ప్రధాన వార్తలు

ISSలో శుభాంశు శుక్లా.. ఇస్రో ఎందుకో వెనుకబడింది!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు?.. ఇంకెవరు తాజాగా ఆ ఫీట్తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్లో భారతీయ అంతరిక్ష సంస్థ(ISRO) కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్ చేసుకోవడం లేదు!!.శుభాంశు శుక్లా అడుగు.. భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్గా సాగిన ఐఎస్ఐఎస్కి సాగిన యాక్జియం-4 మిషన్ ప్రయాణం.. అంతరిక్షంపై భారత్ చేసిన సంతకం. కానీ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ISRO తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా, ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే..వీళ్ల తర్వాత శుక్లానే..అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ. సోయుజ్ T-11 (Soyuz T-11) మిషన్ కోసం 1984, ఏప్రిల్ 3న ఆయన స్పేస్లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో(సెకండ్జనరేషన్ అంతరిక్ష కేంద్రం) ఏడు రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్లోకి వెళ్లింది లేదు. కానీ..భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్.. తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ వూర్పుటూర్ చారి మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాశేష్ శర్మ తర్వాత స్పేస్లోకి.. అందునా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు(60 ప్రయోగాల్లో) నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్ చేసుకోవడం లేదు!.అంత బడ్జెట్ కేటాయించి మరీ..అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్.. చంద్రయాన్, మంగళయాన్తో సూపర్ సక్సెస్ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్ఎస్కి వెళ్లిన తొలి మిషన్ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ మిషన్కు.. శుక్లా పాల్గొన్న ఈ మిషన్ ముందడుగుగా పరిగణించబడుతోంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు.ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నింటిని భారీగా ప్రచారం చేసుకునేదే. కానీ, ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో Wake up ISRO! అనే చర్చ మొదలైంది.అందుకేనా?..ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంభిస్తుందా? అనే అనుమానం కలగకమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు..యాక్సియం-4 స్పేస్ మిషన్.. ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ISRO, NASA, Axiom Space సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్-3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో, తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మిషన్ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం

ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025

Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు.

జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్డాడ్ పూర్డాడ్’ రచయిత
అత్యధికంగా అమ్ముడైన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కియోసాకి తన అధికారిక హ్యాండిల్లో పేర్కొన్నారు.కియోసాకి వెండిని ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'గా అభివర్ణించారు. దాని అధిక రివార్డ్-టు-రిస్క్ సామర్థ్యాన్ని ఉదహరించారు."వెండి ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'. అంటే తక్కువ ప్రతికూల రిస్క్తో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయి' అని రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.వైట్ మెటల్ తక్కువ ప్రతికూల రిస్క్ తో ఎక్కువ లాభాలను కలిగి ఉందని ఆయన వివరించారు. "ఈ రోజు ప్రతి ఒక్కరూ వెండిని కొనగలరు... కానీ రేపు కాదు" అన్నారు. తన సందేశాన్ని "గొప్ప పాఠం"గా అభివర్ణిస్తూ, తనను అనుసరించేవారికి గుర్తు చేశారు. "మీరు కొనుగోలు చేసినప్పుడు లాభాలు వస్తాయి... అమ్మినప్పుడు కాదు" అని సూచించారు.వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో కియోసాకి ప్రకటన వెండి సమీప కదలికపై దృష్టిని మరింత పెంచింది. చాలా మంది ఇప్పుడు జూలైని నిశితంగా గమనిస్తున్నారు. విలువైన లోహాల మార్కెట్ ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా వెండి జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. REMINDER: Rich Lesson:“Your profits are made when you buy…. Not when you sell.”Silver is the best “asymmetric buy” today. That means more possible upside gain with little down side risk.Silver price will explode in July, Everyone can afford silver today… but not…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2025

‘మిస్టర్ రేవంత్.. మీ తెలివి తక్కువ నిర్ణయాలను మేం రద్దు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధానంగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు మార్చడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీ బాస్లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విధేయతను చూపించాలనుకుంటే.. మీ పేర్లను రాజీవ్ లేదా జవహర్గా మార్చుకోండి అంటూ చురకలంటిచారు.ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం.. సిగ్గుచేటు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తెలివి తక్కువ నిర్ణయాలను రద్ద చేస్తాం. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలకు చరమగీతం పాడతాం’ అని కేటీఆర్ హెచ్చరించారు. Mr. Revant Reddy, If you want to show your subservience to Delhi bosses, why don’t you change your own name to Rajiv or Jawahar ? Renaming Annapurna canteens is absolutely ridiculous and shameful We shall undo all of these senseless actions in 2028 when BRS is back at the… https://t.co/ufWwUWyXu2— KTR (@KTRBRS) June 28, 2025

పెద్దారెడ్డి ఇంటి కూల్చివేతకు కూటమి కుట్ర!
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు.. తాజాగా ఆయన ఇంటిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి కక్ష సాధింపు పీక్ స్టేజ్కు చేరుకుంది. పెద్దారెడ్డిని టార్గెట్ చేసి అధికారులు, టీడీపీ నేతలు రాజీకీయంగా వేధింపులకు గురిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు.. ఇప్పటికీ ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వడం లేదు. ఇక, తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు తనిఖీలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈరోజు పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన అధికారులు.. అక్కడ టేపుతో కొలతలు తీసుకున్నారు. ఇంటి ముందు, పరిసరాల్లో కొలతలు చేపట్టారు. అయితే, మున్సిపల్ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే, వారి మాటలకు చేతలకు పొంతన కనిపించలేదు. దీంతో, స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు మాత్రం పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు.

5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
కరాటేలో బ్లాక్బెల్ట్.. డ్యాన్సర్, మోడల్. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్ ఆనంద్ (Mahesh Anand).కెరీర్1982లో సనమ్ తేరీ కసం మూవీలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్ కాకపోవడంతో విలన్గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్లో కరడుగట్టిన విలన్గా పేరు గడించిన మహేశ్ ఆనంద్.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్ వన్, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.ఐదు పెళ్లిళ్లువెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవకాశాలు దూరంఅనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్ కెరీర్ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్.. 2015లో రష్యన్ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. పేదరికంలో మగ్గిన నటుడువందల సినిమాలు చేసిన మహేశ్.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్ బ్రదర్ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం2019 ఫిబ్రవరి 9న మహేశ్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.చదవండి: ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్

రా చీఫ్గా ‘ఆపరేషన్ సింధూర్’ ఫేమ్
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్గా నియమితులయ్యారు. పంజాబ్కు చెందిన 1989 బ్యాచ్ పరాగ్ జైన్ను రవి సిన్హా స్థానంలో రా చీఫ్గా నియమించారు. రా సెక్రటరీగా విధులు నిర్వరిస్తున్న రవి సిన్హా పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీనియర్ అధికారి అయిన పరాగ్ జైన్ను రా చీఫ్గా నియమించారు. ఆయన పదవీ కాలం రెండేళ్ల పాట కొనసాగనుంది. అంతకుముందు పరాగ్ జైన్.. చండీగడ్లో ఎస్ఎస్పీ(సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా పని చేశారు. అలాగే కెనడా, శ్రీలంకల్లో దౌత్య ప్రతినిధిగా పని చేసిన అనుభవం పరాగ్జైన్కు ఉంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పరాగ్ జైన్ సైతం కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం ఏవియేసన్ రీసెర్చ్ సెంటర్లో హెడ్గా పని చేస్తున్న పరాగ్ జైన్.. భారత చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ముఖ్యభూమిక పోషించారు. ఈ ఆపరేషన్లో భాగంగా భారత ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి కీలక సమాచారం అందించడంలో పరాగ్ జైన్ ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లో సైతం పరాగ్ తన వంతు పాత్రన సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఫలితంగా పలు విభాగాల్లో పని చేసి విశేష అనుభవం గడించిన పరాగ్ జైన్ను రా చీఫ్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆయన అధికారికంగా జూన్ 30వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు.

డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్గా.. ట్రవిస్ హెడ్ అరుదైన రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్ (Travis Head) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న క్రికెటర్గా నిలిచాడు. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా హెడ్ ఈ ఘనత సాధించాడు.కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత మూడు టెస్టులు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మొదలైన తొలి టెస్టు (WI vs AUS) మూడు రోజు ఆటలోనే ముగిసింది.హెడ్ హాఫ్ సెంచరీలుబార్బడోస్ వేదికగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, విండీస్ బౌలర్ల విజృంభణకు ఆసీస్ టాపార్డర్ కుదేలు అయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (47) ఫర్యాలేదనిపించగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ అర్ధ శతకం (59)తో రాణించాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (28) కాసేపు పోరాటం చేశాడు.ఈ క్రమంలో 56.5 ఓవర్లలోనే ఆసీస్ కథ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా విండీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 190 పరుగులు సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ పొరపాట్లను పునరావృతం చేయలేదు.టాపార్డర్ మరోసారి విఫలమైనా.. ఈసారి హెడ్ (61)తో పాటు బ్యూ వెబ్స్టర్ (63), అలెక్స్ క్యారీ (65) కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్లో 310 పరుగులు చేసిన కంగారూలు.. ఆతిథ్య జట్టుకు 301 పరుగుల (విండీస్కు తొలి ఇన్నింగ్స్లో 10 పరుగుల ఆధిక్యం) లక్ష్యం విధించారు.ఆస్ట్రేలియా ఘన విజయంఈ క్రమంలో విండీస్ 141 పరుగులకే ఆలౌట్ కావడంతో.. 159 రన్స్తో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 59, రెండో ఇన్నింగ్స్లో 61 పరుగులతో రాణించి ఇక ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ట్రవిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. హెడ్ టెస్టు కెరీర్లో ఇది పదో అవార్డు.తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (2019) మొదలుపెట్టిన తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా హెడ్ చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్గా టెస్టుల్లో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ అత్యధికంగా 23సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.చదవండి: వరుసగా ఐదు ఓటములు.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సన్రైజర్స్ స్టార్

బిగ్ ట్విస్ట్.. కొండా మురళీకి మళ్లీ నోటీసులు
గాంధీభవన్లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఉల్టా వరంగల్ నేతలపైనే ఫిర్యాదు చేశారు. అయితే కాసేపటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకు ట్విస్ట్ ఇచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ మళ్లీ నోటీసులు జారీ చేసింది. సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దుమారాన్ని రేపాయి. వరంగల్ జిల్లాలోని సొంత పార్టీనేతలపై కొండా మురళి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతీకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శనివారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళిని హాజరయ్యారు. కమిటీ ముందు తనపై ఫిర్యాదు చేసిన నేతలపైనే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వని అంశాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. కొండా ఇచ్చిన సమాధానం తర్వాత మిగత ప్రక్రియ ఉంటుందని కమిటీ తెలిపింది. కొండా మురళి ఇచ్చింది వివరణ కాదు: మల్లు రవికొండా మురళి తమపై చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్తో పాటు,క్రమ శిక్షణా కమిటీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళీకి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. ఈ తరుణంలో ఇవాళ గాంధీ భవన్లో క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి వచ్చారు. ఇదే అంశంపై క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి చిట్చాట్ నిర్వహించారు. కొండా మురళీకి నేనే ఫోన్ చేశా. ఇవాళ కమిటీ ముందుకు వచ్చారు. కొండా మురళీ ఇచ్చింది వివరణ కాదు. ఇది ఆరంభం మాత్రమే. కొండా మురళీ కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నాం.మా కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కొండా మురళీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరాను. వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పాము. ఏ ఫిర్యాదులు ఉన్నా లిఖిత పూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలని కోరినట్లు చిట్చాట్లో మల్లు రవి వెల్లడించారు. మళ్లీ రేవంత్ అన్నే సీఎం: కొండా మురళిఇక క్రమ శిక్షణా కమిటీతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ‘ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు. దయ చేసి నన్ను గెలకొద్దు. రాహుల్ గాంధీ అంటే నాకు గౌరవం, కాంగగ్రెస్ను గౌరవిస్తాను. రేవంత్ అన్న మళ్లీ సీఎం అవ్వాలి. బీసీ నాయకుడు మహేష్ అన్నకు మరిన్ని పదవులు రావాలి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయినందుకు సంతోషపడుతున్నా. నేను మాట్లాడింది తప్పా? లేదా? అన్నది నా అంతరాత్మకు తెలుసు. నేను కేసులకు బయపడేవాడిని కాదు.’ అని వ్యాఖ్యానించారు.
కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్.. మంచు విష్ణు రియాక్షన్
‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
Kaleswaram అసలు బాధితులు... సామాన్య ప్రజలే!
‘పెట్టుబడులు తెచ్చిందేమో జగన్.. ప్రచారమేమో చంద్రబాబుది’
Basaveshwarudu: బసవ బోధ
ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
హైదరాబాద్లో ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్ కార్యాలయం
ఐపీఎల్లో అలవాటైంది.. ఇక్కడా అదే చేశారు.. గిల్ మారకుంటే..
Hyd: నగర వాసులకు శుభవార్త.. ఫైఓవర్ను ప్రారంభించిన సీఎం రేవంత్
‘మేం కూడా స్నేహితులమే.. మరి మీరు తమిళం నేర్చుకోండి’
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
ఓటీటీలో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
కన్నప్పను కాపాడిన రుద్ర!
బంగారం కంటే వెండి ముద్దు
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
పోటీ చేసి గెలిచి పనిచేయని పార్టీలపై కూడా కొరడా ఝళిపిస్తే బావుండు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు
సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! సినిమాల్లో..
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
ఇరాన్ అణుకేంద్రాలు ద్వంసం కాలేదు-పెంటగాన్ నివేదిక
అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి
కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్.. మంచు విష్ణు రియాక్షన్
‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
Kaleswaram అసలు బాధితులు... సామాన్య ప్రజలే!
‘పెట్టుబడులు తెచ్చిందేమో జగన్.. ప్రచారమేమో చంద్రబాబుది’
Basaveshwarudu: బసవ బోధ
ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
హైదరాబాద్లో ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్ కార్యాలయం
ఐపీఎల్లో అలవాటైంది.. ఇక్కడా అదే చేశారు.. గిల్ మారకుంటే..
Hyd: నగర వాసులకు శుభవార్త.. ఫైఓవర్ను ప్రారంభించిన సీఎం రేవంత్
‘మేం కూడా స్నేహితులమే.. మరి మీరు తమిళం నేర్చుకోండి’
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
ఓటీటీలో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
కన్నప్పను కాపాడిన రుద్ర!
బంగారం కంటే వెండి ముద్దు
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
పోటీ చేసి గెలిచి పనిచేయని పార్టీలపై కూడా కొరడా ఝళిపిస్తే బావుండు!
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! సినిమాల్లో..
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
ఇరాన్ అణుకేంద్రాలు ద్వంసం కాలేదు-పెంటగాన్ నివేదిక
అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి
సినిమా

కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్
కొందరు పెళ్లి పేరు ఎత్తితేనే పారిపోతుంటారు. అందులో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ముచ్చటే లేదు. ఈ ఏడాదే ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పడుతుందంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపించినా అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. డార్లింగ్ జీవితంలోకి రాబోయే అమ్మాయి ఎక్కడుందో? ఏంటో? లక్కీ గర్ల్ అని అభిమానులు సరదాగా అనుకుంటూ ఉంటారు. పెళ్లంటే ముఖం చాటేస్తున్న హీరోఅయితే ఎవరెన్ని అనుకున్నా.. వయసు మీద పడుతున్నా సరే.. ప్రభాస్ మాత్రం పెళ్లంటేనే నాలుగడుగులు వెనకడుగు వేస్తున్నాడు. వయసు దాటిపోతున్నా.. లెక్క చేయడం లేదు. రియల్ లైఫ్లోనే కాదు రీల్ లైఫ్లో కూడా ఇదే జరిగింది. కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించాడు ప్రభాస్. ఓ సీన్లో తిన్నడు(విష్ణు).. రుద్ర(ప్రభాస్)ను నీకు పెళ్లయిందా? అని అడుగుతాడు. అందుకు రుద్ర.. నా పెళ్లి గురించి నీకెందుకులే.. అని కౌంటరిచ్చాడు. అప్పుడు విషయం అర్థమైన తిన్నడు.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగ్ విసురుతాడు. ఈ సంభాషణకు థియేటర్లో చప్పట్లు, విజిల్స్ గట్టిగానే పడ్డాయి. ప్రభాస్ అభిమానుల అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోతోంది.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. అక్షయ్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్ చేసిన ఇలియానా

ఆ సీన్ తర్వాత గతం మర్చిపోయిన అమ్రిష్ పురి..
హీరోయిన్ కాజోల్కు మతిమరుపు ఉండేది. కుచ్కుచ్ హోతా హై సినిమా సెట్లో పదేపదే అన్నింటినీ మర్చిపోయేది. ఓసారి తనే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెజెండరీ నటుడు అమ్రిష్ పురి (Amrish Puri) ఒకానొక సందర్భంలో తనెవరన్నది కూడా మర్చిపోయాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. అజయ్ దేవ్గణ్, అమ్రిష్ పురి ఓ సినిమాలో కలిసి నటించారు. అంతా మర్చిపోయిన అమ్రీష్పురిఅందులో అమ్రీష్.. జలపాతం కింద నిల్చునే సీన్ ఉంది. అందుకోసం ఆయన వాటర్ఫాల్ కింద నిలబడ్డారు. పైనుంచి ఎంతో వేగంగా వస్తున్న నీళ్లు ఆయన తలను కొట్టుకుంటూ కిందపడేవి. తలకు రక్షణగా ఏదీ పెట్టలేదు. సన్నివేశం అయిపోగానే ఆయన వాటర్ఫాల్ నుంచి వచ్చేశారు. కానీ అన్నీ మర్చిపోయాడు. అసలేదీ గుర్తులేదు. నేనెవర్ని? నేనిక్కడేం చేస్తున్నాను? అని ప్రశ్నించాడు. సెట్లో ఉన్నవాళ్లందరికీ భయంతో చెమటలు పట్టాయి. తనకు జ్ఞాపకశక్తి రావడానికి మూడు గంటలు పట్టింది. కరడుగట్టిన విలన్గా..ఇప్పుడు తల్చుకుంటే సరదాగా అనిపిస్తుందేమోకానీ ఆ సమయంలో మాత్రం అందరూ చాలా భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అమ్రీష్ పురి, అజయ్ దేవ్గణ్.. టార్జాన్: ద వండర్ కార్, ఫూల్ ఔర్ కాంటే, హల్చల్, గెయిర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో వందలాది సినిమాలు చేసిన అమ్రిష్ పురి.. ఆదిత్య 369, బాబా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, నిప్పురవ్వ వంటి పలు చిత్రాల్లో నటించారు. కరడుగట్టిన విలన్గా ప్రేక్షకులను తన ఆహార్యంతోనే భయపెట్టేవారు. 2005లో బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్

టాలీవుడ్లో నెం1 గ్లోబల్ స్టార్ ఎవరు?
టాలీవుడ్ సూపర్ స్టార్ల స్టార్ ఫైట్... ఇప్పుడు గ్లోబల్ ఫైట్గా మారింది. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ హీరోలు రాణిస్తుండడం, అయితే ఒకరి తర్వాత ఒకరు రికార్డ్స్ బద్దలు కొట్టడంతో... వీరిలో ఎవరు నెం1 గ్లోబల్ స్టార్ అనేది ఇంకా తేలలేదు. తొలుత ప్రభాస్, తర్వాత ఎన్టీయార్, రామ్ చరణ్, ఆ తర్వాత అల్లు అర్జున్... పాన్ ఇండియా సినిమాల ద్వారా సత్తా చాటారు. అయితే వీరిలో ఎవరు టాప్ అనేది ఇంకా నిరూపణ కాలేదు. ఈ నేపధ్యంలో వచ్చే 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. టాలీవుడ్ స్టార్ల నుంచి దూసుకు వస్తున్న మూడు భారీ ప్రాజెక్టులు ఎస్ఎస్ఎంబి29, ఎఎ22, స్పిరిట్... చిత్రాలు మూడూ గ్లోబల్ బాక్సాఫీస్ను లక్ష్యంగా చేసుకొని రూపొందుతున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ మూడింటిలో రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న తొలిచిత్రం ఎస్ఎస్ఎంబి29పై అత్యధికంగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ ద్వారా ఇప్పటికే గ్లోబల్ ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో పూర్తి మేకోవర్తో కనిపించనున్నాడు. సమాచారం. అంతేకాక పాన్ ఇండియా సినిమా లో తన సత్తా తొలిసారి చాటనున్నాడు. అల్లూ అర్జున్, అట్లీ కాంబినేషన్ లో మాస్ అండ్ స్టైల్ ఎంటర్టైనర్గా ఎఎ22 చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న 2వ చిత్రంగా నిలవబోతోంది. విజువల్స్, యాక్షన్, హై ఎనర్జీ ప్రెజెంటేషన్ కారణంగా ఇది ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ సూపర్ హీరో సినిమాల అభిమానులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు.హీరోగా ఇప్పటికే గ్లోబల్ స్టార్ డమ్ను స్వంతం చేసుకున్న ప్రభాస్...స్పిరిట్ కూడా రేసు లో వుంది. తన ప్రతీ సినిమా ద్వారా ప్రేక్షకులకు షాక్ కొట్టే కధాంశాలతో హిట్స్ కొట్టే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు, ఇప్పటికే దీపిక పదుకునే నిష్క్రమణ సందీప్ వంగా పై కామెంట్స్ తదితర వార్తల ద్వారా ఈ చిత్రం నిత్యం సినీ అభిమానుల నోట్లో నానుతోంది.ఈ చిత్రం యాక్షన్, డార్క్ థీమ్, బోల్డ్ నెరేటివ్ తో రూపొందుతోంది. అంతర్జాతీయ నటుల ఎంపిక, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ వంటి లతో ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది.ఈ మూడు ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశముంది. ప్రతి చిత్రమూ దేనికదే తనదైన ప్రత్యేకతను కలిగి ఉండటంతో, ఇండియన్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తదుపరి సినిమాలకు ఈ మూడూ దేనికదే ప్రత్యేక శైలి లో దిశా నిర్ధేశ్యం చేయనున్నాయి. ఆ మార్గదర్శకత్వం చేస్తున్నవారు దక్షిణాది వారు అందులోనూ ఒక్క అట్లీ తప్ప అందరూ తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణమే.

గుండె పోటు కాదు.. 42 ఏళ్ల నటి మృతిపై అనుమానాలు!
‘కాంటా లగా’ఫేం, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా(42) మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియాంక చోప్రా, లారదత్తాతో పాటు పలువుడు బాలీవుడ్ తారలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆధారలేవి లేవని, మృతికి ఇంకా కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే.. శుక్రవారం రాత్రి షెఫాలి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను అంథేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. అమె కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందినట్లు తొలుత వార్తల వచ్చాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.పోలీసులు ఏం చెబుతున్నారంటే.. షఫాలీ మృతిపై తాజాగా ముంబై పోలీసులు అప్డేట్ ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ప్రస్తుతం అనుమానాస్పద ఘటనగానే పరిగణలోకి తీసకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మాకు సమాచారం వచ్చింది. అంధేరీలోని షఫాలి నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించాం. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో పని చేస్తున్న వారిని, వంట మనిషిని ప్రశిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అనుమానస్పద ఘటనగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని ముంబై పోలీసులు తెలిపారు.రీమిక్స్ సాంగ్తో ఫేమస్.. 2002లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్తో ఫేమస్ అయింది షెఫాలి. ఈ గుర్తింపుతోనే సినిమా అవకాశాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగా చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం పలు టీవీ రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. హిందీ బిగ్బాస్ సీజన్ 13లోనూ కంటెస్టెంట్గా పాల్గొని అలరించింది. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ని వివాహం చేసుకుంది. 2009లో అతనితో విడాకులు తీసుకొని.. 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్తో రెండో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జైశ్వాల్
భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తిరిగి పుంజుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం తమ జోరును ఎడ్జ్బాస్టన్లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టెస్టులో జైశ్వాల్ 97 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్గా రికార్డులెక్కుతాడు. జైశ్వాల్ ఇప్పటివరకు 20 టెస్టుల్లో 52.86 సగటుతో 1,903 పరుగులు చేశాడు.ప్రస్తుతం ఈ రికార్డు భారత లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను తన 23వ టెస్ట్లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు. గవాస్కర్ తర్వాతి స్ధానంలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. గంభీర్ ఈ ఫీట్ను తన 24వ టెస్టు మ్యాచ్లో అందుకున్నాడుటెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు👉సునీల్ గవాస్కర్ - 23 మ్యాచ్లు👉గౌతమ్ గంభీర్ - 24👉రాహుల్ ద్రవిడ్ - 25👉వీరేంద్ర సెహ్వాగ్ - 25👉విజయ్ హజారే - 26👉చెతేశ్వర్ పుజారా – 26👉సౌరవ్ గంగూలీ - 27👉శిఖర్ ధావన్ - 28👉పటౌడీ - 28

ఊహించిందే జరిగింది.. కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
అంతా ఊహించిందే జరిగిందే. బంగ్లాదేశ్ క్రికెట్లో కెప్టెన్గా నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్రస్దానం ముగిసింది. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీని కోల్పోయిన శాంటో.. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం షాంటో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా షాంటో ఈ నిర్ణయం తీసుకున్నాడు.టీ20 కెప్టెన్సీ నుంచి తనంతట తనే తప్పుకున్న శాంటో.. వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అతడికి ఊహించని షాకిచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని తప్పించింది.అతడి స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ మెహదీ హసన్కు తమ వన్డే కెప్టెన్గా బంగ్లా క్రికెట్ నియమించింది. అప్పటి నుంచి శాంటో బీసీబీ తీవ్ర ఆంసతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాంటో టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. "ఇది వ్యక్తిగతం కాదు. జట్టు శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ డ్రెసింగ్స్ రూమ్లో భాగంగా ఉన్నాను. ముగ్గురు కెప్టెన్లు ఉండడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దీనిపై బోర్డు ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఏదేమైనప్పటికి వారి నిర్ణయానికి మద్దతు ఇస్తాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్కాన్ఫరెన్స్లో శాంటో పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్గా లిట్టన్ దాస్ ఉండగా.. వన్డే కెప్టెన్గా మెహదీ హసన్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఇప్పుడు శాంటో రాజీనామా చేయడంతో టెస్టు కెప్టెన్గా ఎవరు బాధ్యతలు చేపడతారో వేచి చూడాలి. శ్రీలంకతో తొలి టెస్టును డ్రా గా ముగించిన బంగ్లా టైగర్స్.. రెండో టెస్టులో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 0-1తో బంగ్లాదేశ్ కోల్పోయింది.చదవండి: గెలిచిన మ్యాచ్లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్

BAN vs SL: ఐదేసిన జయసూర్య.. బంగ్లాను చిత్తు చేసిన శ్రీలంక
కొలంబో వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో శ్రీలంక(Sri Lanka) ఘన విజయం సాధించింది. 211 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 133 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 78 పరుగుల వెనకుబడడంతో బంగ్లా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.115/6 ఓవర్ నైట్స్కోర్తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన బంగ్లాదేశ్ అదనంగా 18 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జై సూర్య ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు దనుంజయ డి సిల్వా, రత్నాయకే రెండు వికెట్లు సాధించారు.బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్(26) పరుగులతో టాప్ స్కోరర్ నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 290/2తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 116.5 ఓవర్లలో 458 పరుగులకు ఆలౌటైంది. పాథుమ్ నిసాంక (254 బంతుల్లో 158; 19 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో 12 పరుగులు జోడించి వెనుదిరగగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (87 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ హాఫ్సెంచరీతో అదరగొట్టాడు. కమిందు మెండిస్ (41 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 5 వికెట్లు పడగొట్టగా... నయీమ్ హసన్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ జట్టు 247 పరుగులు చేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సైకిల్లో శ్రీలంకకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.చదవండి: గెలిచిన మ్యాచ్లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్

గెలిచిన మ్యాచ్లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్
జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత జట్టు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. లీడ్స్లో టెస్టులో ఓటమితో గంభీర్పై ఒత్తిడి పెరిగిందని చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్గా బాధ్యతలు చెపట్టిన తర్వాత భారత జట్టు బంగ్లాపై మినహా ఒక్క ప్రధాన టెస్టు సిరీస్లో కూడా విజయం సాధించలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఓడిపోవడంతో గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్ను కూడా ఓటమితో ఆరంభించడం గంభీర్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది."గెలిచినప్పుడు ప్రశంసలు, ఓడిపోయినప్పుడు విమర్శలు గుప్పించడం భారత క్రికెట్ సూత్రం. మ్యాచ్లో గెలిచి అన్ని బాగా జరిగితే అందరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అదే ఓటమి పాలైతే ప్రతీ ఒక్కరూ విమర్శలు ఎదుర్కొక తప్పదు. లీడ్స్ టెస్టులో ఓటమికి కెప్టెన్ శుబ్మన్ గిల్ను నేను బాధ్యుడిని చేయాలనుకోవడం లేదు.ఎందుకంటే అతడు ఇప్పుడే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. పరిస్థితులను ఆర్ధం చేసుకోవడానికి అతడికి కాస్త సమయం పడుతోంది. కానీ గౌతం గంభీర్పైన మాత్రం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రెడ్ బాల్ క్రికెట్లో కోచ్గా తన మార్క్ చూపించలేకపోయాడు. అతడి పర్యవేక్షణలో భారత్ చాలా తక్కువ మ్యాచ్లను గెలిచింది. బంగ్లాదేశ్పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై చెరో మూడు మ్యాచ్లలో భారత్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఇంగ్లండ్పై కూడా ఓ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. అతడి నేతృత్వంతో భారత్ కేవలం ఓటముల తప్ప విజయాలు సాధించలేకపోతుంది. ఇంగ్లండ్ సిరీస్లో ఆశించింన ఫలితం రాకపోతే గంభీర్ స్ధానం ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఎందుకంటే గంభీర్ కోరిన ప్రతీది సెలెక్టర్లు, బీసీసీఐ చేసింది. ఎలాంటి ఆటగాళ్లు కావాలంటే అలాంటి ప్లేయర్లను సెలెక్టర్లు ఇచ్చారు. అయినప్పటికి విజయాలను అందించకపోతే సెలక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదుర్కొక తప్పదు" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: MLC 2025: ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్మైర్
బిజినెస్

ప్రమాదాలు జరగకుండా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ స్కార్పియో-ఎన్ ఎస్యూవీకి లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దాంతోపాటు రూ.20.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన కొత్త జెడ్ 8 టీ వేరియంట్ను కూడా విడుదల చేసింది. స్కార్పియో-ఎన్ను ప్రవేశపెట్టి మూడేళ్ల అయినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ఈ సిరీస్ కస్టమర్లను సంపాదించుకున్నట్లు పేర్కొంది.కొత్తగా తీసుకొచ్చిన లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను జెడ్ 8 ఎల్ వేరియంట్లో ప్రవేశపెడుతున్నట్లు ఎం అండ్ ఎం చెప్పింది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను ఇది కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్లు డ్రైవర్ అవగాహనను పెంచేందుకు, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడం లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడుఅదనంగా మహీంద్రా తన ఐసీఈ ఎస్యూవీ ఇంజిన్లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ అనే రెండు కొత్త ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వెహికిల్ నిర్దిష్టమైన వేగాన్ని దాటినప్పుడు స్పీడ్ లిమిట్ అసిస్ట్ యాక్టివ్ అయి డ్రైవర్కు సమాచారం తెలియజేస్తుంది. సింగిల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా క్రూయిజ్ కంట్రోల్ సెట్టింగ్ను వాడుకోవచ్చు. ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ ద్వారా ముందున్న వాహనం కదలడం ప్రారంభిస్తే వీడియో, ఆడియో ఫీడ్ బ్యాక్ను అందిస్తుంది. ఇది ట్రాఫిక్లో చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది.

కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. నాలుగు రోజులుగా క్రమంగా పడిపోతున్న పుత్తడి ధరలు శుక్రవారంతో పోలిస్తే శనివారం కూడా తగ్గాయి. దాంతో ఇంకెంత పడుతుందోనని బంగారం ప్రియులు వేచి చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు
పేదరికంలో పుట్టిన ఓ బాలుడు ముక్కపచ్చలారని వయసులో ఉదయాన్నే లేచి పాలు పోసి గడియారం తొమ్మిది కొట్టిందటే ఠంచనుగా బ్యాగ్ భుజాన వేసుకొని స్కూల్ వెళ్లి చదుకునేవాడు. తాను ఉంటున్న ప్రాంతంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా దాదాపు రోజూ 7-8 కిలోమీటర్ల దూరం నడిచేవాడు. పండగల తోటి స్నేహితులు సరదాగా గుడుపుతుంటే తాను మాత్రం బాణసంచా విక్రయిస్తూ కుటుంబ పోషణలో భాగమయ్యేవాడు. విధి తన కష్టాలను గుర్తించింది. ఓ అవకాశం కల్పించింది. దాంతో ప్రస్తుతం తాను దాదాపు రూ.10,790 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు.రిజ్వాన్ సాజన్ ముంబయిలోని ఘట్కోపర్లో పేద కుటుంబంలో జన్మించారు. ఓ స్టీల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తన తండ్రి నెలకు రూ.7,000 సంపాదించేవాడు. రిజ్వాన్ తండ్రికి నలుగురు సంతానం. కుటుంబ పోషణకు ఆయన సంపాదన ఏమాత్రమూ సరిపోయేది కాదు. ఎలాగోలా నెట్టుకొచ్చేవారు. ఉన్నట్టుండి కుటుంబ పెద్ద, రిజ్వాన్ తండ్రి అకాల మరణం చెందారు. ఆ సమయంలో రిజ్వాన్కు ఏమి పాలుపోలేదు. కుంటుంబ భారం అంతా తనపై పడింది. ఏదోఒక పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఉంటున్న ప్రాంతంలో పాలు పోయడం ప్రారంభించాడు. నిత్యం 7 నుంచి 8 కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణించేవాడు. స్కూల్ ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మానేశాడు. పండగ రోజుల్లో వీధుల్లో బాణసంచా విక్రయించేవాడు.మేనమామ సాయం1981లో తన మేనమామ సాయంతో రిజ్వాన్ పని కోసం కువైట్ వెళ్లారు. అక్కడ ఒక సాధారణ భవన నిర్మాణ సామగ్రి దుకాణంలో ట్రయినీ సేల్స్ మ్యాన్గా చేరారు. నెలకు అప్పటి లెక్కల ప్రకారం..రూ.18,000 వచ్చేవి. క్రమంగా ఉద్యోగంలో ఎదుగుతూ ఒక దశాబ్దంలో సేల్స్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా కువైట్ నుంచి రావాల్సిన పరిస్థితి ఎదురైంది.దుబాయ్లో..కువైట్ నుంచి దుబాయ్ వచ్చిన రిజ్వాన్ ఒక బ్రోకరేజ్ సంస్థలో చేరారు. నిర్మాణ సామగ్రిలో నిరుపయోగం అవుతున్న కొన్ని వస్తువులకు సంబంధించిన అంశాలను గుర్తించారు. 1993లో కొంత పెట్టుబడితో సొంతంగా డాన్యూబ్ పేరుగో రియిల్ఎస్టేట్ వెంచర్ను స్థాపించారు. క్రమంగా ఎదిగి దాన్ని 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,790 కోట్లు) వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ కింది రంగాల్లో సేవలందిస్తోంది.బిల్డింగ్ మెటీరియల్స్రియల్ ఎస్టేట్, లగ్జరీ టవర్స్హోమ్ అలంకరణమిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుఇదీ చదవండి: వడ్డీరేట్లు సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్దాతృత్వ కార్యక్రమాలురిజ్వాన్ సాజన్ దాతృత్వ కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. డాన్యూబ్ వెల్ఫేర్ సెంటర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, మెంటల్ కౌన్సెలింగ్, ఆర్థిక అక్షరాస్యత వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. భారత్, యూఏఈల్లోని నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు. పాఠశాలల మౌలికసదుపాయాలకు నిధులు సమకూరుస్తున్నారు. అల్పాదాయ కుటుంబాలకు ముఖ్యంగా క్రిటికల్ ఇల్నెస్ ఉన్న పిల్లలకు వైద్య చికిత్సలకు సాయం చేస్తున్నారు.

వడ్డీరేట్లు సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను మరోసారి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 25, 2025 నుంచి బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సింగిల్ ఎఫ్డీ కాలపరిమితిపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. 2025 జూన్ 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. అందుకు అనుగుణంగా బ్యాంకు కూడా తన కస్టమర్లకు వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఏ ఎఫ్డీ ప్రభావితం అవుతుందంటే..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 నెలల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేటును 18 నెలలకు తగ్గించింది. గతంలో ఈ రేటు సాధారణ కస్టమర్లకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతంగా ఉండేది. ఇప్పుడు సాధారణ కస్టమర్లకు 6.35 శాతం, సీనియర్లకు 6.85 శాతంగా ఉంది. బ్యాంక్ సాధారణ ప్రజలకు (18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ కాలపరిమితి ఉంటే) 2.75% నుంచి 6.60% వరకు, సీనియర్ సిటిజన్లకు రూ .3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3.25% నుంచి 7.10% వరకు ఎఫ్డీ రేట్లను అందిస్తుంది.ముందస్తు ఉపసంహరణకు జరిమానాఎఫ్డీని ముందుగా నిర్ణయించిన కాలపరిమితి కంటే ముందుగానే విత్డ్రా చేస్తే బ్యాంక్ జరిమానా వసూలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిబంధనల ప్రకారం మెచ్యూరిటీకి ముందే ఎఫ్డీని ఉపసంహరించుకుంటే మీ డబ్బు బ్యాంకులో ఉన్న కాలానికి వర్తించే రేటు కంటే 1% తక్కువగా పొందుతారు.ఇదీ చదవండి: విదేశీ వర్సిటీతో అపోలో మెడ్స్కిల్స్ జట్టుసేవింగ్స్ ఖాతా రేట్లు ఇలా..ఎఫ్డీ రేటు తగ్గింపుతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించింది. జూన్ 24, 2025 నుంచి పొదుపు రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింది. అంటే అన్ని సంవత్సరానికి 2.75% నుంచి 2.50%కి వడ్డీరేట్లను చేర్చింది. పొదుపు ఖాతా వడ్డీని రోజువారీగా లెక్కించి ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు.రికరింగ్ డిపాజిట్లపై ఇలా..బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వడ్డీ రేట్లు డిపాజిట్ వ్యవధిని బట్టి సాధారణ కస్టమర్లకు 4.25% నుంచి 6.60%, సీనియర్ సిటిజన్లకు 4.75% నుంచి 7.10% మధ్య ఉంటాయి. ఈ రేట్లు 2025 జూన్ 10 నుంచి అమల్లో ఉన్నాయి.
ఫ్యామిలీ

'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం
శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా.. ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆ బృందం 14 రోజుల పాటు చేయనున్న పరిశోధనల గురించే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట చూసినా..శుభాంశు శుక్లా పేరే హాట్టాపిక్గా మారింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిను శుభాంశు బృందం మిషన్ సక్సెస్ అవ్వాలన్నేదే దేశమంతటి ఆ కాంక్ష కూడా. ఈ క్రమంలో యావత్తు దేశం గర్వపడేలా చేసే కుమారుడిని కన్న తల్లిదండ్రుల భావోద్వేగం మాటలకందనిది. అంతరిక్షంలోకి అడుగుపెట్టి తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏ పేరెంట్స్కి అయినా ఇది గర్వంతో ఉప్పొంగే క్షణం. లక్నోలోని తమ ఇంటి నుంచి తమ కుమారుడు శుభాంశు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియమ్ మిషన్ 4 ఆకాశంలోకి ఎగిసిన విధానాన్ని వీక్షించారు. ముఖ్యంగా శుభాంశు తల్లి ఆశా శుక్లాకి అదంతా చూసి కన్నీళ్లు ఆగలేదు. అయితే అవి ఆనందంతో ఉప్పొంగిన ఆనందభాష్పాలని చెప్పారామె. తమ బంధువులు, సన్నిహితులు స్క్రీన్లకి అతుక్కుపోయి చూస్తున్న విధానం..పట్టరాని ఆనందాన్నిచ్చిందని అన్నారామె. మాటలే రానంతగా గొతు వణుకుతోందామెకు. అలాగే అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి చేరిన వెంటనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘అంతరిక్షం నుంచి మీ అందరికి నమస్కారం. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది. సుమారు 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి తిరిగి వచ్చాం. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం." అని అన్నారు. దానికి అతడి తల్లిదండ్రులు స్పందిస్తూ.. అది కేవలం తమ కుమారుడి దేశభక్తి మాత్రమే కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. మా బిడ్డ ఇప్పుడు దేశ జెండా తోపాటు ఆ నక్షత్రాల మధ్య యావత్తు దేశ సామూహిక ఆకాంక్షలను తన భుజాలపై మోస్తున్నాడు. అని భావోద్వేగంగా అన్నారు.కాగా, తమ కుమారుడితో అంతరిక్షంలోనికి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఫోన్లో సంభాషించినట్లు తెలిపారు. నాన్న నా గురించి బాధపడుతూ ఉండిపోవద్దు. దేనికోసం ఇక్కడికి వచ్చానో..ఆ మిషన్ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు శుభాంశు తండ్రి అన్నారు. అలాగే ఆయన అక్క సుచి కూడా 30 సెకన్లపాటు శుభాంశుతో మాట్లాడినట్లు సమాచారం. ఇక శుభాంశు కూడా బాగానే ఉన్నాడని, అతడికి శుభాకాంక్షలు కూడా తెలిపామని చెప్పుకొచ్చారు కుటుంబసభ్యులు. #WATCH | Lucknow, Uttar Pradesh: Parents, relatives of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/bNTrlAq72r— ANI (@ANI) June 25, 2025 (చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..)

రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు
ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఇటీవల ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరపై భారతీయ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. అసలు కళాకారులకు క్రెడిట్ ఇవ్వకుండా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ బ్రాండ్లు లాభపడుతున్నాయంటూ ఆయన విమర్శించారు. ఇది చాలా విచారకరం అంటూ ట్వీట్ చేశారు.Prada is selling products looking like Kolhapuri chappals for over ₹1 lakh. Our artisans make the same by hand for ₹400. They lose, while global brands cash in on our culture. Sad! pic.twitter.com/Cct4vOimKs— Harsh Goenka (@hvgoenka) June 26, 2025 ప్రాడా పురుషుల పాదరక్షల స్ప్రింగ్ సమ్మర్ 2026 ఇటీవల ప్రదర్శించింది. వీటి డిజైన్ అచ్చం మన షోలాపూర్ చెప్పుల మాదిరిగానే రాజసాన్ని ఒలకబోస్తుట్టున్నాయి. కానీ వాటి ధరే 1.2 లక్షలు ఉండటం హాట్ టాపిక్గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించారు.అటు బిలియనీర్ గోయెంకా కూడా దీనిపై స్పందించారు.ఈ చెప్పుల ఫోటోలు ట్వీట్ చేస్తూ, ఇవి భారతదేశపు ఐకానిక్ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయి, కానీ ధర లక్షకు పై మాటే!అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. మన చేతివృత్తులు వారు వీటినే రూ.400 కు తయారు చేస్తారు. అంటే వారు ఎంత నష్టపోతున్నారు? ప్రపంచ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయి. విచారకరం! అంటూ గోయెంకా రాసుకొచ్చారు.ఈ హై-ఎండ్ ఫ్యాషన్ చప్పల్స్ని ప్రీమియం మెటీరియల్స్, ఇండియన్ డిజైన్తో రూపొందించినట్టు ప్రాడా ప్రకటించింది. అయితే ఇండియాలో షోలాపూర్ చెప్పులను పోలి ఉన్న ఈ చెప్పుల ధర భారీ లగ్జరీగా ఉండటంతో నెటిజన్లు విస్తుపోయిన సంగతి తెలిసిందే.

పేరుకు తగ్గట్టే.. రిటైర్డ్ ఉద్యోగి ధర్మారావు దాతృత్వం
ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ సమయం లేక కొంతమంది.. ఆర్థిక స్తోమత లేక మరి కొంతమంది చేయలేని పరిస్థితి.. అలాంటివారు ఏమాత్రం అవకాశం దొరికినా తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ధర్మారావు.. సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం తన వంతు సాయంగా సేవ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.. – మోతీనగర్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన బి.ధర్మారావు ప్రస్తుతం మూసాపేట డివిజన్ మోతీనగర్లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగ విధుల నిమిత్తం 1996లో కృష్ణాజిల్లా నుంచి నగరానికి బదిలీ అయ్యారు. డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ జులైలో 2004లో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం ఆయన సతీమణి దివంగత బి.హైమావతి కోరిక మేరకు 2004 నుంచి నేటి వరకూ నిరంతరాయంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్, పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు. ఆమె ఆలోచన నుంచే.. మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడ్డాం. ఈ నేపథ్యంలో నా భార్య హైమావతి ఆలోచన నుంచే ఉద్యోగ విరమణ అనంతరం మా వంతు సాయం చేయాలని నిర్ణయించు కున్నాం. ఆమె మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం విద్యార్థులకు తోచిన విధంగా పరితోషికాన్ని సాయం చేస్తున్నా. అపార్టుమెంట్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ పిల్లలకు నోటు పుస్తకాలు అందజేస్తున్నా. రానున్న రోజుల్లో హైమావతి జ్ఞాపకార్థం మరిన్ని కార్యక్రమాలు చేపడతా. – ధర్మారావు, రిటైర్డ్ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ భార్య జ్ఞాపకార్థం.. ప్రస్తుతం చిన్నకుమారుని వద్ద నివాసం ఉంటున్న ధర్మారావుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. 2020లో ఆయన భార్య మరణానంతరం హైమావతి జ్ఞాపకార్థం.. 2021 నుంచి పుస్తకాలు, యూనీఫామ్ పంపిణీతో పాటు మూసాపేట డివిజన్లోని బబ్బుగూడ, యూసఫ్గూడ, వెంగళరావునగర్, ఇస్నాపూర్, శ్రీరామ్నగర్, రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలు, శ్రీరామ్ నగర్లోని ఉర్దూ మదరసాల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.12వేల చప్పున ఫీజులను చెల్లిస్తున్నారు. గత ఐదేళ్లుగా పదో తరగతి మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన, 500కు పైబడి మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

Kareena Kapoor: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఎవర్గ్రీన్ నటనతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నటి ఆమె. ఇప్పటికి కుర్ర హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్గా ఉంటారామె. ముఖ్యంగా ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మంచి జీవనశైలిని పాటిస్తారామె. తరుచుగా ఆమె ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేస్తుంటారు. తన వర్కౌట్ల నుంచి ఆరోగ్యకరమైన డైట్ వరకు ప్రతిదీ పంచుకుంటారామె. అయితే హీరో హీరోయిన్లు ఎంతలా స్ట్రిక్ట్గా ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇచ్చినా..కెరీర్ పరంగా కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే పాత్ర డిమాండ్కి అనుగుణంగా వాళ్ల ఆకృతిని మార్చుకోక తప్పదు. ఆ క్రమంలో ఆరోగ్యానికి విరుద్ధమైన డైట్లను అనుసరించాల్సి ఉంటుంది. అలానే కరీనా కూడా ఓ మూవీ కోసం జీరో సైజ్ ఫిగర్ మెయింటైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం ఎలాంటి ఫుడ్ తీసుకునేదో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఏంటి పరాఠాలతో తగ్గడం అని షాక్కి గురవ్వుతారు. కానీ కరీనానే ఓ ఇంటర్వ్యూలో పరాఠా విత్ నెయ్యితోనే జీరో సైజ్ బరువుకి వచ్చానని చెప్పడం విశేషం. మరి అదెలాగో చూద్దామా..!.వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ కానీ వాళ్లకు కరీనా అనుసరించిన విధానం ఓ వరమనే చెప్పాలి. ఎందుకంటే పాపం నోరు కట్టేసుకుని ఫైబర్ కోసం రుచి పచి లేని ఫుడ్ తింటుంటారు. అయితే ఇలా కమ్మటి పరాఠాలు, నెయ్యి కలిపి హాయిగా తింటూనే బరువు తగ్గే విధానం తెలుసుకుంటే హమ్మయ్యా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మరీ ఆమె వీటితో సైజ్ జీరోకి ఎలా రాగలిగందంటే..2008 యాక్షన్-కామెడీ 'తాషన్'లో కరీనా కపూర్ జీరో సైజ్ ఫిగర్తో అందరినీ ఆశ్యర్యపరిచింది. అయితే ఆమె ఎప్పుడూ ఆకలితో అలమటించే డైట్లు ఫాలో కానని అంటోంది. ఎప్పుడూ పరాఠాలు తింటూనే ఉంటానంటోంది. అలా తింటూ..కూడా రోజంతా తీసకునే ఆహార క్రమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలని చెబుతోందామె. అయితే ఆమె ఆ మూవీ కోసం దాదాపు 68 కిలోల నుంచి 48 కిలోలు చేరుకునేందుకు అస్సలు ఆకలితో ఇబ్బందిపడే లేదట. (చదవండి: Dinner: సాయంత్రం 6.30కి తినేయడమే మంచిదా? నటి కరీనా కపూర్ కూడా..)తన ఫిట్నెస్ టీమ్ పోషకాహార నిపుణుడు రుజుత దివేకర్, ట్రైనర్ నమ్రత పురోహిత్ల సాయంతో అద్భుతంగా బరువు తగ్గానని చెప్పారామె. అందుకోసం తాను సరైన మార్గాన్ని అవలంభించే మంచి శరీరాకృతిని పొందినట్లు తెలిపారామె. తాను అస్సలు తినకుండా ఉండలేనని అంటోంది. అయితే తాను సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకునేలా రుజుత దివేకర్ నెయ్యితో పరాఠాలు, కుంకుమ పువ్వు నీళ్లు తీసుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. వాటి తోపాటు గుల్కండ్ అనే స్వీటు, గోరువెచ్చని పాలు తప్పనిసరిగా తీసుకునేదాన్ని అని అంటోంది. అయితే 2018లో మొదటి బిడ్డ ప్రసవానంతరం బరువు పెరిగానని, అయితే త్వరితగతిన బరువుని అదుపులోకి తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తాను జిమ్లో 55 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉండలేనని అన్నారు. తాను ఎక్కువగా పవర్ యోగా, పైలట్స్ వర్కౌట్లతో బాడీని ఫిట్గా ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఇక్కడ కరీనా..తనకిష్టమైన ఆహారాన్ని వదులకోకుండానే బరువు తగ్గే ప్రయత్నం చేశారు. మైండ్ఫుల్నెస్గా ఇష్టమైన ఆహారాలు దూరం చేసుకోకుండా తగ్గడమే ఆరోగ్యదాయకమని చెప్పకనే చెప్పారామె. సో ఆమెలా ఒక క్రమ పద్ధతిలో నచ్చిన ఫుడ్ తీసుకుంటూనే తగ్గే ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ది బెస్ట్ ఐస్ క్రీమ్లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఇరాన్పై దాడులను... మాపై అణుబాంబులతో పోలుస్తారా?
టోక్యో: ఇరాన్పై ఇటీవల దాడులు జరిపిన అమెరికా, వాటిని రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించిన హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణు బాంబు దాడులతో పోల్చడాన్ని జపాన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అణుబాంబు వేయడాన్ని సమర్థించినట్లుగా ఉన్నాయని నాగసాకి మేయర్ షిరో సుజుకి ఆక్షేపించారు. బాంబు దాడికి గురైన నగరవాసులుగా తాము చాలా విచారిస్తు న్నట్టు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మిమాకి తోషియుకి అన్నారు. అణు బాంబు దాడి నుంచి బయటపడిన వారిలో ఆయన ఒకరు. ట్రంప్ ప్రక టనను ఉపసంహరించుకోవా లంటూ నాటి అణు బాంబు దాడుల నుండి బయటపడినవారు హిరోషి మాలో నిరసనకు దిగారు. ట్రంప్ ప్రకటన లను తిరస్కరిస్తూ హిరోషి మాలో చట్టసభ సభ్యు లు తీర్మానం ఆమోదించారు. సాయుధ పోరాటా లను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. ‘‘ఇరాన్పై అమెరికా దాడి వల్లే యుద్ధా నికి తెరపడింది. హిరోషిమా, నాగసాకి ఉదాహ రణను నేను ఉపయోగించాలనుకోవడం లేదు. కానీ తప్పడం లేదు’’ అని ట్రంప్ పేర్కొనడం తెలిసిందే. ప్రపంచంలో అణు దాడికి గురైన ఏకైక దేశం జపాన్. 1945 ఆగస్టులో దక్షిణ జపాన్లోని రెండు నగరాలపై అమెరికా వేసిన అణు బాంబులు 1.4 లక్షల మందిని బలిగొ న్నాయి. ప్రాణాలతో బయటపడినవారు నేటికీ నానా శారీరక, మానసిక వ్యాధులతో బాధపడు తున్నారు. అణ్వాయు ధాలకు జపాన్ వ్యతిరేకమని సూచించే శాంతి జ్వాల హిరోషిమాలో ఇప్పటికీ వెలుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని చివరి అణు దాడి జరిగి ఎన్ని రోజులో తెలిపే గడియారం కూడా యుద్ధ మ్యూజి యం ప్రవేశద్వారం ఉంటుంది. శాంతి పట్ల తమ నిబద్ధత తెలియజేసేందుకు హిరోషిమాను సందర్శించే ప్రపంచ నాయకులతో కాగితపు క్రేన్లను తయారు చేయించే సంప్రదాయముంది.

నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?
మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్కు చెందిన వాన్ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్ డబ్బా బ్యాగ్తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్ కోచ్లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్ మొత్తం కోచ్ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్లో ఘటన జూన్ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్లో పెట్రోల్ పోసిన ఘటన వీడియో వైరల్గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025

భూకంపం.. బుల్లి బకాసురుడు
ఓవైపు.. భూకంపం వచ్చి భవనాలన్నీ ఊగిపోతున్నాయి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు?. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తారు కదా. కానీ, ఇక్కడ ఓ బుడతడు చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో ఇటీవల జరిగిన భూకంపం సమయంలో ఓ చిన్నారి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ను నవ్వులు పూయిస్తోంది. జూన్ 23న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని క్వింగ్యువాన్లో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన ఘటన తాలుకా వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో భూమి కంపించింది. తండ్రి తన చిన్న కుమారుడిని ఎత్తుకుని తలుపు వైపు పరుగెత్తాడు. పెద్ద కుమారుడు కూడా వెంటపడ్డాడు. కానీ.. ఆ చిన్నారి ఒక్కసారిగా తిరిగి వచ్చి, టేబుల్ దగ్గరికి వెళ్లి తినడం ప్రారంభించాడు. పైగా బౌల్లో ఉన్న తిండిని తీసుకుని బయటకు పరిగెత్తే ప్రయత్నమూ చేశాడు. ఈలోపు అవతలి నుంచి తండ్రి.. పరిగెత్తు! అని అరిచాడు. అయినా ఆ బుడ్డోడు భోజనం ముందు అన్నట్లు వ్యవహరించాడు. ఈ వైరల్ వీడియోపై ఆ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. మా బిడ్డకు తినడం చాలా ఇష్టం. కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాడికి తిండి కంటే జీవితం ముఖ్యమని ఇక మీదటైనా నేర్పించాలి అని అన్నాడు. నెటిజన్ల స్పందన.. ఈ పిల్లవాడి ప్రాధాన్యతలు అద్భుతం!, భూకంపం వచ్చినా, తిండిని వదలడు!.. - “Snack first, survive later!.. భూకంపం.. బుల్లి బకాసరుడు ఈ కామెంట్లతో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..Nothing comes between this kid and his meal not even an earthquake.pic.twitter.com/eWs218JHUH— Science girl (@gunsnrosesgirl3) June 25, 2025

హార్ముజ్ మూసివేత గండం గడిచినట్లేనా?!
ఇరాన్పై ఇజ్రాయెల్ (israel) అమెరికాల(USA) యుద్ధం నేపథ్యంలో హార్ముజ్( Hormuz) జల సంధిని మూసివేస్తామని ఇరాన్ (Iran)ప్రకటించడం కలకలం రేపింది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? ఇది ఇరాన్కు ఉత్తర భాగంలో, ఒమన్, యూఏఈ దేశాలకు పశ్చిమ భూభాగంలో ఉంటుంది. ఈ జలసంధి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో 50 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. లోతు చాల ఎక్కువగా ఉండి పెద్ద రవాణా నౌకలు కూడా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది గల్ఫ్ దేశాలను అరేబియా సముద్రానికి అనుసంధానిస్తుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఒక్క ఇరాన్ కాకుండా ఇంకా గల్ఫ్ దేశాలైన ఇరాక్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా ఆయిల్ సరఫరా చేస్తుంటాయి. అమెరికాలోని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 2023లో ఈ జలసంధి ద్వారా 2 కోట్ల బారెళ్ల క్రూడ్ ఆయిల్ని ఆ యా గల్ఫ్ దేశాలు సరఫరా చేశాయి. దీని విలువ సుమారు 600 బిలియన్ల డాలర్లు. ఇది ఒక్క ఏడాదిలో జరిగిన ఆయిల్ సరఫరా విలువ.యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డైరెక్టర్ సర్ అలెక్ యూన్గర్ అంచనా ప్రకారం ఈ జలసంధిని మూసివేయడం వల్ల ఆయిల్ రేట్లు అంచనాకు మించి పెరిగే అవకాశముంటుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావి తమవుతాయి. ఈ జలసంధి ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకు ఆయిల్ సరఫరా అవుతోంది. చైనా దిగుమతి చేసుకొనే 90% ఆయిల్ ఒక్క ఇరాన్ నుంచే సప్లై అవుతుంది. ఇండియా 60% క్రూడ్ను దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా 60%, జపాన్ ఉపయోగించే ఆయిల్లో మూడొంతులు ఈ జలసంధి ద్వారానే దిగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరలూ దీని మూసివేత వల్ల బాగా పెరిగే అవకాశంఉంటుంది. ఈ దేశాల వస్తువులు ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు వాడటంతో అంతటా ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది కనుక హార్ముజ్ మూసివేత నిర్ణయాన్ని విరమించినట్టు వస్తున్న వార్తలు నిజమైతే అదే పదివేలు! – డా.కొండి సుధాకర్ రెడ్డి లెక్చరర్
జాతీయం

బాధలో అహ్మదాబాద్ బాధితులు.. డీజే పార్టీ జోష్లో ఎయిర్ ఇండియా ఉద్యోగులు
ఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్ (గతంలో సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd— Mid Day (@mid_day) June 23, 2025విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది.

‘శశి థరూర్.. ఒవైసీ వేరుకాదు’: జావేద్ అక్తర్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, యావత్ దేశంపై జరిగిన దాడి అని ప్రముఖ గీత రచయిత, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రపంచదేశాలకు వివరించేందుకు ప్రతిపక్ష సభ్యుల బృందం వివిధ దేశాల్లో పర్యటనలు సాగిస్తోంది.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గీత రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ నేత శశి థరూర్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకులను ప్రభుత్వం ఈ ప్రతినిధుల బృందంలో చేర్చడం సరైనదేనా? అని అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్ర దాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని అన్నారు. అందుకే దేశంలోని అన్నివర్గాల ప్రతినిధులూ వెళ్లారన్నారు. వీరిలోని కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని. కానీ దేశం విషయానికి వస్తే, అందరం ఒకటేనని అన్నారు. ఈ విధంగా చూస్తే ప్రతినిధుల బృందంలోని శశిథరూర్, అసదుద్దీన్ ఒవైసీ వేరుకాదని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.శశి థరూర్ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడతారని,ఇలాంటి కాంగ్రెస్ నేత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని, ఆయనకు ఐక్యరాజ్యసమితిలో దౌత్య అనుభవం ఉందని అక్తర్ పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ 1965 యుద్ధం.. అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధం నాటి నుంచి కూడా వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయన్నారు. అయితే పాక్ ప్రభుత్వం ఇటువంటి వివాదాల్లో తన ప్రమేయం లేదని చెబుతూ వస్తున్నదన్నారు. పహల్గామ్ దాడి వారు చేసినదేనని అక్తర్ పేర్కొన్నారు.పాకిస్తాన్లోని కోట్లాది మంది భారతదేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నారని, అలాగే అక్కడి యువత భారతదేశానికి వచ్చి, వినోద పరిశ్రమతో పాటు కార్పొరేట్ రంగంలో పనిచేయాలని కోరుకుంటున్నారని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. అయితే అక్కడి సైనిక పాలకులకు ఇది నచ్చిన అంశమన్నారు. పాక్లో సైన్యం ఆధిపత్యం తెలుసుకున్న మీదటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ను ఆహ్వానించారన్నారు. పాక్లో ప్రజాస్వామ్యం ఒక బూటకమని, సైన్యమే ఆ దేశాన్ని పాలిస్తుందని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అభినందన్ను బంధించానన్న.. పాక్ ఆర్మీ అధికారి మృతి

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
కోల్కతా: దేశమంతటా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ కాలేజీ మెడికోపై హత్యాచార ఘటనను మరవకముందే కోల్కతాలో అలాంటిదే మరో దారుణం జరిగింది. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.అతనో క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నాడని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నైనా చటర్జీ చెప్పారు. అంతేగాక అలీపోర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్గా చేస్తున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్కు దగ్గర సంబంధాలున్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్ శ్రేణులు కస్బా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు అత్యాచారోదంతంపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోటా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్దవవుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్తో పారీ్టకి సంబంధం లేదని ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొంది. కానీ తృణమూల్ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్ నేతలతో పాటు మోనోజిత్ ఎన్నోసార్లు వేదికలపై కని్పంచినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు.

8 రోజులు.. 5 దేశాలు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2వ తేదీ నుంచి 8 రోజులపాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. బ్రెజిల్లోని రియోడీజనిరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొననున్న ప్రధాని మోదీ ఆ తర్వాత.. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియాల్లో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొదటగా జూలై 2, 3వ తేదీల్లో ఆఫ్రికా దేశం ఘనా వెళ్తారు. ఈ దేశంలో ప్రధాని మోదీ మొట్టమొదటి పర్యటన ఇదే కాగా, మన ప్రధాని ఒకరు అక్కడ పర్యటించడం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. ఘనా నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారు. అక్కడ జూలై 3, 4వ తేదీల్లో పర్యటించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఒకరు అక్కడికెళ్లడం ఇదే మొదటిసారి. అనంతరం, జూలై 4, 5వ తేదీల్లో అర్జెంటినా వెళ్తారు. జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ సమిట్లో పాల్గొంటారు. చివరగా ప్రధాని మోదీ నమీబియా చేరుకుంటారు. మోదీ నమీబియాలో పర్యటించే మూడో భారత ప్రధాని కావడం గమనార్హం.
ఎన్ఆర్ఐ

చెవిరెడ్డి అరెస్ట్ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు
తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు

పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
డల్లాస్: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆహార కిట్లను సిద్ధం చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుకబడిన దేశాల్లో వేల మంది చిన్నారుల ఆకలి తీర్చడంలో దోహదపడనుంది. మానవ సేవే మాధవ సేవ అనే నాట్స్ చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఉంటుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచుతాయని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని, సమిష్టి శక్తిని చూపించడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలే మంచి ఉదాహరణలు అని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డల్లాస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ నాయకత్వం అభినందించింది. అలాగే స్పాన్సర్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ డల్లాస్ జట్టు సభ్యులు బద్రి బియ్యపు, పద్మసుందరి రాతినం, శ్యామల తూనుగుంట్ల తదితరులతో పాటు 20 కి పైగా యువ వాలంటీర్లు పాల్గొన్నారు. సమాజంలో సేవా స్ఫూర్తిని పెంచేలా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్లోని మహాత్మగాంధీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక తెలుగు వారు వినియోగించుకున్నారు. నాట్స్ బోర్డు సలహా సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ బాపూజీ దర్శిలు ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర్ల, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిష్ట్ల తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న నాట్స్ మిస్సోరీ విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జూన్ 16 : శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డేగా ప్రకటించిన ఫ్లోరిడా
జాక్సన్విల్, ఫ్లోరిడా, జూన్ 16ను శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే అని ప్రకటించింది. జాక్సన్విల్, ఫ్లోరిడా శ్రీ శ్రీ రవిశంకర్ గారి నిరంతర సేవను.ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సమాజంలో పరస్పర అవగాహన, ఐక్యత, స్వస్థత చేకూరుట కోసం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను గౌరవిస్తూ, జూన్ 16 తేదీని అధికారికంగా "శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే" అని ప్రకటించింది. ఈ ప్రకటనను జాక్సన్విల్ మేయర్, నార్త్ ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా అందజేశారు. దీని ద్వారా, జాక్సన్విల్ ప్రపంచంలో "శ్రీ శ్రీ రవిశంకర్ దినోత్సవం"ను ప్రకటించిన 32వ నగరంగా నిలిచింది.ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మానవ మృగానికి ఉరే సరైన శిక్ష
విశాఖపట్నం: పెందుర్తి మండలం వి.జుత్తాడలో నాలుగేళ్ల క్రితం(2021 ఏప్రిల్ 15న) జరిగిన దారుణ హత్యల కేసులో నిందితుడు బత్తిన అప్పలరాజుకు జిల్లా కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం, స్థానికులు న్యాయం లభించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పసిపిల్లలతో సహా ఆరుగురు నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోగా, అప్పటి నుంచి న్యాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబానికి ఈ తీర్పు కొంత ఊరటనిచ్చింది. అనుమానమే ఆరుగురి ప్రాణాలు తీసింది 2021 ఏప్రిల్ 15 తెల్లవారుజామున జుత్తాడ గ్రామం రక్తసిక్తమైంది. నిందితుడు బత్తిన అప్పలరాజు కుమార్తెకు, అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్కిరణ్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పగతో రగిలిపోయిన అప్పలరాజు.. విజయ్కిరణ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఉదయం వారింట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(40), బమ్మిడి ఉదయ్నందన్ (2), బమ్మిడి ఉర్విష విజయ్కిరణ్(6 నెలలు)లను కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అభంశుభం తెలియని పసికందులను కూడా వదలకుండా చంపడం అందరినీ కలచివేసింది. రక్తపు మడుగులో మృతదేహాల దృశ్యం చూసిన వారందరినీ కన్నీరు పెట్టించింది. న్యాయం దిశగా ... ఈ దారుణ ఘటన అనంతరం అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నష్టపరిహారం చెల్లించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. పోలీసులు ఈ కేసును అత్యంత పకడ్బందీగా విచారించి కోర్టులో నివేదించారు. నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఈ రోజు విశాఖ కోర్టు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఆనందం ఈ తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు నాటి ఘటనను తల్చుకుని కన్నీరు పెట్టుకుంటూనే తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘మానవ మృగానికి ఉరే సరైన శిక్ష. మా కుటుంబానికి న్యాయం జరిగింది’అని తెలిపారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

ముంచెత్తే మత్తు..బతుకే చిత్తు
కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దందా గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. యువత, కళాశాలల విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకునే బాలలే లక్ష్యంగా మాదకద్రవ్యాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. పాలకులకు రెడ్బుక్ పేరిట రాజకీయ కక్షలు సాధించడంతో సరిపోతోంది. దీంతో డ్రగ్స్ దెబ్బకు యవత బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకైన్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. రాజధాని ప్రాంతంలోనే ఎక్కువమంగళగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.