

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన

న్యూజిలాండ్తో స్వదేశంలో మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసింది

అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో 100 పరుగులు సాధించింది

తద్వారా జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది

స్మృతి కెరీర్లో ఇది ఎనిమిదో వన్డే శతకం

తద్వారా దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్(7) పేరిట ఉన్న రికార్డు స్మృతి బ్రేక్ చేసింది

భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన మహిళా క్రికెటర్గా నిలిచింది

ఇక ఈ సిరీస్లో భారత్ 2-1తో న్యూజిలాండ్పై విజయం సాధించింది

కాగా సెంచరీ హీరో స్మృతి మంధానపై ప్రశంసల వర్షం కురుస్తోంది

ఈ క్రమంలో ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ సైతం ఇన్స్టా వేదికగా స్మృతిని అభినందించాడు

పలాష్ ముచ్చల్ మ్యూజిక్ కంపోజర్.. ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్ సోదరుడు

ఐదేళ్లుగా స్మృతితో రిలేషన్షిప్లో ఉన్నట్లు ఇటీవలే పలాష్ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు


