ప్రధాన వార్తలు

నవ్విపోదురు గాక..!
‘‘ఆరు సూపర్ సిక్స్ హామీలూ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ అని మాట్లాడితే, వారికి నాలుక...’’ అంటూ వాక్యం మధ్యలో చంద్రబాబు కాస్త విరామం పాటించారు. ఆ ప్రెస్ మీట్ను టీవీల్లో చూస్తున్న వాళ్లకు నాలుకను కోసేస్తా అంటారేమో అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే, గత ఏడాదికాలంగా హామీల అమలు గురించి గట్టిగా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, ఏదో వంకతో జైలుకు పంపించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు గనుక! చంద్రబాబు పాటించిన వాక్య విరామంలో గట్టి హెచ్చరికను పంపించే ఉద్దేశం కూడా ఉండవచ్చు. విరామం తర్వాత వాక్యాన్ని ‘మందం’ అనే మాటతో ముగించారు. అంటే ఇకముందు ఎవరైనా సరే సూపర్ సిక్స్ అమలు కాలేదని మాట్లా డితే వారి నాలుక మందం అనుకోవాలి. వాక్య విరామ హెచ్చరిక కూడా వారికి వర్తిస్తుందనుకోవాలి.సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ నిధుల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా 2025–26 అకడమిక్ ఇయర్ కోసం విడుదల చేశారు. బకాయి పడిన గత సంవత్సరం నిధులు హుష్ కాకే! మిగిలిన ఐదు పథకాల సంగతి? వాటినెప్పుడు అమలు చేశారు? దీపం పథకం కింద ఏటా ఇవ్వాల్సిన మూడు ఉచిత సిలిండర్ల బదులు రెండు ఇచ్చారు. సరే, అది కూడా అమలైంది. ‘అన్నదాత సుఖీ భవ’ కింద రైతుకు ఇస్తానన్న రూ. 20 వేల నగదు సాయానికి కూడా ఓ అంటకత్తెర కథ చెప్పారు. ఈ నెల 20న కేంద్రం విడుదల చేసే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విడత విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం మూడు విడతల్లో విడుదల చేసే ఆరు వేలకు మరో 14 వేలను మూడు విడతల్లో కలిపి అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బకాయి పెట్టిన గతేడాది సొమ్ము అటకెక్కినట్టే! మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఆగస్టు 15న ముహూర్తం పెట్టినట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాలి.సూపర్ సిక్స్లో భాగంగా ఉన్న మరో రెండు అతి కీలకమైన పథకాలను మాత్రం దేవుడి ఖాతాలో వేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పందొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1500 చొప్పున ఏటా 18,000 రూపాయలను జమ చేస్తా మని కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ. ఇప్పుడు దాన్ని పీ–ఫోర్ అనే పథకంతో లింక్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆడబిడ్డల అదృష్టాన్ని డబ్బున్న వారి ఔదార్యంతో ముడి వేశారన్నమాట. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకానికి దాదాపు ఏటా 35 వేల కోట్లు అవసరమని అంచనా. ఇంతటి ఔదార్యాన్ని పి–ఫోర్ పథకం ద్వారా పిండుకోవాలట! ఇది అయ్యే పనేనా?సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంది. పన్నెండు నెలలు బకాయి పెట్టారు. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంతో జత చేస్తామని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది? నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇస్తారు? అందులో ఈ మూడు వేల రూపాయలు పోషించే పాత్రేమిటి? అనే మీమాంసలనవసరం. ఈ పథకానికీ పాడె కట్టినట్టే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో యాభ య్యేళ్లు నిండిన ప్రతివారికీ పెన్షన్ అమలు చేస్తామని మరో కీలకమైన వాగ్దానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దాని గురించి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ మాటా లేదు, ముచ్చటా లేదు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను విశ్లేషిస్తే ఒక్క మొదటి యేడాదికే రూ. 80 వేల కోట్లకు పైగా వాగ్దాన భంగానికి పాల్పడినట్టు తేలింది.ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నాయకులు ఫ్లాగ్ షిప్గా పెట్టుకున్న సూపర్ సిక్స్లోనే అరకొరగా రెండు, అత్తెసరుతో మరో రెండు ప్రకటించారు. భారీగా వ్యయమయ్యే ఇంకో రెండు పథకాలకు తిలోదకాలొదిలేశారు. ఫ్లాగ్షిప్ సంగతే ఇట్లా ఉంటే మిగతా మేనిఫెస్టో హామీల గురించి చర్చించడానికేముంటుంది? మోసం చేశారని ఆవేశపడటం తప్ప. మేనిఫెస్టో మీద, దాని హామీల మీద చర్చ జరగడం కూడా కూటమి సర్కార్ సహించడం లేదు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామని వారు చెబుతున్నారు. అందరూ అదే చెప్పాలి. ఇందుకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదు. పత్రికల్లో గానీ, టీవీల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఇందుకు భిన్నమైన సమాచారం రాకూడదు. వస్తే రెడ్బుక్ నోరు తెరుస్తుంది. రెడ్ బుక్ ఆదేశాలతో దాదాపు వెయ్యిమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. పలు కుటుంబాలు ఇంకా వేధింపులకు గురవు తున్నాయి. 70 మంది పాత్రికేయులపై కేసులు పెట్టారు. పదిమందిపై దాడులు చేశారు. ప్రత్యర్థి రాజకీయపక్షంపై జరుగుతున్న దాడులను ఇక్కడ ప్రస్తావించడం లేదు. వారిపై జరుగుతున్న హత్యాకాండ జోలికెళ్లడం లేదు. వారి ఆస్తుల విధ్వంసం గురించి కూడా చెప్పడం లేదు. కేవలం పాత్రికేయులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండను గురించి మాత్రమే ఈ నివేదన. వారి కలాలకూ, గళాలకూ బిగిస్తున్న శృంఖలాలను గురించి మాత్రమే ఈ ఆవేదన.నాలుగున్నర దశాబ్దాలు పాత్రికేయ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ భయానక పాలనకు ఒక స్పష్టమైన ఉదాహరణ. పత్రికా రంగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కొమ్మినేని.రెండు పత్రికల్లో స్టేట్ బ్యూరో చీఫ్గా పనిచేశారు. ఢిల్లీ బ్యూరోకు నాయకత్వం వహించారు. ఒక పత్రికలో ఒకే సమ యంలో సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జిగా నేను, స్టేట్ బ్యూరో చీఫ్గా కొమ్మినేని కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ అనుభవంతో చెప్పగలిగిన మాట ఒక్కటే. పాత్రికేయ వృత్తి పట్ల, ఆ వృత్తిలో పాటించవలసిన ప్రమాణాల పట్ల పూర్తిస్థాయి నిబద్ధత కలిగిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. న్యూస్ ఛానెళ్ల పర్వం ప్రారంభమైన తర్వాత దాదాపు పద్దెనిమిదేళ్లుగా మూడు టీవీ చానెళ్లలో కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో వర్తమాన రాజకీయాలపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా చర్చా కార్యక్రమాల్లో అత్యంత సంయమనం పాటిస్తూ హద్దుమీరకుండా, చర్చ పక్క దారి పట్టకుండా తన నియంత్రణలో నడిపించే వారిలో అగ్ర గణ్యుడు కొమ్మినేని.అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడని కొమ్మినేని మీద, వార్తా విశ్లేషకుడు కృష్ణంరాజు మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సెక్షన్ కూడా ఒకటి. పెరుగుతున్న వేశ్యల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్నదనే ఒక నివేదికను కృష్ణంరాజు ప్రస్తావించారు. ఈ తరహా వార్తలు గతంలో యెల్లో మీడియాలో కూడా వచ్చినవే. ఈ ప్రస్తావన సందర్భంగా అమరావతిని ఉద్దేశించి కృష్ణంరాజు మాటల్లో దొర్లిన ఒక అనుచిత వ్యాఖ్యానాన్ని షో నిర్మాహకుడైన కొమ్మినేనికి కూడా ఆపాదించి ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రదర్శనలనూ, సాక్షి మీడియాపై దాడులనూ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి మీడియాలపై కేసులు నమోదు చేశారు. కొమ్మినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినప్పుడు అట్రాసిటీ కేసుపై మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధం లేని కేసులు పెట్టడంపై ఎస్పీకీ, డిఎస్పీకి మెమోలు కూడా ఇచ్చారు. ఆ సెక్షన్ తొలగించి రిమాండ్కు పంపారు.సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట లభించింది. తాను చేయని వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా బాధ్యుల్ని చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ లాయర్లను ప్రశ్నించింది. ఈ కేసులో కూడా ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లోద్రా వంటి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసే లాయర్లనే కూటమి ప్రభుత్వం మోహరించింది. కొమ్మినేనికి వెంటనే బెయిల్ లభిస్తే మిగతా పాత్రి కేయుల్లో ప్రభుత్వం పట్ల భయం మిగలదనే సందేహం కావచ్చు. ఆ బెయిల్ను అడ్డుకునేందుకు భారీ గానే ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. విశ్లేషకుని వ్యాఖ్యానానికి కొమ్మినేని నవ్వాడు గనుక ఆయన కూడా శిక్షార్హుడేనని కూటమి లాయర్లు చేసిన వాదన సుప్రీంకోర్టులో నవ్వుల పాలైంది. కొమ్మి నేనిని వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.విఫల పాలనతో ప్రజామోదం కోల్పోతున్నప్పుడు అసంతృప్తిని చల్లార్చడానికి నియంత పాలకులు ఎక్కువగా నిర్బంధాన్నే నమ్ముకుంటారు. విమర్శకులు నవ్వినా, తుమ్మినా, దగ్గినా కూడా తిరుగుబాటు సంకేతంలాగానే వారికి కనిపించవచ్చు. నవ్వులే కాదు పువ్వులు కూడా వారిని భయపెడతాయి, వారి నీడలు కూడా వారిని భయపెడతాయి. ఈ భయం నుంచి బయటపడాలంటే వారి ముందున్న మార్గం ఒకటే. తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ధైర్యంగా ప్రభుత్వ కార్యా లయాల్లో అంటించుకోవాలి. ఇదిగో ఇన్ని హామీలను అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి వైసీపీలాగా ధైర్యంగా చెప్పగలగాలి. లేకుంటే రాబోయే మూడునాలుగేళ్లూ నిర్భంధ కాండనే నమ్ము కోవాల్సి వస్తుంది. నిర్బంధకాండలో ఎవరూ నిలబడలేరని చరిత్ర చెబుతున్నా పాలకులకు చెవికెక్కదు. ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎంతమందిని జైలుకు పంపినా, ఎంత హత్యాకాండ కొనసాగించినా రాబోయే మార్పును ఆపడం సాధ్యం కాదు. ‘నువ్వు అన్ని పువ్వులనూ కోసి పారేయవచ్చు, కానీ వచ్చే వసంతాన్ని ఆపడం నీ తరం కాదు...’ చిలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ స్పానిష్ కవి పాబ్లో నెరూడా చెప్పిన నిత్య సత్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. మందీ మార్బలంతో పత్రికా కార్యాలయంపై దండెత్తడం, అక్షరాన్ని దహనం చేసే ప్రయత్నం చేయడం ఎంత అవివేకమైన చర్యలో చరిత్ర తప్పక నిరూపిస్తుంది. టీవీలో ఓ యాంకర్ నవ్వు, ఇన్స్టాలో ఓ యువ కుడి సెటైర్, వేదికపై ఓ గాయకుడి పాట, పొలంలో ఓ రైతన్న ఆగ్రహం... ఇలాంటివన్నీ తనకు నచ్చలేదని కేసులు పెడుతూ పోతే జనానికి కొన్ని కామెడీ పాత్రలు గుర్తుకొస్తాయి. నవ్వి పోదురు గాక నాకేటి... అనుకుంటే ఇంకేమీ ఉండదు మరి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

రైతులను రౌడీలుగా చూపిస్తూ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తతలకు కారణమైనవాళ్లను వదిలేసి.. అమాయక ప్రజలపై, రైతులపైనా కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఎక్స్లో మండిపడ్డారాయన. చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన.. అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది?. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?.. .. పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ?. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు..@ncbn గారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2025

హాలీవుడ్కు వేదికవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్కు హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇకపై బాలీవుడ్కు హైదరాబాద్ వేదిక కానుందని పేర్కొన్నారు. శనివారం హైటెక్స్లో తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ‘భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలుగు సినీ పరిశ్రమకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏళ్లు నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. నేను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్ గురించి వెల్లడించాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగో తరం కొనసాగుతోంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తిం. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్రెడ్డి అన్నారు. గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్లు గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.

దాడులు... ప్రతిదాడులు
టెహ్రాన్/జెరూసలేం/దుబాయి/వాషింగ్టన్: తొలిదెబ్బతోనే పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధిచేసిన ఇజ్రాయెల్ శనివారం మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. శనివారంనాటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు ప్రాణాలుకోల్పోయారు. సైనిక జనరల్ స్టాఫ్లో డెప్యూటీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన జనరల్ గోలామ్రెజా మెహ్రీబీ, ఆపరేషన్స్ విభాగ డెప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్ సైతం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్లోని పలు జనావాసాలపై పడ్డాయి. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియరాలేదు. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్పైనా క్షిపణులు పడ్డాయి. ఆగ్నేయ ఇరాన్ ‘ఖుజెస్తాన్’ప్రావిన్సులోని అబదాన్ నగరంపై, మిలటరీ స్థావరం సమీపంలోని కెర్మాన్షా ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ దాడులుచేసింది. ఇరాన్ గగనతల రక్షణవ్యవస్థలు ధ్వంసంకావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంగా తయారైందని, ఇష్టమొచ్చినట్లు మేం దాడిచేయగలమని ఇజ్రాయెల్ రక్షణశా ఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీడెఫ్రిన్ ప్రకటించారు. 70 ఫైటర్జెట్లతో శత్రు గగనతల రక్ష ణ వ్యవస్థను భస్మీపటలం చేశామని పేర్కొన్నారు. రేడియో ధార్మికత సాధారణమే సైన్యాధికారులను కోల్పోయి సైనికంగా, స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ వెంటనే ప్రతికార దాడులకు దిగింది. శనివారం ఉదయం సైతం మరోసారి వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్రాజధాని టెల్ అవీవ్ సిటీమీదకు ఎక్కుపెట్టింది. ఇజ్రాయెల్ ఐరన్డోమ్ క్షిపణ విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది. దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు, మెరుపులు చూసి, భారీ శబ్దాలు విని ఇజ్రాయెల్వాసులు భయకంపితులయ్యారు. అయితే భారీఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్డోమ్ వ్యవస్థను దాటుకొని మరీ లక్ష్యాలను ఢీకొట్టాయి. దీంతో రిషాన్ లీజియన్ నగరంలో ఇద్దరు, టెల్అవీవ్లోని రమాత్ గాన్ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాడులనేపథ్యంలో టెల్ అవీవ్ సమీప బెన్ గురియణ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసేసింది. మృతసముద్రతీర ప్రాంతంలో చాలా డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ అణుకేంద్రంపై శుక్రవారం పలుమార్లు దాడులుజరిగాయని, రేడియోధార్మికత స్థాయిలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ శనివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేసింది. ఇరాన్ ఆర్మీ చీఫ్గా అమీర్ హతామి ఇరాన్ నూతన ఆర్మీ చీఫ్గా అమీర్ హతామి నియమితులయ్యారు. ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హతామి ఇరాన్ సైన్యానికి చీఫ్ కమాండర్గా వ్యవహరిస్తారు. హతామి 2013 నుంచి 2021 వరకు ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇరాన్ సైనిక వ్యవస్థతో బలమైన సంబంధాలున్న హతామికి మూడు దశాబ్దాలకు పైగా వ్యూహాత్మక, కార్యాచరణ అనుభవం ఉంది. మరోవైపు బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం నూతన చీఫ్గా జనరల్ మజీద్ మౌసావితో ఖమేనీ శనివారం భర్తీచేశారు. ప్రస్తుత చీఫ్ అమీర్ అలీ హజిజాదే శుక్రవారంనాటి దాడుల్లో చనిపోవడం తెల్సిందే. యుద్ధాన్ని ఆపాలన్న ప్రపంచదేశాలు ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో అస్థిరత రాజ్యమేలుతుండగా కొత్తగా ఇరాన్తోనూ ఇజ్రాయెల్ సమరానికి సై అనడాన్ని ప్రపంచదేశాలు తప్పుబట్టాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని కోరాయి. శాంతిస్థాపన దిశగా చర్చలు జరపాలని శనివారం వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికాలో నూతన పోప్ లియో–14 సందేశం ఇచ్చారు. ఇతర ఉనికి మరొకరు ప్రశ్నించకూడదని, బెదిరించకూడదని అన్నారు. ‘‘ఇరాన్ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ బాంబులేస్తే, టెల్అవీవ్పై ఇరాన్ క్షిపణులను పడేసింది. పెరిగిన ఉద్రిక్తతలను చాలించండి. ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయమిది. శాంతి, దౌత్యమార్గాల్లో నడవండి’’అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం పిలుపునిచ్చారు. రహస్యంగా డ్రోన్లు తరలించి.. రష్యాలోకి ఉక్రెయిన్ రహస్యంగా డ్రోన్లను తరలించినట్లే ఇజ్రాయెల్ సైతం ఇరాన్లోకి రహస్యంగా డ్రోన్లను తరలించి గగనతల రక్షణవ్యవస్థల వద్దకు చేర్చింది. అదనుచూసి ఎస్–300 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లాంఛర్లను, రాడార్ వ్యవస్థలను డ్రోన్లతో పేల్చేసింది. రాడార్లులేకపోవడంతో సులభంగా ఇజ్రాయెల్ ఫైటర్జెట్లు ఇరాన్ ప్రధానభూభాగందాకా వచ్చి భీకరస్థాయిలో బాంబులు జారవిడిచి వినాశనం సృష్టించాయి. అర్ధరాత్రి దాడి తాలూకు వీడియో ఫుటేజీని ఇజ్రాయెల్నిఘా విభాగం మొస్సాద్ శనివారం విడుదలచేసింది. ఇలాంటి వీడియోలను మొస్సాద్ విడుదలచేయడం అత్యంత అరుదు. విమానాలను కూల్చేసే లాంఛర్లపై ఇజ్రాయెల్ ఆత్మాహుతి డ్రోన్లు ల్యాండ్ అయి పేలిపోవడం ఆ దృశ్యాల్లో కనిపించింది. ‘‘మావైపుగా క్షిపణులు ప్రయోగించడం మానకుంటే టెహ్రాన్ను అగ్నికి ఆహుతిచేస్తాం. మరుభూమిగా మార్చేస్తాం. మా పౌరులకు హాని తలపెడితే మిమ్మల్ని మసిచేస్తాం. టెహ్రాన్పై మరోదఫా దాడులకు మా యుద్దవిమానాలు సదా సిద్ధంగా ఉన్నాయి’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’అన్నారు. ఈయన పేరులో దేశంపేరూ ఉండటం విశేషం. ‘‘ముప్పును సమూలంగా తొలగించేదాకా దాడులు ఆపబోం. దాడులు రోజులతరబడి కొనసాగొచ్చు’’అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు.ఇరాన్ ‘అణు’కల చెదిరింది యురేనియంను అత్యంత శుద్ధిచేసి అణుబాంబును తయారుచేయాలన్న ఇరాన్ కల చెదిరిపోయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అణుకేంద్రం ధ్వంసంకావడం, అందులో కీలక వ్యవస్థలు కూలిపోవడంతోపాటు అత్యంత కీలకమైన 9 మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయిన నేపథ్యంలో ఇరాన్ ఇప్పట్లో అణుబాంబును తయారుచేయడం అసాధ్యమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అణువిద్యుత్ కేంద్రానికి సరిపడా యురేనియంను శుద్ధిచేసేందుకు ఇరాన్కు అనుమతి ఉండగా అదనపు యురేనియంను శుద్ధిచేస్తోందని చాన్నాళ్ల నుంచి ఆరోపణలురావడం తెల్సిందే. శుక్రవారంనాటి దాడుల్లో అణువిద్యుత్కేంద్రం బ్యాకప్ ఇంధన శక్తివ్యవస్థను ఇజ్రాయెల్ నాశనంచేసింది. దీంతో కరెంట్ కష్టాలు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది.అణు చర్చలు అర్థ్ధరహితంఅమెరికా ఓవైపు మాపై యుద్ధానికి ఇజ్రాయెల్ను ఎగదోస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడటం అర్థ్ధరహితమని అగ్రరాజ్యంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అణుచర్చల కోసం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఐదుసార్లు చర్చలు జరగ్గా ఆరోసారి ఆదివారం ఒమన్లో జరగనున్నాయి. ఇజ్రాయెల్ను మాతో యుద్దానికి దించి అమెరికా మరోదఫా చర్చలకు అర్థంలేకుండాచేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయిల్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్కు మద్దతిస్తే పశ్చిమాసియాలోని మీ స్థావరాలపై దాడులుచేస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లను ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఆదివారం జరగబోయే చర్చలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఇజ్రాయెల్ వైపుగా వెళ్తున్న కొన్ని ఇరాన్ క్షిపణులను తాము ఎయిర్డిఫెన్స్ వ్యవస్థలతో కూల్చేశామని అమెరికా అధికారి ఒకరు వెల్లడించడం గమనార్హం. కశ్మీర్ ‘పోస్ట్’పై ఇజ్రాయెల్ క్షమాపణలుటెహ్రాన్పై వైమానిక దాడులు చేశామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం తమ ‘ఎక్స్’ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘‘ఇరాన్ అనేది ప్రపంచం మొత్తానికి పెనుముప్పుగా మారింది. ఇది ఇజ్రాయెల్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. త్వరలో అన్ని దేశాలతోనూ ఇది ఇలాగే వ్యవహరిస్తుంది. అందుకే దాడులు చేయడం మినహా మాకు మరోదారి కనిపించలేదు’’అని ఐడీఎఫ్ శుక్రవారం ఒక మ్యాప్ను పోస్ట్పెట్టింది. అయితే ఈ మ్యాప్లో జమ్మూకశీ్మర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే తప్పు తెల్సుకున్న ఇజ్రాయెల్ శనివారం క్షమాపణలు చెప్పింది. ‘‘ఈ ప్రాంత భూభాగాన్ని చూపుతూ ఊహాత్మకంగా గీసిన మ్యాప్ అది. సరిహద్దులను కచ్చితంగా సూచించడంలో ఈ మ్యాప్ విఫలమైంది. మ్యాప్ కారణంగా మేం ఏదైనా నేరానికి పాల్పడినట్లు భారత్ భావిస్తే సారీ’అని ఐడీఎఫ్ శనివారం ఒ పోస్ట్ పెట్టింది.

AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి చివరిగా వచ్చిన మే డే కాల్లో ఐదు సెకన్ల పాటు రికార్డ్ అయిన ఆడియో సందేశంలో కీలక విషయం వెల్లడైంది. ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి వచ్చిన మే డే కాల్లో.. మే డే.. మే డే.. మే డే.. నో పవర్.. నో త్రస్ట్.. గోయింగ్ డౌన్ ఇవి కెప్టెన్ సబర్వాల్ ఆఖరి సందేశంగా రికార్డైంది. దీనికి సంబంధించి ఆడియో ప్రస్తుతం ఏటీసీ వద్ద ఉందని తాజాగా వెల్లడించారు. మే డే కాల్కు శతాబ్ధానికి పైగా చరిత్ర!సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్కు సమానార్ధకం. ఫ్రెంచ్లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.మేడే కాల్ వస్తే..!ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. కాగా, జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది.

సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుకలో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 2024 ఏడాదిగాను పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 2 చిత్రానికి అందిన తొలి అవార్డు ఇది. తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు వేడుకను ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పుష్ప-2 మూవీలోని మాస్ డైలాన్ని చెప్పి ఆకట్టుకున్నాడు. ఇది సినిమా ఫంక్షన్ కదా.. తన సినిమాలోని డైలాగ్ను చెప్పవచ్చా.. అని అడిగి మరీ అల్లు అర్జున్ ‘రప్పా రప్పా’ డైలాగ్ చెప్పాడు.రేవంత్ రెడ్డి ముందు పుష్ప 2 సినిమా డైలాగ్ కొట్టిన హీరో అల్లు అర్జున్ pic.twitter.com/LlQh7mSQfP— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025

సూపర్ ‘సఫారీ’
దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్ కప్ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్ కప్లు, 9 టి20 వరల్డ్ కప్లు, 9 చాంపియన్స్ ట్రోఫీలు, 2 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్ అందుకునే అవకాశమే రాలేదు... అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్తో సఫారీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఈ సారి మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎయిడెన్ మార్క్రమ్ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్మనీ దక్కింది.27.4 ఓవర్లలో 69 పరుగులు... ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్ అవుట్ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్ (8)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్రమ్ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్హామ్ (21 నాటౌట్) అండగా నిలిచాడు. ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్రమ్ను హాజల్వుడ్ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్ వేసిన బంతిని వెరీన్ కవర్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) హెడ్ (బి) హాజల్వుడ్ 136; రికెల్టన్ (సి) క్యారీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్ 66; స్టబ్స్ (బి) స్టార్క్ 8; బెడింగ్హామ్ (నాటౌట్) 21; వెరీన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్: స్టార్క్ 14.4–1–66–3, హాజల్వుడ్ 19–2–58–1, కమిన్స్ 17–0–59–1, లయన్ 26–4–66–0, వెబ్స్టర్ 5–0–13–0, హెడ్ 2–0–8–0.

శ్రీశ్రీ ఒక తీరని దాహం
జలజల పారే గంగా గోదావరీ అనే జీవ నదులూ, మబ్బుల్ని తాకే హిమాలయ పర్వత శ్రేణులూ, పున్నమి వెన్నెల్లో తాజ్ మహల్ సౌందర్యమూ, బిస్మిల్లాఖాన్ షెహనాయి రాగాల లాలిత్యమూ... వీటి గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకున్నా బావుంటుంది. కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ యేల ఏడ్చెదో... బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకున్... మందార మకరంద మాధుర్యమును గ్రోలు... వంటి తియ్యని తెలుగు కవిత్వాన్నీ, సిరులు మించిన పసిడి బంగారు జిలుగు దుప్పటి జారగా... అంటూ కవ్వించే జనార్దనాష్టకం పద్యాల నడకలోని తూగునీ ఎన్నిసార్లు పాడుకున్నా అదే చెక్కుచెదరని అందం. అంతే తన్మయత్వం!మహాభారతం, ‘కన్యాశుల్కం’, ‘అన్నా కరెనినా’, ‘ద బ్రదర్స్ కరమజోవ్’, ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’, చలం ‘ఓ పువ్వు పూసింది’– ఎలాగో ‘మహాప్రస్థానమూ’ అంతే. ఒక సూపర్ క్లాసిక్. మరిచిపోలేని మాస్టర్ పీస్! అది తెలుగు సాహిత్యాన్ని యుద్ధరంగంలోకి నడిపించింది. తెలుగు కవిత్వాన్ని అజేయమైన శక్తిగా నిలిపింది. నీలాకాశంలోకి తెలుగు పతాకాన్ని ఎగరేసింది. విశ్వనాథ సత్యనారాయణ లాంటి పండితుడూ,సంప్రదాయవాదీ విస్తుపోయాడంటే, శ్రీశ్రీ ఎగరేసిన జెండాలా, సంస్కృత సమాసాలకు తల్ల కిందులై కాదు, అందులోని స్వచ్ఛమైన అచ్చమయిన కవిత్వాన్ని చూసి, అలా రాయడం మరొకరి వల్లకాదని తెలిసి! ‘తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ లెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు?’– విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఆ నాలుగు లైన్లూ చదివి, దివాకర్ల వెంకటావధాని, రెండు మూడొందల ఏళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో ఇలా అన్నవాడెవడూ లేడని ఒక ఉద్వేగంతో చెప్పారు. శ్రీశ్రీని పరుసవేది అన్నాడు జ్వాలాముఖి. మోడువారిన చెట్టు చిగురించి మళ్లీ జీవితంలోకి ప్రవేశించడం మనకి నేర్పుతుంది. శ్రీశ్రీ కవిత్వం చదివిన వాళ్ళందరి అనుభవమూ అదే. మనో వాక్కాయకర్మ శుద్ధి పరిపూర్ణంగా గలవాడికి మాత్రమే అలాంటి కవిత్వం సిద్ధిస్తుంది. సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. మహాప్రస్థానానికి 75 ఏళ్లు అంటున్నారు. తొలిసారి 1950లో అచ్చయింది గనక ఇలా అనొచ్చు. హంగ్రీ థర్టీస్లోనే 1934–40 మధ్యనే శ్రీశ్రీ ఈ గీతాలు రాశారు. రాసి తొంభై సంవత్సరాలు అయింది. సెలబ్రేట్ చేసుకోడానికి ఒక అకేషన్ అని తప్పితే, జీవ నది లాంటి ఆ కవిత్వం మన సంస్కృతిలో, అనుభూతిలో, మన రక్తంలో ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. మహాప్రస్థానంలో మీకు ఏ కవిత ఇష్టం? కొంపెల్ల జనార్ధనరావు కోసమా? ఎచటికి పోతావీ రాత్రి? దారిపక్క చెట్టుకింద కూర్చున్న ముసిల్దా? సంధ్యా సమస్యలా? శైశవ గీతా? గంటలా? కవితా ఓ కవితా? ఇలా మనం ఎన్ని పొయెమ్స్ అయినా చెప్పగలం. వాటిని అప్పచెప్పగలం కూడా! అయితే, తాను రాసిన వాటిల్లో శ్రీశ్రీకి బాగా నచ్చిన కవిత ఏదో తెలుసా? అది మహాప్రస్థానంలో లేదని కూడా తెలుసా? ‘శరశ్చంద్రిక’ నాకు యిష్టం అని ఒక సందర్భంలో చెప్పారు శ్రీశ్రీ. ఆ దీర్ఘ కవిత ‘ఖడ్గసృష్టి’లో మొట్టమొదటిది! నవీన విశ్వవిద్యా లయాల్లో పురాణ కవిత్వంలాగా శ్రవణ యంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతం లాగా ఇలా వచ్చావేం వెన్నెలా? అంటూ వెన్నెలలో మహాకవి సంభాషణ మొదలవుతుంది. సాదాసీదాగా, నిరలంకారంగా, ఊర్నే నువ్వూ నేనూ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. శరశ్చంద్రిక చదవడం పూర్తి అయ్యేసరికి మనం ఒక వెన్నెల తుఫాన్లో చిక్కుకుపోతాం. సాక్షాత్తూ వెన్నెల సముద్రం మీద సంతకం చేస్తున్న దృశ్యం ఒక మహత్తరమైన పెయింటింగ్లా మనోఫలకం మీద నిలిచిపోతుంది. ప్రలోభాలకూ, పద్మశ్రీలకూ తలవంచని తీరానికి చెందిన వాడు. పురిపండా అప్పలస్వామి ఒరియా సాహిత్య చరిత్ర రాసిన తెలుగువాడు. చేతిరాతతో లండన్ మహాప్రస్థానం ఎందుకూ? అని శ్రీశ్రీ సందేహిస్తున్నపుడు, పురిపండా ఇలా అన్నారు: ‘మహా ప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం. నాకు తెలిసినంత మట్టుకు మరే భారతీయ భాషలోనూ ‘కవితా ఓ కవితా’ అంత గొప్పగీతం రాలేదు’. ఈ మాట ఒక జ్ఞాన్పీఠ్ అవార్డు కన్నా తక్కువదేమీ కాదు. మార్క్సిస్ట్ ఈస్థటిక్స్కి మహా ప్రస్థానమే ఒక సజీవ ఉదాహరణ. గదిలో ఎవరూ లేరు, గదినిండా నిశ్శబ్దం, సాయంత్రం ఆరున్నర, గదిలోపల చినుకుల వలె చీకట్లు... అని మొదలవుతుంది ‘ఆకాశ దీపం’, వట్టి వచనం. తొంభై సంవత్సరాల క్రితం ఇలా రాయడానికి ఎంత ధైర్యం శ్రీశ్రీకి? ‘దీపం ఆరిపోయింది – తారగా మారిపోయింది’ అని కవిత ముగిసేసరికి గుండె పేలి పోతుంది. అందుకే చలం ‘బుద్ధున్నవాడెవడూ దీన్ని కవిత్వం అనడు’ అన్నారు. ఈ కవి అప్పీల్ బుద్ధినీ, వివేకాన్నీ, కళానిబంధ నల్నీ మించిన ఏ అంతరాళానికో తగుల్తుంది. ఆ అంతరాళం అనేది ఉన్నవాళ్ళకి అని చెప్పారు. నిప్పులు చిమ్ముకుంటూ... అంటూ ఆరు లైన్ల పొట్టి కవిత రాసినా, కవితా ఓ కవితా అని ఆరేడు పేజీల దీర్ఘకవిత్వం రాసినా శ్రీశ్రీలో ఆవేశం, సముద్ర కెరటమై ఎగిసిపడుతుంది. లెనిన్, స్విన్ బర్న్, సాల్వడార్ డాలీ, కొంపెల్ల జనార్ధనరావు... ఇలా ఎవరి గురించి రాసినా పాఠకుణ్ణి నిద్రపోనివ్వని శ్రీశ్రీ ముద్ర మనందరి కలెక్టివ్ ఎక్స్పీరియ¯Œ ్స! కనకదుర్గా చండ సింహం జూలు దులిపే ఆవులించింది – అనే శుద్ధవచనాన్ని నరాలు తెగే కవిత్వంగా మార్చే రహస్యం తెలిసినవాడు –అతనొక్కడే! మహాప్రస్థానము, ఖడ్గసృష్టి మాత్రమే రాసి శ్రీశ్రీ చేతులు దులుపుకోలేదు. సిరిసిరిమువ్వలు, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, గల్పికలు, అనువాదాలు, నాటికలు, కథలు, వీలునామా, సినిమా పాటలు, ఆత్మకథ ‘అనంతం’ – మరెన్నో రాశాడు. అద్భుతాలు చేశాడు. జీవితాంతమూ రాస్తూనే ఉన్నాడు. ఎంత రాశాడో అంతకు మించి చదువుకున్నాడు. శ్రీశ్రీ జ్ఞాని. రుషితుల్యుడు. కష్టజీవు లందరికీ మిత్రుడు. తెలుగుజాతి వరపుత్రుడు. దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిపించినా, వెలుతురెక్కడ సోనియా అంటూ బైరాగి విలపించినా, చెట్లు కూలుతున్న దృశ్యాన్ని చూసి అజంతా కన్నీళ్లు పెట్టినా; జనంలో నడు, కాలాన్ని వెంటపెట్టుకు నడూ అని మక్దూమ్ మొహియుద్దిన్ పిలుపు ఇచ్చినా, సత్యమూర్తి చిరుగాలి సితారా సంగీతం వినిపించినా;ఎండ్లూరి సుధాకర్, మద్దూరి నగేష్బాబు వెలివాడల వేదనని కన్నీటి అక్షరాలుగా పరిచినా అది శ్రీశ్రీ తిరుగుబాటు వేదాంతానికి ఉత్తేజపూర్వకమైన కొనసాగింపు మాత్రమే. గురజాడ వేంకట అప్పారావు పరిచిన వారసత్వపు వెలుతురు దారుల్లో శ్రీశ్రీ, ఎర్రకాంతుల ఇనోదయాన్ని డిస్కవర్ చేసి, నవ్య కవిత్వంతో నిండిన వేల పాలపుంతల్ని ప్రసాదిస్తే ఆ వెలుగు వెన్నెల జోడిలో ఆధునిక తెలుగు కవిత్వం మానవ జీవన మాధుర్య సౌందర్య తీరాలను తాకి పరవశిస్తోంది.తాడి ప్రకాష్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రచయిత ‘ 97046 41559

ఆదాయం ఆశల పల్లకీలో..
దేశంలోని 74 శాతం గ్రామీణ కుటుంబాలు రాబోయే ఒక ఏడాదిలో తమ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు ‘నాబార్’్డ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) తాజా సర్వే వెల్లడించింది. 2025 మే నెలలో జరిగిన ఆ సర్వే ప్రకారం – ఈ 74 శాతం అన్నది గత మార్చిలో 72 శాతంగా నమోదైంది. 2024 సెప్టెంబర్లో నాబార్డ్ ద్వైమాసిక ‘రూరల్ ఎకనమిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్స్ సర్వే (ఆర్.ఇ.సి.ఎస్.ఎస్.) ప్రారంభం అయినప్పటి నుంచి – రానున్న ఒక సంవత్సరంలో తమ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్న వారి శాతంలో ఇదే అత్యధికం. – సాక్షి, స్పెషల్ డెస్క్నైరుతితో చిగురించిన ఆశలు600 గ్రామాల్లో.. ప్రతి నమూనా గ్రామం నుంచి 10 కుటుంబాలను ఎంపిక చేసుకుని 6,000 మందితో నాబార్డ్ ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది మే నెలలో ఐదవ విడత సర్వే పూర్తయింది. సర్వే ఫలితాలను బట్టి గ్రామీణ ప్రాంతాలలో తమ ఆదాయంలో పెరుగుదలను ఆశించే వారి సంఖ్య పెరగటం మాత్రమే కాకుండా, తమ ఆదాయం క్షీణించవచ్చునని మునుపు అనుకున్న వారి సంఖ్య సర్వే మొదటి విడతలోని 7.3 నుంచి 6.7 శాతానికి తగ్గటం విశేషం. గ్రామీణ కుటుంబాలలో ఆదాయం వృద్ధి గురించి పెరుగుతున్న ఆశావాదం.. గత కొన్ని నెలలుగా గ్రామీణ రంగం పుంజుకుంటోందన్న సానుకూల ఆలోచనలకు అనుగుణంగా ఉంది. 2025లో ‘సాధారణం కంటే ఎక్కువ’గా నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందన్న అంచనా గ్రామీణ రంగంలో సానుకూల మార్పునకు దోహదపడింది. ఆ సానుకూలత గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ వృద్ధిని, కొనుగోలు శక్తిని పెంచుతుందన్న ఆశలు రేపింది. పెరగనున్న వాస్తవ వేతనాలుఇటీవలి ‘ఇండియా రేటింగ్స్’ నివేదిక ప్రకారం కూడా అనుకూల రుతుపవనాల వ్యవసాయ వృద్ధి కారణంగా 2025–26 లో వాస్తవ వేతనాలు (ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరిగినవి) స్థిరంగా 6.5 శాతం నుంచి 7 శాతం వరకు వృద్ధి చెందుతాయని అంచనా. ఏదైనా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సంఘటనలు, రుతుపవనాల పురోగతిలో అంతరాయం, వాణిజ్యం లేదా భౌగోళిక రాజకీయ సమస్యలు సంభవిస్తే మాత్రం వాస్తవ వేతన వృద్ధి రేటు తగ్గవచ్చని కూడా నివేదిక సూచించింది. కాగా, నాబార్డ్ నివేదిక ప్రకారం.. ఆదాయం పెరుగుదలపై మే నెలలో స్వల్పంగా గ్రామీణ కుటుంబాల ఆశలు చిగురించాయి. 53.8 శాతం మంది మెరుగైన ఆదాయాలు వస్తాయని భావిస్తున్నారు. 2025 మార్చిలో ఈ ఆశ 52.5 శాతంగా మాత్రమే ఉంది. ఉపాధి లభ్యతపై సానుకూలతవచ్చే త్రైమాసికంలో లభించనున్న ఉపాధి అవకాశాలపై అంచనాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో 53.5 శాతం కుటుంబాలు ఉపాధి పరిస్థితుల్లో మెరుగుదలను ఆశించగా, 2024 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక ఆశావహ శాతం. కేవలం 8 శాతం మంది మాత్రమే తగ్గుదలను అంచనా వేశారు, ఫలితంగా నికర సానుకూలత 45.4కు చేరుకుందని నాబార్డ్ సర్వే వెల్లడించింది. 2025 జనవరిలో స్వల్పంగా తగ్గిన ఆశలు తిరిగి స్థిరంగా కోలుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో కుటుంబ ఆదాయాలు స్వల్ప మెరుగుదలను చూపించాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 37.4 శాతం మంది గత సంవత్సరంతో పోలిస్తే తమ ఆదాయంలో పెరుగుదల కనిపించినట్లు తెలిపారు. మార్చిలో ఇది 34.8 శాతంగా ఉంది. అయితే 21.4 శాతం మంది తమ ఆదాయం తగ్గిందని, 41.3 శాతం మంది ‘ఏమో చెప్పలేం’ అని సమాధానం ఇచ్చారు.పొదుపు ఆలోచన కొంత తగ్గింది!నాబార్డ్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వినియోగ వ్యయాలు కూడా బలంగానే ఉన్నాయి. 79.1 శాతం కుటుంబాలు తమ ఖర్చు పెరిగినట్లు తెలిపాయి. ఇది మార్చి నెలతో పోలిస్తే (79.9 శాతం) స్వల్పంగా తగ్గినప్పటికీ , నికరంగా 74.6 వద్ద స్థిరంగా ఉంది. ఈ ధోరణి గ్రామీణ కుటుంబాలలోని నిరంతర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా, పొదుపు చేయాలన్న ఆలోచన తగ్గిపోయింది. కేవలం 18.8 శాతం కుటుంబాలు మాత్రమే తమ పొదుపు మొత్తాలు పెరిగినట్లు చెప్పగా, 28.7 శాతం కుటుంబాలు తగ్గాయని తెలిపాయి. ఫలితంగా 9.9 శాతం నికరమైన ప్రతికూలత కనిపించింది. మార్చి (–11.9) నుంచి ఇది స్వల్ప మెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, సర్వేలో వరుసగా ఐదవ విడతలో సైతం పొదుపు బలహీనంగానే ఉంది.

ఘనంగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. విజేతలు వీళ్లే
హైదరాబాద్లోని అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. 2014 నుంచి 2024 వరకు వచ్చిన సినిమాలు, నటీనటులకుగానూ ఈ పురస్కారాల ప్రదానం చేశారు. అవార్డ్తో పాటు సిల్వర్ మొమెంటో, రూ.5 లక్షల ప్రైజ్మనీ అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.అవార్డులు అందుకున్న విజేతలు వీళ్లేఉత్తమ నటుడు- అల్లు అర్జున్( 2024 ఏడాదికి గాను పుష్ప-2 మూవీ)ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ఉత్తమ చిత్రం : కల్కి 2898 ఏడీద్వితీయ ఉత్తమ చిత్రం : పొట్టేల్తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్: మేం ఫ్రెండ్సండీఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్)ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్ శ్రీరామ్: ఊరుపేరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్: పుష్ప2 (సూసేటి అగ్గిరవ్వ) ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర-ఆయుధపూజ)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్స్టర్)ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా2)ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అధ్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్కుమార్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అరుణ్ దేవ్ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మోనీ సోషల్ అప్లిస్ట్: కమిటీ కుర్రాళ్లు
మరో దోపిడీకి తెరలేపిన విద్యుత్ శాఖ
20, 21 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు వాయిదా
దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాథుర్ బాధ్యతలు
ఎటెళ్లిపోయాయో.. ఆ 900 బస్తాలు
ప్రసారం ఓ ప్రహసనం..మనుగడ ప్రశ్నార్థకం
తిరుచానూరులో మరో ఆలయం కూల్చివేత
ఇంటి కాంపౌండ్లోకి చిరుత
బతికుండగానే శ్మశానవాటికకు..
తల్లుల పేరుతో లీలలు వం‘ధనం’ వింతలు
ఏడాది పాలన.. మహిళలకు వంచన
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
Plane Crash: బీజే మెడికల్ కాలేజీలో CCTV విజువల్స్
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
డ్యాన్స్ మాస్టర్ కోసం వెళ్లిన రోజా, మీనా, రంభ, దేవయాని (ఫోటోలు)
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఈ నకిలీ డాక్టర్కు అసలు ‘హృదయం’ లేద్సార్!
పెళ్లయి 16 ఏళ్లు.. సుకుమార్ భార్య ఎమోషనల్ (ఫొటోలు)
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరిచయాలు పెరుగుతాయి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
అహ్మదాబాద్లో విమాన ప్రమాదం - 241 మంది మృతి
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక
అఖిల్ రిసెప్షన్లో అట్రాక్షన్గా 'శోభిత ధూళిపాళ' చీర.. ధర ఎంతో తెలుసా? (ఫోటోలు)
మరో దోపిడీకి తెరలేపిన విద్యుత్ శాఖ
20, 21 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు వాయిదా
దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాథుర్ బాధ్యతలు
ఎటెళ్లిపోయాయో.. ఆ 900 బస్తాలు
ప్రసారం ఓ ప్రహసనం..మనుగడ ప్రశ్నార్థకం
తిరుచానూరులో మరో ఆలయం కూల్చివేత
ఇంటి కాంపౌండ్లోకి చిరుత
బతికుండగానే శ్మశానవాటికకు..
తల్లుల పేరుతో లీలలు వం‘ధనం’ వింతలు
ఏడాది పాలన.. మహిళలకు వంచన
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఈ నకిలీ డాక్టర్కు అసలు ‘హృదయం’ లేద్సార్!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరిచయాలు పెరుగుతాయి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
అహ్మదాబాద్లో విమాన ప్రమాదం - 241 మంది మృతి
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి.. క్షేమం అంటూ పోస్ట్
వా.. నర ప్రేమ!
సినిమా

కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. ఎందుకిలా జరుగుతోంది?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన బ్లాక్బస్టర్ మూవీ కాంతార (Kantara Movie). 2022లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి మేకర్స్ ప్రీక్వెల్ (కాంతార: చాప్టర్ 1) ప్రకటించారు.అయితే ఏ ముహూర్తాన కాంతార 1 ప్రకటించారో కానీ అప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంతార నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు (43) గుండెపోటుతో మరణించాడు. తీర్థహళ్లిలో చిత్రయూనిట్తో బస చేసిన అతడికి బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. ఇతడు మాలికాపురం, మార్కో వంటి పలు చిత్రాల్లో నటించాడు. 25 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తున్నాడు.గతంలో..షూటింగ్ ప్రారంభించిన కొత్తలో కర్ణాటకలోని ముడూరులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారేమో తీవ్రమైన గాలివాన వల్ల భారీ సెట్ కూలిపోయింది. ఇటీవల మలయాళ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి విగతజీవిగా తేలాడు. ఆ తర్వాత కన్నడ నటుడు, హాస్య నటుడు రాకేశ్ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు కళాభవన్ కన్నుమూశాడు. ఈ వరుస విషాదాలు కాంతార చిత్రయూనిట్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అడవిలో పేలుళ్లుఅయితే నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. అడవిలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని, పేలుళ్లతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం అక్కడి అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టికి రాగా.. తక్షణమే షూటింగ్ ఆపేయాలని అధికారులను ఆదేశించారు.ఇకపోతే పంజుర్లి దేవుడి ఆగ్రహంతోనే ఇలా జరుగుతోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాంతార సినిమాతోనే పంజుర్లి దేవుడు గురించి వెలుగులోకి వచ్చింది. పంజుర్లి అంటే పంది. చెడు చేసేవారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే భగవంతుడే పంజుర్లీ అని నమ్ముతారు.చదవండి: మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో

'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్తో తీసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ఈవెంట్ తాజాగా కొచ్చిలో నిర్వహించారు. అక్కడే మోహన్ లాల్ చేతుల మీదుగా ఇప్పుడు ట్రైలర్ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ స్క్రీన్ పెజెన్స్ కూడా అభిమానులకు నచ్చేలా ఉంది. గతంలో వచ్చిన కంటెంట్పై వచ్చింది. ట్రైలర్ని మాత్రం ట్రోలింగ్కి స్కోప్ లేకుండా బాగానే కట్ చేశారు. అలానే స్టోరీ ఏంటనేది కూడా చూచాయిగా చెప్పేశారు కూడా. సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా ట్రైలర్తో శాంపిల్ చూపించేశారు.ఓ గూడెంలో నివసించే తిన్నడు (మంచు విష్ణు).. చిన్నప్పటి నుంచి దేవుడిని పెద్దగా నమ్మడు. పెద్దయిన తర్వాత కొన్ని సంఘటనల వల్ల గూడెం నుంచి ఇతడిని వెలివేస్తారు. అదే టైంలో నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. తర్వాత శివుడు(అక్షయ్ కుమార్), రుద్ర(ప్రభాస్)ని భూమ్మీదకు పంపిస్తాడు. రుద్ర వల్ల తిన్నడు.. అతిపెద్ద శివభక్తుడు ఎలా అయ్యాడు? ఈ మొత్తం కథలో వాయు లింగం సంగతేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?)

అనసూయ ఒయ్యారాలు.. హల్దీ వేడుకల్లో 'బిగ్బాస్' శుభశ్రీ
ఒంపుసొంపులతో గ్లామర్ బెండ్ తీస్తున్న అనసూయహల్దీ వేడుక వీడియోని షేర్ చేసిన బిగ్బాస్ శుభశ్రీకొరియాలోని సియోల్లో కల్యాణి ప్రియదర్శినిమాళవిక మోహనన్ మత్తెక్కించే బాత్రూమ్ పోజులువయ్యారంగా చూస్తూ కిక్ ఇస్తున్న కోమలి ప్రసాద్నల్లంచు తెల్లచీరలో అరియానా ఫుల్ ఎంజాయ్హాట్ హాట్గా కనిపించేస్తున్న హీరోయిన్ నేహాశర్మ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)

అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు సామాన్యులకు ఎప్పుడూ వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్... తాజాగా పెళ్లి... అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్... ఇంకా కెరీర్ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే. అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్ రూపుదిద్దుకోకుండానే అఖిల్ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం. అంటే అక్కినేని యంగ్ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే...తాజాగా అఖిల్ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.మరోవైపు అఖిల్తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే... హైదరాబాద్లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ మేకర్. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్ స్కూల్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్ డిజైనర్గా శ్రియా శరణ్, సమంతా రూత్ ప్రభు కాజల్ అగర్వాల్ వంటి టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు. అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్’ అనే దుస్తుల బ్రాండ్ కు వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నా... తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.అఖిల్తో బ్రేకప్ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడైన అనిందిత్ రెడ్డి ని ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్గా నిలిచాడు. గత 2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎమ్ఎస్సి)లో 2017లో మోటార్స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్వ్యాగన్ వెంటో కప్ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ ఫార్మ్ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్గా ఎంపికయ్యాడు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఆర్య–అర్జున్ పసిడి గురి
మ్యూనిక్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సురుచి స్వర్ణ పతకం సాధించగా... శనివారం భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆర్య బోర్సే–అర్జున్ బబూతా జంట అద్వితీయమైన గురితో ఒలింపిక్ చాంపియన్ జిఫీ వాంగ్–లిహావో షెంగ్ (చైనా) ద్వయంపై గెలుపొందింది. ఫైనల్లో ఆర్య–అర్జున్ జోడీ 17–7తో చైనా జంటను చిత్తుచేసి అగ్ర స్థానంలో నిలిచింది.నార్వే జంటకు కాంస్య పతకం దక్కింది. భారత్కే చెందిన ఎలవెనిల్ వలరివన్–అంకుశ్ జాధవ్ జోడీ 631.8 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. పోటీల చివరి రోజు క్వాలిఫయింగ్ ఈవెంట్లో అర్జున్ 317.7 పాయింట్లు సాధించగా... ఆర్య 317.5 పాయింట్లు స్కోరు చేసింది. దీంతో ఓవరాల్గా 635.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్లో పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీ రుద్రాం„Š పాటిల్తో కలిసి ఆర్య బోర్సే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో రజత పతకం గెలిచింది. తాజా ప్రపంచకప్లో భారత్కు ఇది రెండో స్వర్ణం కాగా... ఓవరాల్గా నాలుగో పతకం. సిఫ్ట్ కౌర్ సమ్రా, ఎలవెనిల్ వలరివన్ వ్యక్తిగత కాంస్యాలు గెలుచుకున్నారు. ఇక పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–ఆదిత్య మల్రా 577 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. సురుచి సింగ్–వరుణ్ తోమర్ జంట 576 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమైంది.

చోకర్స్ కాదు... విన్నర్స్
దాదాపు ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్తో టి20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడింది. 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో చేతిలో 6 వికెట్లతో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఇక విజయం లాంఛనమే అనిపించగా...చివరకు 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డగౌట్లో కూర్చుకున్న కెప్టెన్ మార్క్రమ్ కన్నీళ్లపర్యంతమైన దృశ్యం దక్షిణాఫ్రికా అభిమానులకు కలచివేసింది. ఇప్పుడు సంవత్సరం తిరగక ముందే అతను సఫారీ ఫ్యాన్స్ దృష్టిలో హీరోగా మారిపోయాడు. ఆస్ట్రేలియా ‘బౌలింగ్ చతుష్టయం’ను ఎదుర్కొని దక్షిణాఫ్రికా 282 పరుగులు సాధించగలదా అనే సందేహాల మధ్య అతను అసాధారణ బ్యాటింగ్ను ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్లో ‘డకౌట్’ అయినా రెండో ఇన్నింగ్స్లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా తన కెరీర్లో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కెపె్టన్ తెంబా బవుమా విజయగాథ కూడా ఇలాంటిదే. 64 టెస్టుల కెరీర్లో కేవలం 4 సెంచరీలే సాధించిన అతను ప్రతీసారి తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నాడు. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టి టీమ్లో చోటు దక్కిందని, రిజర్వేషన్ కారణంగానే కొనసాగుతున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. తాజా ఘనతతో బవుమా నాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలిచాడు. ఫైనల్కు ముందు తన కెపె్టన్సీలో ఆడిన 9 టెస్టుల్లో 8 మ్యాచ్లు గెలిపించి ఓటమి ఎరుగని అతను...ఇప్పుడు టీమ్ను వరల్డ్ చాంపియన్గా నిలిచి పొట్టివాడు అయినా గట్టివాడే అని నిరూపించాడు. మార్క్రమ్, బవుమా 147 పరుగుల భాగస్వామ్యం ఆ్రస్టేలియా ఆట కట్టించేలా చేసింది. డ్రగ్స్ వివాదం నుంచి బయటపడిన రబాడ 9 వికెట్లతో సఫారీ విజయానికి పునాది వేయగా, రెండో ఇన్నింగ్స్లో ఇన్గిడి తన విలువ చాటాడు. విమర్శలను అధిగమించి... దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించినా...ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎదురుగా బలమైన ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థి ఉండటంతో పాటు టీమ్లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. టాప్–7 బ్యాటర్లతో పాటు ఆల్రౌండర్ యాన్సెన్ మొత్తం టెస్టు పరుగులు కలిపినా... ఒక్క స్టీవ్ స్మిత్ సాధించిన పరుగులకంటే తక్కువగా ఉన్నాయి! పైగా స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్, లయన్ కలిసి ఆసీస్కు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అలాంటి బౌలింగ్ను ఎదుర్కొని గెలవడం దాదాపు అసాధ్యమని అనిపించింది. అన్నింటికి మించి సఫారీ టీమ్ ఫైనల్కు చేరిన క్రమంపై విమర్శలు ఉన్నాయి. 2023–25 డబ్ల్యూటీసీ సైకిల్లో అగ్రశ్రేణి టీమ్లైన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను ఒక్క టెస్టులోనూ ఎదుర్కోని టీమ్... సొంతగడ్డపై భారత్ చేతిలో 55కు ఆలౌటై చిత్తుగా ఓడింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లాంటి బలహీన ప్రత్యర్థులపై (వరుసగా 7 టెస్టులు) గెలిచి ఫైనల్ చేరిందని వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఫైనల్కు ముందు ‘అదంతా మా చేతుల్లో లేదు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే దానిని ఎవరూ పట్టించుకోరు’ అంటూ స్పష్టంగా చెప్పిన బవుమా దానిని చేసి చూపించాడు. ఆ్రస్టేలియాను ఓడిస్తేనే వరల్డ్ చాంపియన్గా భావిస్తాం అనేవారికి సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో టి20 లీగ్ కోసం ప్రధాన ఆటగాళ్లతో కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్ పంపగా 0–2తో టీమ్ చిత్తయింది. అయినా సరే చివరకు డబ్ల్యూటీసీ ఫైనల్కు జట్టు అర్హత సాధించడం విశేషం. ఆనందం దక్కింది... అంతర్జాతీయ క్రికెట్లోకి 1991లో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ సెమీస్లో వర్షం నిబంధనతో ఓడిన జట్టు, 1996లో అన్ని లీగ్లు గెలిచి క్వార్టర్స్లో అనూహ్యంగా ఓడింది. 1998తో క్రానే, కలిస్, రోడ్స్, బౌచర్లతో కూడిన జట్టు తొలి చాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఆనందం పంచింది. అయితే ఆ తర్వాతే జట్టు రాత పూర్తిగా మారిపోయింది. గత ఏడాది టి20 వరల్డ్ కప్కు ముందు వరకు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయింది. 1999 సెమీస్లో ‘టై’తో గుండె పగలగా, సొంతగడ్డపై 2003లో మళ్లీ వర్షంతో లెక్క తప్పడంతో సెమీస్ కూడా చేరలేకపోయింది. ఆ తర్వాత మూడు సార్లు సెమీస్ వరకు చేరడంలో సఫలమైంది. స్వదేశంలో 2007 టి20 వరల్డ్ కప్లో సెమీస్ చేరని జట్టు తర్వాత రెండు సార్లు సెమీస్లోనే ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో ఐదు సార్లు సెమీస్కే పరిమితమైంది. వేర్వేరు కారణాలతో వచ్చిన ఈ ఓటములతో టీమ్లో నైరాశ్యం నెలకొంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బోర్డులో రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో జట్టు ఆటపై కూడా ప్రభావం పడింది. వరుస ఓటములతో టీమ్ వెనుకబడిపోవడంతో ఇతర టీమ్ల దృష్టిలో అది ద్వితీయ శ్రేణి జట్టుగా మారిపోయింది. అయితే తాజా విజయం సఫారీ టీమ్లో కొత్త ఉత్సాహం తీసుకు రానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ విజయం వారిలో జోష్ నింపడం ఖాయం.

సూపర్ ‘సఫారీ’
దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్ కప్ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్ కప్లు, 9 టి20 వరల్డ్ కప్లు, 9 చాంపియన్స్ ట్రోఫీలు, 2 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్ అందుకునే అవకాశమే రాలేదు... అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్తో సఫారీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఈ సారి మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎయిడెన్ మార్క్రమ్ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్మనీ దక్కింది.27.4 ఓవర్లలో 69 పరుగులు... ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్ అవుట్ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్ (8)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్రమ్ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్హామ్ (21 నాటౌట్) అండగా నిలిచాడు. ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్రమ్ను హాజల్వుడ్ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్ వేసిన బంతిని వెరీన్ కవర్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) హెడ్ (బి) హాజల్వుడ్ 136; రికెల్టన్ (సి) క్యారీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్ 66; స్టబ్స్ (బి) స్టార్క్ 8; బెడింగ్హామ్ (నాటౌట్) 21; వెరీన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్: స్టార్క్ 14.4–1–66–3, హాజల్వుడ్ 19–2–58–1, కమిన్స్ 17–0–59–1, లయన్ 26–4–66–0, వెబ్స్టర్ 5–0–13–0, హెడ్ 2–0–8–0.

WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 విజేతగా దక్షిణాఫ్రికా అవతరించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్ని ముద్దాడింది. ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 207 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. 14 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేశాడు. అతడితో పాటు టెంబా బావుమా(64) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, హాజిల్వుడ్, కమ్మిన్స్ తలా వికెట్సాధించారు.దక్షిణాఫ్రికా ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?ఇక వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచిన దక్షిణాఫ్రికాకు ఎంతో ప్రైజ్మనీ దక్కింది, రన్నరప్ ఆస్ట్రేలియాకు ఎంతో మొత్తం లభించిందో తెలుసుకుందాం. తొలిసారి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన ప్రోటీస్కు టెస్టు ఛాంపియన్ షిప్ గదతో పాటు ప్రైజ్మనీ కింద 3.6 మిలియన్ల డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.31.05 కోట్లు) లభించింది. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే.. ప్రైజ్ మనీనీ ఈసారి రెండింతలు ఐసీసీ పెంచింది.ఇక రన్నరప్ ఆస్ట్రేలియాకు 2.1 మిలియన్ల డాలర్ల (రూ.18.63 కోట్లు) ప్రైజ్మనీ దక్కింది. ఇక డబ్యూటీసీ 2023-25 సైకిల్లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టుకు 1.44 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12. 42 కోట్లు) క్యాష్ ప్రైజ్ అందనుంది.WTC 2025 ప్రైజ్మనీ వివరాలుసౌతాఫ్రికా: రూ. 31.05 కోట్లుఆస్ట్రేలియా: రూ. 18.63 కోట్లుఇండియా: రూ. 12.42 కోట్లున్యూజిలాండ్: రూ. 10.35 కోట్లుఇంగ్లండ్: రూ. 8.28 కోట్లుశ్రీలంక: రూ. 7.24 కోట్లుబంగ్లాదేశ్: రూ. 6.21 కోట్లువెస్టిండీస్: రూ. 5.17 కోట్లుపాకిస్తాన్: రూ. 4.14 కోట్లుచదవండి: WTC 2025: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
బిజినెస్

ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..
కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ రేటు రావాలనుకునేది ఒక్క స్థిరాస్తిలో మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గిరాకీ, సరఫరా కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.వసతులే కీలకం.. ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాల్స్ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరం ఉండదు కాబట్టి ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకం.సౌకర్యాలే ముఖ్యం కాదు.. ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజారవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు ఇలాంటివే కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే.. భవిష్యత్తులో ఇల్లు విక్రయించే సమయంలో కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి విలువ లెక్కగడతారని గుర్తుంచుకోవాలి.చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేము. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉండాలన్నమాట. ఇంటికి లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటు మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.👉 ఇది చదవలేదా? రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. ఇంటి విలువ కేవలం ఫ్లాట్కో.. ప్లాట్కో పరిమితం కాదు.. సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది. ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్ ఫ్లాట్లకు ఎక్కువే రేటు వస్తుంది.

ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?
ఎలాన్మస్క్కు చెందిన స్టార్లింక్ మరో రెండు నెలల్లో భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం భారతదేశం డిజిటల్ అంతరాన్ని, ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు తోడ్పడుతుందని కొందరు భావిస్తున్నారు.సమస్యలకు పరిష్కారం..స్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం చాలా కాలంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్న కమ్యూనిటీలకు పరిష్కారాన్ని అందిస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఫైబర్ ఆప్టిక్ లేదా సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ల మాదిరిగా కాకుండా స్టార్లింక్లో లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. ఇది చాలా మారుమూల ప్రాంతాల్లో నిరంతర ఇంటర్నెట్ కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం 4,000 స్టార్లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!
బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో డెవలపర్ ఉద్యోగం కోసం 14 రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేశానని ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. విప్రో క్యాంపస్లో ఉన్న ఫొటోలతో పాటు కంపెనీ లోగోను చూపిస్తూ అంతరా మండల్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్లో వివరాలు షేర్ చేశారు.ధ్రువీకరణ కోసం ఇన్స్టాగ్రామ్లో ఆమె తన ఆఫీస్ ఐడీ కార్డు కూడా పోస్ట్ చేశారు. ఉద్యోగం కోసం ఏకంగా 14 రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేసి కొలువు దక్కించుకున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి చివరకు విప్రోలో డెవలపర్ పొజిషన్కు ఎంపికయ్యాను. మీ నిద్రలో వచ్చేవి కలలు కావు.. మిమ్మల్ని నిద్రపోనివ్వనివే అసలైన కలలు’ అని ఆమె రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Antara Mandal (@_antara.mandal)ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచనఅయితే సామాజిక మాధ్యామాల్లో ఈ పోస్ట్పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఉద్యోగం కోసం ఇన్ని రౌండ్లు ఇంటర్వ్యూ చేయడంపై చాలా మంది వినియోగదారులు విమర్శించారు. కొందరు ఇందుకు భిన్నంగా రిప్లై ఇచ్చారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూ? అది కూడా డెవలపర్ రోల్ కోసమే.. చాలా ఫన్నీ యార్’ అని ఒక యూజర్ స్పందించారు.

డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచన
‘స్మార్ట్’ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక కలలను నిజం చేస్తుంది. కొందరు మంచి కారు కొనాలనుకుంటారు.. కొందరికి ఖరీదైనా ఫోన్ కావాలనిపిస్తుంది.. ఇంకొందరు కాలేజ్ ఫీజు కోసం పొదుపు చేస్తారు.. ఇలా ఒక్కొక్కరి ఆర్థిక అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే వారి ఆర్థిక లక్ష్యాలను సరైన మార్గంలో సెట్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు పడ్సాలిందేనని నిపుణులు చెబుతున్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ‘స్మార్ట్(SMART)’ పద్ధతులను అవలంభించాలని సూచిస్తున్నారు. కొత్తగా ఉద్యోగం సాధించిన యువత కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే తప్పకుండా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారని తెలుపుతున్నారు.స్మార్ట్ లక్ష్యాలుSMARTSpecificMeasurableAchievableRealisticTime-boundనిర్దిష్ట లక్ష్యాలు(Specific): మీకు ఆర్థికంగా ఏమి కావాలో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. ‘నేను డబ్బు ఆదా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పడానికి ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. ‘నేను దేని కోసం పొదుపు చేస్తున్నాను? నాకు ఎంత డబ్బు అవసరం?..’ అనే అంశాలపై స్పష్టత ఉండాలి.కొలవదగినదై ఉండాలి..(Measurable): మీ లక్ష్యాలను మీ ఆదాయంతో పోల్చి చూసుకొని ఖర్చులు, ఆదాపై పురోగతిని ట్రాక్ చేయాలి. తక్కువ జీతంల ఉన్నవారు ఆచరణ సాధ్యం కాని భారీ లక్ష్యాలను పెట్టుకోవడంలో అర్థం ఉండదు.సాధించేదిగా ఉండాలి..(Achievable): మీ ఆదాయం లేదా ఖర్చుల ఆధారంగా లెక్కలు పక్కాగా చూసుకుంటూ..లక్ష్యాన్ని సాధించాలి. లెక్కల విషయంలో నిజాయితీగా ఉండాలి. అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నిరాశకు దారితీస్తుంది.ఇదీ చదవండి: పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!వాస్తవికతకు దగ్గరగా..(Realistic): మీ లక్ష్యం మీ ప్రస్తుత జీవిత పరిస్థితికి సరిపోయేలా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఆర్థిక లక్ష్యానికి కట్టుబడి ఉండేలా స్వీయ క్రమశిక్షణతో మెలగాలి.కాలపరిమితి(Time-bound): ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా కాలపరిమితిని నిర్ధారించుకోవాలి. డెడ్ లైన్ ఉంటే మరింత మెరుగ్గా పొదుపుపై దృష్టి సారించేందుకు వీలవుతుంది.
ఫ్యామిలీ

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?
విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.రీజన్ ఏంటంటే..'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా స్ట్రక్చరల్ రీన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం. (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?)

25 మందికి ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇచ్చిన స్టార్టప్ కంపెనీ
చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు కార్లను గిఫ్టగా ఇచ్చింది. కంపెనీలు లాభాలను ఉద్యోగులను పంచి ఇచ్చింది. "నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు; అనుచరులు లేకుండా నాయకుడు లేడు" అని అజిలిసియం వ్యవస్థాపకుడు, CEO రాజ్ బాబు తెలిపారు.ఈ పరంపర కొనసాగుతుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఈ వార్త నెట్టింట సందడిగా మారింది. 25 మందికి ఎస్యూవీ కార్లు గిప్ట్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు ప్రముఖ అటానమస్ ఏజెంట్ ఏఐ భాగస్వామిగా ఉన్న అజిలిసియం సంస్థ ఒక గొప్ప ఆవిష్కరణకు చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంగా తమ సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ హ్యుందాయ్ క్రెటా కార్లను బహుమతిగా గురువారం అందజేసింది. సంస్థ 10వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రారంభం నుంచి ప్రపంచ స్థాయికి దాని ప్రయాణాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉద్యోగులను గుర్తించి సత్కరించారు. విలువైన సేవలకు గుర్తింపుగా చెన్నైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని అజిలిసియం ప్రధాన కార్యాలయంలో ఈ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిలిసియంలో తమ ఉద్యోగుల సేవలను ఎల్లప్పుడు గుర్తిస్తూనే ఉన్నామని చెప్పారు. సకాలంలో సేవలను అందించడంలో , దీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అందించిన ఈ కార్లు బహుమతులు కావని, అవి శాశ్వత విశ్వాసం, భాగస్వామ్య ఉద్దేశం కలిసిన అద్భుత స్పూర్తిగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే! 2014లో అజిలిసియంను రాజ్ బాబు స్థాపించారు .ఇది ఏజెంట్ AI భాగస్వామిగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు సేవలందిస్తున్నందున బూట్స్ట్రాప్గా ఎదుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇది 45శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)తో వృద్ధి చెంది 2027 నాటికి 100 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!

Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!
సువాసనలు వెదజల్లే అందమైన పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ అందానికి అందంగా, సుగంధంగా గులాబీలు, మల్లె, జాజి పూలు అమ్మాయిలకు మరీ ఇష్టం. పురాతన కాలం నుంచీ మల్లి, జాజి, గులాబీ పూల రెక్కలను సౌందర్య సాధనంగా కూడా వాడేవారు. శరీరానికి మెరుపు, ముఖ తేజస్సును పెంచుకునేందుకు గులాబీ రేకులకు, కాస్త తేనె, కూసింత పసుపు,ఇతర అనేక సుగంధ ద్రవ్యాలను కలిపి వాడతారు. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా గులాబీ బాలగా మన ముఖం మెరిసిపోవాలంటే ఇవిగో టిప్స్...గులాబీ రేకులు, నల్ల నువ్వులు, బార్లీ గింజలు సమ పాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని తగినన్ని రోజ్వాటర్ కలిపి, ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. లేదంటే సింపుల్గా పది గులాబీ రేకలను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల రోజ్వాటర్, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే.. చక్కటి మెరుపు వస్తుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్తో చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖ చర్మం కాంతివంత మవుతుంది. (Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..)ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. చర్మం తాజాగా మెరుస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. ఇదీ చదవండి: సంజయ్ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా..!మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ప్యాక చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నోట్ : పువ్వులు ఎంత అందమైనవి అయినా కొంతమందికి ఎలర్జీ కలిగించవచ్చు. అందుకే ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు కొద్దిగా టెస్టింగ్ ప్యాక్లా వేసుకోవడం మర్చిపోవద్దు. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

Donald Trump: నచ్చితే ఒక రకంగా.. నచ్చకపోతే ఇలా..!
డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఏది చేసినా తమ పాటే వినాలనే పంతం. ఏ అంశాన్ని తీసుకున్నా ‘వామ్మో ట్రంప్’ అనుకోవాల్సిన పరిస్థితి. అటు సుంకాలు పెంపు దగ్గర్నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం, పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం.. ఇలా ప్రతీది ట్రంప్కు ముడిపడే ఉంది.ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకున్నారు. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్నది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్రరాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.మరి ఇరాన్పై కక్ష ఎందుకు?ఇక్కడ ఇరాన్పై మాత్రం ట్రంప్ పగ కనబడుతూనే ఉంది. తాజాగా ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్ సమర్ధిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్ ేచేసిన దాడి అద్భుతమని కొనియాడారు. అదే సమయంలో ఇంకా ఇరాన్పై దాడిని ఇజ్రాయిల్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి చెప్పారు. మొన్నటి వరకూ రష్యా- ఉక్రెయిన్ల సుదీర్ఘ యుద్ధం, ఆపై భారత్-పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం.. ప్రపంచానికి పెనుముప్పు అని కనువిప్పు కల్గించిన ట్రంప్.. ఇప్పుడు ఇజ్రాయిల్-ఇరాన్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ట్రంప్కు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇలా వ్యవహరిస్తారనేది తాజా ప్రకటనతో తేటతెల్లమైంది. అణు ఒప్పందంపై ఇరాన్కు చాన్స్ ఇచ్చామని, కానీ దాన్ని వారు పట్టించుకోలేదన్నారు ట్రంప్. తమతో అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి నిరాకరించారని, అందుకు తగిన ప్రతిఫలమే ఇజ్రాయిల్ చేసిన దాడి అంటూ ఏబీసీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. వారు(ఇరాన్) ఇంకా మూల్యం చెల్లించుకుంటుందంటూ ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని నేరుగా అభినందిస్తూ ఇరు దేశాలను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాము చెప్పిన మాట విననందుకు ఇరాన్ ఏమైపోయినా ఫర్వాలేదన్న వైఖరి ట్రంప్లో స్పష్టంగా కనబడుతోంది. ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్ ఉన్నారనేది తాజా పరిణామాలతో రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఎమర్జెన్సీ విధింపు..ఇజ్రాయెల్-ఇరాన్ రెండూ భారత్కు మిత్రదేశాలే, కానీ..

బోయింగ్ డ్రీమ్లైనర్ రహస్యాల్ని బయటపెట్టి..
అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్బాడీ ఎయిర్లైనర్తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే.. బోయింగ్ విమానం.. అందునా డ్రీమ్లైనర్(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ స్టేట్మెంట్ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్.. ఆయన 787 డ్రీమ్లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 👉జాన్ బార్నెట్(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్ కరోలీనా చార్లెస్టన్లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్ను ప్రస్తావిస్తుంటారు.👉ఆ నోట్ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్ వాదన. 👉బోయింగ్ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్లైనర్ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో క్వాలిటీ మేనేజర్గా విధులు నిర్వర్తించారు. అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్పై ఆయన విమర్శలు గుప్పించారు.ఏం చెప్పాడంటే.. 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. Photo Credits: Netflix👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 👉2022లో నెట్ఫిక్స్ ‘డౌన్ఫాల్: ది కేస్ అగెనెస్ట్ బోయింగ్’ డాక్యుమెంటరీలో జాన్ బార్నెట్ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్లైన్స్ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్ డ్రీమ్లైనర్పై బార్నెట్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది.

ప్రశ్నించినందుకు! ఈడ్చుకెళ్లి, బేడీలేసి..
అమెరికా రాజకీయాల్లో ఓ ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియా సెనేటర్, డెమొక్రటిక్ సభ్యుడు అలెక్స్ పాడిల్లా(Alex Padilla)తో భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ ఆయన్ని నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి బేడీలు వేశారు అధికారులు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం లాస్ ఏంజెల్స్లో హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ప్రెస్మీట్ నిర్వహించారు. గత వారం రోజులుగా అక్కడ వలసదారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎంత మంది వివరాలు సేకరించారో గణాంకాలను నోయెమ్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘నా పేరు అలెక్స్ పాడిలా. సెనేటర్ని. సెక్రటరీకి నాదో ప్రశ్న అంటూ మాట్లాడబోయారు. ఇంతలో..URGENT BREAKING: Democrat US Senator Alex Padilla was just thrown to the ground and arrested for trying to speak at a DHS Press Conference by Secretary Kristi Noem. This is Trump’s America. This is so incredibly pathetic. I am so sad for the state of this country. pic.twitter.com/yI9fKdoYoW— Brian Krassenstein (@krassenstein) June 12, 2025అక్కడున్నన సిబ్బందిని ఆయన్ని బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు, వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం.. ఎఫ్బీఐ సిబ్బంది ఆయన్ని బలవంతంగా నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి.. బేడీలు వేసి అదుపులోకి తీసున్నారు. అయితే కాసేపటికే ఆయన్ని అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.డీహెచ్ఎస్ ఈ చర్యలను సమర్థించుకుంది. పాడిల్లాను దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిగా భావించి అధికారులు అలా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఆయన చర్యను పొలిటికల్ డ్రామాగా అభిర్ణించింది. అయితే కాసేపటికే ఆయన్ని విడుదల చేశామని, నోయెమ్-పాడిల్లా 15 నిమిషాలపాటు భేటీ అయ్యారని ప్రకటించింది. మరోవైపు ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో కూడా తమ సిబ్బంది చర్యను వెనకేసుకొచ్చారు. ఈ ఘటనపై అలెక్స్ పాడిల్లా స్పందించారు. ఒక సెనేటర్ విషయంలోనే ఇలా జరిగితే.. సాధారణ వర్గాల ప్రజలతో ఇంకెలా వ్యవహరిస్తారో? అని నిలదీశారాయన. వలసవాదులతో ఎలా వ్యవహరిస్తున్నారో.. ఈ దేశ పౌరులతోనూ అలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ పాలనలో ఇలాంటి దుర్మార్గాలు కూడా మొదలయ్యాయ వ్యాఖ్యానిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, కమలా హారిస్, సెనేట్లో మైనారిటీ నేత చుక్ షూమర్ తదితరులు ఈ ఘటనను ఖండించారు. ఇంకోవైపు రిపబ్లికన్ పార్టీలోనూ ఈ ఘటనపై పలువురి నుంచి ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించాల్సి ఉంది.

ఇజ్రాయెల్-ఇరాన్ రెండూ భారత్కు మిత్రదేశాలే, కానీ..
ఇరాన్ నుంచి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’(Operation Rising Lion) పేరిట సైనిక చర్యకు దిగింది. ప్రతిగా.. ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. అయితే తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత దేశం స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఇరు పక్షాలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది.‘‘ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దాడులు ఎంతో ఆందోళనకరం. భారత్ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. రెండు మాకు మంచి మిత్రదేశాలే. సాధ్యమైన మద్దతు అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అందుకే దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేగానీ, ఉద్రిక్తతలను పెంచే చర్యలను ఏమాత్రం ప్రోత్సహించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకు ముందు.. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 200 యుద్ద విమానాలతో టెహ్రాన్ దాకా ఇజ్రాయెల్ బలగాలు దూసుకెళ్లాయి. ఇరాన్ అణు.. క్షిపణి స్థావరాలను నాశనం చేయడంతో పాటు ఆ దేశ మిలిటరీ చీఫ్, కొందరు అగ్ర సైంటిస్టులను హతమార్చాయి. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది.
జాతీయం

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. ఇస్రో కీలక ప్రకటన
ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 19వ తేదీన శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. యాక్సియం-4 మిషన్ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన నింగిలోకి వెళ్లనున్నారు. అయితే, తొలుత మే 29న ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలతో పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది.ఇదిలా ఉండగా.. అంతకుముందు శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ఎక్స్ తెలిపింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ‘ఎక్స్’లో పేర్కొంది. మరమ్మతులకు సమయం పడుతుందని.. త్వరలోనే కొత్త లాంచ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రయోగ వాయిదా విషయాన్ని భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ధ్రువీకరించింది. ప్రయోగానికి ముందు బూస్టర్ టెస్టును తనిఖీ చేస్తుండగా ఈ సమస్యను గుర్తించినట్లు తెలిపింది. తొలుత లీక్ సమస్యను పరిష్కరించి పరీక్షించిన తర్వాత ప్రయోగం నిర్వహించాలని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్ నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తారు. BREAKING 🚨#Ax4 Mission with India’s Shubhanshu Shukla to launch on June 19, #ISRO says pic.twitter.com/XTX3wQE7kg— Sibu Tripathi 🪂 (@imsktripathi) June 14, 2025

నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్ సంస్థ భారీగా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో మహిళ టాటా గ్రూప్ వాళ్లకే రెండు కోట్ల రూపాయలు ఎదురిస్తానంటోంది. బదులుగా.. చనిపోయిన తన తండ్రిని ప్రాణాలతో తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. నవ్వుతూ నిత్యం తమ మధ్య తిరిగిన తండ్రి.. తాజా ఘటనలో దుర్మరణం పాలై మృతదేహాం జాడ కూడా లేని స్థితిలో ఉన్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.‘‘నా తండ్రే పోయాక మీ పరిహారం ఎవరికి కావాలి. నేను వాళ్లకు రెండు కోట్ల రూపాయిలిస్తా. బదులుగా చనిపోయిన నా తండ్రిని బతికించి తీసుకురండి. వాళ్లు ఇచ్చే పరిహారం నా తండ్రిని వెనక్కి తెస్తుందా?.. నాకు నా తండ్రి, ఆప్యాయతలు కావాలి. వాటి కోసం వాళ్లలా ఎంతైనా నేను ప్రకటిస్తా’’ అంటూ ఫాల్గూని అనే మహిళ కన్నీరు పెట్టుకుంది. ఫాల్గునితో పాటు బాధిత కుటుంబాలు అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండోరోజూ డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నాం. ఫలితాలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది?. . ఎప్పుడు మా వాళ్లను అప్పగించేది? అని ఫాల్గునితోపాటు మరికొందరు అధికారులను నిలదీశారు.మరోవైపు.. అధికారులు మాత్రం తమ బృందాలు అహర్నిశలు పని చేస్తున్నాయని చెబుతున్నారు. ‘‘దాదాపుగా బంధువుల నుంచి శాంపిల్స్ సేకరించాం. ఇప్పటికే 240 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాం. డీఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి కాగానే.. వీలైనంత త్వరగా మృతదేహాలు అప్పగిస్తాం’’ అని ఓ అధికారి వెల్లడించారు.

Updates: ఎయిరిండియా కీలక నిర్ణయం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లీనియంగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.AI-171 విమానం నుంచి చివరి సందేశంవిమానంలో పవర్ కట్ అయిందని..కిందకి పడిపోతున్నట్టు మెసేజ్ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి మేడే కాల్లో ఆడియోవిమానంలో పవర్ కోల్పోయామని ఏటీసీకి వెల్లడించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఐదు సెకన్ల ఆడియో మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అని చెప్పిన కెప్టెన్ సబర్వాల్ఏటీసీ వద్ద రికార్డయిన ఐదు సెకన్ల ఆడియోఎయిరిండియా కీలక నిర్ణయంఅహ్మాదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయంవిమానంలో ప్రయాణిస్తున్నన 241 మంది దుర్మరణంభవనంపై విమానం కూలి మెడికోలు, ఇతరులు మృతిమొత్తం మృతుల సంఖ్య 274ఇక నుంచి ఏఐ-171 విమాన సర్వీస్ నిలిపివేతదానికి బదులు ఎయిరిండియా- 159 విమానంఇక నుంచి లండన్కు వెళ్లనున్న ఏఐ-159 సర్వీస్ విమానం ప్రమాదంపై విచారణ జరుగుతోంది: రామ్మోహన్నాయుడుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ జరిపిన సమీక్ష వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుపైలట్ మే డే కాల్ చేశారుఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ప్రమాదం జరిగిందిఅహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందిరెస్క్యూ ఆపరేషన్కు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందిబ్లాక్ బాక్స్ దొరికింది.. డీకోడ్ చేస్తున్నారుబ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఏం జరిగిందనేది తెలుస్తుందిహైలెవల్ కమిటీతో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందినివేదిక వచ్చాకే బాధ్యులపై చర్యలు ఉంటాయివిమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది787 సిరీస్ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చాండీఎన్ఏ పరీక్షలు పూర్తైన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాంపౌర విమానయాన శాఖ సమీక్ష వివరాలు వెల్లడిఎయిరిండియా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ సమీక్షవివరాలు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ అధికారులుAircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులువిమానం 650 అడుగుల ఎత్తు ఎగిరాక కూలిపోయిందిపైలట్ చివరిసారిగా మే డే కాల్ అన్నారుఆ తర్వాత ఎలాంటి సిగ్నల్ అందలేదుమూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాంరంగంలోకి ఎన్ఐఏఅహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థకుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతున్న ఎన్ఐఏక్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతున్న బృందంబోయింగ్ ట్రాజెడీ పాపం ఎవరిది?తనిఖీ, నిర్వహణ లోపమే కారణమా?డీజీసీఏ హెచ్చరికలను ఎయిరిండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితం అయ్యిందా? ఎందుకు గాల్లో ఎగరలేక పోయింది? టేకాఫ్ సెట్టింగుల్లో లోపం, పైలట్ తప్పిదమే కారణం?ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా? దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నోక్లిక్ చేయండి: రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం! అహ్మదాబాద్ ప్రమాద ఘటన.. మరికాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్షకీలకంగా డిజిటల్ ఆధారాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుభవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనంబ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశండిజిటల్ వీడియో రికార్డర్ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్కు డీవీఆర్ను పంపిన అధికారులుబోయింగ్ ట్రాజెడీ ఫైల్స్అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుప్రాథమికంగా.. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ కమిటీ దర్యాప్తుకేంద్రం తరఫున.. నిపుణులతో హైలెవల్ కమిటీ దర్యాప్తుడీజీసీఏ విచారణ కూడాభారత్లో బోయింగ్ విమానాల తనిఖీలుప్రత్యేక అడిటింగ్కు ఆదేశించిన కేంద్రం👉ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు.. విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని వాళ్లు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 👉ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 274కి చేరింది. 👉విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా.. 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. 👉గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం (AI171) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే మెఘాని ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. 👉మే డే కాల్ ఇచ్చిన పైలట్ ఆ వెంటనే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా.. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు ఖాళీ మసైపోయారు. 👉ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది👉విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై కొనసాగుతున్న విచారణ

Air India Crash: నాడు ‘ఎంపరర్ అశోక’.. నేడు ‘డ్రీమ్ లైనర్’.. అదే విషాదం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారి విషాద గాథలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఈ ప్రమాదంతో ముడిపడిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 1978 నాటి ‘ఎంపరర్ అశోక’ విషాదాన్ని పోలివుందనే కథనాలు తెరమీదకు వస్తున్నాయి. నాడుముంబైకి మూడు కి.మీ దూరంలో జరిగిన ‘ఎంపరర్ అశోక’ ప్రమాదంలో విమానంలోని 213 మంది కన్నుమూశారు. ఈ రెండు ఘటనల్లో విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే అవి కూలిపోయాయి.1978, నూతన సంవత్సరం తొలిరోజున..గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నివాస భవనాలపై ఎయిర్ ఇండియా విమానం ఏI 171, బోయింగ్ 787-8 ‘డ్రీమ్లైనర్’ కూలిపోయింది. ఈ ప్రమాదం దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ముంబై నుండి అరేబియా సముద్రంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం ఏI 855, ‘ఎంపరర్ అశోక’ఘటనను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. 1978, జనవరి 1.. నూతన సంవత్సరం తొలిరోజున ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 747 అయిన ‘ఎంపరర్ అశోక’ ముంబైలోని శాంటా క్రజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుండి దుబాయ్కి బయలుదేరింది. 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, ఎనిమిది వేల అడుగుల ఎత్తునకు చేరేందుకు అనుమతి లభించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగిస్తోంది. అయితే ఇంతలో అత్యంత ముఖ్యమైన యాటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్ (ఏడీఐ)పనిచేయలేదు.నాడు సముద్రంలో.. నేడు జనావాసాల్లో..దాదాపు 18 వేల విమాన గంటలు నడిపిన కెప్టెన్, మదన్ లాల్ కుకర్(51) వెంటనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విమానంలో మాజీ భారత వైమానిక దళ కమాండర్ ఇందు విర్మాణి(43) కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాలోని అత్యంత సీనియర్ ఇంజనీర్లలో వారు ఒకరు. అలాగే అనుభవజ్ఞులైన ఫ్లైట్ ఇంజనీర్ ఆల్ఫ్రెడో ఫారియాకూడా విమానంలో ఉన్నారు. విమానం రాత్రిపూట అరేబియా సముద్రం మీదుగా ఉన్నందున, దృశ్య హోరిజోన్ సూచన లేకపోవడంతో కెప్టెన్ కుకర్ ఎడమ నియంత్రణ ఇన్పుట్లను ఉపయోగించి కుడి ఒడ్డును సరిచేశారు. విమానం 108 డిగ్రీల కోణంలో ఎడమవైపుకు తిరుగుతూనే దాదాపు 2,000 అడుగుల నుండి నిటారుగా దాదాపు 35-40 డిగ్రీల కోణంలో కిందకు పడిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 213 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇది జరిగిన 47 ఏళ్ల తర్వాత మొన్నటి జూన్ 12న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ‘ఎంపరర్ అశోక’ మాదిరిగానే ‘డ్రీమ్లైనర్’ కూడా విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోయింది. అయితే ఈసారి జనావాస ప్రాంతంలోకూలిపోయి, పెను విషాదాన్ని మిగిల్చింది.ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..
ఎన్ఆర్ఐ

బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

న్యూయార్క్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్ ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు.కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్

న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం లో “న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ “ ఆధ్వర్యం లో జై తెలంగాణ నినాదాలతో “తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక”లను ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.అసోసియేషన్ అధ్యక్షులు “కోడూరి చంద్రశేఖర్” అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “Dr.మోహన్ కుమార్ సేథి” ముఖ్య అతిధి గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారుఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించడం జరిగిందిప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమం లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు “పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మేకల ప్రసన్న కుమార్ తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి,సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం,జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల,విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ,కిరణ్మయి పద్మ,విశ్వనాథ్ అవిటి,సందీప్ నాగుల,పవనకుమార్ చారుకొండ,సలీం మహమ్మద్,హరీష్ గోపాల్,మనోహర్ కన్నం,కిరణ్ కుమార్ కొమ్ముల,రమేష్ రెడ్డి రామిండ్ల,శ్రీరామ్ విజయ్,శ్రీనివాస్ గాజుల,ప్రమోద్ ఇరుగు,అనిల్ మెరుగు,రమేష్ ఆడెపు,రవి కుమార్ వట్టం,విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరుల తో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.
క్రైమ్

గృహిణి ఆత్మహత్య
హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియాంక కాలనీలో నివాసం ఉంటున్న రూప అనే గృహిణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన తల్లి, సోదరి వేధింపులే తన చావుకు కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీఐ భరత్ కుమార్ కథనం ప్రకారం..మహబూబాబాద్కు చెందిన జంగారెడ్డి, సత్తమ్మల చిన్నకుమార్తె రూప వివాహం 2014లో గుండు జలంధర్ రెడ్డితో జరిగింది. వీరికి సిరిరెడ్డి, వేదాన్ష్ రెడ్డి సంతానం. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో రూప సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఉండగా కూతురు సిరిరెడ్డి గమనించి తండ్రికి ఫోన్ చేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. అక్కడ నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభించింది. అందులో తన తండ్రి జంగారెడ్డి రెండునెలల క్రితం చనిపోగా..తల్లి సత్తమ్మ, అక్క చంద్రకళలు తనకు కట్నం కింద రాసిచ్చిన రెండెకరాల భూమిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారని, అందువల్లనే తాను చనిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. తనకు రాసిచ్చిన రెండెకరాల భూమి తన పిల్లలకే చెందాలని రూప పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

బ్యాంకింగ్ మోసాలు @ రూ.36,014 కోట్లు
సాక్షి, అమరావతి: రుణ ఖాతాలు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ నేరాల విలువ 2023–24తో పోల్చిచూస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ మోసాల విలువ రూ.12,230 కోట్ల నుంచి రూ.36,014 కోట్లకు ఎగసింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఇదే కాలంలో నేరాల సంఖ్య మాత్రం 36,060 నుంచి 23,953కు తగ్గింది. ఫ్రాడ్ క్లాసిఫికేషన్కు సంబంధించి 2023 మార్చి 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, గత సంవత్సరాల్లో నివేదించిన రూ.18,674 కోట్ల విలువైన 122 కేసులను తిరిగి తాజా నేరాలుగా నమోదు చేయడం వల్ల మొత్తం నేరాల విలువ పెరిగిందని ఆర్బీఐ నివేదిక వివరించడం గమనార్హం. మొత్తం నేరాల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులకు సంబంధించినవి 60 శాతం ఉన్నాయి. కానీ విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకులవి 71 శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..» నేరాల సంఖ్యలో ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల (కార్డ్, ఇంటర్నెట్) కేటగిరీలో చోటుచేసుకున్నాయి. అయితే విలువ పరంగా చూస్తే లోన్ లేదా అడ్వాన్స్ ఖాతాల్లోనే ఎక్కువ నేరాలు జరిగాయి. » ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువగా కార్డ్, ఇంటర్నెట్ నేరాలు జరగ్గా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ పోర్టుఫోలియోకి సంబంధించిన నేరాలు ఎక్కువ ఉన్నాయి. » మొత్తం కేసుల్లో లోన్ సంబంధిత నేరాలు 33 శాతానికి పైగా ఉండగా, మొత్తం నేరాల విలువలో 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి.» 2024–25 చివరిలో కార్డ్, ఇంటర్నెట్ నేరాల కేటగిరీలో 13,516 కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం 23,953 నేరాల్లో 56.5 శాతం.» రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఉన్న కేసుల వివరాలనే నివేదికలో పొందుపరచడం జరిగింది. » సంస్థలు తమ నివేదికలను సవరిస్తే ఈ డేటా మారే అవకాశం కూడా ఉంది. » నివేదికలో పేర్కొన్న మొత్తాన్ని ‘కోల్పోయిన నష్టం’గా పరిగణించడం సరికాదు. రికవరీల ఆధారంగా నష్టం తగ్గవచ్చు.భద్రత కోసం కొత్త డొమెయిన్లు..డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న నేరాలపై పోరాటానికి ఒక వినూత్న ప్రయత్నంగా భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా ‘..bank.in’, నాన్–బ్యాంకుల కోసం ‘fin.in’ అనే ఇంటర్నెట్ డొమెయిన్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ చేసింది. ఈ ప్రయత్నం డిజిటల్ బ్యాంకింగ్పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది, సైబర్ మోసాలను గుర్తించడంలో అలాగే ఫిషింగ్ వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ) ఈ డొమెయిన్లకు ప్రత్యేక రిజిస్ట్రార్గా వ్యవహరిస్తుందని, బ్యాంకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని నివేదిక తెలిపింది.

డ్రైవర్ నిర్లక్ష్యానికి ఐదుగురు బలి
సాక్షి బెంగళూరు/కార్వేటినగరం: కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు మృతిచెందారు. ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు–2 డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు గురువారం రాత్రి తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. బస్సు శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు శివారులోని హోసకోటె–కోలారు జాతీయ రహదారిపై గొట్టిపుర గేట్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. బస్సు అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో 18 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతి మారేడుపల్లె గ్రామానికి విశ్వనాథరెడ్డి భార్య శారద(40), వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కె.కేశవులురెడ్డి(45), అతని తమ్ముడు జనార్దన్రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసి (22), తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతుల కుమార్తె ప్రణతి(4)గా గుర్తించారు. ప్రణతి తండ్రి బెంగళూరులో ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. క్షతగాత్రులను సిలికాన్ సిటీ, ఎంవీజే ఆస్పత్రుల్లో చేర్పిం చి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోపాటు అతి వేగంతో లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయతి్నంచడమే ఈ ప్రమాదానికి కారణమని హోసకోటె పోలీసులు తెలిపారు. బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ సీకే బాబా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

బాలికపై అఘాయిత్యం
రాజమహేంద్రవరం సిటీ: ప్రేమ పేరుతో వంచించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికను గర్భిణిని చేసిన యువకుడు చివరకు మోసం చేసిన ఘటన రాజమహేంద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికతో కలసి రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి గురువారం మీడియాతో మాట్లాడారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామానికి చెందిన బాలికను మోరంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు పులపర్తి సత్యదేవ్ ప్రేమించానంటూ రెండేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలికను లోబరచుకున్నాడు. గత ఏడాది నవంబర్లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ బాలిక 6వ నెల గర్భిణిగా నిర్ధారణ అయ్యింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని, మాల తీసేలోగా బాలికకు అబార్షన్ చేయించాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ 17న ఆ బాలికకు అబార్షన్ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్ నిరాకరిస్తున్నాడు. కులం తక్కువ దానివంటూ దూషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలికి చట్ట ప్రకారం న్యాయం జరగాలని కోరారు. బాలికకు అబార్షన్ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ గాండ్ల, తెలుకుల సంఘం అధ్యక్షురాలు సంకిస భవానీప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి పాల్గొన్నారు.బాలికపై లైంగిక దాడిగర్భం దాల్చడంతో తల్లి ఫిర్యాదునాగలాపురం: తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో 15 ఏళ్ల బాలికపై రెండునెలల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసినట్లు నిండ్ర సీఐ రవీంద్ర తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం.. పిచ్చాటూరు మండలం, కారూరు దళితవాడకు చెందిన శేఖర్ (55) అనే వ్యక్తి రెండు నెలల క్రితం 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అనంతరం.. బాలిక గర్భం దాల్చడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిచ్చాటూరు పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండుకు తరలించినట్లు పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్ తెలిపారు.