
క్షణంలో అదృశ్యమయ్యే సుందర చిత్రాలను కెమెరాల్లో బంధించి ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత కళ ఫొటోగ్రఫీ అని జేఎన్ఏఎఫ్ఏయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.గంగాధర్, ‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ అన్నారు

మాసబ్ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చతుర్వింశతి పేరిట మంగళవారం ఆర్ట్, ఫొటో ఎగ్జిబిషన్తో పాటు వివిధ అంశాలపై ప్రదర్శనలను ప్రారంభించారు

ఫొటో ఎగ్జిబిషన్లో దేశంలోని పలు నగరాలు, పుణ్యక్షేత్రాలు, నృత్యం, పల్లె జీవనం, వైల్డ్లైఫ్, మోడలింగ్, ఏజెన్సీ ప్రాంతాలు, పక్షులు వంటి చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి

విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభకు, సృజనాత్మకతకు ఈ ప్రదర్శన అద్దం పడుతుందన్నారు

కళామతల్లికి చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ఫైన్ ఆర్ట్స్లో భాగమైన ఫొటోగ్రఫీ విద్యార్థులు సినిమా, టీవీ రంగాలతో పాటు దేశ విదేశాల్లో అత్యున్నత పదవుల్లో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు









