
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలను తయారు చేసే మేడమ్ టస్సాడ్స్ మ్యూజియం భారత్లో ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది జూన్కల్లా మ్యూజియాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు మాతృ సంస్థ మెర్లిన్ ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే కనాట్ప్లేస్ ప్రాంతంలోని రీగల్ థియేటర్లోని రెండు అంతస్థులలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేస్తారు. రాబోయే పదేళ్లలో 418 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించనున్నట్లు మెర్లిన్ అధికార ప్రతినిధి మార్కెల్ క్లూస్ తెలిపారు. తొలుత దాదాపు 50 మంది సెలబ్రిటీల బొమ్మలతో ఏర్పాటు కానున్న ఈ మ్యూజియంలో 60 శాతం బొమ్మలు స్థానిక సెలబ్రిటీలవి కాగా 40 శాతం అంతర్జాతీయ ప్రముఖులవి ఉండనున్నాయి.