వల్ల కేన్సర్ వ్యాధి పొంచి ఉందిట. చీర ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశంతో పాటు, అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. అయితే దుస్తులు ఏవైనా పరిశుభ్రతే ఎక్కువ కారణమని వైద్యులు పేర్కొడం గమనార్హం. ముంబైలోని RN కూపర్ హాస్పిటల్ లాంటి చోట్ల పరిశోధనలు కూడా జరిగాయి. ఈ పరిశోధనలో ధోతీ కూడా ఉంది. చీర కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన అందమైన దుస్తుల్లో ఒకటి. ఐదున్నర నుండి ఆరు మీటర్ల చీరను ధరించడం ఆనవాయితీ. ఢిల్లీలోని పిఎస్ఆర్ఐ ఆసుపత్రిలో క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వివేక్ గుప్తా, ఒకే వస్త్రాన్ని ఎక్కువసేపు ధరించడం వల్ల నడుము వద్ద రాపిడి ఏర్పడుతుంది. చర్మం రంగు మారుతుంది. పొట్టులాగా రావడం జరుగుతుందిట. ఆ తరువాత మానని పుండుగా మారి ఇదే కేన్సర్కు దారితీసే అవకాశాలున్నాయి. దీన్నే వైద్య పరిభాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC), చీర క్యాన్సర్ అని పిలుస్తారని పరిశోధకులు తెలిపారు. నడుము చుట్టూ ఇరిటేషన్, పుండ్లు తాజాగా 68 ఏళ్ల మహిళ ఈ కేన్సర్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. చీర కట్టుకోవడం వలన వచ్చిన కేన్సర్ కాబట్టి, దీన్ని చీర కేన్సర్గా భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత, తేమ ఉండే జార్ఖండ్, బీహార్లో చీర క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య ఒక శాతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. డెర్మటోసిస్ నుండి ఉత్పన్నమయ్యే ప్రాణాంతక, చాలా అరుదైన కేసుగా వైద్యులు పేర్కొంటున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాలలో, ధనికులు, పేదలు, పట్టణ లేదా గ్రామీణ మహిళలు ఏడాది పొడవునా, వారానికి ఏడు రోజులు చీరలను ధరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిజానికి ఏ పని చేస్తున్నా రోజంతా చీరలోనే ఉంటారు. చీర జారిపోకుండా ఉండేందుకు పెటీకోట్ను నాడాతో గట్టిగా కట్టుకుంటారు. ఇలా గట్టిగా కట్టు కోవడం వల్ల నడుము చుట్టూ చర్మం కమిలిపోవడం, దురద రావడం, క్రమంగా పుండ్లు రావడం.. ఇవన్నీ చీర కట్టుకునేవారికి అనుభవమే. అధిక ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్లో ఇది మరీ చికాకు పుట్టిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, ఇది కేన్సర్గా (చాలా అరుదు)గా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు జీన్స్తో సహా బిగుతుగా ఉండే దుస్తులు ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరికైనా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చాలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందని, మగవారిలో వ్యంధ్యత్వ సమస్యకు దారి తీస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి విదితమే. కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అదేవిధంగా, కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అని పిలువబడే చర్మ కేన్సర్కి మరో రూపం. చలికాంలో వెచ్చదనం కోసం కాంగ్రీస్ అని పిలువబడే కుంపటితో నిండిన మట్టి కుండలను వాడే విధానం వల్ల ఈకేన్సర్ వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు , తొడ ప్రాంతాలలో కాంగ్రిస్ నుండి వేడికి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ కావడం దీనికి దారి తీస్తుంది. నోట్ : చీరలు కట్టుకునేవారికి అందరికీ కేన్సర్ వస్తుందని కాదు. దుస్తులు ఏవైనా, పరిశుభ్రంగా ఉండటం, మరీ బిగుతుగా కట్టుకోకుండా ఉండటం అవసరం. అలాగే లోదుస్తుల విషయంలో, ముఖ్యంగా వేసవిలో చాలా పరిశుభ్రతను పాటించాలి. చిన్న పిల్లల విషయంలో కూడా అప్రతమత్తత అవసరం. నడుము చుట్టూ గానీ, స్థనాల వద్ద, తొడలు, జననాంగాల మధ్య ఇరిటేషన్, నల్లటి మచ్చలు మానని పుండ్లు లాంటి సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
సివంగివే సివంగివే... నీ త్యాగమే గుర్తించగా.. సాహో అంటూ మోకరిల్లదా లోకమే
పాటలు అంటే సరదాగా పాడుకునేవే కావు శక్తి మాత్రలు కూడా. తాజా విషయానికి వస్తే ఇండియన్ ఉమెన్ కబడ్డీ కోచ్ కవితా సెల్వరాజ్ ‘రెయిన్ డ్రాప్ ఫౌండేషన్’ నిర్వహించిన సమావేశంలో విజయ్ ‘బిగిల్’ (తెలుగులో విజిల్) సినిమాలో ఏఆర్ రెహమాన్ పాడిన ‘సివంగివే’ పాట ఎంత ఇన్స్పైర్ చేసిందో చెప్పింది. స్వయంగా ఆ పాట పాడింది. డెబ్బై వేలకు పైగా వ్యూస్తో ఈ వీడియో దూసుకుపోతోంది. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ‘బిగిల్’ సినిమాలో విజయ్ మహిళా ఫుట్బాల్ జట్టుకు కోచ్గా నటించాడు. మహిళా క్రీడాకారులలో స్ఫూర్తి, ధైర్యం నింపి విజయం వైపు తీసుకువెళ్లే క్రమంలో వినిపించే పాట సివంగివే. ఈ పాట (తెలుగు)లో నుంచి కొన్ని లైన్లు... ‘అడుగులే జలిపించు/ పిడుగులై ఒళ్లు విరుచుకో/ విను వీధి దారిన మెరుపులా/ భూమిని బంతాడు సివంగివే సివంగివే/ తలవంచె మగజాతి నీకే/ నీ త్యాగమే గుర్తించగా/సాహో అంటూ మోకరిల్లదా లోకమే -
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్స్టాగ్రామ్లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? గిన్నీస్ రికార్డ్
సాధారణంగా మనందరి నోట్లో 32 పళ్లుంటాయి. కానీ కల్పనా బాలన్(26) అనే మహిళకు నోట్లో ఏకంగా 38 పళ్లున్నాయి. ఈ ఘనతతో మహిళల్లో అత్యధిక పళ్లున్న జాబితాలో ఆవిడ గిన్నీస్ రికార్డ్ సాధించారు. తనకు అడ్డంకిగా ఉన్న పళ్లే రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. Kalpana Balan from India has six more teeth than the average human. Read more by clicking the picture 👇 — Guinness World Records (@GWR) November 20, 2023 కల్పనకు నాలుగు అదనపు దవడ (దిగువ దవడ) పళ్ళు, రెండు అదనపు దవడ (ఎగువ దవడ) పళ్ళు ఉన్నాయి. తన యుక్తవయసులో ఉండగానే అదనపు దంతాలు ఆవిర్భవించాయి. అవి క్రమంగా ఒక్కొక్కటిగా పెరుగుతూ పైకి వచ్చాయి. ఎటువంటి నొప్పిని కలిగించనప్పటికీ ఆహారం తరచుగా అదనపు దంతాల మధ్య చిక్కుకుపోతోందని కల్పన తెలిపారు. అదనపు దంతాలు ఏర్పడినప్పుడు ఆశ్చర్యపోయినట్లు కల్పన తల్లిదండ్రులు తెలిపారు. వాటిని తీసివేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ పూర్తిగా పెరిగిన తర్వాతనే తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో ఆగిపోయారు. ఇబ్బందిగా మారిన ఈ పళ్లే తనకు గిన్నీస్ రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. కల్పనలో మరో రెండు అసంపూర్తిగా ఉన్న పళ్లు ఉన్నాయి. అవి పెద్దైతే ఈ రికార్డ్ను ఆమె మరింత పెంచనున్నారు. ప్రస్తుతం మగవారిలో అత్యధికంగా 41 పళ్లున్న జాబితాలో కెనడాకు చెందిన ఎవనో మెల్లోన్ రికార్డుల్లో నిలిచారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్లో ఇంజినీర్గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్పోల్లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్పోల్కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్పోల్కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్పోల్లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాస్తా..నేడు సంపన్న మహిళగా..!
రాధ వెంబు విజయాన్ని చూసిన తరువాత ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అనే సుపరిచిత మాటకు అదనంగా మరో మాట చేర్చవచ్చు అనిపిస్తుంది. ‘ప్రతి పరిశ్రమ విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ సాధారణ ఉద్యోగిగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ‘జోహో కార్పోరేషన్’లోకి అడుగు పెట్టిన రాధ వెంబు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి గెలుపు పాఠాలు తయారు చేసుకుంది. ప్రతిభావంతులైన సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి బలమైన సైన్యాన్ని తయారు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించని రాధ వెంబు ‘ఇన్విజిబుల్ ఫోర్స్’గా పేరు తెచ్చుకుంది. తాజాగా ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ లో చోటు సంపాదించి, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీ నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ని దాటేసి మన దేశంలోని సంపన్న మహిళగా వార్తల్లో నిలిచింది....' ‘ఎన్నో విజయాలు సాధించిన రాధ వెంబు గురించి నేనెందుకు వినలేకపోయాను అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అంటూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రాశాడు జోహో కార్పొరేషన్ కన్సల్టెంట్ ఇంగ్లాండ్కు చెందిన ఆడిసన్. ఈ కన్సల్టెంట్కు మాత్రమే కాదు దేశంలో చాలామందికి ఆమె విజయాల గురించి తప్ప వ్యక్తిగత వివరాల గురించి తెలియదు. ‘సెల్ఫ్–మేడ్ ఉమన్’ అనేది ఆమె పేరు ముందు కనిపించే విశేషణం. ‘కామ్ అండ్ టాస్క్–ఓరియెంటెడ్’ అని సన్నిహితులు రాధ గురించి చెబుతుంటారు. చెన్నైలో పుట్టి పెరిగింది రాధ. తండ్రి మద్రాస్ హైకోర్టులో స్టెనోగ్రాఫర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మద్రాస్) లో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది రాధ. ఆమె సోదరుడు శ్రీధర్ వెంబు ఆమెకు స్నేహితుడు, గురువు. టెక్ ఇండస్ట్రీ గురించి గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. మన కంపెనీలను విదేశీ కంపెనీలతో పోల్చుతూ విశ్లేషించుకునేవారు. తన సోదరులతో కలిసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ‘జోహో కార్పొరేషన్’ మొదలు పెట్టింది రాధ వెంబు. అంతకుముందు ఉన్న శ్రీధర్ వెంబు కంపెనీ ‘అడ్వెన్ నెట్’ జోహో కార్పోరేషన్లో విలీనమైంది. మొదట్లో ఒక సాధారణ ఉద్యోగిగా ఆ సంస్థలో చేరింది రాధ వెంబు. క్షేత్రస్థాయి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడానికి ఇది తనకెంతో ఉపయోగపడింది. ఆ తరువాత జోహో మెయిల్ ప్రాడక్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించింది. వేగంగా ఉన్నత హోదాలోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ చాలా సంవత్సరాల పాటు ప్రాడక్ట్ మేనేజర్గానే పనిచేసింది. పెద్ద పెద్ద సంస్థలతో పోటీ పడుతూ తమ కంపెనీని ముందు వరుసలో నిలిచేలా చేసింది. ‘కంపెనీకి సంబంధించిన సాంకేతికతను శక్తిమంతం చేయడానికి, కస్టమర్లను ఆశ్చర్యానందాలకు గురి చేయడానికి సంబంధించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను’ అంటుంది రాధ. ‘పని చేసే ప్రదేశంలో పక్షపాతానికి చోటు లేదు. ఆడా మగా అనే తేడా లేదు. ప్రతిభ ఒక్కటే ప్రమాణం’ అని నమ్మడమే కాదు ఆచరణలో నిరూపించింది రాధ. జోహో వర్క్కల్చర్ బాగా పాపులర్ అయింది. ఒక స్థాయికి చేరిన తరువాత టెక్ కంపెనీల హెడ్క్వార్టర్స్ విదేశాల బాట పడితే ‘జోహో’ మాత్రం మన దేశంలోని చిన్న పట్టణాలను ఎంచుకుంది. టెక్ రంగంలో పురుషాధిక్యతే ఎక్కువగా కనిపించే పరిస్థితులలో రాధా వెంబు ఎన్నో మూస ఆలోచనలను బద్దలు కొట్టింది. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ‘నువ్వు కనిపించడం కాదు నీ ప్రాడక్ట్ కనిపించాలి. నువ్వు మాట్లాడడం కాదు నీ ప్రాడక్ట్ మాట్లాడాలి’ అనేది రాధ వెంబు నమ్మిన సిద్ధాంతం. పబ్లిసిటీ లేకపోతే పని జరగదు అని నమ్మే ఈ కాలంలోనూ ఆమె నమ్మిన సిద్ధాంతం నిలిచి గెలిచింది. తీరిక సమయాల్లో తోటపని చేసే రాధ వెంబుకు సామాజిక సేవాకార్యక్రమాలు అంటే ఇష్టం. ‘సంపన్నురాలిగా మారాలని టెక్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకువచ్చి ఆ ఫలితాలతో సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో వచ్చాను’ అంటుంది రాధ వెంబు. (చదవండి: రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్) -
పారిపోను.. సాయం చేస్తా
శత్రు దేశాలు, ఉగ్రమూకలు, తీవ్రవాదులు విరుచుకుపడినప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆ మధ్యన అప్ఘానిస్థాన్ పరిస్థితి ఇలానే ఉండేది. అది మర్చిపోయే లోపు ఉక్రేయిన్ రష్యా యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్ఘానిస్థాన్, ఉక్రెయిన్లలో ఏర్పడిన పరిస్థితులకు భయపడిపోయిన చాలామంది ప్రజలు ప్రాణాలు అరచేత బట్టి దేశం విడిచి పారిపోయారు. ఇక ఆయా దేశాల్లో ఉన్న విదేశీయులు ముందుగానే పెట్టే బేడా సర్దుకుని తమ తమ దేశాలకు పరుగెత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయినా అక్కడ నివసిస్తోన్న 41 ఏళ్ల ప్రమీలా ప్రభు మాత్రం ‘‘నేను ఇండియా రాను. ఇక్కడే ఉండి సేవలందిస్తాను’’ అని ధైర్యంగా చెబుతోంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా.. హెర్గాలో పుట్టి పెరిగింది ప్రమీలా ప్రభు. మైసూర్లో చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రిలో నర్స్గా చేరింది. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక, ఇజ్రాయేల్లో మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో.. తన ఇద్దరు పిల్లలతో ఇజ్రాయెల్కు వెళ్లింది. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోన్న ప్రమీలా ఆ దేశం మీద అక్కడి ప్రజల మీద మమకారం పెంచుకుంది. అందుకే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ... ‘‘ఇండియా నాకు జన్మనిస్తే.. ఇజ్రాయెల్ జీవితాన్నిచ్చింది. ఇలాంటి కష్టసమయంలో దేశాన్ని వదిలి రాను. నేను చేయగలిగిన సాయం చేస్తాను’’ అని కరాఖండిగా చెబుతూ అక్కడి పరిస్థితులను ఇలా వివరించింది.... నేను టెల్ అవీవ్ యాఫోలో నివసిస్తున్నాను. అక్టోబర్ 7తేదీన∙రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనం చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్ వినిపించింది. వెంటనే మేమంతా బంకర్లోకి వెళ్లిపోయాము. దాదాపు రాత్రంతా సైరన్ వినిపిస్తూనే ఉంది. నేను ఇజ్రాయెల్ వచ్చాక ఇంతపెద్ద హింసను ఎప్పుడూ చూడలేదు. మా ఇంటికి కిలోమీటర్ దూరంలో బాంబులు పడుతున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు ఒక్కసారిగా భయపెట్టేశాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బంకర్లు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా వీటిలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. సైరన్ మోగిన వెంటనే కనీసం ముప్ఫైసెకన్లపాటు బాంబుల శబ్దాలు వినపడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇజ్రాయెల్పై తీవ్రవాద సంస్థ హమాస్ దాడులకు తెగబడుతూనే ఉంది. హమాస్ వల్ల గాజా కూడా దాడులతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా చనిపోయారు. ఇక్కడి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. టెల్ అవీవ్లో షాపులు అన్నీ మూసేసారు. వీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. అందరూ కిరాణా సామాన్లు తెచ్చుకుని నిల్వ చేసుకుంటున్నారు. అరగంట లోపలే... మా చెల్లి ప్రవీణ జెరుసలేంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నేను టెల్ అవీవ్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఈ అపార్ట్మెంట్లో ముఫ్పైమంది వరకు ఉన్నారు. మేమంతా అత్యవసరమైన ఆహారం, నీళ్లు, టార్చ్లైట్ వంటివాటిని దగ్గర ఉంచుకుని బేస్మెంట్ తలుపులు లె రుచుకుని ...సైరన్ రాగానే బంకర్లోకి పరుగెడుతున్నాం. సైరన్ ఆగినప్పుడు బంకర్ల నుంచి బయటకు వస్తున్నాం. బంకర్లోకి వెళ్లిన ప్రతిసారి అరగంట పాటు లోపలే ఉండాల్సి వస్తోంది. ఊహకందని దాడి ఇజ్రాయెల్మీద పాలస్తీనా దాడులు చేయడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరిగిన దాడి అస్సలు ఊహించలేదు. ఊహకందని వికృతదాడికి హమాస్ సంస్థ పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్లో శాంతికోసం ఏర్పాటు చేసిన ‘మ్యూజిక్ ఫెస్టివల్’ను ఇలా అశాంతిగా మారుస్తారని అసలు ఊహించలేదు. ఆ ఫెస్టివల్ గురించి అత్యంత బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ.. యుద్ధానికి అన్నిరకాలా సన్నద్ధమై ఉండి, రక్షణాత్మక చర్యలను పర్యవేక్షిస్తుంటుంది. లేదంటే మరింతమంది హమాస్ దాడుల్లోప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు రాలేను.. ఇజ్రాయెల్ నాకు జీవితాన్నిచ్చింది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా మాతృదేశం వచ్చి సంతోషంగా ఉండలేను. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతిస్తే నా సేవలు అందించడానికి సిద్ధ్దంగా ఉన్నాను. ఉడిపిలో ఉన్న మా కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా... లేదా... అని కంగారు పడుతున్నారు. ఇక నా పిల్లలు ఇండియా వెళ్లిపోయారు. వారిని విడిచి ఇక్కడ ఉన్నాను. వాళ్లంతా గుర్తొస్తున్నారు. అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి పారిపోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇండియా తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’’ అని చెబుతూ ఎంతోమంది స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రమీలా ప్రభు. -
ప్రవాస భారతీయురాలు ఆత్మహత్య ?
కర్ణాటక: ఆస్ట్రేలియా ప్రవాస భారతీయురాలు శవం ధార్వాడలో అనుమానాస్పద స్థితిలో గత ఆదివారం లభించింది. ధార్వాడకు చెందిన ఆస్ట్రేలియా నివాసి ప్రియాదర్శిని లింగరాజ పాటిల్ (40) ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వివరాలు...ప్రియాదర్శినికి ఇద్దరు పిల్లలు. భర్తతో ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. అక్కడి పౌరసత్వం ఉంది. అయితే ఇటీవల ఇండియాకు వచ్చిన ప్రియదర్శిని స్వగ్రామానికి రాలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాజీ మేయర్ వీరేశ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రియదర్శిని పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ విషయంపై ఆమె తీవ్ర మనోవేదనలో ఉందని, ఈనెల 18 భారత్కు వచ్చిన ప్రియదర్శిని బెంగళూరులో ఒకరోజు స్నేహితుల ఇంటిలో ఉన్నారు. మరుసటి రోజు ధార్వాడ వెళ్తున్నట్లు చెప్పి బస్సు ఎక్కి గోగాక్ టికెట్ తీసుకున్నారు. అయితే గోగాక్కు బదులు సవదత్తిలో దిగి నవిళుతీర్థలో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆమె పిల్లలను ఆస్ట్రేలియా నుంచి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో మాట్లాడామని చెప్పారు. -
'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం'
భోపాల్: పాకిస్థాన్లోని ప్రియుడు నస్రుల్లా కోసం భారత్ను వదిలిన వివాహిత అంజు అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్తను వదలి పాక్లోని తన ప్రియుడు నస్రుల్లా కోసం వెళ్లిపోయింది అంజు. అక్కడికి వెళ్లిన తర్వాత మతం మార్చుకుంది. ఫాతిమాగా పేరు కూడా మార్చుకుని నస్రుల్లాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పాక్కు వచ్చి మతం మార్చుకున్నందుకు వారి జంటకు స్థానికంగా రియల్ఎస్టేట్ వ్యాపారి బహుమతులు అందిస్తున్నారు. డబ్బు, ఉండటానికి ఇళ్లు, భూములు ఇలా.. సకల సౌకర్యాలను సమకూర్చుతున్నారు. పాక్కు వచ్చి మతం మార్చుకున్నందుకు ఆమెకు సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. దీనిపై మధ్యప్రదేశ్కు చెందిన హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఓ వివాహిత పిల్లలను వదిలి పాక్ వెళ్లి, మతం మార్చుకుని ప్రియున్ని పెళ్లి చేసుకున్న ఘటనల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం దాగి ఉందని నరోత్తమ్ మిశ్రా అన్నారు. అలా పాక్కు వచ్చిన యువతికి గిఫ్ట్ల పేరిట సకల సౌకర్యాలను సమకూర్చడం కుట్రకు తావిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. రాజస్థాన్కు చెందిన 34 ఏళ్ల అంజుకు 15 ఏళ్ల కూతురు ఉంది. 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుని కోసం పాక్కు పారిపోయింది. దీనిపై స్పందించిన ఆమె తండ్రి.. తీవ్రంగా ఆవేదన చెందారు. భర్తను పిల్లలను ఎలా వదిలి వెళ్లగలిగిందని అన్నారు. ఆవిడ చనిపోయినట్లుగానే భావిస్తున్నట్లు గతంలో చెప్పారు. ఇదీ చదవండి: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు -
'చావడమే మేలు..' పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు తండ్రి ఆవేదన..
జైపూర్: పాక్ వెళ్లి ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజు చర్యల పట్ల ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోవడమే మేలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి భారత్కు రావడానికి అంజూకు హక్కు లేదని అన్నారు. ఒకవేళ తిరిగివస్తే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. ఆమె చేసింది చాలా తప్పు పని అని అన్నారు. అంజు.. వివాహిత అయిన రాజస్థాన్కు చెందిన భారతీయ మహిళ. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇండియా నుంచి పాక్కు వెళ్లి తన ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాతో గత మంగళవారమే వివాహం చేసుకుంది. ఈ ఘటనతో తీవ్ర దుఖాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పిన అంజూ తండ్రి థామస్.. తమ కూతురు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. గౌరవప్రదేమైన భారతదేశానికి తన కూతురు చర్యతో కలంకం సోకినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అంజు తండ్రిగా తన పేరును ప్రభుత్వ రికార్డుల నుంచి తీసేయాలని కోరారు. ఇదీ చదవండి: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి! అంజూతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని థామస్ తెలిపారు. దేశ సరిహద్దు దాటినప్పుడే తమతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. చాలా విచారకరమైన విషయమని అన్నారు. సీమా హదర్ కేసుకు భిన్నంగా అంజు అనే వివాహిత రాజస్థాన్ నుంచి పాకిస్థాన్లోని తన ఫేస్బుక్ ప్రియున్ని కలవడానికి వెళ్లింది. రాజస్థాన్లో బివాడీకి చెందిని అంజూకు అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీసాతో అధికారికంగానే పాక్లోకి అడుగుపెట్టిన అంజు.. ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాను తన స్నేహితున్ని కలవడానికి మాత్రమే వెళ్లినట్లు అంజు చెప్పారు. ఈ పరిణామాల అనంతరం అంజూ తండ్రి తీవ్రంగా స్పందించారు. అంజు తనకు చెప్పకుండానే పాక్ వెళ్లిందని ఆమె భర్త తెలిపారు. లాహోర్లో ఉన్నట్లు కాల్ చేసినట్లు తెలిపిన ఆయన.. రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రేమ వ్యవహారంగా భావించిన రాజస్థాన్ పోలీసులు.. నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఇదీ చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్! -
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్షాప్లు నిర్వహించింది. -
Mahasweta Ghosh: ఎడారి చిరుత
ప్రపంచంలో అత్యంత కష్టమైన మారథాన్ ‘సహారా మారథాన్’. ఆరు రోజుల పాటు సహారా ఎడారిలో 250 కిలోమీటర్లు నడవాలి. ఒక్క ఒయాసిస్సు కూడా తగలని ఈ దారిలో ప్రాణం కూడా పోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన పోటీలో భారతీయ మహిళ మహాశ్వేతా ఘోష్ మొదటిసారి పాల్గొని మారథాన్ పూర్తి చేసింది. ఆమె పరిచయం. ‘మారథాన్ దెస్ సేబుల్స్’ లేదా ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ లేదా ‘సహారా మారథాన్’లో పాల్గొనేవారి ధైర్యం ఏమిటో? మామూలుగా ఎండలో నడవడమే కష్టం. అలాంటిది ఎడారి ఎండలో నడవడం సామాన్యమా? మామూలు నేల మీద ఎక్కువసేపు నడవడం కష్టం. ఇక ఎడారి ఇసుకలో ఎక్కువ సేపు నడవడం సాధ్యమా? 44 ఏళ్ల మహాశ్వేతా ఈ అసాధ్యమైన మారథాన్ను పూర్తి చేయగలిగింది. అలా చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు స్థాపించింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యి మే 1న ఈ మారథాన్ పూర్తయ్యింది. ఎడారిలో సాహసవంతులు ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ 1986 నుంచి మొదలయ్యింది. 1984లో పాట్రిక్ బ్యూయెర్ అనే ఫ్రెంచ్ వ్యక్తి మొరాకోలోని సహారా ఎడారిలో 12 రోజుల పాటు ఒక్కడే 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడు ప్రయాణించిన దారిలో ఒక్క ఒయాసిస్సు కూడా లేదు. ఎడారి తండాలు కూడా కనిపించలేదు. అంటే ఈ దారి అల్ట్రా మారథాన్కు అనువైనదని భావించి రెండేళ్ల తర్వాత ఈ మారథాన్ను మొదలెట్టాడు. అయితే 2009 నాటికిగాని ఇది ఊపందుకోలేదు. ఆ సంవత్సరం వెయ్యి మంది సహారా మారథాన్లో పాల్గొన్నారు. అడుగడుగునా సవాళ్లు 2023లో మారథాన్ ఆఫ్ ది శాండ్స్ ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యింది. భారతదేశం నుంచి మహాశ్వేతా ఘోష్ మాత్రమే హాజరయ్యింది. అనేక దేశాల నుంచి మొత్తం 1200 మంది పోటీదారులు వచ్చారు. ‘మా అందరికీ 11 కిలోల బరువున్న బ్యాక్ ప్యాక్ మాత్రమే అనుమతించారు. రోజుకు 12 లీటర్ల నీళ్లు నిర్వాహకులు సప్లై చేశారు. అంతకుమించిన నీరు దొరకవు. ఎవరి ఆహారం వారు తినాలి. మారథాన్లో పెద్దగా స్నేహాలు ఏర్పడవు. పోటీ కాబట్టి ఎవరి లక్ష్యంలో వారు నడుస్తుంటారు. ఎడారి దారిలో 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉండే ఎండలో నడవడం అంటే మాటలు కాదు. మాకు ప్రతిరోజూ లక్ష్యం ఇస్తారు. అంటే రోజుకు 70 నుంచి 90 కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోవాలి. ఇచ్చిన సమయంలో నిర్దేశిత దూరానికి చేరుకోలేకపోతే అక్కడితో వారు పోటీ నుంచి డిస్క్వాలిఫై అయిపోతారు. నేను ఎలాగైనా ఈ మారథాన్ పూర్తి చేయదలిచాను. అందుకే ఏ రోజు కూడా నిర్దేశిత గమ్యాన్ని తప్పలేదు. చాలామంది మధ్యలోనే ఆగిపోయారు’ అని తెలిపింది మహాశ్వేతా. పోహా, ఓట్స్ ‘నేను మారథాన్ సాగిన ఆరు రోజులు హల్దీరామ్ డిహైడ్రేటెడ్ దాల్ చావల్, రెడీ టు ఈట్ పోహా, న్యూట్రిబార్స్, చాక్లెట్లు, డ్రై ఓట్స్ తిన్నాను. తల మీద సోలార్ హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్ట్రోలింగ్ స్టిక్స్, భుజాన బ్యాగ్తో మన నడక కొనసాగాలి. చివరిరోజు చివరి దశలో పరుగు తీయాలి. ఎండ మన సహనాన్ని పరీక్షిస్తుంది. డీ–హైడ్రేట్ కాకుండా చూసుకో వాలి. చాలామంది తల మీద నీళ్లు పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల వేడి ఇంకా పెరుగుతుంది. కేవలం మెడ, ముఖం తడుపుకుంటూ ముందుకు సాగాలి. గుడారంలో రాత్రిపూట విశ్రాంతిలో భాగ్ మిల్కా భాగ్లోని స్ఫూర్తిగీతం వినేదాన్ని’ అని చెప్పిందామె. భ్రాంతుల నుంచి ‘ఎడారిలో భ్రాంతులు ఎక్కువ. వాటి మాయలో పడ్డామంటే చిక్కుల్లో పడతాం. ఈ ఎడారిలో నీకు ఎప్పటికీ నీళ్లు కనిపించవు. కనిపించే నీళ్లను నమ్మకు అని నా మనసుకు చెప్పుకున్నాను. ఏమంటే చాలాసార్లు ఎండమావులు కనిపిస్తాయి. షూస్లో ఇసుక దూరకుండా నడవడం పెద్ద విద్య. ఇన్ని కష్టాలు పడ్డా అంతిమంగా యాత్ర ముగిస్తే కలిగే ఆనందం నిజంగా జీవితంలో ఒయాసిస్సులా ఉంటుంది’ అందామె నవ్వుతూ. లూజర్స్ స్ఫూర్తి ‘మాది పశ్చిమ బెంగాల్. నేను కాలేజీలో చదివేప్పుడు సన్నబడటానికి నడకను, జాగింగ్ను సాధనంగా చేసుకున్నాను. అదే కొనసాగిస్తున్నాను. 2019లో నెట్ఫ్లిక్స్లోని లూజర్స్ సిరీస్ నాకు మారథాన్ ఆఫ్ శాండ్స్ గురించి తెలియజేసింది. అందులోని ఒక ఎపిసోడ్లో ఒలింపిక్ విజేత మౌరో ప్రాస్పెరీ మారథాన్ ఆఫ్ శాండ్స్ను ఎలా ముగించాడో వివరంగా చూపించారు. నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. అయితే ఎడారిలో మారథాన్ చాలా కష్టం. అందుకే రాజస్థాన్లోని పోఖ్రాన్లో నాకై నేను 75 కిలోమీటర్ల మారథాన్ సాధన చేసి ఈ అతికష్టమైన ఎడారి మారథాన్కు సిద్ధమయ్యాను’ అని చెప్పింది మహాశ్వేతా ఘోష్. -
13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్
కూతురు పైలెట్.. తండ్రి ప్రయాణికుడు. మరి కాసేపట్లో విమానం గాల్లో ఎగరాలి. కూతురు కాక్పిట్ నుంచి బయటికొచ్చి తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. తండ్రి ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మరిచి నేను ఏ పనీ చేయను అంటున్న భారతీయ పైలెట్ కృతద్న్యా సోషల్ మీడియాలో మెటికలు విరిచే ఆశీర్వాదం పొందుతోంది. ‘ఈ రోజు కోసం నేను 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ఇన్స్టాలో రాసుకుంది పైలెట్ కృతద్న్యా హాలె తన తండ్రితో పాటు ఉన్న తన ఫొటోను పోస్ట్ చేస్తూ. ‘నేను పైలెట్ అవ్వాలని కలలు కంటున్నప్పుడు మా నాన్న తప్ప ఎవరూ నా మీద విశ్వాసం ఉంచలేదు. నా కెరీర్ మొదలెట్టి 13 ఏళ్లు అయింది. ఇవాళ మా నాన్నను ఆకాశం మీదుగా గమ్యాన్ని చేర్చే అవకాశం వచ్చింది’ అని కూడా రాసుకుంది కృతద్న్యా. ముంబై నుంచి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్కి ఎయిర్బస్ 320 తరచూ నడిపే కృతద్న్యా తన తండ్రిని బహుశా స్వదేశం తీసుకు వస్తూనో లేదా స్పెయిన్ తీసుకువెళుతూనో ఒక వీడియో పోస్ట్ చేసింది. విమానం ఎగిరే ముందు కాక్పిట్ నుంచి బయటకు వచ్చి పాసింజర్ సీట్లో కూచుని ఉన్న తండ్రి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఆయన్ను హత్తుకుంది. తబ్బిబ్బవుతూ తండ్రి ఆమెను ఆశీర్వదించాడు. ఆ వీడియోను కృతద్న్యా పోస్ట్ చేస్తూ ‘తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా నేను ఏ పని చేయను. ఒక్కోసారి డ్యూటీకి నేను తెల్లవారుజాము మూడుకో నాలుక్కో ఇంటి నుంచి బయట పడాల్సి వచ్చినా నా తల్లిదండ్రులు గాఢనిద్రలో ఉన్నా వారి పాదాలు తాకి వెళ్లడం అలవాటు’ అని రాసింది. ఈ వీడియోను ఆమె పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దానికి దాదాపు ఐదు లక్షల లైకులు వచ్చాయి. ఇన్స్టాలో చాలామంది నెటిజన్లు ఉద్వేగానికి లోనయ్యారు. ‘నిన్ను, మీ నాన్నను చూసి కన్నీరు ఆగడం లేదు’ అని ఒకరు రాస్తే ‘ఇది అసలు సిసలు భారతీయ సంస్కృతి’ అని మరొకరు రాశారు. ‘నీలాంటి అమ్మాయిలే మాకు రోజూ స్ఫూర్తినిస్తున్నారు’ అని మరొక మహిళ కామెంట్ చేసింది. భారతీయ కుటుంబాల్లో తండ్రీ కూతురు అనుబంధం ప్రత్యేకమైనది. కొందరు కూతుళ్లు అమ్మ కూచిలుగా కాకుండా నాన్న బిడ్డలుగా ఉంటారు. నాన్నతో క్లోజ్గా ఉంటారు. నాన్నలు వారి కోసం ప్రాణం పెడతారు. కృతద్న్యా, ఆమె తండ్రిలో అలాంటి తండ్రీ కూతుళ్లు తమను తాము పోల్చుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో యమా వైరల్గా మారింది. చదవండి: Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?! Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు! View this post on Instagram A post shared by Capt. Krutadnya Hale✈️ (@pilot_krutadnya) -
సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం
‘నేను ఒక సగటు భారతీయ మహిళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న నాకు అందాల సుందరిగా పట్టాభిషేకం చేయడం భారతదేశం నలుమూలల్లో ఉన్న అద్భుతమైన మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు స్వాతి పాల. ఈ యేడాది హాట్ మండే మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత కిరీటాన్ని ఇటీవల స్వాతి పాల అందుకున్నారు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన స్వాతి, హైదరాబాద్లో మీడియా రంగంలోనూ పని చేశారు. కెనడాలో బిజినెస్ అనలిస్ట్గా, ఇద్దరు పిల్లలు తల్లిగా, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న గృహిణిగా, తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న సాధకురాలిగా స్వాతి ఎన్నో సంగతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ఈ ఏడాది ప్రయాణం నాకు చాలా అపురూపమైనది. వివాహిత మహిళల కోసం అత్యంత గౌరవనీయమైన, ప్రసిద్ధి చెందిన ఈ అందాల పోటీలు దుబాయ్లోని రస్ అల్ ఖైమాలోని హిల్టన్ గార్డెన్ ఇన్ లో జరిగింది. ఈ ఫైనల్స్లో దేశ దేశాల నుంచి 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నేను అగ్రగామిగా నిలవడం ఎంతో గొప్పగా, ఆనందంగా అనిపించింది. నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, భూమిని సూచించేలా నన్ను ఎలిమెంట్స్ క్వీన్గా ప్రకటించారు. మాది వైజాగ్. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీయే చేశాను. హైదరాబాద్కి ఉద్యోగరీత్యా వచ్చాక సాక్షి’ టీవీ ప్రారంభం నుంచి నాలుగేళ్లు హెచ్.ఆర్ విభాగంలోనూ, క్రియేటివ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గానూ వర్క్ చేశాను. మా వారి జాబ్ నేవీ కావడంతో తనకు కెనడాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో నేనూ కెనడా వెళ్లాను. అక్కడే బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో అప్లై మా వారు ఆన్లైన్లో ఈ అందాల పోటీల గురించి చూసి, నన్ను ప్రోత్సహించారు. అప్లై చేయించారు. 50 వేల అప్లికేషన్స్లో 110 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక అయిన వారిలో నేనున్నాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఏడాదిగా చాలా సెషన్స్ అయ్యాయి. వాటిలో రకరకాల టాస్క్లు దాటుకుని దుబాయ్లో జరిగిన గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాను. మూడు రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 20 మందితో పోటీ పడి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచాను. కష్టమైనా ఇష్టంతో.. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఈ పోటీలో పాల్గొడానికి చేసిన కృషి చాలా కష్టమైనది. రోజూ జిమ్కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవడం, గ్రూమింగ్ సెషన్స్ తీసుకోవడం, ర్యాంప్ వాక్, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం క్లాసులు .. ప్రతిసారీ టాస్క్ అనిపించింది. ఉద్యోగంతో పాటు ఈ హార్డ్ వర్క్ చేయగలనా.. అని సందేహం కలిగింది. కానీ, ప్రారంభించాక మెల్ల మెల్లగా మామూలు అయిపోయింది. అయితే, ఈ క్లాసులన్నీ దాదాపు ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇండియా నుంచి కోచ్లుగా ఉన్న రితిక రామ్త్రీ మొదటి ఆరు నెలలు, తర్వాత శైలజ సూచి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండియా టైమింగ్స్ను బట్టి నైట్ టైమ్లోనూ కోచింగ్ తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను అనే ఉత్సాహంతో ఈ ప్రయాణం నడిచింది. క్లాసికల్ డ్యాన్సర్ ముందు కష్టం అనుకున్నది మెల్లగా మెల్లగా నా దినచర్య మార్చుకోవడంతో ట్రైనింగ్ సులువుగా మారిపోయింది. సెషన్స్లో ‘మిమ్మల్నే మిసెస్ ఇండియాగా ఎందుకు సెలక్ట్ చేయాలి?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నాను. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకున్నాను. దీంతో డ్యాన్స్లో నాకు సులువు అనిపించింది. పిల్లలే ప్రోత్సాహం కిరీటం వచ్చిందా లేదా అనేది తర్వాతి విషయం. శిక్షణ ఎంత బాగా తీసుకుంటామో ఫైనల్ పోటీలలో ప్రతిఫలిస్తుంది. కానీ, నాలో నాకే చాలా గొప్ప మార్పులు కనిపించాయి. నా పెద్ద కొడుకు తనీష్కి పదకొండేళ్లు. వాడు నా ఫొటోలు తీసి, సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ చేసేవాడు. చిన్నవాడు రేయాన్ ఫుడ్ తీసుకోవడంలో చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ‘నువ్వే గెలవాలి’ అనే వారి తాపత్రయం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. రాబోయే పోటీలు 12వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. కెనడాలో వచ్చే నెలలో జరగబోయే ఆడిషన్స్లో నేను జ్యూరీ మెంబర్గా ఉన్నాను. అయితే, ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయో తెలియాల్సి ఉంది’ అని వివరించారు ఈ మిసెస్ ఇండియా. – నిర్మలారెడ్డి -
పరాన్నజీవులూ, వెళ్లిపొండి.. అమెరికన్ జాత్యహంకార వ్యాఖ్యలు
లండన్: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్ మాల్ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన వీడియో వైరల్గా మారింది. ‘‘నేను అమెరికా పౌరుడిని. అందుకే అమెరికాలో మాత్రమే ఉంటాను. అమెరికా మీ వాళ్లతో నిండిపోతోంది. నువ్వెందుకు పోలండ్ వచ్చావు? పోలండ్ను సైతం భారతీయులతో నింపేస్తారా? మీ సొంత దేశానికి పోరెందుకు? మా దేశాలను ఎందుకు ముంచెత్తుతున్నారు? మీకు భారతదేశముందిగా. మీ దేశాన్ని ఎందుకు సుసంపన్నం చేసుకోరు? కష్టపడి సంపన్నంగా మార్చుకున్న మా దేశాలకు ఎందుకొస్తున్నారు? పోలండ్లోనూ స్థిరపడటం ఈజీ అనుకుంటున్నారా? మీ సొంత దేశానికెందుకు వెళ్లరు? మీరంతా మా జాతిని నాశనం చేస్తున్నారు. నువ్వో ఆక్రమణదారువు. పరాయిదేశంలో బతికే పరాన్నజీవివి. ఇక్కడి నుంచి వెళ్లిపో. మీరు మా యూరప్లో ఉండొద్దు. పోలండ్ పోలిష్ జాతీయులదే’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. అతన్ని ‘గోయిమ్ టీవీ’ అనే విద్వేష గ్రూప్నకు సారథ్యం వహిస్తున్న జాన్ మినడియో జూనియర్గా గుర్తించారు. -
కామన్వెల్త్లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత సైక్లిస్ట్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీల్లో పాల్గొన్న భారత్ మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. విషయంలోకి వెళితే.. గేమ్స్లో భాగంగా సోమవారం సైక్లింగ్లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే ఈ మీనాక్షి సైకిల్పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్ వేగంగా మీనాక్షిపై దూసుకెళ్లింది. దీంతో బ్రయోనీ బోథా కూడా సైకిల్పై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైడర్లిద్దరినీ పోటీ నుంచి తప్పించారు. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్లో ఇంగ్లండ్కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇదే లీ వ్యాలీవెలో పార్క్ వద్ద ఇది రెండో ప్రమాదం. ఇంగ్లండ్కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్లో సైకిల్పై నుంచి పడిపోయాడు. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు. Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she’s ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82 — Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం -
'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్ట్తో సంబంధం అంటగట్టి'
మాజీ జాతీయ సైక్లింగ్ కోచ్ ఆర్కే శర్మపై ఇటీవలే లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఆర్కే శర్మపై వేటు వేసింది. దీనికి సంబంధించిన కేసును సాయ్ ఇటీవలే మానవ హక్కుల కమీషన్కు బదిలీ చేసింది. తాజాగా ఆర్కే శర్మ విషయంలో మరో టాప్ సైక్లిస్ట్.. జాతీయ చాంపియన్ డెబోరా హెరాల్డ్ విస్తుపోయే విషయాలు పేర్కొంది. ''ఆర్కే శర్మతో పాటు అతని అసిస్టెంట్ కోచ్ గౌతామని దేవి నన్ను రెండుసార్లు కొట్టారు. ప్రతీ చిన్న విషయానికి ఎగతాళి చేసేవారు. దానిని అడ్డుకోవాలని చూస్తే మరింత వేధించేవారు. అంతేకాదు మరో మహిళా సైక్లిస్ట్తో నేను రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు కూడా పుట్టించారు. నిజం ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు పుకార్లు పుట్టిన ఆ సైక్లిస్ట్ వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అయితే దీనిని కోచ్ ఆర్కే శర్మ.. అసిస్టెంట్ కోచ్ గౌతామని దేవి వేరే రకంగా ఊహించుకునేవారు. ఒక సందర్భంలో మేము ఉన్న గదిలో ఎయిర్ కండీషనర్ పని చేయకపోవడంతో కింద ఫ్లోర్లో ఉన్న అబ్బాయిల గదిలోకి వెళ్లాం. అంతకముందు వాళ్ల అనుమతి తీసుకున్నాం. ఈ విషయం తెలుసుకోకుండా కోచ్ ఆర్కే శర్మ ఆరోజు ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.'' అంటూ పేర్కొంది. ఇక డెబోరా హెరాల్డ్ 2012 నుంచి భారత్ తరపున సైక్లింగ్లో యాక్టివ్గా ఉంటుంది. ఆర్కే శర్మ నేతృత్వంలో మరింత రాటుదేలిన హెరాల్డ్.. 2014లో జరిగిన ఆసియా కప్ ట్రాక్లో 500 మీటర్ల టైమ్ ట్రయల్లో విజేతగా నిలిచింది. 2015 అక్టోబర్లో జరిగిన తైవాన్ కప్ ఇంటర్నేషనల్ క్లాసిక్లో ఐదు మెడల్స్ సాధించిన హెరాల్డ్.. ఆ తర్వాత ట్రాక్ ఇండియా కప్లో మూడు మెడల్స్ సొంతం చేసుకుంది. ఇక యూసీఐ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానం సంపాదించిన హెరాల్డ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా సైక్లిస్ట్గా చరిత్ర సృష్టించింది. చదవండి: 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్పై భారత మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు -
'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'
క్రీడలు ఏవైనా లైంగిక వేధింపులు సహజం. పాశ్చాత్య క్రీడల్లో భాగంగా ఉన్న ఇలాంటి వేధింపులు భారత్కు పాకాయి. తాజాగా భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. భారత సైక్లింగ్ జాతీయ కోచ్ ఆర్కే శర్మపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్కే శర్మ తనను తన గదికి బలవంతంగా లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. స్లోవేనియాలో జరుగుతున్న సైక్లింగ్ పోటీలకు భారత సైక్లింగ్ టీమ్లో ఐదురుగు పురుషులు, ఓ మహిళా సైక్లిస్ట్ వెళ్లారు. వాస్తవానికి స్లోవేనియాలో భారత జట్టుకి మహిళా కోచ్లు ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో ఆర్కే శర్మ సదరు మహిళకు కూడా కోచ్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గదిలోకి లాక్కెళ్లి తనకు బార్యగా ఉండాలని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా భారత జట్టు సైక్లింగ్ పోటీల్లో పాల్గొని జూన్ 14న స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ టూర్ని మధ్యలోనే రద్దు చేసుకుని, వెనక్కి రావాల్సిందిగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ ఓంకార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్ఐ కలిసి రెండు ప్యానెల్స్తో విచారణ నిర్వహిస్తున్నాయి. ‘అథ్లెట్ ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ఆమె భద్రత దృష్ట్యా, సైక్లింగ్ బృందాన్ని స్వదేశానికి రప్పించడం జరిగింది. కమిటీ ఈ విషయంపై పూర్తి విచారణ చేయనుంది. అతి త్వరలో నిజాలను నిగ్గు తేల్చి, బాధితురాలికి న్యాయం చేస్తాం.’ అని సాయ్ అధికారులు తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే శర్మ ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకోలేదు. త్వరలోనే అతన్ని స్లోవేనియా నుంచి స్వదేశానికి రప్పించి, నోటీసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. చదవండి: మెస్సీకి వీరాభిమాని.. రెచ్చగొట్టే ఫోటోలతో చేతులు కాల్చుకుంది Tiger Woods: వేల కోట్లు వద్దనుకున్నాడు.. బిలీనియర్ అయ్యే చాన్స్ మిస్ -
Priyanka Mohite: రికార్డులు బ్రేక్.. ఫస్ట్ ఇండియన్ ప్రియాంకనే..
భారత ఖ్యాతిని మరోసారి ఓ యువతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన పేరిటి సరికొత్త రికార్డును సృష్టించింది. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగను (8,586 మీటర్లు) గురువారం అధిరోహించారు. దీంతో ప్రపంచంలోని ఐదు.. 8,000 మీటర్ల కంటే ఎతైన శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక ఘనత సాధించారు. ప్రియాంక గురువారం సాయంత్రం 4.52 గంటలకు మౌంట్ కాంచన్జంగా (8,586 మీ)పై తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది” అని ఆమె సోదరుడు ఆకాష్ మోహితే తెలిపారు. ఇక, ప్రియాంక.. తన చిన్నతనం నుంచే పర్వతారోహణపై మక్కువతో మహారాష్ట్రలోని సహ్యాద్రి శ్రేణిలోని పర్వతాలను అధిరోహించడం ప్రారంభించింది. 2012లో ఉత్తరాఖండ్లోని ఉన్న హిమాలయాల్లోని గర్వాల్ డివిజన్లో ఉన్న బందర్పంచ్ను అధిరోహించింది. 2020లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డ్ను ప్రియాంక మోహితే అందుకున్నారు. ప్రియాంక అధిరోహించిన శిఖరాలు ఇవే.. - ఏప్రిల్ 2021లో అన్నపూర్ణ పర్వతాన్ని (8,091 మీ), - 2013లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని (8,849 మీ), - 2018లో ల్హోట్సే (8,516 మీ), మౌంట్ మకాలు (8,485 మీ)ను, - 2016లో మౌంట్ కిలిమంజారో (5,895 మీ)ను అధిరోహించారు. -
వయసుకు సవాలు విసురుతూ.... మరో సాహసానికి సై!
‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు. అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు. సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి. ఈ సాహస బృందంలోని సభ్యులు: 1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ) 2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్) 4. చేతనా సాహు (54, కోల్కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్) 9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్నవూ) ‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు. లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు. ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు. ‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు! 4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్. విజయోస్తు -
ప్రపంచాన్ని ఫిదా చేసిన ‘విశ్వ’సుందరి హర్నాజ్ కౌర్ సంధు.. ఫొటోలు
-
Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Interesting Facts About Harnaaz Sandhu: ప్రపంచం ఎదుట భారతీయ సౌందర్యం మరోసారి మెరుపు నవ్వు నవ్వింది. ప్రపంచం ఎదుట భారతీయ సంస్కారం మరోసారి తన ఎరుకను ప్రదర్శించింది. ప్రపంచం ఎదుట భారతీయ స్త్రీ సౌందర్యకాంక్ష తన శిరస్సు మీదకు జయ కిరీటాన్ని ఆహ్వానించింది. చండీగఢ్కు చెందిన హర్నాజ్ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుంది. 21 ఏళ్ల హర్నాజ్ 2021లో 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మరోసారి ఈ కిరీటాన్ని దేశానికి తెచ్చింది. ‘చక్ దే ఫట్టే ఇండియా’ అని కేరింతలు కొట్టింది హర్నాజ్ కిరీటం గెలిచాక. అంటే ‘సాధించు. గెలుపు సాధించు ఇండియా’ అని అర్థం. నేడు ఇండియా గెలిచింది. ‘విశ్వసుందరి’ మిస్ ఇండియా హర్నాజ్ సంధు (మధ్యలో) ఇరువైపులా రన్నరప్స్ పరాగ్వేకు చెందిన మిస్ నాడియా, సౌతాఫ్రికాకు చెందిన మిస్ లలేలా డిసెంబర్ 12న (మన తేదీ ప్రకారం 13 తెల్లవారుజామున) భారతీయురాలైన హర్నాజ్ సంధు తల మీద విశ్వసుందరి కిరీటం తళుక్కున మెరిసింది. ప్రపంచమంతా కరతాళధ్వనులు మోగిస్తుండగా దేశం అందమైన ఈ విజయంతో ఉత్సాహంగా నిద్ర లేచింది.1994లో సుస్మితా సేన్ మొదటిసారి ఈ టైటిల్ గెలిచి స్ఫూర్తి ఇచ్చాక 2000లో లారా దత్తా రెండోసారి గెలిచాక మూడోసారి టైటిల్కై సాగుతున్న ఎదురుచూపులకు అడ్డుకట్ట వేస్తూ హర్నాజ్ ఈ సౌందర్యాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇజ్రాయిల్ రేవు పట్టణం ఐలత్లో తాత్కాలికంగా నిర్మించిన భారీ ప్రాంగణంలో సుప్రసిద్ధ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే హోస్ట్గా జరిగిన ఈ విశ్వ పోటీలో 80 దేశాల పోటీదారులను దాటి హర్నాజ్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఎర్రసముద్రం మురిసిపోయింది ఎర్రసముద్రం ఒడ్డు మీద ఉన్న 50 వేల జనాభా కలిగిన ఐలత్ పట్టణంలో హర్నాజ్ విజయంతో భారత్ పేరు మార్మోగింది. ఎవరీ అందగత్తె అని ఎర్రసముద్రం తొంగి చూసి మురిసిపోయింది. ‘భారతీయ సౌందర్యానికి నేను బెస్ట్ వెర్షన్ని’ అని పోటీలకు వెళ్లబోతూ వ్యాఖ్యానించిన హెర్నాజ్ 80 దేశాల అందగత్తెలతో తలపడి ముందు టాప్ 16లో ఆ తర్వాత టాప్ 10లో ఆపైన టాప్ 5లో వెళ్లి టైటిల్ మీద ఆశలు రేపింది. టాప్-3లోకి రాగానే ఉత్కంఠ నెలకొంది. చివరి ఇద్దరిలో పరాగ్వే దేశ పోటీదారైన నాడియా చేతులు పట్టుకుని అంతిమ ఫలితం కోసం నిలుచున్న హెర్నాజ్ ‘ఇండియా’ అన్న ప్రకటన వెలువడిన వెంటనే ఆనందబాష్పాలు రాల్చింది. సెకండ్ రన్నర్ అప్గా సౌత్ ఆఫ్రికాకు చెందిన లలేలా నిలిచింది. సౌందర్యంతో పాటు చైతన్యం కూడా అందాల పోటీలో భాగంగా ప్రశ్న–జవాబు ఘట్టంలో లాటరీ ద్వారా ‘గ్లోబల్ వార్మింగ్’ అంశం తన వంతుకు రాగా హర్నాజ్ చైతన్యవంతమైన జవాబు చెప్పింది. ‘ఒకనాడు మనకు మన జీవితం సాక్షాత్కరిస్తుంది. అది వీక్షించదగ్గదిగా ఉండాలని మనం అనుకుంటాం. కాని పర్యావరణానికి మనం చేస్తున్న అవమానకరమైన కీడు వల్ల ఆ జీవితం మనం ఆశించినట్టుగా ఉండదు. ప్రకృతి మరణిస్తుంది. ఇప్పటికైనా ఈ చేటును మనం నివారించగలం. కనీసం అక్కర్లేని లైట్లను ఈ రాత్రి నుంచే ఆఫ్ చేయడం మొదలెడదాం’ అంది. అలాగే ‘నేటి యువతులు ఎదుర్కొంటున్న వొత్తిడిని మీరెలా చూస్తారు’ అనే ప్రశ్నకు ‘నేటి యువతులకు అన్ని శక్తులూ ఉన్నాయి. కాని వారికి వారి పైన నమ్మకం లేదు. ఇతరులతో పోల్చుకుని న్యూనత చెందుతున్నారు. మీరు మీలాగే ఉండటం మీ ప్రత్యేకత అని తెలుసుకోవాలి’ అంటూ సమాధానం చెప్పింది. ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్కు విశ్వకిరీటం దక్కగానే తొలి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్ తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ‘ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ’ అని వ్యాఖ్యానించింది. ఇక లారాదత్తా అయితే ‘విశ్వసుందరుల క్లబ్లోకి ఆహ్వానం. ఈ విజయం కోసం 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేసింది. నిన్న మొన్నటి వరకూ ఒకటి రెండు పంజాబీ సినిమాల్లో నటించింది సంధు. బహుశా అతి త్వరలో ఆమెను బాలీవుడ్ తెర మీద చూడొచ్చు. మధ్యతరగతి విజయం ‘హర్నాజ్ మధ్యతరగతి అమ్మాయి. మధ్యతరగతి అమ్మాయిలు కలలు కని సాధించుకోవచ్చు అనడానికి ఉదాహరణ’ అంటుంది హర్నాజ్ తల్లి రవిందర్ సంధు. ఆమె గైనకాలజిస్ట్గా పని చేస్తున్నారు. హర్నాజ్ తండ్రి పేరు పి.ఎస్.సంధు. ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు హరూన్. వీరి కుటుంబం చండీగడ్లోని మోహలీలో ఉంటుంది. ఒకవైపు అందాలపోటీ జరుగుతుంటే హర్నాజ్ తల్లి దగ్గరలో ఉన్న గురుద్వార్లో రాత్రంతా ప్రార్థనలో కూచుంది. తెల్లవారుజామున హర్నాజ్ టైటిల్ గెలవడం చూసి సోదరుడు హరూన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గురుద్వారాలోని తల్లికి ఈ విషయం తెలియచేశాడు. ‘నా కూతురు తిరిగి రావడంతోటే ఆమెకు ఇష్టమైన ‘మక్కికి రోటీ’, ‘సర్సన్ ద సాగ్’ చేసి పెడతాను’ అంది తల్లి ఉత్సాహంగా. హర్నాజ్ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. సాటి విద్యార్థుల గేలి ఎదుర్కొనేది. అయినా సరే టీనేజ్లోకి వచ్చాక అందాలపోటీ పట్ల ఆసక్తి పెంచుకుంది. 2017లో ‘మిస్ పంజాబ్’ టైటిల్ గెలుచుకుంది. 2019లో ‘మిస్ ఇండియా’లో సెమీ ఫైనలిస్ట్ దశకు చేరుకుంది. ‘అప్పుడు అర్థమైంది నాకు అందాల పోటీ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అని. విశ్వ కిరీటం సాధించడానికి ఆ విధంగా నేను సిద్ధమయ్యాను.’ అంటుంది సంధు. కుటుంబ సభ్యులతో హర్నాజ్ The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 -
భారతీయ మహిళపై పైశాచికత్వం.. నోట్లో పళ్లన్నీ ఊడిపోయేలా..!
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లే ఎందరో అమాయకులు బానిత్వంలో మగ్గిపోతున్నారు. వారిపై యజమానులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. మానవత్వాన్ని మరిచి చేసే హింసల దాటికి బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు. మెల్బోర్న్(ఆస్ట్రేలియా): ఓ భారతీయ మహిళను ఎనిమిదేళ్లపాటు తమ ఇంటిలో బానిసగా ఉంచినందుకు మెల్బోర్న్ దంపతులకు అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కందసామి కణ్ణన్(57), కుముత్తిని కణ్ణన్(53) భార్యాభర్తలు. అయితే కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి మెల్బోర్న్లో స్థిరపడ్డారు. కాగా వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మహిళను 2007లో మెల్బోర్న్కు తీసుకెళ్లారు. కొన్నాళ్లు బాగానే వ్యవహరించిన ఈ వృద్ధ దంపతులు ఆ తర్వాత ఆ మహిళ పట్ల కర్కశంగా వ్యవహరించారు. తిట్టి, కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆమెపై పైశాచికంగా ప్రవర్తించి కొట్టడంతో నోట్లో పళ్లన్నీ ఊడిపోయాయి. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. ఇలా వెలుగులోకి.. కాగా 2015 జులైలో ఆ పెద్దావిడ మూత్రపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆమెను పరీక్షించిన ఓ పారామెడిక్.. మహిళ కేవలం 40 కేజీల బరువు ఉండి, శరీర ఉష్ణోగ్రత కూడా 28.5 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమెకు షుగర్ ఉండగా.. శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో ఆ పారామెడిక్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ భార్యాభర్తలు చేసిన అమానవీయ ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 67 సంవత్సరాలు. ఈ అమానుష ఘటనపై విక్టోరియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ చాంపియన్ తీవ్రంగా స్పందించారు. వృద్ధ దంపతుల పట్ల ఎవరూ.. ఎలాంటి కనికరం చూపరాదని.. వాళ్లు చేసిన పని కచ్చితంగా మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడమేనని న్యాయమూర్తి తీర్పు వెలువరించే సందర్భంలో వ్యాఖ్యానించారు. -
అంతరిక్ష యానం: నాసా వద్దంది.. బ్లూ ఆరిజన్ రమ్మంది!
న్యూయార్క్: ప్రస్తుతం ధనవంతుల అంతరిక్షల యాత్రల సీజన్ కొనసాగుతోంది. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్తో బ్రాన్సన్ నింగిలోకి పయనించగా, త్వరలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షయానానికి రెడీ అవుతున్నారు. ఈ రెండిటిలో భారతీయులు గర్వించే అంశం ఒకటి కామన్గా ఉంది. బ్రాన్సన్ ప్రయాణంలో భారత సంతతి వ్యక్తి శిరీష కీలకపాత్ర పోషించినట్లే, బెజోస్ యాత్రలో సైతం మరో భారతీయ యువతి కీలక పాత్ర పోషిస్తోంది. బెజోస్ రాకెట్ నిర్మాణ బృందంలో మరాఠా అమ్మాయి సంజల్ గవాండే(30) ముఖ్య భూమిక వహించింది. గతంలో ఆమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా పౌరసత్వ సమస్యలతో ఎంపిక కాలేదు. అనంతరం బ్లూ ఆరిజన్లో సిస్టమ్ ఇంజినీర్గా చేరి, ప్రస్తుతం బెజోస్ యాత్రలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని కళ్యాణ్. ఆమె తండ్రి మున్సిపల్ ఉద్యోగి. మహిళ మెకానికల్ ఇంజనీరా? ముంబై యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీర్ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత మాస్టర్స్ చదివేందుకు 2011లో అమెరికాలోని మిషిగన్ టెక్నోలాజిక్ యూనివర్సిటీలో చేరారు. ఒక అమ్మాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంచుకోవడమేంటని గతంలో చాలామంది తనతో అన్నారని, కానీ ఆమె అందరి అనుమానాలు పటాపంచలు చేసి తాము గర్వపడేలా చేసిందని సంజల్ తండ్రి అశోక్ గవాండే ఆనందం వ్యక్తం చేశారు. అంతరిక్ష వ్యవహారాలపై ఆసక్తితో ఏరోస్పేస్ సబ్జెక్ట్ను ఎంచుకుని సంజల్ ఫస్ట్క్లాస్లో పాసయ్యారు. ఆ తర్వాత విస్కన్సిస్లోని మెర్క్యురీ మెరైన్ సంస్థలో, టయోటా రేసింగ్ డెవలప్మెంట్లో చేరారు. బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ రూపొందించిన న్యూషెపర్డ్ నౌక జూలై 20న అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. -
పద్మిని రౌత్ శుభారంభం
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి పద్మిని రౌత్ శుభారంభం చేసింది. రష్యాలో సోమవారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్ తొలి గేమ్లో పద్మిని 36 ఎత్తుల్లో ఉల్వియా (అజర్బైజాన్)పై గెలిచింది. నేడు వీరిద్దరి మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. దీనిని ‘డ్రా’ చేసుకుంటే పద్మిని రెండో రౌండ్కు చేరుకుంటుంది. మరో తొలి రౌండ్ గేమ్లో భారత్కే చెందిన వైశాలి 62 ఎత్తుల్లో కియు జౌ (కెనడా)పై నెగ్గింది. ద్రోణవల్లి హారిక, భక్తి కులకర్ణిలకు నేరుగా రెండో రౌండ్కు ‘బై’ లభించింది. -
భారత కబడ్డీ మాజీ ప్లేయర్ తేజస్వినికి క్రీడా శాఖ సాయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి భర్తను కోల్పోయిన భారత మహిళల కబడ్డీ జట్టు మాజీ సభ్యురాలు వి. తేజస్విని బాయికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి ద్వారా తేజస్వినికి సహాయం అందించారు. కర్ణాటకకు చెందిన తేజస్విని, ఆమె భర్త నవీన్ ఈనెల ఒకటిన కరోనా బారిన పడ్డారు. తేజస్విని ఇంటివద్దే కోలుకోగా... ఆమె భర్త నవీన్ (30 ఏళ్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన తుదిశ్వాస విడిచాడు. నవీన్ తండ్రి కూడా కరోనా వైరస్తోనే మృతి చెందారు. 2011లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ పొందిన తేజస్విని 2010 గ్వాంగ్జూ, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరించింది. తేజస్వినికి ఐదు నెలల పాప ఉంది. ఆర్థిక సాయంగా లభించిన మొత్తాన్ని పాప భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తేజస్విని పేర్కొంది. -
వైల్డ్ ఇన్నొవేటర్ అడవి కూన
అడవిలో జాడలైన వాళ్లకు, అన్వేషణలో అడుగులు వీడని వాళ్లకు ‘వైల్డ్ ఇన్నొవేటర్ అవార్డు’ వస్తుంది! వన్య పరిశోధకుల వినూత్న దృష్టికి గొప్ప అభినందన వంటి ఈ అంతర్జాతీయ అవార్డుకు తొలిసారి ఒక భారతీయ మహిళ ఎంపికయ్యారు. యు.ఎస్. నుంచి ముగ్గురు, కెన్యా నుంచి ఇద్దరు, యు.కె., ఆస్ట్రేలియా కొలంబియా, మొజాంబిక్ నుంచి ఒక్కొక్కరు ఈ అవార్డును గెలుపొందగా.. ఇండియా నుంచి డాక్టర్ కృతి కారంత్ విజేత అయ్యారు. బహుమతి 75 లక్షల రూపాయలు. గౌరవం గగనమంత. విలువ భూగోళమంత. కృతి మాత్రం పుట్టినప్పటి నుంచీ అడవి కూనే! అరణ్యంలో వృక్షాలెన్నో, కృతి కెరీర్లో అవార్డులు అన్ని. అయితే ఇప్పుడొచ్చింది ప్రత్యేకమైన అవార్డు. ఒక విలక్షణమైన వృక్షంతో పోల్చదగిన పురస్కారం. యు.ఎస్. లోని ‘వైల్డ్ ఎలిమెంట్స్ ఫౌండేషన్’ ఈ అవార్డు ఇస్తుంది. బెంగళూరులోని ‘సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్’ (సి.డబ్లు్య.ఎస్.)లో కృతి చీఫ్ కన్సర్వేషన్ సైంటిస్ట్. వన్యప్రాణుల జీవనాన్ని అధ్యయనం చేసి, పరిశోధించి వాటి సంరక్షణకు వినూత్న విధానాలను కనిపెడుతుంటే శాస్త్రవేత్త. 42 ఏళ్ల కృతి ఎప్పటికప్పుడు అప్పుడే కొత్తగా అడవిని, అడవిలో పులులు, సింహాలను చూస్తున్నంత ఉల్లాసంగా ఉంటారు. నిజానికి ఆమె తనకు ఊహ తెలుస్తున్నప్పుడే అరణ్యమార్గంలోకి వచ్చేశారు! నాగర్హోల్ నేషనల్ పార్క్లో ఒక సాయంత్రం తాతగారి తెల్ల అంబాసిడర్ కారులో తండ్రి పక్కన కూర్చొని మెల్లిగా వెళుతున్నప్పుడు ఒక కందకంలో పులి ఆ చిన్నారి కంట పడింది. ఆ కొద్దిసేపటికే చిరుత దర్శనమిచ్చింది. ‘‘నాకది ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది’’ అంటారు కృతి. క్రమంగా కర్ణాటక లోని అటవీ ప్రాంతాలన్నీ ఆమె ఆట మైదానాలు అయ్యాయి. అందుకు తగిన కారణమే ఉంది. తండ్రి డాక్టర్ ఉల్లాస్.. టైగర్ బయాలజిస్ట్! తాతగారు డాక్టర్ శివరామ్ కారంత్ ప్రసిద్ధ రచయిత, పర్యావరణవేత్త. అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల వారితో కలిసి కృతి వన్య జీవన అధ్యయనం తర్వాతి కాలంలో జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత. ప్రకృతిని ప్రేమించే ఇద్దరు వ్యక్తుల దగ్గర పెరిగిన అమ్మాయి ప్రకృతినే కదా ప్రేమిస్తుంది. అయితే వన్యప్రాణుల సంరక్షణ శాస్త్రవేత్త అవుతానని అప్పుడు ఆమెక్కూడా తెలీదు. తల్లిలా, తండ్రిలా, తాతయ్యలా పీహెచ్డీ చేయాలని మాత్రమే అనుకుంది. నార్త్ కరోలీనా వెళ్లి అక్కడి డ్యూక్ యూనివర్శిటీలో పర్యావరణంపై పీహెచ్.డీ చేశారు కృతి. ఆ ముందు వరకు, ఆ తర్వాతా ఆమె చదివిన చదువులు, జరిపిన పరిశోధనలు, చేసిన ఉద్యోగాలు.. దేశంలో, విదేశాల్లో.. అన్నీ కూడా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినవే. చివరికి తను పుట్టిన రాష్ట్రంలోనే పెద్ద సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ అవార్డు! 2011లో ‘నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వాళ్ల రిసెర్చ్ గ్రాంట్ రావడం, తర్వాతి ఏడాదే ‘ఎమర్జింగ్ ఎక్స్ప్లోరర్’గా గుర్తింపు పొందడం కృతి కెరీర్ని విస్తృతం చేశాయి. పది దేశాలు తిరిగి, పది సంస్కృతుల మనుషులతో కలిసిమెలిసి తిరగడం సాధ్యం అయింది. సాధారణంగా సైంటిస్టులు మనుషులతో కలవడానికి ఇష్టపడరు. కృతి మాత్రం ఎక్కడి మనుషులతో అక్కడి మనిషిలా కలిసిపోయారు. కర్ణాటక అరణ్య ప్రాంతాల చుట్టూ కనీసం రెండు వేల ఇళ్లకైనా వెళ్లి వాళ్లతో మాట్లాడి ఉంటారు కృతి! మాట వరకు పైన పది దేశాలను అన్నాం కానీ.. 40 దేశాలకు పైగానే ఆమె పర్యటించారు. అన్ని దేశాలు తిరిగిన ఆమె ఇండియా మొత్తం తిరగకుండా ఉంటారా! దేశంలోని అభయారణ్యాలన్నిటిలో ఒక అడుగు వేసి వచ్చారు. పరిశోధన అవసరమైన చోట అక్కడే కొన్నాళ్లు నివాసం ఉన్నారు. ఆమె పరిశోధనలు బి.బి.సి.లో, ఇంకా అనేక ప్రసిద్ధ చానళ్లలో సీరీస్గా వచ్చాయి. కృతి రియల్ లైఫ్ హీరోలు తండ్రి, తాత, తల్లి ప్రతిభ. ఇప్పుడు ఆమె తన కుటుంబంలోని ముగ్గురికి హీరో అయ్యారు. భర్త అవినాశ్ సొసలే, ఇద్దరు కూతుళ్లు.. ఆమె సెలవు రోజుల్లో ఆమెతో పాటు అడవిలో విహరించే వన్యప్రాణులు అయిపోతారు! వాళ్లతో పాటు ఇంట్లో నల, బఘీర అనే రెండు పిల్లులు వినిపించీ వినిపించనంతగా మ్యావ్ మ్యావ్ మంటూ పులుల్లా సోఫాలు ఎక్కి దిగుతుంటాయి. కృతి సాధించిన పరిశోధనల్లో ఒకటి.. ధ్వని, వాయు కాలుష్యాల నుంచి వన్య జీవులను సంరక్షించడం. -
నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
మొన్నటి ‘పెర్సీ’ రోవర్తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్లకు, తాజా పెర్సీ రోవర్కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ. నాసా ఆఫీస్లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్ల నియంత్రణకు స్క్రీన్ప్లే వంటి సాఫ్ట్వేర్ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్లలో ఒక్క సోజర్న్ రోవర్కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో పైలట్. ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్వేర్కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాసా లేబరేటరీలో రోవర్ల మధ్య వందన -
వెలుగు ఛాయల అడవి చుక్క.
ఫ్రేమ్ని కాస్త వైడ్ చేసింది ఐశ్వర్య. మిణుగురులలోకి నక్షత్రాలు వచ్చి చేరాయి. పచ్చని పాలపుంత విచ్చుకుంది. కడలి నురుగై కాంతి పరచుకుంది. టాపిక్కి కరెక్టు సెట్టింగ్. ఫొటో తీసి పోటీకి పంపింది. అండ్ ది అవార్డ్ గోస్ టు.. ఐశ్వర్య! వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో తొలి భారతీయ మహిళా విజేత! వెలుగు ఛాయల అడవి చుక్క. ఫొటోగ్రఫీలో ఐశ్వర్యకు వచ్చిన అవార్డులను, ఆమె ప్రతిభా విశేషాలను చెప్పుకోవడం మొదలు పెడితే ఆ మహారణ్యంలో ఎక్కడో దారి తప్పుతాం. లేదంటే, ఎంతకూ తరగని ఒక ఫొటో అల్బమ్ను రోజంతా తిప్పుతూ కూర్చోవడమే. ఇంతా చేసి ఈ అమ్మాయి వయసు ఇరవై మూడు! ఇప్పుడు ఇంకొక ఘనత. ‘వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ! ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి 50 వేల మంది పోటీకి ఎంట్రీలను పంపితే ఐశ్వర్య తీసిన ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ ఫొటో దగ్గర జడ్జీల కళ్లన్నీ ఆగిపోయాయి! వండర్ఫుల్ అన్నారు. పదివేల పౌండ్ల ప్రైజ్ మనీ. అవుట్స్టాండింగ్ అన్నారు. ట్రోఫీ. కంగ్రాచ్యులేషన్స్ అన్నారు. ప్రత్యేక ప్రశంశాపటం. పదివేల పౌండ్లంటే సుమారు పది లక్షల రూపాయలు. ఒక మంచి కేనన్ కెమెరా కొనడానికి అయ్యే ఖర్చుకు మాత్రమే ఆ మొత్తం సమానం అయినది కావచ్చు. కానీ, లండన్లోని ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ నుంచి చిన్న గుర్తింపునైనా పొందడం వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లకు చిన్న వయసులోనైనా జీవిత సాఫల్య పురస్కారమే! పోటీలో విజేత ఎంపిక అంత టఫ్గా ఉంటుంది. ఫొటోలు తియ్యమని వాళ్లిచ్చే థీమ్ కూడా ఫ్రేమ్లో ఎలా ఇమడ్చాలో తెలియని విధంగా ఉంటుంది! ‘వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2020’ విజేతగా ఐశ్వర్యను నిలబెట్టిన ఫొటో ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’. బిహేవియర్ : ఇన్వెర్టిబ్రేట్స్.. ఇదీ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ ఏడాది ఇచ్చిన ఫొటోగ్రఫీ పోటీ థీమ్. భూమి మీద కానీ, గాలిలో గానీ, నీటి మీద గానీ కనిపించే వెన్నెముక ఉండని ప్రాణుల నడవడికను ఫొటో తియ్యాలి! టాపిక్ వినగానే.. పోటీకి ఉత్సాహపడుతున్న ‘వైల్డ్’ ఫొటోగ్రాఫర్ల మెడలలోని కెమెరాలు సగానికన్నా ఎక్కువ తక్కువగా చేతుల్లోంచి కిందికి వాలిపోతాయి. మిగిలిన వాళ్లలో ఐశ్వర్య ఉండనే ఉంటారు. పన్నెండేళ్ల వయసు నుంచి అరణ్యాలను చూస్తోంది ఐశ్వర్య. అరణ్యాలలోని ఇన్వెర్టిబ్రేట్స్ నడవడికల్ని చూడలేదా?! ఈ పోటీ కోసం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని భందర్దరా అడవుల్లోకి రాత్రిపూట వెళ్లి అక్కడి మిణుగురులను (ఫైర్ఫ్లైస్) ఎంపిక చేసుకుంది ఐశ్వర్య. అవి ఒక చెట్టునిండా ఉన్నాయి. చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్రేమ్లోకి చెట్టును, మిణుగురులను తీసుకుంది. ఊహు.. ఇలాక్కాదు అనుకుంది. ఫ్రేమ్ని కొంచెం వైడ్ చేసింది. మరికొంచెం చేసింది. నక్షత్రాలను, ఆకాశాన్నీ ఫ్రేమ్లోకి లాక్కుంది. ఇక చూడండి. అదొక పాలపుంత. చుక్కల భ్రమణం. ఆ ఫొటోకి ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ అని పేరు పెట్టి పోటీకి పంపించింది. మోహన కాంతులు అని! అంతే. అవార్డు గ్రహీతగా ఆమె ఫొటో క్లిక్ మంది. గత మంగళవారం లండన్ నుంచి వర్చువల్గా (స్క్రీన్పై) జరిగిన వేడుకలో విజేతగా ఐశ్వర్య పేరును ప్రకటించింది ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’. ఐశ్వర్య వైల్డ్లైఫ్ మీద, ఆడపులుల మీద కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీసింది. మాస్ మీడియాలో పట్టభద్రురాలు. పుట్టింది, ఉంటున్నదీ ముంబైలో. తండ్రి శ్రీధర్ రంగనాథన్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో సభ్యుడు. తండ్రితోపాటు అరణ్య పర్యటనలకు వెళుతుండేది ఐశ్వర్య. అలా ఆమెకు వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. తల్లి రాణి సపోర్ట్ కూడా ఉంది. -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్కు చెందిన చంద్ర దత్తా (34) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్గా ఉన్నారు. వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్ వారం క్రితం మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. చంద్రదత్తా కోల్కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి 2009లో బ్రిటన్ వెళ్లారు. ఆక్స్ఫర్డ్లో వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాలు పంచుకునే ముందు ఆమె పలు ఉద్యోగాలు చేశారు. ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్తోపాటు, ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు, విధానాలు పాటిస్తున్నదీ లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తుంటారు. ‘కోవిడ్ వ్యాక్సిన్ రూపకల్పనలో పాలుపంచుకోవడం సంతోషం కలిగిస్తోంది. గత నెలంతా మేమెంతో ఒత్తిడి అనుభవించాం. అయితే వ్యాక్సిన్ను త్వరగా తయారు చేయగలిగాం’ అని ఆమె చెప్పారు. పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో సెప్టెంబర్, అక్టోబర్లలో భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని, అయితే కరోనా వ్యాక్సిన్ను నెలల వ్యవధిలోనే తయారు చేయగలిగామని చెప్పారు. కరోనాపై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్లు తయారు చేశామని, మరో 1000 వ్యాక్సిన్లు కూడా చేసిన అనంతరం భారీ స్థాయిలో ఉత్పత్తి చేపడతామని చెప్పారు. -
‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు చైనాలో తొలి భారతీయ మహిళ ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్న ఆమె వైద్య ఖర్చులు ఇప్పటికే కోటి రూపాయలు దాటడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనా, భారత ప్రభుత్వాలను సంప్రదించడంతో పాటు క్రౌడ్ఫండింగ్ కూడా మొదలు పెట్టారు. షెన్జెన్లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ప్రీతి మహేశ్వరి (45)కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైద్యులు సోమవారం ధృవీకరించారని ఆమె భర్త అశుమాన్ ఖోవాల్ షెన్జెన్కు చెందిన పీటీఐకి తెలిపారు. న్యుమోనియా, టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ డైస్ఫంక్షన్ సిండ్రోమ్ (మోడ్స్), సెప్టిక్ షాక్తో ఆమె బాధపడుతున్నారు. చైనాలోని షెన్జెన్లోని షెకౌ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్లు, డయాలసిస్ చికిత్స జరుగుతోంది. అయితే ఈ వైద్యానికవుతున్న ఖర్చును సమకూర్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఉద్యోగి అయిన ఆమె సోదరుడు మనీష్ థాపా.. ఆర్థిక సహాయం కోసం బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అలాగే ఆమె ఆసుపత్రి ఖర్చుల సహాయార్థం భారతదేశంలోని హెల్త్కేర్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ద్వారా సహాయాన్ని కోరారు. ప్రీతి అనారోగ్యం పాలైన జనవరి 11వ తేదీ నుంచి చికిత్స ఖర్చు రోజు రోజుకు పెరుగుతోందని థాపా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చికిత్సకు 10 లక్షల చైనీస్ యువాన్లు అంటే.. భారత కరెన్సీలో కోటి రూపాయలు ఖర్చయిందని, దీంతో హెల్త్కేర్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఇంపాక్ట్గురు.కామ్కు సంప్రదించామని, గత నాలుగు రోజుల్లో 410 మంది దాతల నుండి 15.27 లక్షలు విరాళం వచ్చినట్టు చెప్పారు. (ఇంపాక్ట్గురు.కామ్ ప్రకారం ప్రస్తుతం ఇది 844 మంది దాతల నుండి రూ. 27 లక్షలుగా సేకరించింది) దీనిపై భారత ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామన్నారు. సహాయం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందన్నారు. బంధువుల క్షేమ సమచారంపై హుబీ ప్రావిన్స్లోని చాలామంది తమను సంప్రదిస్తున్నారనీ భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చైనాలో నెలకొన్న ఈ ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్న వుహాన్, హుయాంగ్ గాంగ్, ఎఝౌ, ఝిజియాంగ్, ఖియాన్ జింగ్లో నివసిస్తున్న భారతీయులకు అన్నివిధాలా సహాయం చేస్తామని వెల్లడించింది. అక్కడ ఆహార కొరత రాకుండా చూసుకుంటున్నామని చైనా అధికారులు భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు. చైనా నగరం వుహాన్లో 500 మందికి పైగా భారతీయ వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలుస్తోంది. మరోవైపు చైనాలో తమ బంధువుల గురించి తెలుసుకోవాలనుకునే భారతీయుల కోసం ఎంబసీ రెండు హాట్లైన్లు +8618612083629 , +8618612083617ను ఇప్పటికే ప్రారంభించింది. చదవండి : అచ్చం ఆ సినిమాలో లాగనే చనిపోతున్నారు! -
ఎవరు.. ఎందుకు ఉపయోగిస్తున్నారు?
‘స్మార్ట్ ఫోన్లు వచ్చినదగ్గరనుంచి ఈ ఆడవాళ్లు ఎప్పుడు చూసినా ఇంటర్నెట్లోనే ఉంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ తప్ప వీరేం చూస్తారు’ అని నెట్సెర్చింగ్ చేసే ఆడవాళ్లను ఆడిపోసుకుంటుంటారు కొందరు పురుషపుంగవులు. అయితే, ఇంటర్నెట్ వినియోగంలో భారతీయ మహిళ ఏ దిశగా వేళ్లు కదుపుతుందో తెలిస్తే ఇక నుంచి అనవసర మాటలను పెదవి దాటించడానికి కూడా సాహసించరు. భారతీయ మహిళ ‘సాధికారత శక్తి’గా అదీ వేగంగా అభివృద్ధి చెందడానికి తపన పడుతోంది. ఈ నిజాలను భారతదేశం అంతటా మహిళా ఇంటర్నెట్ వినియోగదారుల అలవాట్లను సర్వే చేసిన ‘న్యూ వెరిజోన్ మీడియా’ అధ్యయనం చేసి, విషయాలను తేటతెల్లం చేసింది. చదువు, కెరియర్ డెవలప్మెంట్, సాధికారత, ఆరోగ్యం, ఫిట్నెస్.. వంటివి మహిళలు ఎక్కువగా శోధించే అంశాలుగా తేలింది. ఇక ‘యువ భారతీయ మహిళల అన్లైన్ అలవాట్ల’పై నీల్సన్, వెరిజోన్ మీడియా కలిసకట్టుగా సర్వేలు నిర్వహించారు. 2019 జూలైలో భారతదేశంలో 12 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో కళాశాల విద్యార్థులు, యువశ్రామిక మహిళలు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నారు. వృత్తి నైపుణ్యాలు మెరుగు భారతీయ మహిళలు ఆన్లైన్లోకి వెళ్లిన ప్రతిసారీ వృత్తిపరంగా ముందుకు సాగడానికి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి శోధిస్తున్నట్లు వెల్లడైంది. 44 శాతం మంది మహిళలు ఆంగ్లంలోనూ, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు సెర్చ్చేస్తూ ఉద్యోగం చేయడానికి అనువైన శక్తిని నింపుకుంటున్నారు. ఈ తరహా దృష్టి 18 నుంచి 23 సంవత్సరాల వయసు యువతులలో తీవ్రంగా ఉంది. యువతులు విద్య, కెరియర్, నైపుణ్యాలకు సంబంధించి ఎక్కువ కంటెంట్ను యాక్సెస్ చేయగా, 29 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు వ్యక్తిగత శ్రేయస్సుకు సంబంధించి ఆన్లైన్ వీడియో కంటెంట్ను యాక్సెస్ చేసినట్టు తెలుసుకున్నారు. కచ్చితమైన సమయవేళలు సర్వే చేసిన మొత్తం మహిళలో 80 శాతం భాషకు సంబంధించి ఉండగా వీరిలో 1/5 మంది మాత్రమే ఇంగ్లిష్ భాషకు సంబంధించిన కంటెంట్ను యాక్సెస్ చేశారు. మహిళలు ఎక్కువ శాతం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఆరోగ్యం – ఫిట్నెస్ ఆరోగ్య స్పృహ, శారీరక ఫిట్నెస్కు సంబంధించిన కేటగిరీలో 35 ఏళ్లు దాటిన మహిళల సంఖ్య 70 శాతం ఉంది. వీరే తరచూ ఆరోగ్యం, ఫిట్నెస్కు సంబంధించిన వీడియోలను చూడటం, ఆర్టికల్స్ను చదవడం, షేర్ చేయడం చేస్తున్నారు. వీరు 5 నిమిషాల నిడివి గల వీడియోలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సబ్స్క్రైబ్ చేయడం వంటివి మెట్రో నగరాల్లో 60 శాతం మంది మహిళలు ఆసక్తి చూపుతుండగా, మిగతా పట్టణాలలో ఈ శాతం 46 ఉంది. -
భారత సంతతి ప్రియా.. మిస్ ఆస్ట్రేలియా
మెల్బోర్న్: భారత సంతతికి చెందిన ప్రియా సెరావో మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా–2019 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో భాగంగా 26 ఏళ్ల సెరావో మొత్తం 26 మంది యువతులను వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాను దక్కించుకుంది. దీంతో ఆమె ఈ ఏడాదిలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ప్రియా సెరావ్ భారత్లోనే పుట్టింది. అయితే అనంతరం ఆమె కుటుంబం తొలుత ఒమన్లో.. తర్వాత దుబాయ్లో కొన్నాళ్లు ఉన్నారు. చివరగా ఆమె కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం మెల్బోర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ జాబ్స్, ప్రెసింక్ట్స్, అండ్ రీజియన్స్లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంతకుముందెన్నడూ ఇలాంటి పోటీల్లో పాల్గొనలేదని, మోడలింగ్లో కూడా పాలుపంచుకోలేదని తెలిపారు. మిస్ యూనివర్స్ కిరీటం తనను ఆశ్చర్యపరిచిందని వెల్లడించారు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన బెల్లా కాసింబా, విక్టోరియా మారిజానా రద్మానోవిక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
సాయం చేయండి ప్లీజ్ - సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి ట్విటర్లో బాధితుల పట్ల శరవేగంగా స్పందిస్తూ తన ప్రాధాన్యతను చాటుకుంటున్నారు. ఇథియోపియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల ఆచూకీని కనుక్కోవడంలోనూ ఒక పక్క ఎంబసీ ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ, పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ, మరో పక్క వారి బంధువులకు సమాచారం అందించడంలో మానవతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా పర్యావరణశాఖ కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి ఇంకా ఆమె మరణ వార్త చేరకపోవడంపై ఆమె ట్వీట్ చేశారు. శిఖా గార్గ్ మృతి గురించి చెప్పేందుకు ఆమె భర్తకు ఎన్నో సార్లు ఫోన్ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆమె కుటుంబాన్ని సంప్రదించేందుకు సాయం చేయండి ప్లీజ్ అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. సాయం చేయండంటూ ఆమె నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. కాగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-8 మాక్స్ విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిదిమంది సిబ్బంది సహా 157మంది దుర్మరణం చెందగా, వీరిలో నలుగురు భారతీయులున్నారు. I am trying to reach the family of Shikha Garg who has unfortunately died in the air crash. I have tried her husband's number many times. Please help me reach her family. — Sushma Swaraj (@SushmaSwaraj) March 11, 2019 -
భారతీయ మహిళలకు రూ.9.4 కోట్ల స్కాలర్షిప్
లండన్: బ్రిటన్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం(స్టెమ్) సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేయాలనుకునే భారతీయ మహిళలకు రూ.9.49 కోట్ల(మిలియన్ పౌండ్లు) స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ తెలిపింది. ఈ మొత్తాన్ని బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో 2019–20 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ కోర్సులో చేరే 70 మంది భారతీయ మహిళలకు ఇస్తామని వెల్లడించింది. 2018–19 విద్యా సంవత్సరంలో స్టెమ్స్ కోర్సుల్లో చేరిన 104 మంది భారతీయ మహిళలకు స్కాలర్షిప్లు ఇచ్చామని కౌన్సిల్ భారత డైరెక్టర్ అలెన్ గెమ్మెల్ తెలిపారు. వీరంతా ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్లో ఉన్న 43 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాయాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారని వెల్లడించారు. బ్రిటన్లోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా 2019, జనవరి 30 నాటికి సీటు పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతేడాది స్టెమ్ కోర్సులు పూర్తిచేసిన భారతీయ యువతుల్లో 50 శాతం కంటే ఎక్కువమంది భారత్లోని టైర్–2, టైర్–3 నగరాల నుంచే ఉన్నారని తెలిపారు. గతేడాది దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నతవిద్య కోసం బ్రిటన్ వర్సిటీల్లో చేరారు. బ్రిటన్ సైన్యంలో భారతీయులు.. త్రివిధ బలగాల్లో సిబ్బంది కొరతకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కెన్యా సహా 53 కామన్వెల్త్ దేశాలకు చెందిన యువతను సైన్యంలో చేర్చుకునేందుకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం బ్రిటన్లో ఐదేళ్ల పాటు స్థిరనివాసం ఉండాలన్న నిబంధనను తొలగించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ త్రివిధ దళాల్లో 8,200 మంది సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ దేశాల నుంచి ఈ ఏడాది 1,350 మందిని విధుల్లోకి తీసుకునేలా రూపొందించిన ప్రతిపాదనను రక్షణశాఖ పార్లమెంటుకు సమర్పించింది. బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాల్లో చేరేందుకు యువతులకు అవకాశం ఇస్తున్నారు. బ్రిటన్ సైన్యంలో పనిచేసేందుకు నేపాల్ గుర్ఖాలకు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. -
జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి బిడ్డలకు దూరమైన వారిలో భారత్కు చెందిన ఓ మహిళ ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గుజరాత్కు చెందిన భావన్ పటేల్ (33) అనే మహిళ పట్టుబడగా, వికలాంగుడైన ఆమె కొడుకు (5)ను అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్బంధ కేంద్రంలో ఉంచిందని తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి అమెరికా వేరుచేయడం తెలిసిందే. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో 200 మంది వరకు భారతీయులు ఉండొచ్చని వార్తలొచ్చినా ఇలా వివరాలు వెల్లడవటం ఇదే తొలిసారి. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని వాషింగ్టన్లోని సెనేట్ బిల్డింగ్ ముందు ఆందోళన నిర్వహించిన 600 మంది ప్రజల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఓ ఇల్లాలి ఉల్లాసం
కదిలేంత వరకే జీవితం బెరుకు బెరుగ్గా ఉంటుంది. కదిలాక ఎక్కడ లేని దీమా వచ్చేస్తుంది. కొత్త జీవితం అంటే ఏం లేదు. కొత్త ప్రదేశమే. అది మారిన దేశం కావచ్చు, మారిన రాష్ట్రం కావచ్చు, ఆఖరికి మారిన ఇల్లయినా కావచ్చు. వనితా దురై గోథెన్బర్గ్ వెళ్లే వరకు స్వీడన్లోని ఆ తీరప్రాంత పట్టణంలో నివాసం ఉంటున్న భారతీయ మహిళలు ఎవరికివారిగా ఉండేవారు. ఐదేళ్లయింది వనిత చెన్నై నుంచి అక్కడికి వెళ్లి. వెళ్లేటప్పుడు భర్తకు మాత్రమే ఉద్యోగం. వెళ్లాక తనూ ఒక ఉద్యోగం సంపాదించుకుంది. వాల్వో కార్ల కంపెనీలో చేస్తోంది తనిప్పుడు. అయితే ఆ ఉద్యోగం ఆమెకు ఏమంత తేలిగ్గా రాలేదు. అదనే కాదు, ఏ ఉద్యోగమూ కష్టపడి తెచ్చుకోనిదే రాదు. తిరగాలి. తెలియని భాష మాట్లాడాలి. అప్లికేషన్లో మనకు ఉన్నాయని చెప్పుకున్న ప్రతిభాసామర్థ్యాలకు మించి ఇంటర్వ్యూలో కనబరచాలి. ఉద్యోగంలో చేరాక అంతకుమించి నిరూపించుకోవాలి. అప్పుడే పరాయిదేశంలో స్థిరపడగలం. స్థిరపడ్డాక ఏమిటి జీవితం? రోజూ ఆఫీసుకు వెళ్లిరావడం, రోజూ భర్తను, పిల్లల్ని సిద్ధం చేసి పంపించడం ఇదేనా?! ఇదే కావచ్చు. ఇందులోనే సంతోషం వెతుక్కోవచ్చు. అయితే వనిత ఈ స్థిరత్వంలోనే ఉండిపోదలచుకోలేదు. గోథెన్బర్గ్లో ఉన్న మిగతా భారతీయ ఉద్యోగులను, గృహిణులను కలుపుకుని ఏదైనా చేయాలని అనుకున్నారు. ఏదైనా చెయ్యడం తర్వాత. ముందు కలుపుకోవడం ఎలా? ఫేస్బుక్ ఉందిగా. అందులోంచి వెల్కమ్ చెప్పారు. మంచీచెడ్డా చెప్పుకున్నారు. మీ పిల్లలేం చదువుతున్నారంటే, మీ పిల్లలేం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకున్నారు. పండగలొస్తే వేడుకలు చేసుకున్నారు. దీపావళికి స్వీట్లు పంచుకున్నారు. క్రిస్మస్ వస్తే ఫ్రూట్ కేకులు పంపుకున్నారు. రంజాన్కు శుభాకాంక్షలు తెలుపుకుని ఆత్మీయ విందులకు ఆహ్వానించారు. బర్త్డేలు ఎలాగూ ఉంటాయి. ఏదైనా సాధించిన రోజూ ఉంటుంది. ఇటీవలే ఈ టీమ్లోని ఉల్లాసవంతులంతా కలిసి ఓ సెంట్రల్ మాల్లో ‘ఫ్లాష్మాబ్’ ఈవెంట్లో డ్యాన్స్ కూడా చేశారు. అంతా డ్యాన్సు వచ్చే చేయలేదు. డ్యాన్స్ వచ్చినవాళ్లతో కలసి చేశారు. స్త్రీత్వంలోని సౌందర్యాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అలా గోథెన్బర్గ్లో ఒక అందమైన భారతీయ మహిళా దేశం ఆవిర్భవించింది. ఆ దేశం వ్యవస్థాపకురాలు వనితా దురై. ఆ దేశం పేరు ‘ఇండియన్ ఉమెన్ ఇన్ గోథెన్బర్గ్’. ముప్పై నాలుగేళ్ల వనితా దురై స్వీడన్ తనకెంత బాగా నచ్చిందో చెబుతున్నప్పుడు చూడాలి ఆమె కళ్లను. ఆ మెరుపు గోథెన్బర్గ్ మొత్తాన్నీ వెలిగిస్తున్నట్లుగా ఉంటుంది. ‘‘స్వీడన్ వచ్చాక, ఒక ఉద్యోగం వెతుక్కునేవరకు పరిస్థితులు కాస్త గడ్డుగా ఉన్నట్లనిపిస్తాయి. ఉద్యోగంలో చేరాక అంతా మనోహరంగా మారిపోతోంది. నాకైతే కుటుంబ జీవితానికి స్వీడన్ని మించిన దేశం లేదనిపిస్తుంది. సెలవుల్ని, సాయంత్రాలను ఇక్కడ తప్ప ఎక్కడా ఇంత ఆహ్లాదకరంగా అనుభూతి చెందలేమేమో అనిపిస్తుంది. చుట్టూ అన్నీ మైదానాలే. ఎక్కడా రద్దీ ఉండదు. కాలుష్యం కనిపించదు. శబ్దాలు ఉండవు. ఈ సంస్కృతిలోంచి వీచే ఏ దేవగానమో మార్మికంగా చెవులకు సోకుతూ మనసును ప్రశాంత పరుస్తుంటుంది. అంతా కలిసి కూర్చొని దీర్ఘంగా ముచ్చటించుకుంటూ కాఫీ తాగే ఇక్కడి ‘ఫికా’ కల్చర్ కోసమైనా చెన్నై నుంచి ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణించి రావచ్చు. ఇక్కడి వాళ్లు ఎంత హ్యాపీగా, రియల్గా, కాన్ఫిడెంట్గా ఉంటారో చెప్పలేను. మనం మనలా ఉంటే చాలు, వాళ్లలో కలిసిపోవచ్చు’’ అని వనితా దురై పెట్టిన పోస్టును ఇండియాలో, విదేశాల్లో ఉన్న ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఒక ట్రావెలాగ్లా చదివి గోథెన్బర్గ్ను కాఫీ పరిమళాలతో కలిసి ఆస్వాదిస్తున్నారు. కదిలేంత వరకే జీవితం బెరుకు బెరుగ్గా ఉంటుంది. కదిలాక ఎక్కడ లేని దీమా వచ్చేస్తుంది. కొత్త జీవితం అంటే ఏం లేదు. కొత్త ప్రదేశమే. అది మారిన దేశం కావచ్చు, మారిన రాష్ట్రం కావచ్చు. ఆఖరికి మారిన ఇల్లయినా కావచ్చు. -
అమెరికాలో ఇండియన్ మహిళపై గృహ హింస
సాక్షి, హౌస్టన్: భర్త, అతని తల్లిదండ్రుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న మహిళను, ఆమె ఏడాది చిన్నారిని అమెరికన్ పోలీసులు కాపాడారు. భార్యను హింసించేందుకు ప్రత్యేకంగా తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించుకుని మరీ ఆ భర్త దాడి చేయటం ఇక్కడ విశేషం. ఇండియాకు చెందిన 33 ఏళ్ల సిల్కీ గెయింద్, దేవబిర్ కల్సితో పెళ్లాయ్యాక అమెరికా వెళ్లిపోయింది. వీరికి ఏడాది పాప కూడా ఉంది. అయితే గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన మాట వినని భార్యకు బుద్ధి చెప్పాలని తల్లిదండ్రులను ఫోన్ చేయించి మరీ అమెరికాకు రప్పించుకున్నాడు. పథకం ప్రకారం శనివారం కావాలనే భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆపై ఆమెపై చెయ్యి చేసుకోబోతుండగా ప్రతిఘటించింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతని తల్లిదండ్రులు సిల్కీకి పై దాడికి దిగారు. ఆపై ముగ్గురూ కలిసి ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. ఆ సమయంలో ఆమె కూతురిని ఎత్తుకుని ఉండటంతో ఆ చిన్నారికి కూడా గాయాలయ్యాయి. చివరకు ఆమెను చంపుతామంటూ కత్తితో బెదిరించిన కల్సి తండ్రి ఆమెను ఓ గదిలో పడేశాడు. ఎలాగోలా యువతి తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేయగా, ఆమె తల్లి ఫ్లోరిడా పోలీసులకు సమాచారం చేరవేసింది. హౌస్టన్ లో ఆమె ఉంటున్న నివాసానికి వచ్చిన పోలీసు అధికారి ఎంత సేపటికి తలుపు బాదిన ఎవరూ తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చింది. చివరకు లోపలి నుంచి సిల్కీ గట్టిగా కాపాడాలంటూ అరవటంతో అధికారి డోర్ బద్ధలు కొట్టుకుని మరీ లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఆమె తీవ్ర గాయాలపాలైన ఉండటంతో నిందితులను అరెస్ట్ చేసి హిల్స్ బర్గ్ జైలుకు తరలించారు. దేవబిర్ కు అతని, తల్లిదండ్రులకు దేశ బహిష్కరణ శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సిల్కీకి, ఆమె కూతురికి చికిత్స అందజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
పాక్ కోర్టులో భారత్ విజయం
అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్న పాకిస్తానీ వ్యక్తి ఒకరు తనను బలవంతంగా పెళ్లి చేసుకుని ఆ దేశానికి తీసుకొచ్చారని, తనను తన మాతృదేశమైన భారత్కు పంపేయాలంటూ ఉజ్మా అనే భారతీయ మహిళ పెట్టుకున్న దరఖాస్తును ఇస్లామాబాద్ హైకోర్టు ఆమోదించింది. భారతదేశానికి తిరిగి వెళ్లేందుకు ఉజ్మాకు అనుమతి ఇచ్చింది. ఆమె భర్త తాహిర్ అలీ నుంచి స్వాధీనం చేసుకున్న ఉజ్మా ఒరిజినల్ ఇమ్మిగ్రేషన్ ఫాంను జస్టిస్ మొహసిన్ అఖ్తర్ కయానీ నేతృత్వంలోని హైకోర్టు బెంచి.. ఆమెకు తిరిగి ఇచ్చింది. దాంతో ఉజ్మా స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వాఘా సరిహద్దు దాటేవరకు ఆమెకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. ఉజ్మాను విడిగా కలిసేందుకు అనుమతి ఇవ్వాలని తాహిర్ కోరగా, తన చాంబర్లో కలవొచ్చని జస్టిస్ కయానీ చెప్పారు. కానీ, అతడిని కలిసేందుకు ఉజ్మా నిరాకరించారు. ఈ నెలాఖరుతో ఉస్మా వీసా గడువు ముగిసిపోతుంది కాబట్టి, ఈలోపే తనను భారత్ పంపేలా చూడాలన్నారు. తాహిర్తో తనకు బలవంతంగా పెళ్లి చేశారని, తనపై ఒత్తిడి చేసి నిఖానామా మీద సంతకం చేయించారని అంతకుముందు ఉజ్మా కోర్టుకు తెలిపారు. తుపాకి చూపి బెదిరించి తన పెళ్లి చేశారని చెప్పారు. దాంతో తనకు ఈ పెళ్లి నుంచి విముక్తి కల్పించి భారత్ పంపాలని కోరగా, ఇప్పుడు కోర్టు అందుకు అంగీకరించింది. -
ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి!
-
ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాల్సిందిగా పెళ్లి కోసం పాక్కు వెళ్లి మోసపోయిన భారతీయ యువతి ఉజ్మా శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టును కోరారు. ఢిల్లీచెందిన ఉజ్మా పాకిస్తాన్కు చెందిన తాహిర్ అలీని మలేసియాలో కలుసుకుని, పెళ్లి చేసుకునేందుకు పాక్కు ఈ నెల 1న పాక్కు వెళ్లడం తెలిసిందే. అప్పటికే అలీకి పెళ్లయ్యి నలుగురు పిల్లలు కూడా ఉన్నారనీ, ఈ విషయం ముందుగా తనకు చెప్పకుండా పాక్కు వచ్చాక మోసగించి, బెదిరించి అలీ తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. తన పాస్పోర్టు, ప్రయాణ పత్రాలను కూడా అలీ దొంగిలించాడని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉజ్మా పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్నారు. భారత్కు తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించడంతోపాటు డూప్లికేట్ ప్రయాణ ప్రతాలను అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాలని ఆమె ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫొటోలు తీసినందుకు క్షమాపణ చెప్పిన భారత అధికారి ఊజ్మ కేసు విచారణ సాగుతుండగా పాక్లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పియూష్ సింగ్ అనే సీనియర్ అధికారి కోర్టు లోపల ఫొటోలు తీశారు. ఇది కోర్టు నియమాలకు విరుద్ధం. ఈ విషయం న్యాయమూర్తి దృష్టికి వెళ్లడంతో పియూష్ సింగ్ లిఖిత పూర్వకంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. -
జర్మనీలో భారతీయురాలికి చేదు అనుభవం
బెంగళూరు: బెంగళూరు నుంచి ఐస్లాండ్కు వెళ్తున్న భారతీయ మహిళ శ్రుతి బసప్పకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. తనిఖీ చేసేందుకు దుస్తులు విప్పాలంటూ విమానాశ్రయ భద్రతా అధికారులు ఇబ్బంది పెట్టారని ఫేస్బుక్ పోస్ట్లో ఆమె పేర్కొన్నారు. ‘మొత్తం బాడీ స్కాన్ చేశాకకూడా సిబ్బంది సందేహం వ్యక్తం చేశారు. ‘దుస్తులు మొత్తం విప్పాలన్నారు. చేతులతో తడిమి తనిఖీ చేసుకోమన్నాను. 2 వారాల క్రితం పొట్ట భాగంలో ఆపరేషన్ జరిగిందని, రికార్డుల్ని చూపించాను. దానికీ వారు ఒప్పుకోలేదు’ అని పోస్ట్లో పేర్కొన్నారు. ఐస్ల్యాండ్ జాతీయుడైన తన భర్త గదిలోకి రాగానే అధికారుల తీరు పూర్తిగా మారిపోయిందని, చేతులతో తడిమి వదిలేశారన్నారు. ఇది స్పష్టంగా జాతి వివక్షేనని ఆమె వ్యాఖ్యానించారు. -
అమెరికాలో భారత మహిళకు బెదిరింపులు!
న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా విదేశీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య అనంతరం అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఇందుకు భారత సంతతికి చెందిన ఓ మహిళా ఉద్యోగి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోనే ఉదాహరణ. ఎక్తా దేశాయ్ అనే భారతీయ మహిళ న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో తాను ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. న్యూయార్క్లో లోకల్ ట్రైన్లో వెళ్తుండగా ఓ అమెరికన్ ఆమె వద్దకు వచ్చి అసభ్య పదజాలంతో దూషించాడని తన పోస్ట్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. అమెరికన్ తనపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడగా, ఆ సమయంలో రైల్లో దాదాపు 100 మంది ప్రయాణికులున్నారని తెలిపింది. హెడ్ ఫోన్స్తో తిరుగు ప్రయాణంలో కాలక్షేపం చేస్తున్న తన వద్దకు ఓ వ్యక్తి వచ్చాడని, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని.. మీ దేశానికి వెళ్లిపో (గో బ్యాక్ టూ యువర్ కంట్రీ) అంటూ బెదిరించాడని ఎక్తా దేశాయ్ పేర్కొంది. తాను మాత్రం అతడితో వాదించే ప్రయత్నం చేయలేదట. తన తర్వాత అదే కంపార్ట్మెంట్లో ఉన్న మరో ఆసియా యువతిపై ఇదే తీరున రెచ్చిపోవడంతో రైల్వే పోలీసులకు ఎక్తా దేశాయ్ ఫిర్యాదు చేసింది. మొబైల్లో రికార్డు చేసిన వీడియోను పోలీసులను చూపించింది. తాను తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని, తాను ఏ మహిళను తాకలేదంటూ అమెరికన్ వ్యక్తి చెప్పినట్లు వీడియోలో రికార్డ్ అయింది. పోలీసులు మాత్రం అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని సమాచారం. కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య ఉదంతం అనంతరం ఎక్తా పోస్ట్ చేసిన వీడియో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జాతి విద్వేష దాడులు, కాల్పులపై అమెరికా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
భారత మహిళ యూకేలో దారుణహత్య
లండన్: భారత సంతతికి చెందిన ఓ మహిళ యూకేలో దారుణహత్యకు గురైంది. కిరణ్ దాడియా(46) అనే మహిళను హత్యచేసి సూట్కేసులో మృతదేహాన్ని ఉంచి లీసెస్టర్ లోని క్రొమర్ స్ట్రీట్లో వదిలివెళ్లారు. సూట్కేసును గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. లీసెస్టర్షైర్ పోలీసులు అక్కడకి చేరుకుని సూట్కేసు తెరచిచూడగా రక్తపు మరకలతో ఉన్న కిరణ్ దాడియా మృతదేహాన్ని గుర్తించారు. భారత సంతతికి చెందిన ఈ మహిళ గత 17 ఏళ్ల నుంచి ఓ కాల్ సెంటర్లో జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన ఆమె కనిపించడం లేదని కిరణ్ సోదరి జస్బీర్ కౌర్ పోలీసులకు తెలిపారు. చివరగా జాబ్ వెళ్లే ముందు తన సోదరితో ఫోన్లో మాట్లాడినట్లు వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గురైన మహిళ భర్త అశ్విన్ దాడియా(50)ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అదే ఏరియాలో ఇటీవల తప్పిపోయిన బ్రిటన్ మహిళ మృతదేహమని మొదట తాము భావించామని స్థానికులు చెప్పారు. ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్ దర్యాప్తు జరుపుతోంది. కిరణ్ భర్త అశ్విన్ను కోర్టుకు తీసుకెళ్లనున్నట్లు పోలీసులు చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. తన సోదరి మృతదేహాన్ని చూసిన తన పిల్లలు ఎంతో భయపడ్డారని, అందులోనూ ఇంటికి వచ్చి పోలీసులు విచారణ చేయడం ఇందుకు మరో కారణమని జస్బీర్ కౌర్ చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారని, సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుని వారిని శిక్షించాలన్నారు. అమ్మ అందరితోనే కలిసిపోయే వ్యక్తి అని ఆమె హత్యకు గురయ్యారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామని కిరణ్ దాడియా ఇద్దరు కుమారులు పోలీసుల విచారణలో తెలిపారు. -
అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. తాజా సర్వేలో అత్యంత స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది. షాదీ.కామ్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం తేలింది. ‘ఇటీవలి కాలంలో మీలో స్ఫూర్తి పెంచిన భారత మహిళ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు 33.7 శాతం మంది దీపకే ఓటేశారు. ఈ సర్వేలో మొత్తం 12,500 మంది పాల్గొన్నారు. రెండో స్థానంలో 27.4 శాతంతో రెజ్లర్ సాక్షి మలిక్ నిలిచింది. అయితే ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి మహిళగా నిలిచి రికార్డు సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైపు కేవలం 6.2 శాతం మందే మొగ్గు చూపారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షిస్తున్న మహిళగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (36.3 శాతం) నిలిచారు. నటి ప్రియాంక చోప్రా (31.2), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (17.4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
కాబూల్లో కిడ్నాపైన భారత మహిళ క్షేమం
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో గత నెలలో కిడ్నాప్ కు గురైన భారత మహిళ కథ సుఖాంతమైంది. ఆమె ఆచూకీ శనివారం దొరికిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కోత్ కతాకు చెందిన జుడిత్ డిసౌజా (49) కాబూల్ లోని ఆగాఖాన్ ఫౌండేషన్ లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. జూన్ 9 న ఆమెను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. జూన్ 15 న ఆమె ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. దీనిపై సుష్మా స్వరాజ్ డిసౌజా కుటుంబ సభ్యులకు ఆమెను క్షేమంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. భారతీయ మహిళ కిడ్నాప్ ఘటనలో చర్యలు వేగవంతం చేయాలని భారత విదేశాంగ శాఖ అఫ్ఘాన్ అధికారులను కోరింది. అక్కడి భారత అధికారులను సుష్మ అప్రమత్తం చేశారు. అనంతరం ఎట్టకేలకు జూడిత్ ఆచూకీని భారత్-అఫ్ఘాన్ అధికారులు కనుగొని ఆమెను రక్షించారు. ప్రస్తుతం భారత ఎంబసీ సంరక్షణలో ఉన్న జుడిత్.. త్వరలోనే మాతృదేశానికి తిరిగొస్తారని సుష్మ తన ట్వీట్లలో చెప్పారు. ఆమె ఆచూకీని కనుగొనడంలో చురుగ్గా వ్యవహరించిన భారత ఎంబసీ అధికారి మన్ప్రీత్ ఓహ్రాను ఆమె అభినందించారు. చాలా అద్భుతంగా పనిచేశారంటూ ప్రశంసించారు. తన సోదరి క్షేమ సమాచారం తెలిసిన వెంటనే ఆమె సోదరుడు జెరోమ్ డిసౌజా సుష్మాకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. I am happy to inform you that Judith D'souza has been rescued. @jeromedsouza — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 Judith was abducted in Kabul on 9th June 2016. — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 Thank you Afghanistan - for all your help and support in rescuing #Judith. — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 Ambassador @VohraManpreet - you have done an outstanding job.#Judith — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 Judith D'Souza is with us - safe and in good spirits. She will reach her Motherland at the earliest. Vande Mataram. https://t.co/VAfBWpBAeN — Sushma Swaraj (@SushmaSwaraj) 23 July 2016 -
ఆఫ్ఘాన్లో భారతీయ మహిళ కిడ్నాప్
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్లో తైమని ప్రాంతంలో భారతీయ మహిళను గురువారం రాత్రి ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఆఫ్ఘాన్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆమెను విడిపించేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కిడ్నాప్ను గురైన సదరు మహిళ ఆగాఖాన్ ఫౌండేషన్లో విధులు నిర్వహిస్తున్నట్లు ఆఫ్ఘాన్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కిడ్నాప్ అయిన మహిళను క్షేమంగా విడిపించేందుకు ఆఫ్ఘాన్లోని భారతీయ రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు ఆ దేశ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్నకు గురైన సదరు మహిళ భారత్లోకి కొల్కతాకు చెందిన వారని ఉన్నతాధికారులు చెప్పారు. -
కాబూల్లో భారతీయ మహిళ కిడ్నాప్
కాబూల్: ఆప్ఘనిస్తాన్లోని కాబూల్లో భారతీయ మహిళ కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. ఆగా ఖాన్ ఫౌండేషన్లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్న కోల్కతాకు చెందిన జూడిత్ డిసౌజా(40)ను గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి కిడ్నాప్ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కాబూల్లోని టైమాని ఏరియాలో కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్కు గురైన మహిళ ఆచూకి కోసం ఆప్ఘన్ ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కిడ్నాప్ ఘటన తరువాత కొంత సమయం వరకు ఆమె ఫోన్ ఆన్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారతీయ మహిళ కిడ్నాప్ ఘటనలో చర్యలు వేగవంతం చేయాలని భారత విదేశాంగ శాఖ ఆప్ఘన్ అధికారులను కోరింది. కిడ్నాప్కు పాల్పడింది ఉగ్రవాదులా లేక ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. -
భారత యువతిని పాక్ మేనేజర్ ఏం చేశాడంటే..
దుబాయి: తన అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఓ 19ఏళ్ల భారతీయ యువతి (గృహిణి)పై పాకిస్థాన్కు చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తప్పుడుగా ప్రవర్తించాడు. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. దుబాయ్లోని రషిదియా ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన పాకిస్థాన్ మేనేజర్ ఉన్నాడు. గృహిణిగా పనిచేస్తున్న భారతీయ యువతి తనకు కంప్యూటర్ ఓరియెంటెడ్ జాబ్ కోసం గత కొద్దికాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, ఓ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన పాకిస్థాన్ మేనేజర్.. తన కంపెనీలో సెక్రటరీ ఉద్యోగం ఉందని ఇంటర్వ్యూకు హాజరుకావాలని, అక్కడే కంప్యూటర్కు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి అతడు చెప్పిన అడ్రస్కు వెళ్లాక అది కార్యాలయం కాదని, అతడి ఇళ్లు అని తెలిసింది. ఆ వెంటనే ఏవో మాయమాటలు చెప్పి మెల్లగా ఆమెను తన బెడ్ రూంలోకి తీసుకెళ్లిన అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై మే 26న తీర్పు వెలువరించనున్నారు. -
గర్భవతిని పొడిచిపొడిచి చంపారు
ఒమన్: ఒమన్లో ఓ భారతీయ మహిళా నర్సు దారుణ హత్యకు గురైంది. తన సొంత అపార్ట్ మెంట్లో కత్తిపోట్లకు గురై ప్రాణాలు విడిచి ఆమె విగత జీవిగా పడి ఉంది. మరో విషాదమేమంటే ఆమె గర్భవతి కూడా. ఒమన్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం గర్భవతి అయిన చిక్కు రాబర్ట్ అనే కేరళకు చెందిన మహిళను దాదాపు పన్నెండు సార్లు పొడిచి చంపేశారు. కేరళకు చెందిన ఆమె, తన భర్తతో కలిసి దోఫార్ ప్రావిన్స్ లోని సలాలాహ్ నగరంలోగల బదర్ అల్ సమా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరికి గత నాలుగు నెలలకిందటే వివాహం అయింది. బుధవారం సాయంత్రం పదిగంటల ప్రాంతంలో విధుల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన ఆమె అనంతరం కత్తిపోట్లకు గురైంది. విధులకు హాజరుకానీ తన భార్య కోసం ఇంటికి వెళ్లిన భర్తకు ఆమె విగతజీవిగా కనిపించడంతో అతడు పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఈ విషయం తెలిసింది. వారి ఇంటిపక్కన ఉండే పాకిస్థాన్ వ్యక్తిని పోలీసులు అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. అతడు దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకోవడంతో ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
బాస్ నా జీవితం నాశనం చేశాడు..
భారత మహిళ.. ముంబైకి చెందిన ఫరీదా బేగం ఇప్పుడు దుబాయ్ లో అష్ట కష్టాలు పడుతోంది. యజమాని పాస్ పోర్ట్ విషయంలో చేసిన మోసంతో... చేయని నేరానికి శిక్ష అనుభవిస్తోంది. ఇప్పటికే తనకు పడిన సుమారు ఐదున్నర లక్షల రూపాయల జరిమానాతో ఆమె తిరిగి ఇండియా రాలేక, అక్కడ మరో ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆందోళనలో ఉంది. కాస్మెటిక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా.. శిక్షణ పొందిన బ్యూటీషియన్ గా ఫరీదా బేగం 45 వేల రూపాయల జీతంతో ఉద్యోగానికి మే , 2014 లో దుబాయ్ వెళ్ళింది. అప్పట్లో రెసిడెన్స్ వీసా కోసం ఆమె ఓ మెడికల్ టెస్ట్ కూడ చేయించుకున్నట్లు చెబుతోంది. కానీ ఆమె వీసా దరఖాస్తు అధికారికంగా అమల్లోకి రాలేదు. '' నేను ఇమిగ్రేషన్ కోసం వెళ్ళాను. నా ఎంట్రీ పర్మిట్ గతేడాది జూన్ 26 న ముగిసి పోయిందని, అప్పటినుంచీ జరిమానా మొదలైందని చెప్పారు. అంతకు ముందే నా పాస్ పోర్ట్ పై వీసా స్టాంపింగ్ అయి ఉండాలి. కానీ కాలేదు. నేనెప్పుడు అడిగినా నా యజమాని ఏవో సాకులు చెప్పేవాడు. చివరికి ఇప్పుడు అతడిపై పోలీస్ కేస్ పెట్టి, లేబర్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాను. నాకు ఫేవర్ గా కోర్టు, పోలీసులు ఉన్నప్పటికీ అతను పెద్దగా భయపడటం లేదు.'' అంటోంది బాధితురాలు ఫరీదా. ''ఉద్యోగం క్రమబద్ధీకరిస్తాడన్న ఆశతో నేను మూడు నెలల పాటు జీతం కూడ లేకుండా ఉద్యోగం చేశాను. ఓరోజు షాప్ కు వెళ్ళేసరికి మూసి వేసి పారిపోయాడని తెలిసి షాకయ్యాను. ఆ తర్వాత నా ఫోన్ కాల్ కి ఆన్సర్ చేయడం కూడ మానేశాడు. నాకు రెండున్నర లక్షల దాకా జీతం ఇవ్వాలి. అంతేకాదు నేను అరెస్టయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా జీవితం, నా భవిష్యత్తు రోడ్డున పడ్డాయి'' అంటూ ఫరీదా ఆవేదన చెందుతోంది. సంవత్సరం పాటు దుబాయ్ లో అక్కడక్కడా తల దాచుకున్న ఫరీదా బేగం, ఇటీవలే ఓ ఇండియన్ ఫ్యామిలీ ఇచ్చిన ఆశ్రయం పొందుతోంది. ఇప్పుడు మరో ఉద్యోగానికి అవకాశం వచ్చినా సరైన వీసా లేక అవకాశాన్ని కోల్పోతోంది. ఇండియా వచ్చినా తనకు ఎవ్వరూ లేరని, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో, ఉన్న ఇంటిని కూడ అమ్మి దుబాయ్ వెళ్ళిన తాను ఇండియా వచ్చే అవకాశం కూడ లేదని చెప్తోంది. దుబాయ్ లో భారత్ కాన్సులేట్ జారీ చేసిన తాత్కాలిక పాస్ పోర్ట్ కూడ సెప్టెంబర్ 2016 నాటికి గడువు ముగిసిపోతుంది. దిక్కు తోచని స్థితిలో ఉన్న తనకు తగిన సహాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫరీదా బేగం దీనంగా వేడుకుంటోంది. -
భారతీయుడిని చంపిన మహిళకు 24 ఏళ్ల జైలు
న్యూయార్క్: భారతీయుడిని రైలు పట్టాల పైకి తోసి చంపిన కేసులో 33 ఏళ్ల అమెరికా మహిళకు ఇక్కడి కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మత విద్వేషంతో చేసిన ఈ నేరాన్ని ఎరికా మెనెండెజ్ అనే మహిళ క్వీన్స్ సుప్రీం కోర్టులో అంగీకరించింది. జడ్జి గ్రెగరీ లసక్ ఆమె చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. 2012 డిసెంబర్ 27న సునందో సేన్ (46) సబ్వే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాంపైన ఉన్నప్పుడు వెనకవైపు నుంచి వచ్చిన మెనెండెజ్ రైలు సమీపిస్తుండగా అతడిని పట్టాలపైకి తోసేసింది. తీవ్రగాయాలపాలైన సునందో సేన్ మరణించాడు. అనంతరం మెనెండెజ్ను పోలీసులు అరెస్ట్చేయగా తనకు ముస్లింలు, హిందువులంటే ద్వేషమని చెప్పింది. ‘ఇది దారుణ హత్య. మెనెండెజ్ చర్య న్యూయార్క్ నగరాన్ని మొత్తం వణికించింది. రోజూ లక్షలాది మంది కార్యాలయాలకు, స్కూళ్లకు, ఇతర గమ్యాలకు వెళ్లడానికి రైళ్లు ఎక్కుతుంటారు. ఇలాంటి ఘటనలు జరిగితే భద్రంగా ఉన్నామని ఎలా భావిస్తారు’ అని జడ్జి పేర్కొన్నారు. -
కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య
లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నియాలోని అల్బేనీలో ఉంటూ దంత విభాగంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ మహిళ(37) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె తలలోకి బుల్లెట్ దూసుకెళ్లిన గాయంతో తాను ఉంటున్న అపార్ట్మెంట్లో విగత జీవిగా పడిఉంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో దంత వైద్య విద్యను అభ్యసిస్తున్న రణధీర్ కౌర్ ఈ నెల 8న సాయంత్రం 4గంటలకు తన అపార్ట్మెంట్లో చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె అప్పుడప్పుడు సిక్కు దేవాలయానికి వెళ్లి ప్రార్ధనలు చేస్తుంటుంది. అదే రోజు కూడా మధ్యాహ్నం ప్రార్థనలకు వెళ్లొచ్చిన అనంతరం ఈ ఘటన జరగడంతో రెండు గంటల వ్యవధిలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆ ఆపార్ట్మెంట్లోకి ఎవరు వచ్చి వెళ్లినట్లుగానీ, ఇంట్లో వాతావరణం చెడిపోయినట్లుగానీ ఆధారాలు లభించలేదు. ఆమె వ్యక్తిగత వస్తువులు పరిశీలించినా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరైన హత్య చేసి ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
అది జాతి వివక్ష హత్య కాదు!
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని శనివారం జరిగిన భారతీయ ఐటీ కన్సలెంట్ ప్రభా అరుణ్ కుమార్ హత్య జాతి వివక్షతో జరిగినట్లు లేదని ఆ దేశ పోలీసులు స్పష్టం చేశారు. ఇది జాతి వివక్షతో చేసిన హత్య అనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తుకు ప్రత్యేక డిటెక్టివ్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు భారత కౌన్సిల్ జనరల్ సంజయ్ సుధీర్ తెలిపారు. కేసును ఛేదించేందుకు పోలీసులు ఇప్పటికే ప్రభు హత్యకు ముందు ఇంటి వద్ద నడుస్తు వెళుతున్న సీసీ ఫుటేజ్ ను విడుదల చేశారు. ప్రభ తన భర్తతో మాట్లాడుతూ వెళుతుండగా ఆమెను కొందరు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియాలో భారత మహిళ హత్య
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ భారత మహిళా ఐటీ కన్సల్టెంట్ దారుణ హత్యకు గురయ్యారు. సిడ్నీ శివారులోని వెస్ట్మీడ్ పారామట్టా పార్కులో శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రభా అరుణ్ కుమార్(40) అనే ఐటీ కన్సల్టెంట్ను గుర్తు తెలియని దుండగులు కత్తులలో విచక్షణారహితంగా పొడిచారు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పారామట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా తమకు తెలియజేసి కేసు దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభ ఆఫీస్ విధులు ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె మేనల్లుడు త్రిజేష్ తెలిపారు. ఆమె బెంగళూరులోని తన భర్త అరుణ్తో ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తుండగా దుండగుడు తనను వెంబడిస్తున్నాడని చెప్పిందని తెలిపారు. ‘నన్ను వెళ్లనివ్వండి, కావాలంటే నా బ్యాగ్ తీసుకోండి, ఇంకా ఏమి కావాలన్నా ఇస్తాను’ అని చెబుతుండగానే ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అయిందని చెప్పారు. ఆమె ఇంటికి 300 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే అర్వాంద్ అమిరియన్ అనే స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. సిడ్నిలోని భారత కాన్సులేట్ జనరల్ వెంటనే అప్రమత్తమయ్యారని, ఘటనపై తగిన చర్యలు తీసుకుంటున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. వీసా గడువు ముగియగానే స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆమె భావించిందని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ప్రభ ఇరుగుపొరుగు వారు చెప్పారు. ప్రభ భర్త ఆస్ట్రేలియాకు బయల్దేరారు. -
సిడ్నీలో భారతీయ మహిళ దారుణహత్య
-
సిడ్నీలో భారతీయ మహిళ దారుణహత్య
ఆస్ట్రేలియా: ఓ భారతీయ మహిళ దారుణహత్యకు గురైంది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు పొడిచి చంపారు. ఈ ఘటన సిడ్నీలో ఆదివారం వెలుగుచూసింది. సిడ్నీ కాలమానం ప్రకారం.. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఆమెపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో వెనకనుంచి ఓ వ్యక్తి వచ్చి కత్తితో పొడిచాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలు భారతీయ మహిళ ప్రభా అరుణ్(41)గా పోలీసులు గుర్తించారు. ఆమె సిడ్నీలో ఐటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, శివారుప్రాంతం కావడంతో... కొందరు వ్యక్తులు డబ్బులు కోసం ఇటుగా వెళ్లవాళ్లపై దాడులకు పాల్పడుతుంటారని పేర్కొన్నారు. ఒంటిరిగా వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కాగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారతనారి టాలెంట్లో పుల్.. ఆరోగ్యంలో నిల్!
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బహుముఖ ప్రజ్ఞ పాటవాలను ప్రదర్శించడంలో భారత నారీమణులు తిరుగులేని వారని ఓ సర్వే తేల్చింది. అయితే, ఆరోగ్యం విషయంలో మాత్రం వారికి పూర్తి అలసత్వం ఉంటుందని కుండబద్దలు కొట్టింది. జీవితా బీమాను అందించే సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్ భారత స్త్రీలపై సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. దేశంలో కేవలం 39శాతం స్త్రీలు మాత్రమే జీవిత బీమాను కలిగి ఉన్నారని ఇది ఆందోళనకరమైన విషయమని సర్వే పేర్కొంది. ఏ పనిలోనైనా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించే వీరంతా ఎందుకు ఆరోగ్య బీమా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్దం కావడం లేదని, బహుషా వీరు వివిధ పనుల్లో బిజీ అవడం వల్లే అలా ఆలోచించలేకపోతుండొచ్చని కూడా సర్వే తెలిపింది. గత ఫిబ్రవరిలో ఆన్లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించగా అందులో 16 శాతం మంది మహిళలు అసలు హెల్త్ చెకప్లే చేయించుకోరని, 63 శాతం మంది మాత్రం ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతేనే ఆస్పత్రి ముఖం చూస్తారని పేర్కొంది. -
ఒమన్ లో భారత మహిళ మృతి
దుబాయ్: ఒమన్ లోని సుర్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత మహిళ ఒకరు మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలు ఖదీజగా గుర్తించారు. గాయపడిన వారిలో ఆమె కుమారుడు, కారు డ్రైవర్, మరో ప్రయాణికురాలు ఉన్నారు. ఖదీజ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సుర్ నగరంలోని భారత సామాజిక కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. -
తెగువే మగువకు రక్షణ
సిటీ బస్సులు... కాలేజీ సెంటర్లు... ఎంఎంటీఎస్లు... ఏరియా ఏదైనా ఈవ్ టీజింగ్ మాత్రం కామనయిపోయింది. అమ్మాయిలను వేధించి ఆనందించే ఆకతాయిలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చట్టాలు... వ్యవస్థలు... ఎన్ని ఉన్నా రోజూ ఎక్కడో అక్కడ ఈవ్ టీజర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. మరి దీనికి ఫుల్స్టాప్ పెట్టేదెవరు..? అమ్మాయిలను రక్షించేదెవరు? ఇవే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసే కంటే.. మనల్ని మనం రక్షించుకొనే ప్రయత్నం చేస్తే వీటి నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చని చూపారు హర్యానా సిస్టర్స్. బస్సులో వెంటాడిన ఈవ్ టీజర్లను బెల్టు తీసి భరతం పట్టిన వీరిలా అందరూ తెగువ చూపాలంటున్నారు మాదాపూర్ శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థినులు. వారి చర్చే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’... మానస: హర్యానాలో జరిగిన బస్సు సంఘటన వీడియో చూసి హ్యాపీగా ఫీలయ్యా. ఒక్క క్షణం ఇది నిజమేనా అనిపించింది. నిజంగా భారతి, పూజ ప్రతి ఒక్క భారతీయ మహిళకు ఆదర్శం. స్నేహ: యా మానస.. ఆ సీన్ చూడగానే నేను బస్సులో ఎదుర్కొన్న సంఘటనలన్నీ కళ్ల ముందు తిరిగాయి. ఓసారి బస్సులో కాలేజీకి వస్తుంటే... మా ఫాదర్ ఏజ్ ఉంటుంది అతనికి. పక్కనే నిలబడ్డాడు. కావాలని నా చేతిని టచ్ చేస్తున్నాడు. రెండు మూడుసార్లు చూసి ‘ఏం కావాలి?’ అంటూ అరిచాను. బస్ బాగా రష్గా ఉందంటూ చెప్పాడు. నిశ్చల: బస్సుల్లో ఇవి కామనయిపోయాయి. అయితే ఎంతమంది అమ్మాయిలు ఎదురుతిరుగుతున్నారనేది ప్రశ్న. ఈ మధ్యనే మా ఫ్రెండ్ బస్లో వెళుతుంటే ఓ యాభై ఏళ్ల వ్యక్తి తనను బాగా ఇబ్బంది పెట్టాడు. నలుగురిలో అతన్ని ఎదిరిస్తే తనెక్కడ అల్లరి అవుతుందోననే భయంతో బస్సు దిగేసింది. టీనా: ఇట్స్ టూ బ్యాడ్. కనీసం ఆమె అతన్ని కొట్టక్కర్లేదు... గట్టిగా నాలుగు మాటలంటే... చుట్టుపక్కలవారికి భయపడైనా దూరంగా జరిగేవాడు కదా! నిశ్చల: నో... టీనా ఇలాంటి సందర్భాల్లో అమ్మాయినే తప్పుపట్టేవారున్నారు. హరిణి: యస్... ఆ అమ్మాయి కాస్త మోడ్రన్ డ్రెస్ వేసుకుందనుకో... సపోర్ట్ చేయకపోగా కామెంట్ చేసేవారూ ఉన్నారు. టీనా: అఫ్కోర్స.. కాలం మారింది. బస్సులో ఆకతాయిలతో పాటు మనలాంటి పిల్లలున్న అమ్మానాన్నలు కూడా ఉంటున్నారు కదా.. వారు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. హరిణి: హర్యానా బస్సు ఇన్సిడెంట్లో అక్కాచెల్లెళ్లు తమకు ఇబ్బంది అనిపించగానే... చుట్టుపక్కలవారు ఏమనుకుంటారని ఆలోచించలేదు. బెల్టు తీసి బుద్ధి చెప్పడానికి సిద్ధపడ్డారు. మనమైనా అలాగే ఆలోచించాలి. సౌందర్య: ఎగ్జాట్లీ... నాకూ ఇలాంటి అనుభవం ఒకటుంది. అయితే ఇక్కడ టీజ్ చేసింది బస్ కండక్టరే. టికెట్లు తీసుకున్న తర్వాత కూడా కావాలని వెనక్కి, ముందుకీ ఓ పదిపదిహేను సార్లు మమ్మల్ని తోసుకుంటూ తిరుగుతున్నాడు. ఇక లాభం లేదని... నా దగ్గరికి రాగానే వాడి కాలుని నా హైహీల్స్తో గట్టిగా తొక్కా. దెబ్బకు కిక్కురుమనకుండా వెనక్కి వెళ్లిపోయాడు. అనూష: ఒక్క బస్సు సంఘటనలే కాదు... మిగతా చోట్లా ఆడవాళ్లను వేధిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా తెలిగా వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. స్నిగ్ధ: యస్... మనం ఆ పని చేయాలే గానీ సొసైటీ తప్పనిసరిగా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతుంది. టీనా: ఇక్కడ సొసైటీ ఎవరు స్నిగ్ధ? మనం ఇంకా ఎవరో వస్తారని, ఏదో చేస్తారనే లోకంలోనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతి, పూజ సంఘటన చూడు. ఎపిసోడ్ మొత్తంలో ఆ అక్కాచెల్లెళ్ల రియాక్షన్ మాత్రమే ఉంది. బస్సు నిండా పదుల సంఖ్యలో ఆడవాళ్లు, మగవాళ్లు ఉన్నారు. వారెవరూ స్పందించలేదు. అస్మిత: వాళ్లిద్దరూ టీజర్లని చితకబాదింది చుట్టూ ఉన్నవారిని చూసి కాదు... వారిలో ఉన్న ధైర్యం, అందుబాటులో ఉన్న బెల్టుని చూసుకుని. అంటే ఆత్మరక్షణే ఈ సమస్యకు పరిష్కారం. గుణపాఠం భారతి, పూజని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించాలనుకున్న నిర్ణయం చాలా గొప్పది. పాఠాలు వేరు, గుణపాఠాలు వేరు. ఈ రోజు వారు మగవారి వంచనకు గురవుతున్న మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఎలాంటి సందర్భంలోనూ మగవారి వేధింపులను భరించాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న ఏ చిన్న వస్తువునైనా ఆయుధంగా మలచుకుని ఎదురుతిరగాలి. - అజిత సురభి, డెరైక్టర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ భువనేశ్వరి ఫొటోలు: రాజేష్రెడ్డి -
దుబాయ్లో ఎన్నారై మహిళకు జీవితఖైదు
తాను పని చేస్తున్న ఇంట్లో యజమాని కూతురిని చంపినందుకు దుబాయ్లో ఓ భారతీయ మహిళకు జీవితఖైదు విధించారు. సెలవు ఇవ్వలేదన్న కోపంతో 11 నెలల బాలికను చంపినందుకు ఈ శిక్ష పడింది. ఆర్.టి. అనే ఇంటిపేరున్న నిందితురాలు.. తన యజమాని ఇంట్లో లేని సమయంలో ఆ చిన్నారి బాలిక మెడకు స్కార్ఫ్ బిగించి, పీకనొక్కి చంపేసింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆమె ఈ హత్య చేసినట్లు కోర్టులో రుజువైంది. తొలుత ఆమె తాను ఆ పాపను హత్య చేయలేదని, కేవలం మంచం మీద పడుకోబెట్టానని కోర్టులో చెప్పింది. ఆమెను తన సొంత కూతురిలా ప్రేమించానంది. తనకూ ఇద్దరు పిల్లలున్నారని, అందువల్ల ఇలాంటి దారుణానికి పాల్పడే అవకాశమే లేదని తెరలిపింది. అయితే, ఆమె తన యజమాని బయటకు వెళ్లే వరకు ఆగడం.. స్కార్ఫ్ కొనుక్కుని తీసుకొచ్చి పాప మెడచుట్టూ చుట్టి, ఆమె నోట్లోంచి ఎలాంటి అరుపులు రాకుండా నోరు నొక్కడం అన్నీ రుజువయ్యాయి. తర్వాత ఏమీ ఎరగనట్లు ఇంట్లో పని చేసుకుంటూ ఉండిపోయింది. తర్వాత బాలిక తల్లికి అనుమానం రావడంతో తన సోదరికి ఫోన్ చేసి.. ఇంటికి వెళ్లాల్సిందిగా చెప్పింది. తీరా ఆమె వచ్చి చూస్తే పాప కదలట్లేదు. వెంటనే ఆస్పత్రికి తరలించినా, రెండు గంటల క్రితమే మరణించినట్లు చెప్పారు. -
సబ్సిడీపై 12 సిలిండర్లు
-
సబ్సిడీపై 12 సిలిండర్లు
కేంద్రంలో మాకు మెజారిటీ రాకుండా కుట్ర బలహీన ప్రభుత్వం ఏర్పడేలా మాపై అసత్య ఆరోపణలు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కాంగ్రెస్పై రాజ్నాథ్ నిప్పులు సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ తమపై కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకుండా, కేవలం పేలవ ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కుట్రపన్నుతోందని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్జైట్లీలతో కలసి రాజ్నాథ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు. భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, హరిబాబు, వీర్రాజు, శాంతారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ప్రత్యేక ఆహ్వానితుడిగా కృష్ణంరాజు పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు రాంలీలా మైదాన్లో జరగనున్నాయి. రాజ్నాథ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: యూపీఏ పదేళ్ల పాలనపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని తెలుసుకున్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకుండా, బలహీన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా అసత్య ఆరోపణలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఓటుబ్యాంకు రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్...మన వల్ల లౌకిక వాదానికి పెనుముప్పంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దీన్ని తిప్పికొట్టేందుకు యూపీఏ పాలనలో జరిగిన స్కాంలు, ఆర్థిక వ్యవస్థ పతనం, ఓటుబ్యాం కు రాజకీయాల వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లోక్సభ ఎన్నికల్లో 272 స్థానాల్లో గెలిచి సంపూర్ణ మెజార్టీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తాం. భేటీలో ఏం చేశారంటే... 272 కన్నా ఎక్కువ సీట్ల సాధనకు రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులపై అగ్రనేతల మేధోమథనం. ఒక ఓటు ఒక నోటు కార్యక్రమం ద్వారా పల్లెపల్లెకు వెళ్లడం, పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి, బూత్స్థాయిల్లో సమావేశాల నిర్వహణ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలు, ప్రచార వ్యూహాలపై చర్చ. ఆర్థిక, రాజకీయ తీర్మానాలకు తుదిరూపు సిక్కుల ఊచకోత గుర్తులేదా: బీజేపీ బీజేపీతో లౌకికవాదానికి ముప్పన్న సోనియాగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. దశాబ్దాలపాటు సాగిన కాం గ్రెస్ పాలనలో 13 వేల అల్లర్లు జరిగాయని, 70 వేల మందికిపైగా మృత్యువాతపడటానికి కాంగ్రెస్ మతఛాందసవాద విధానాలే కారణమన్నారు. ముఖ్యంగా తమ పార్టీపై మతతత్వ ముద్ర వేస్తున్న కాంగ్రెస్కు 10 వేల మంది సిక్కుల ఊచకోత ఎవరి హయాంలో జరిగిందో గుర్తులేదా? అని దుయ్యబట్టారు. -
భారతీయ మహిళకు డబ్ల్యూహెచ్వోలో ఉన్నత స్థానం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరక్టర్గా భారతీయురాలైన పూనం ఖేత్రపాల్ సింగ్ ఎన్నికయ్యారు. 44ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతీయులకు ఈ పదవి దక్కడం ఇదే ప్రథమం. ప్రస్తుతం డబ్ల్యూహెచ్వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరక్టర్గానున్న థాయ్లాండ్ వాసి సామ్లీ ప్లియాన్బాంగ్చాంగ్ పదేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో ఎన్నిక నిర్వహించారు. డబ్ల్యూహెచ్వో ఆగ్నేయాసియా విభాగంలోనున్న 11 దేశాల (భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్లాండ్, ఇండోనేషియా, శ్రీలంక, మాల్దీవులు, తిమోర్ లెస్టే, దక్షిణ కొరియా) ఆరోగ్య మంత్రుల సమావేశంలో పూనం ఎన్నికను గురువారం అధికారికంగా ప్రకటించారు. పూనం ప్రస్తుతం సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యకరమైన పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్గా, డైరక్టర్ జనరల్ కేబినెట్ సభ్యురాలిగా జెనీవాలోని డబ్ల్యూహెచ్వో కార్యాలయంలో పనిచేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, ఇలాంటి అత్యున్నత పదవికి భారతీయ మహిళ ఎన్నికకావడం డబ్యూహెచ్వో కీలక భాగస్వామిగా భారత్ ఆరోగ్యం, అభివృద్ధి రంగాల్లో బహుముఖ పాత్ర పోషించడానికి మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. -
ఒమన్లో రూ.65 కోట్లకు భారత మహిళ టోపీ
దుబాయ్: పెట్టుబడిదారులకు రూ.65 కోట్ల మేర టోపీ వేసిన ఓ భారత మహిళ ఒమన్ నుంచి ఉడాయించింది. తాను పలు ప్రాజెక్టులకు ఇన్చార్జినని పేర్కొంటూ ఒమన్ మంత్రిత్వ శాఖకు చెందిన నకిలీ పత్రాలను చూపించి, తమను మోసగించినట్లు బాధితులు తెలిపారు. వారంతా భారత్కు చెందినవారేనని ‘టైమ్స్ ఆఫ్ ఒమన్’ తెలిపింది. తమ పెట్టుబడికి కొన్ని నెలలవరకూ వడ్డీ సక్రమంగానే చెల్లించిందని, తర్వాత ఎగ్గొట్టిందని ఓ బాధితుడు తెలిపారు. ఆమె ఈ ఏడాది మే నెలలో ఒమన్ నుంచి పరారైందని.. ప్రస్తుతం మంగుళూరులో ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె కోట్లు కొల్లగొట్టిందని చెప్పారు. తాము పోలీసు కేసు పెట్టామని.. కోర్టునూ ఆశ్రయించామని చెప్పారు. -
ఆఫ్రికాలో అన్నపూర్ణ...
దేశాన్ని దేశం గెలవడానికి... అనేక మార్గాలున్నాయి. ఫిరంగులను పేల్చి గెలవొచ్చు. పావురాలను ఎగరేసి గెలవొచ్చు. ఇచ్చిపుచ్చుకుంటూ గెలవొచ్చు. వచ్చిపోతూ గెలవొచ్చు. అంతేనా... రుచిగా ఇంత వండిపెట్టి కూడా గెలవొచ్చు! అలా గెలిచే... ‘లెసొతో’ రాజ్యానికి క్యాటరింగ్ మహారాణి అయ్యారు ఎలిజబెత్ స్కినర్! ‘హైదరాబాదీ ఖీమా’ను సర్వ్ చేసి ఏకంగా ఆ దేశపు రాజుగారి చేతే... లొట్టలు వేయించిన ఈ ‘తెలుగింటి’ ఆంగ్లో ఇండియన్ ఆడపడుచుఅంతదూరం ఎందుకు వెళ్లినట్లు?! ఇంత ఘనత ఎలా సాధించినట్లు? ఇదే ఈ వారం మన ‘జనహితం’. మన ఊళ్లో వ్యాపారం పెట్టి సక్సెస్ అవ్వడం గొప్పకాదు. పక్క ఊరిలో పాగా వేసి పదిమందితో శభాష్ అనిపించుకుంటే ప్రత్యేకత ఉన్నట్టు. అలా చెయ్యడానికి ధైర్యం ఒక్కటీ ఉంటే సరిపోదు, బోలెడన్ని తెలివితేటలుండాలి. ఆ విజయం పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే వందశాతం నిజాయితీ ఉండాలి. కేవలం పక్కూర్లో స్థిరపడడం కోసమే ఇన్ని మాట్లాడుకుంటే... ముప్పైఏళ్లకిత్రం దేశం వదిలి ఎక్కడో దక్షిణాఫ్రికా దగ్గర్లోని లెస్సోతో అనే దేశంలో అడుగుపెట్టి అక్కడివారితో ‘మనమ్మాయి’ అనిపించుకోవడం అంటే మాటలు కాదు. ఎందుకంటే విమానం ఎక్కడానికే వెయ్యిసార్లు ఆలోచించే ఆ రోజుల్లో ఒకమ్మాయి విదేశాలకు ఒంటరిగా పయనమయ్యిందంటే ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఒక భారతీయ వనితకు ఇది సాధ్యమయ్యే పనేనా? అని. నిజమే ఆమె ఒట్టి ఇండియన్ కాదు. ఆంగ్లో ఇండియన్. పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అయినా... మాతృభాష ఇంగ్లీషు కావడం, ఆడా మగా అంటూ పట్టింపులు వారి సమాజంలో బాగా తక్కువగా ఉండడం ఎలిజెబత్ స్కినర్ పాలిట వరాలయ్యాయి. లెస్సోతోలో ఆహార పరిశ్రమలు పెట్టి విజయం సాధించిన ఎలిజెబత్ స్కినర్ అక్కడి ప్రజలందరితో ప్రతిరోజూ ‘అన్నదాతా సుఖీభవ...’ అనిపించుకుంటోంది. ఆంగ్లో ఇండియన్ వార్షిక వేడుకల సందర్భంగా ఆమె ‘ఫ్యామిలీ’తో పంచుకున్న తన విజయరహస్యాలివి. సికింద్రాబాద్ అమ్మాయిని... ‘‘నేను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పుట్టాను. నాన్న రుబిన్ స్కినర్ మిలటరీ పనిచేసేవారు. అమ్మ డోరస్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది. ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు...మొత్తం ఏడుగురు సంతానాన్నీ ఎలాంటి లోటు లేకుండా పెంచారు. అందరికంటే నేనే చిన్నదాన్ని. మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల మాకు చదువు ఆ తర్వాత ఉద్యోగాలు తప్ప మరో ఆలోచనలు ఉండేవి కావు. నేను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదివాక ఇక్కడే ఇసిఐఎస్ కంపెనీలో అడ్మిస్ట్రేషన్లో కొన్నాళ్లు పనిచేశాను. ఇంతలో ఎవరో మా బంధువులు లెస్సోతోకి విహారయాత్రకు వెళుతున్నారంటే వారితో కలిసి అక్కడికి వెళ్లాను. నా కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి అక్కడ ఒక కంపెనీవారు ఉద్యోగం ఇస్తానన్నారు. ఇంటికి తిరిగొచ్చాక ఆ ఉద్యోగ అవకాశం గురించి అమ్మానాన్నలకు చెప్పాను. ‘మాకు నీ మీద, నీ శక్తి మీద నమ్మకం ఉంది. మన దేశానికి మంచి పేరు రాకపోయినా పరవాలేదు. చెడ్డపేరు మాత్రం రాకూడదు’ అని చెప్పారు. ఇక అక్కలు, అన్నయ్యలు ‘గో హెడ్’ అన్నారు. మా రెండో అక్క క్రిస్టీన్ లాజరెస్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చి నన్ను విమానం ఎక్కించిన క్షణాలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. కో ఆర్డినేటర్ జాబ్... మచాచ్చే గ్రూప్ ఆఫ్ కంపెనీలో కో ఆర్డినేటర్ జాబ్లో చేరాను. అప్పటికి నా వయసు 29. ఆ ఏడాదిలోనే అక్కడే స్థిరపడ్డ గుజరాతి అబ్బాయి రాజ్దీప్షాతో పెళ్లి జరిగింది. ఏడాది ఉద్యోగ అనుభం వ్యాపారం పెట్టడానికి సరిపోతుందనుకున్నాను. లెస్సోతో చాలా చిన్న దేశం. ఇప్పటికీ రాచరికం కొనసాగుతున్న దేశం. చల్లని ప్రదేశం, టూరిజానికి అనుకూలమైన ప్రదేశం కావడంతో భారతీయ వంటలకు గిరాకీ ఉంటుందనుకుని ధైర్యం చేసి క్యాటరింగ్ వ్యాపారం మొదలెట్టాను. దానికోసం ప్రత్యేకంగా వంటలు నేర్చుకున్నాను. కూరలు తెచ్చుకోవడం నుంచి వండి, వచ్చినవారికి అందించేవరకూ అన్ని నేనే చేసుకునేదాన్ని. వ్యాపారసూత్రాలు పాటిస్తూనే నాణ్యమైన ఆహారం అందించడం కోసం చాలా కష్టపడేదాన్ని. రెస్టారెంట్ ప్రయోగం... క్యాటరింగ్లో విజయవంతంగా నడుస్తున్న సమయంలో నా భర్త ఆలోచనతో ‘ది రెగల్’ పేరుతో ఒక రెస్టారెంట్ కూడా పెట్టాం. దానికోసం ఒక చెఫ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. టీ, కాఫీ మొదలు...మీట్ వరకూ మా రెస్టారెంట్ చాలా ఫేమస్ అయ్యింది. మొదట్లో నేను రోజుకి 14 గంటలు పనిచేసేదాన్ని. కొన్నేళ్లపాటు అలా కష్టపడడం వల్ల ఇప్పటికీ నాలుగు గంటలకంటే ఎక్కువ నిద్ర పట్టదు నాకు. ఇంతలో వేడుకలకు ఆహ్వానం ఉండేది. నా క్యాటరింగ్ లేని వేడుకలకు మాత్రమే హాజరయ్యేదాన్ని. ఎందుకంటే క్యాటరింగ్ ఉన్న ప్రతీ చోటకి వెళ్లి వంటలు, వడ్డింపులను నేను స్వయంగా వెళ్లి చెక్ చేసుకునేదాన్ని. మాకు ఒక అబ్బాయి.. ఎలిస్టిర్ స్కినర్. నేను లిస్సుటోలో స్థిరపడ్డాక అమ్మానాన్న, అక్కలు, అన్నయ్యలు, మా అత్తగారు... అందరూ మా ఇంటికొచ్చి కొన్నాళ్లుండి మేం వ్యాపారం చేసే విధానాన్ని చూసి బాగా ఎంజాయ్ చేసేవారు. రోజూ వందలమంది వచ్చిపోయే రెస్టారెంట్ యజమానినైనా అవసరమైతే కస్టమర్లు తిన్న ప్లేట్లని తీసి నేను శుభ్రం చేసేసుకుంటానక్కడ. ఆ దేశంలో అలా పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తారు. రాజు...ప్రశంస లెస్సోతో రాజు లెట్సీ...మా రెస్టారెంట్కి వచ్చినప్పుడల్లా స్పెషల్గా హైదరాబాదీ ఖీమా కూరని ఆర్డర్ చేస్తారు. దాంతోపాటు స్పైసీగా ఉండే చికెన్ కబాబ్ని కూడా చాలా ఇష్టంగా తింటారాయన. మన దేశం నుంచి విఐపీలకు అపాయింట్మెంట్ తీసుకుని ఆ రాజుగారిని పరిచయం చేస్తుంటాను. క్యాటరింగ్, రెస్టారెంట్లతో పాటు ‘స్టెమ్ బచేరి’ పేరుతో కూరగాయలు, మాంసం కట్ చేసే కంపెనీ పెట్టాం. ఆ ఆలోచన నాదే. అది కూడా బాగా సక్సెస్ అయ్యింది. చేతనైనంత సాయం... ఇన్నేళ్లలో ఎన్నో ప్రశంసలు, అవార్డులు, పదవులు... నాలో మరింత శక్తిని నింపాయి. సౌత్ ఆఫ్రికా చెఫ్ అసోసియేషన్లో ప్రొఫెషనల్ మెంబర్గా పనిచేసినప్పుడు చాలా రెస్టారెంట్లు తిరిగాను. చాలా దేశస్తుల్ని కలిసాను. బోలెడంతమంది భోజనప్రియుల్ని చూశాను. వారి దీవెనల్ని అందుకున్నాను. వ్యాపారాలతో పాటు లెస్సోతోలో కొన్ని సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. లెస్సోతో కూడా ఎయిడ్స్ బాధిత దేశమే. ఎయిడ్స్ రోగులకు మందుల పంపిణి, పేదవిద్యార్థులకు ఆర్థికసాయం, దూరప్రాంతాలకు మంచినీరు సరఫరా వంటి సేవాకార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నాను. ఏటా ఆగస్టు రెండవ తారీఖు ఆంగ్లో ఇండియన్ వార్షిక వేడుకలు మొదలవుతాయి. రేపటితో ముగియనున్న ఈ వేడుకలు, ఈ సందర్భంగా మా కమ్యూనిటీ సంక్షేమం కోసం తలపెట్టిన కార్యాలు సఫలమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అన్నపూర్ణ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ మనం కూడా ఆమెకి ఆల్ ది బెస్ట్ చెబుదామా! - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ప్రత్యేకంగా నిలిచింది... - క్రిస్టీన్ లాజర్స్, ఎమ్ఎల్ఎ, ఆంధ్రప్రదేశ్ మా చెల్లి ఎలిజెబత్ ‘డేర్ టు డిఫరెంట్’ అనే సామెతకు నిలువెత్తు నిదర్శనం. చిన్న కాఫీ షాపు నడపాలంటే బోలెడంత ఓపిక కావాలి. అలాంటిది మనది కాని దేశంలో అంతపెద్ద ఎత్తున ఆహార సంస్థలు స్థాపించి విజయం సాధించింది అంటే దాని వెనక ప్రత్యేకంగా జీవించాలనే తన బలమైన కోరికే కారణం. ఇండియాని వదిలి ముప్పై ఏళ్లు అవుతున్నా...ఇక్కడున్న ఆంగ్లో ఇండియన్స్ గురించి చాలా ఆలోచిస్తుంది. ఆర్థికంగా కూడా సాయపడుతుంది.