
బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది

మార్గశిరమాసం మూడో గురువారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాక రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు

బుధవారం అర్ధరాత్రి నుంచే బారులుదీరారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు, నాదస్వరాలతో ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, వేద పారాయణాలు, శ్రీచక్రార్చన లక్ష్మీ హోమం నిర్వహించారు

పరిసర ప్రాంతాల ప్రజలు తీసుకొచ్చిన పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి జలాభిషేకం చేశారు

పెద్ద ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు











