నిర్భయ కేసు: ఎప్పుడేం జరిగింది? | Nirbhaya case: Timeline of incidents | Sakshi

నిర్భయ కేసు: ఎప్పుడేం జరిగింది?

Sep 10 2013 3:22 PM | Updated on Sep 1 2017 10:36 PM

'నిర్భయ' కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. అత్యాచారం జరిగినప్పటినుంచి సంఘటన కాలక్రమం ఇలా ఉంది..

'నిర్భయ' కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. అత్యాచారం జరిగినప్పటినుంచి సంఘటన కాలక్రమం ఇలా ఉంది..

16 డిసెంబర్, 2012: కదులుతున్న బస్సులో 23 ఏళ్ల ఫిజియోథెరపిస్టుపై ఢిల్లీలో అత్యాచారం.
17 డిసెంబర్: బస్సు డ్రైవర్ రామ్ సింగ్, మరో ఇద్దరు నిందితుల అరెస్టు
18 డిసెంబర్: సంఘటనపై వెల్లువెత్తిన నిరసనలు, సెంట్రల్ ఢిల్లీలో పోలీసులతో జనం ఘర్షణ, నాలుగో నిందితుని అరెస్టు
19 డిసెంబర్: ఢిల్లీ కోర్టులో ఇద్దరు నిందితుల హాజరు. తనను ఉరితీయాలంటూ వినయ్ అనే నిందితుని వేడుకోలు.
21 డిసెంబర్: కేసులో నిందితుడైన మైనర్ బాలుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు. బీహార్లో ఆరో నిందితుని పట్టివేత.
22 డిసెంబర్: సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు.
23 డిసెంబర్: ఫాస్ట్ ట్రాక్ కోర్టును నెలకొల్పిన ఢిల్లీ హైకోర్టు.
24 డిసెంబర్: అత్యాచార కేసుల్లో నిందితులను వేగంగా విచారించి, శిక్షను పెంచేందుకు సూచనలిచ్చేందుకు కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన
27 డిసెంబర్: చికిత్స కోసం సింగపూర్కు బాధితురాలి తరలింపు
29 డిసెంబర్: తీవ్ర గాయాలతో సింగపూర్ ఆస్పత్రిలో బాధితురాలి మరణం.
30 డిసెంబర్: ఢిల్లీకి బాధితురాలి మృతదేహం తరలింపు, అంత్యక్రియలు
2013 జనవరి ౩: ఐదుగురు నిందితులపై అత్యాచారం, హత్య, కిడ్నాప్, సాక్ష్యాల విధ్వంసం, హత్యాయత్నం కేసుల నమోదు
28 జనవరి: ఆరుగురు నిందితుల్లో ఒకరు మైనరని తేల్చిన జువెనైల్ జస్టిస్ బోర్డు
2 ఫిబ్రవరి: ఐదుగురు నిందితులపై సామూహిక అత్యాచారం, హత్య, ఇతర నేరారోపణల కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు మార్గం సుగమం
3 ఫిబ్రవరి: క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్సు విడుదల. మార్చి 19న లోక్సభలో, 21న రాజ్యసభలో బిల్లు ఆమోదం.
5 ఫిబ్రవరి: కోర్టులో విచారణ ప్రారంభం, నిందితుల వాంగ్మూలం రికార్డు.
11 మార్చి: తీహార్ జైల్లోని తన సెల్లో ఉరికి వేలాడుతూ కనిపించిన రామ్ సింగ్
17 మార్చి: సాక్షిగా హాజరైన బాధితురాలి తల్లి, తన కుమార్తెకు న్యాయం చేయాలని వినతి.
14 జూన్: కస్టడీలో 18 ఏళ్లు నిండిన బాలనేరస్థుడు.
11 జూలై: బాల నేరస్థుడికి శిక్షపై తీర్పు వాయిదా వేసిన జువెనైల్ జస్టిస్ బోర్డు
25 జూలై: బాల నేరస్థుడికి శిక్షపై తీర్పును ఆగస్టు 5కు వాయిదా వేసిన జువెనైల్ జస్టిస్ బోర్డు
22 ఆగస్టు: తీర్పు వెల్లడించేందుకు జువెనైల్ బోర్డుకు సుప్రీం ఆమోదం
31 ఆగస్టు: బాల నేరస్థుడు మూడేళ్ల పాటు స్పెషల్ హోంలో గడపాలంటూ ఆదేశించిన జువెనైల్ జస్టిస్ బోర్డు
3 సెప్టెంబర్: తీర్పు వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు
10 సెప్టెంబర్: నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ అన్ని నేరాల్లోనూ దోషులుగా నిర్ధారణ. బుధవారం తీర్పు వెల్లడించనున్న కోర్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement