Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Trump And Putin Meeting End with No Results1
ట్రంప్‌, పుతిన్‌ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్‌!

అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్‌ చివరలో ట్విస్ట్‌ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్‌ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్‌-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్‌తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్‌ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్‌ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్‌ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్‌ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్‌ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్‌కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్‌ లావ్రోవ్‌, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్‌ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్‌, పుతిన్‌ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్‌హౌస్‌, క్రెమ్లిన్‌లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ట్రంప్‌ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్‌కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025

Aamdalavalasa MLA harasses KGBV principal in Srikakulam2
‘ముద్దు’ల ముచ్చట.. ‘కూన’ నైట్‌ కాలింగ్‌..!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం పట్నం బజారు (గుంటూరు), కళ్యాణదుర్గం: దేశమంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటున్న వేళ.. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తుండటంతో మహిళలు రక్షణ కరువై అల్లాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మరిచిన టీడీపీ ప్రజాప్రతినిధుల విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తుతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోంది. విద్యాధికులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకుని కూర్చున్నారు! కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ఉద్యోగు­లు కార్యాలయాలకు రావాలంటే వణికి­పోతున్నారు. రాత్రిపూట పార్టీ కార్యాల­యాలకు పిలుస్తూ.. వీడియో కాల్స్‌ చేసి వేధింపులకు దిగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అఘాయి­త్యాలు.. గుంటూరు ఎమ్మెల్యే ‘ముద్దు’ వీడియోలు మహిళల పట్ల ఏడాది పాలనలో జరుగుతున్న దుశ్చర్యలకు మచ్చు తునకగా నిలుస్తున్నాయి. ‘కూన’ వీడియో కాల్స్‌...!‘ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్‌ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాల­యాలకు రా­వా­లని తన అనుచ­రులతో పిలిపిస్తారు. చా­లాసేపు అక్కడే ఉంచుతారు. రాత్రి 10.30 దాటిన తర్వాత వీడియో కాల్‌ చేసి వేధిస్తుంటాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. సాధారణ కాల్స్‌ చేయరు. వీడియో కాల్‌ అయితేనే మాట్లాడతారని అనుచరులతో చెప్పిస్తారు. దుర్బుద్ధి­తోనే ఇదంతా... దారికి రాలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. నాలా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలను కున్నా...!’టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు ఎదుర్కొన్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌ సౌమ్య ఆవేదన ఇదీ! దళితురాలిని తీవ్రంగా వేధించారంటూ బాధితు­రాలు కన్నీరు మున్నీరవుతున్నారు. కూన రవికుమార్‌ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిపారు. అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నా­రని వాపోయారు. కాగా గార, కంచిలి కేజీబీవీల ప్రిన్సిపాళ్లపై కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.బలిపశువుని చేస్తున్నారు..!గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్‌ అహ్మద్‌ ‘ముద్దు’ దృశ్యాల వీడియో వైరల్‌ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తు­న్నా­రంటూ పార్టీ మహిళా నేత షేక్‌ సూఫియా పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులు తట్టుకోలేక­పోతు­న్నా­నంటూ శుక్రవారం ఆమె గుంటూరు బ్రహ్మా­నందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహ­త్యా­యత్నం చేయడంతో కు­టుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పా­ర్టీ నాయకు­రాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వి­వా­హేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ తె­లుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు. ఎమ్మె­ల్యే­తో సన్నిహి­తంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్‌కృష్ణ స్వయంగా రికార్డ్‌ చేసి వైరల్‌ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్‌కు చెప్పడంతో రెండు రోజులు మాట్లాడ­కుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్‌­మెంట్‌ చేసుకుని తనని ఇరికించే యత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్‌కృష్ణ ఫోన్‌లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపో­తున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. కళ్యాణదుర్గంలో గర్భిణి బలవన్మరణం..‘భర్త, అత్త మామల వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగ­లేదు. నా ఫిర్యాదును పోలీసోళ్లు మార్చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నాకు అన్యాయం చేశారు..’ అని విలపిస్తూ అనంతపురం జిల్లా కళ్యా­ణదుర్గం పట్టణానికి చెందిన నిండు గర్భిణి శ్రావ­ణి (22) ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్ప­డింది. తన దయనీయ పరిస్థితిని ఫోన్‌లో ఆడియో రికార్డ్‌ చేసి తనువు చాలించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా... శుక్రవారం ఉదయం మృతురాలి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదా..?కళ్యాణదుర్గానికే చెందిన శ్రీనివాసులుతో మూడేళ్ల క్రితం శ్రావణికి వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త,అత్త మా­మలు తరచూ వేధించడంతో కళ్యాణదుర్గం పోలీస్లకు ఫిర్యాదు చేసినట్లు శ్రావణి పేర్కొంది. స్థానిక టీడీపీ నేత, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వైపీ రమేష్, మాజీ వైస్‌ చైర్మన్‌ శర్మస్‌ వలి ఒత్తిళ్లతో సీఐ దీన్ని మరో ర­కంగా మార్చేసి భర్త, అత్తమా మ­లకు అనుకూలంగా వ్యవహరించా­­రని ఆడియోలో మృతురాలు కన్నీ­రు మున్నీరైంది. కడుపులో పెరు­గుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుంచి వెళ్లిపో­తున్నామని, కనీసం తన మొదటి బిడ్డకైనా (రెండేళ్ల చిన్నారి) న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ప్రభుత్వంలో ఇక న్యా­యం జరగదా? అని ఆక్రోశించింది. ఈమేరకు ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేసి పుట్టింట్లో ఉరేసుకుని తనువు చా­లించింది. దీనిపై పట్టణ సీఐ యువ­రాజును వివరణ కోరగా.. మృతురాలు ఆరోపించిన­ట్లుగా తాము నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు.

India may have Pushed Delhi Further into Beijing Moscow Axis Bolton3
ట్రంప్‌కు జాన్ బోల్టన్ హెచ్చరిక.. ‘మాస్కో, బీజింగ్‌, ఢిల్లీ ఒక్కటైతే..’

వాషింగ్టన్‌: అమెరికా- భారత్‌ మధ్య వాణిజ్య సుంకాల యుద్ధం నడుస్తోంది. ఈ నేపధ్యంలో ట్రంప్‌ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మండిపడ్డారు. ట్రంప్‌ చర్యతో భారత్‌.. చైనా-రష్యా కూటమికి దగ్గరవుతుందని, ఇది అమెరికా అధ్యక్షుని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమిస్తుందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని జాన్ బోల్టన్ తప్పుబట్టారు. అలాస్కాలోని యాంకరేజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్‌ల సమావేశ సమయంలో జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించారని అయితే ఇదేవిధంగా రష్యా నుండి అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అదనపు సుంకాలను విధించలేదన్నారు. ఈ చర్య భారతదేశాన్ని చైనా-రష్యా కూటమి వైపు ఆకర్షితమయ్యేలా చేయవచ్చని బోల్టన్ ‘ఎక్స్‌​’లో పేర్కొన్నారు.‘Unforced error’: John Bolton calls Trump’s anti-India pitch lack of strategic thinking https://t.co/CVDLrD07ll— Financial Express (@FinancialXpress) August 15, 2025సీఎన్‌ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశం లాంటి దేశాలపై వైట్ హౌస్ ద్వితీయ సుంకాలను విధించిందని అన్నారు. భారతదేశంపై 25 శాతం సుంకం విధించిందని. అయితే ఇది ఇంకా అమలు కాలేదన్నారు. దీనిపై భారత్‌ చాలా ఆగ్రహంతో ఉన్నదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అలాంటి సుంకం విధించకుండా భారత్‌పైననే విధించడమేమిటని బోల్టన్ ప్రశ్నించారు. మాస్కో, బీజింగ్‌, ఢిల్లీ(మూడు దేశాల రాజధానులు) ఒక్కటైతే అమెరికాపై ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. 2018 తర్వాత పుతిన్ భారత్‌ పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలు అమెరికాపై ప్రతికూల పరిణామాలకు ఉదాహరణలు కావచ్చని బోల్టన్ అన్నారు. ట్రంప్‌ ఎటువంటి సంప్రదింపులు లేకుండా సుంకాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బోల్టన్ ఆరోపించారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఈ పర్యటన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరుగనుంది. మరోవైపు ఈ నెల చివరిలో ప్రధాని మోదీ చైనాను సందర్శించే అవకాశం ఉంది. ఆగస్టు 31- సెప్టెంబర్ ఒకటి మధ్య టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

Zelenskyy Comments on Trump-Putin meeting4
పుతిన్‌ ఆలోచన అదే.. రష్యాపై విరుచుకుపడిన జెలెన్‌ స్కీ

కీవ్‌: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, పుతిన్‌ జరిపే చర్చల సఫలం కావు అంటూ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం పుతిన్‌కు లేదంటూ విమర్శలు చేశారు. అందువల్లే ఈ భేటీని పుతిన్‌ వ్యక్తిగత విజయంగా జెలెన్‌ స్కీ అభివర్ణిస్తున్నారు.అలాస్కా వేదికగా ట్రంప్‌, పుతిన్‌ మధ్య భేటీ జరుగుతున్న నేపథ్యంలో జెలెన్‌ స్కీ స్పందించారు. ఈ సందర్బంగా జెలెన్‌ స్కీ ట్విట్టర్‌ వేదికగా వీడియోలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ లేకుండా ట్రంప్‌, పుతిన్‌ చర్చలేంటి?. ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న రోజున కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం మాస్కోకు లేదని మరోసారి నిరూపితం అయ్యింది. యుద్ధానికి సరైన ముగింపు ఎలా సాధించాలనే దానిపై ఉక్రెయిన్.. వాషింగ్టన్, యూరోపియన్ మిత్రదేశాలతో చర్చలు జరుపుతోంది. ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ సాధ్యమైనంత పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము అమెరికా నుండి బలమైన స్థానాన్ని ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.On the day of negotiations, the Russians are killing as well. And that speaks volumes. Recently, weʼve discussed with the U.S. and Europeans what can truly work. Everyone needs a just end to the war. Ukraine is ready to work as productively as possible to bring the war to an end,… pic.twitter.com/tmN8F4jDzl— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 15, 2025ఉక్రెయిన్‌ డిమాండ్స్‌ ఇవే?రష్యాతో ఘర్షణలో బాధిత దేశమైన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ భాగస్వామి చేయకుండా ట్రంప్, పుతిన్‌ జరిపే చర్చలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కారణంగానే వీరి భేటీని పుతిన్‌ వ్యక్తిగత విజయంగా జెలెన్స్కీ అభివర్ణిస్తున్నారు.శాంతి చర్చలు జరపాలంటే రష్యా బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాలన్నది ఉక్రెయిన్‌ డిమాండ్‌. రష్యాకు తమ భూభాగాల అప్పగింత ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని, రష్యా అపహరించుకుపోయిన తమ దేశ చిన్నారులను తిరిగి అప్పగించాలని కోరుతోంది.భవిష్యత్తులో తమ దేశంపై రష్యా దాడి చేయకుండా రక్షణలు కల్పించాలని పట్టుబడుతోంది.రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తోంది.అవసరమైతే వాటిని మళ్లీ విధించేందుకు అవకాశం ఉండాలి. మరోవైపు.. అలాస్కా వేదికగా ట్రంప్‌, పుతిన్‌ మధ్య జరిగిన కీలక భేటీ ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ ఎలాంటి ఫలితం తేల్చకుండానే ముగిసిపోయింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. గతంలో ట్రంప్‌ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్‌ మరో మారు పేర్కొన్నారు. ట్రంప్‌ స్పందిస్తూ.. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు.

Komatireddy Raj Gopal Reddy Interesting Comments on CM Revanth Reddy 5
అయ్యా రేవంత్‌ రెడ్డి పదవులూ మీకే.. పైసలూ మీకేనా?

సంస్థాన్‌ నారాయణపురం: ‘పదవుల్లో మీరే ఉంటరు.. పైసలు మీరే తీసుకుంటరు. నాకు పదవి ఇవ్వకపోయినా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పదవి వచ్చేటప్పుడు వస్తుంది. మనను ఎవరూ ఆపలేరు. పదవులు మీకే.. పైసల్‌ మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. సీఎం రేవంత్‌రెడ్డిని అన్నానని తెలుసు కదా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరకి వెళ్లి అడిగినా రాలే. పనిచేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమంటున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్‌ చేతిలో ఉంది. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి’ అని వ్యాఖ్యానించారు. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

England Squads for South Africa Ireland series Jacob Bethell named skipper6
ఇంగ్లండ్‌ ‘టీ20’ జట్టు కెప్టెన్‌గా జేకబ్‌ బెతెల్‌.. ప్రకటన విడుదల

టీమిండియాతో ప్రతిష్టాత్మక ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌.. సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న ఇంగ్లిష్‌ జట్టు.. తదుపరి ప్రొటిస్‌ టీమ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.సొంతగడ్డపై జరిగే ఈ వైట్‌బాల్‌ సిరీస్‌లకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. హ్యారీ బ్రూక్‌ సారథ్యంలోని ఈ జట్లలో ఆల్‌రౌండర్‌ రెహాన్‌ చోటు దక్కించుకున్నాడు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.మరోవైపు.. పేసర్‌ సోనీ బేకర్‌ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియాతో టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా సౌతాఫ్రికాతో సిరీస్‌లలో పాల్గొననున్నాడు.వీరితో పాటు ల్యూక్‌ వుడ్‌, లియామ్‌ డాసన్‌ను కూడా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక ప్రొటిస్‌ జట్టుతో సిరీస్‌లు ముగిసిన అనంతరం.. ఇంగ్లండ్‌ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టుకు యువ సంచలనం జేకబ్‌ బెతెల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.రెగ్యులర్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. సారథ్య బాధ్యతలను జేకబ్‌కు అప్పగించారు. ఇక లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీతో పాటు మాథ్యూ పాట్స్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఐర్లాండ్‌తో సిరీస్‌ నేపథ్యంలో మార్కస్‌ ట్రెస్కోతిక్‌ ఇంగ్లండ్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేలకు ఇంగ్లండ్‌ జట్టుహ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, జోఫ్రా ఆర్చర్‌, సోనీ బేకర్‌, టామ్‌ బాంటన్‌, జేకబ్‌ బేతెల్‌, జోస్‌ బట్లర్‌, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ డకెట్‌, విల్‌ జాక్స్‌, సకీబ్‌ మహమూద్‌, జేమీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌, జో రూట్‌, జేమీ స్మిత్‌.సౌతాఫ్రికాతో టీ20లకు ఇంగ్లండ్‌ జట్టుహ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, జోఫ్రా ఆర్చర్‌, టామ్‌ బాంటన్‌, జేకబ్‌ బెతెల్‌, జోస్‌ బట్లర్‌, బ్రైడన్‌ కార్స్‌, లియామ్‌ డాసన్‌, బెన్‌ డకెట్‌, విల్‌ జాక్స్‌, సకీబ్‌ మహమూద్‌, జేమీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, జేమీ స్మిత్‌, ల్యూక్‌ వుడ్‌.ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టుజేకబ్‌ బెతెల్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, సోనీ బేకర్‌, టామ్‌ బాంటన్‌, జోస్‌ బట్లర్‌, లియామ్‌ డాసన్‌, టామ్‌ హార్ట్‌లీ, విల్‌ జాక్స్‌, సకీబ్‌ మహమూద్‌, జేమీ ఓవర్టన్‌, మాథ్యూ పాట్స్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, ల్యూక్‌ వుడ్‌.

Vishwambhara Teaser Will Release Date Locked7
చిరంజీవి బర్త్‌డే గిఫ్ట్స్‌.. అభిమానులకు పండగే

చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వంభర’ నుంచి మరో టీజర్‌ విడుదల కానుంది. ఈమేరకు షోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్‌ పేర్కొంది. అయితే, ఈ మూవీకి సంబంధించి విడుదలై మొదటి టీజర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌పై విమర్శలు వచ్చాయి. ఆ సమయం నుంచి పెద్దగా అప్డేట్స్‌ మాత్రం బయటకు రావడం లేదు.విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌పై విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠి పలు జాగ్రత్తలు తీసుకున్నారట. మరింత సమయం తీసుకున్నా సరే సినిమా హిట్‌ కావాలనే సంకల్పంతో పనిచేశాడట. ఈ క్రమంలోనే ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు వస్తుండటంతో అభిమానులు విశ్వంభర నుంచి ఏదైనా గిఫ్ట్‌ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్‌ను సిద్ధం చేసింది చిత్ర బృందం. ఆపై విడుదల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. మరోవైపు అనిల్‌ రావిపూడి కూడా చిరు పుట్టినరోజుకు కానుక ఇవ్వాలని చూస్తున్నారట. సినిమా టైటిల్‌ ప్రకటించాలని ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.విశ్వంభర అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా, ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.

DGCA Cracks Down on Drones Registered Under False Grounds8
అడ్డగోలుగా డ్రోన్ల రిజిస్ట్రేషన్‌..

నిబంధనలను విరుద్ధంగా రిజిస్టర్‌ అయిన వేలాది డ్రోన్లు, వాటి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డ్రోన్ రిజిస్ట్రేషన్లపై విస్తృత సమీక్ష చేపట్టింది. దిగుమతి నిషేధాలు, తప్పనిసరి నిబంధనలను పాటించకుండా చాలా డ్రోన్లు రిజిస్టర్ అయ్యాయని నివేదికలు వెల్లడైన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రధానంగా చైనా సంస్థలకు చెందిన డ్రోన్లు దేశీయంగా తప్పుడు కారణాలతో నమోదయ్యాయనే వాదనలున్నట్లు తెలిపింది.2021 నుంచి దిగుమతిలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ 8,700కి పైగా చైనా డ్రోన్లు భారతదేశంలో నమోదయ్యాయని జులై 29న ఓ వార్తా సంస్థ కోరిక మేరకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. డ్రోన్ అనుమతులు పొందడానికి తప్పుడు డిక్లరేషన్లను ఉపయోగించే సంస్థలు అధికారిక రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లైన డిజిటల్ స్కై, ఈ-జీసీఏలను దుర్వినియోగం చేస్తున్నాయని డీజీసీఏ ఇటీవల జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కొంతమంది ఆపరేటర్లు తప్పుడు కేటగిరీల కింద యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను (యూఐఎన్‌) జనరేట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ప్రక్రియను దాటవేయడంతో తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నట్లు నోటీసు ఎత్తిచూపింది.ముఖ్యంగా చాలా మంది దరఖాస్తుదారులు కఠినమైన కమర్షియల్‌ నిబంధనలను పాటించకుండా ఉండడానికి తమ డ్రోన్లను ‘మోడల్ ఆర్‌పీఏఎస్‌’ సబ్‌కేటగిరీ కింద తప్పుగా వర్గీకరించారు. ఇవి విద్య, పరిశోధన, పరీక్ష లేదా వినోద ఉపయోగం కోసం ఉద్దేశించినవి. కానీ వాటిని ఇతర అవసరాల కోసం వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది నిబంధనల ఉల్లంఘనేనని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దుర్వినియోగం పౌర విమానయాన వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడమే కాకుండా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్‌లతో స్వావలంబనడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి అవసరమైన దిగుమతి అనుమతులు లేకుండానే పలు డ్రోన్లను విదేశాల్లో తయారు చేసి భారత్‌లోకి తీసుకువచ్చినట్లు డీజీసీఏ వెల్లడించింది. 2022 డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్ ప్రకారం రక్షణ, పరిశోధన, అభివృద్ధి, భద్రతకు సంబంధించిన ప్రయోజనాలు మినహా డ్రోన్ల దిగుమతులు నిషిద్ధం. కొనుగోలు ఇన్‌వాయిస్‌లు, దిగుమతి అనుమతులు, డ్రోన్ ఛాయాచిత్రాలు వంటి మద్దతు పత్రాలతో పాటు లిఖితపూర్వక వివరణ ఇవ్వడానికి బాధిత డ్రోన్ కంపెనీలకు ఏవియేషన్ రెగ్యులేటర్ సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ను సమర్థించడంలో విఫలమైతే యూఐఎన్‌లను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. వాటితోపాటు చట్టపరమైన చర్యలు ఉంటాయి.

Janmashtami, celebrating Lord Krishnas birth day9
కృష్ణం వందే జగద్గురుమ్‌

చాలామంది కృష్ణుడంటే అల్లరి, చిలిపితనం, మాయలు, మహిమలు... అనే అనుకుంటారు. కానీ కృష్ణుడంటే ఒక చైతన్యం. ఒక స్ఫూర్తి. ఎందుకంటే తానో రాజు కొడుకైనా సామాన్య గోపబాలురతో చెలిమి చేశాడు. అల్లరి పనులతో బాల్యాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. అంతేకాదు, యవ్వనంలో ఉండే చిన్న చిన్న సరదాలనూ చూపించాడు. బంధాలను నిలుపుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, స్నేహం... ఏదైనా సరే పది కాలాల పాటు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు. భగవద్గీత ద్వారా ఈ సారాన్ని ప్రపంచానికి అందించాడు. నేడు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన చెప్పిన ఆ పాఠాలను అర్థం చేసుకుందాం...స్నేహానికి ప్రాణంచిన్నప్పుడు గోపబాలురతో అరమరికలు లేకుండా హాయిగా ఆడుకున్న శ్రీ కృష్ణుడు స్నేహితులకు, శరణార్థులకూ మాట ఇచ్చాడంటే తప్పడం అన్నది లేదు. ‘కురుక్షేత్రంలో ఆయుధం పట్టను’ అని చెప్పాడు. ఆ మాట మీదే నిలబడ్డాడు. అంతేకాదు. అర్జునుడితో చుట్టరికం ఉన్నప్పటికీ అంతకు మించి ఆప్యాయతను చూపించాడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడి గురించి ఎలా చెప్పుకుంటారో అదే విధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడి బంధం గురించి కూడా మాట్లాడతారు. పాండవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అండగా నిలిచాడు. వారికి దిక్కుతోచనప్పుడు మార్గదర్శిగా మారాడు. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇవన్నీ కేవలం స్నేహం కోసం చేసినవే.ఒక భరోసా... ఒక నమ్మకంనమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యం. నమ్మకం పోగొట్టుకోడానికి ఎంతోసేపు పట్టదు. కానీ సంపాదించుకోడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ‘నన్ను పూర్తిగా నమ్ము.. అంతా నేను చూసుకుంటాను’ అనే భరోసా ఇచ్చాడందరికీ. అందరికన్నా ముందుగా అర్జునుడికి. ఆ నమ్మకంతోనే యుద్ధంలో పోరాడాడు అర్జునుడు. అంగబలం, అర్థబలం, అధికార బలం, సైనిక బలం ఉన్న కౌరవులపై యుద్ధంలో పాండవులు పైచేయి సాధించగలిగారంటే అందుకు కృష్ణుడే కారణం.స్థాయీ భేదాలు చూపలేదు...అవతలి వాళ్ల స్థాయి ఏంటి... వారు ఎలాంటి హోదాలో ఉన్నారు అన్నది పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని బోధించాడు కృష్ణుడు. అందుకే సాయం కోసం వచ్చిన కుచేలుడి మనసు అర్థం చేసుకుని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో గౌరవం చూపించాడు. కేవలం స్నేహితులు అనే కాదు. ప్రేమికులు, భార్యా భర్తలు...ఇలా ఏ బంధంలో అయినా సరే అందరినీ సమానంగా చూస్తే ఎలాంటి చిక్కులూ రావని, పరస్పరం గౌరవించుకుంటే సమస్యలే ఉండవని నిరూపించాడు.క్షమాగుణంతప్పులు అందరూ చేస్తారు. కొన్నిసార్లు తెలియక, కొన్ని సార్లు తెలిసి అవి జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. వాళ్లపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. మిత్రులనే కాదు. శత్రువులను కూడా ఒకే రకంగా ఆదరించడంలో కృష్ణుడు ముందుండే వాడు. ఆ మాత్రం క్షమాగుణం లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు చేసిన వంద తప్పులను మన్నించాడు. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుంచి ఏవేవో ఆశించకుండా పూర్తిగా డిటాచ్‌డ్‌గా ఉండాలని బోధించాడు కృష్ణుడు.పరిపూర్ణ జీవితంకృష్ణుడంటే అన్ని బంధాలనూ ఆస్వాదించిన వాడని మరచిపోరాదు. బాల్యంలోనే కన్న తల్లిదండ్రులకు దూరమైనా, పెంచిన తల్లిదండ్రులను పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులకూ సాంత్వన నిచ్చాడు. పదహారు వేలమంది గోపికలకూ తన ప్రేమను పంచాడు. అష్టమహిషులనూ అదేవిధంగా ఆదరించాడు. తనను నమ్మి వచ్చిన ఎవ్వరికీ ఏ లోటూ రానివ్వలేదు. తాను సంతోషంగా ఉన్నాడు. తనతో ఉన్న వారిని అదేరీతిలో ఉంచాడు.వ్యక్తిత్వ వికాస గురువుఇప్పుడు వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నింటికీ మూలాధారం రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతే! వ్యక్తిత్వ వికాస బోధకులకు కృష్ణుడే గాడ్‌ ఫాదర్‌. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు.. అందరికీ పరమ ఆప్తుడు... జగద్గురువు కూడా!– డి.వి.ఆర్‌.

Rasi Phalalu: Daily Horoscope On 16-08-2025 In Telugu10
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.అష్టమి రా.10.54 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: భరణి ఉ.8.29 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.7.39 నుండి 9.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: తె.4.33 నుండి 6.01 వరకు (తెల్లవారితే ఆదివారం), శ్రీకృష్ణాష్టమి.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.23రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.వృషభం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. పనుల్లో ఆటంకాలు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు.కర్కాటకం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.సింహం: సన్నిహితులతో అకారణ వైరం. చర్చలు ఫలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కన్య: రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.తుల: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.మకరం: విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది పరుస్తాయి.కుంభం: వ్యవహారాలలో విజయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.మీనం: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement