Century
-
పాక్ కు చుక్కలు చూపించిన కోహ్లీ
-
ఇంగ్లాండ్ పై భారత్ గ్రాండ్ విక్టరీ.. రోహిత్ శర్మ విధ్వంసం
-
అరంగేట్రంలోనే శతక్కొట్టిన ఆసీస్ బ్యాటర్
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా (Australia) వికెట్కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ (Josh Inglis) సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్తోనే టెస్ట్ అరంగేట్రం చేసిన ఇంగ్లిస్.. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 21వ ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే గడిచిన పదేళ్లలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడమ్ వోగ్స్ 2015లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఇంగ్లిస్ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆరో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఫవాద్ ఆలం (పాకిస్తాన్, 2009), సురేశ్ రైనా (భారత్, 2010), షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా, 2011), మొహమ్మద్ అష్రాఫుల్ (బంగ్లాదేశ్, 2001), బెన్ ఫోక్స్ (ఇంగ్లండ్, 2018) శ్రీలంక గడ్డపై టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లిస్కు ముందు ఉస్మాన్ ఖ్వాజా, స్టీవ్ స్మిత్ కూడా సెంచరీలు చేశారు. ఖ్వాజా సెంచరీతో ఆగకుంగా డబుల్ సెంచరీతో (232) కదంతొక్కగా.. స్టీవ్ స్మిత్ 141 పరుగులు చేసి ఔటయ్యాడు. 90 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్న ఇంగ్లిస్ 102 పరుగుల (10 ఫోర్లు, సిక్స్) వద్ద ఔటయ్యాడు. It's a century on Test debut for Josh Inglis!From just 90 balls, with 10 fours and a six, Inglis is the first Australian to make a century on Test debut since Adam Voges in 2015 #SLvAUS pic.twitter.com/yFCXF74UK9— 7Cricket (@7Cricket) January 30, 2025ఇంగ్లిస్ సెంచరీ చేయగానే అతని తల్లిదండ్రులు ఫ్లైయింగ్ కిస్లతో అభినందించారు. ఖ్వాజా, స్మిత్, ఇంగ్లిస్ సెంచరీలతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 600 పరుగుల మార్కును తాకింది. శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా తొలిసారి టెస్ట్ల్లో పరుగులు చేసింది.రెండో వేగవంతమైన శతకంఈ మ్యాచ్లో 90 బంతుల్లో శతక్కొట్టిన ఇంగ్లిస్ టెస్ట్ అరంగేట్రంలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. టెస్ట్ అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు శిఖర్ ధనవ్ పేరిట ఉంది. ధవన్ 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 85 బంతుల్లోనే శతక్కొట్టాడు. ధవన్, ఇంగ్లిస్ తర్వాత టెస్ట్ అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు వెస్టిండీస్కు చెందిన డ్వేన్ స్మిత్ పేరిట ఉంది. స్మిత్ 2003లో సౌతాఫ్రికాపై 93 బంతుల్లో సెంచరీ చేశాడు.ట్రవిస్ హెడ్ మెరుపు అర్ద శతకంఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్ 20 పరుగులు చేయగా.. అలెక్స్ క్యారీ (39), బ్యూ వెబ్స్టర్ (23) తమ ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. 148 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్ 627/5గా ఉంది. -
మిథాలీ అడుగు జాడల్లోనే...
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష... తన ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రభావం ఉందని వెల్లడించింది. వరల్డ్కప్లో భాగంగా స్కాట్లాండ్తో ‘సూపర్ సిక్స్’ పోరులో 59 బంతులాడి అజేయంగా 110 పరుగులు చేసిన త్రిష... ఇన్నింగ్స్ను ఎలా నిర్మించాలో హైదరాబాదీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ను చూసి నేర్చుకున్నానని వెల్లడించింది. 2023 మహిళల అండర్–19 ప్రపంచకప్తో పాటు, గతేడాది అండర్–19 ఆసియాకప్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన త్రిష... తాజా సెంచరీని తండ్రి రామిరెడ్డికి అంకితమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మిథాలీ రాజ్ను చూస్తూ పెరిగాను. ఆమె ఇన్నింగ్స్ను నిర్మించే తీరు నాకెంతో ఇష్టం. నేను కూడా అలాగే చేయాలని ఎప్పటి నుంచో అనుకునే దాన్ని. నా ఆదర్శ క్రికెటర్ మిథాలీ. ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. మొత్తానికి అది స్కాట్లాండ్పై సాధ్యపడింది. తొలుత బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. అప్పుడే మొత్తం 20 ఓవర్లు ఆడి భారీ స్కోరు చేసేందుకు వీలుంటుంది. స్కాట్లాండ్తో మ్యాచ్లో టాస్ ఓడిపోవడంతో ఆ అవకాశం దక్కింది. క్రీజులో ఉన్నప్పుడు వ్యక్తిగత స్కోరును పట్టించుకోను. సహచరులు సంబరాలు చేసుకునేంత వరకు సెంచరీ పూర్తి చేసుకున్నానని గుర్తించలేదు.చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సెంచరీని ఆయనకే అంకితమిస్తున్నా. అమ్మానాన్న సహకారం లేకుంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’అని త్రిష వెల్లడించింది. తాజా ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న త్రిష... వరుసగా రెండో సారి కప్పు ముద్దాడడమే తమ లక్ష్యమని పేర్కొంది. -
ఇస్రో సెంచరీ.. ఏపీకి గర్వకారణం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: శ్రీహరికోట నుంచి వందో రాకెట్ ప్రయోగం విజయవంతమైన వేళ.. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అభినందనలు తెలియజేశారు. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు.భారత అంతరిక్ష పరిశోధనలకు ముఖద్వారంగా మారిన శ్రీహరికోట ఏపీలో ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో అత్యున్నతమైందని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనల్లో ఈ ప్రయోగంతో భారతదేశ ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారాయన. భవిష్యత్తులోనూ ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారాయన. Congratulations to ISRO on its 100th launch from Sriharikota! Wishing continued success in serving the nation and achieving many more such milestones. Kudos to Team ISRO!#100thLaunch— YS Jagan Mohan Reddy (@ysjagan) January 29, 2025శ్రీహరికోట నుంచి ఈ ఉదయం ఇస్రో చేపట్టిన చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్.. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివెరిసింది. -
శ్రీహరికోట నుంచి ఇస్రో వందో ప్రయోగం సక్సెస్
తిరుపతి, సాక్షి: భారత అంతరి ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. సూళ్లురుపేట శ్రీహరికోట నుంచి బుధవారం వేకువఝామున జీఎస్ఎల్వీ ఎఫ్-15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలు సంబురాల్లో మునిగితేలారు. కొత్త రకం నేవిగేషన్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-02 రెండోది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలందించనుంది. పదేళ్లపాటు ఈ నేవీగేషన్ శాటిలైట్ తన సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. ఇస్రో వందో ప్రయోగం సక్సెస్పై ఆయన ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ‘‘ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయ్యింది. నేవీగేషన్ శాటిలైట్ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. ఇస్రో వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది’’ అని అన్నారు. కాగా, ఇస్రో చైర్మన్ నారాయణన్ నేతృత్వంలో జరిగిన తొలి ప్రయోగం ఇదే. ISRO successfully carries out 100th launch; GSLV-F15 carries NVS-02 into its planned orbitRead @ANI Story | https://t.co/halyAIg3eL#ISRO #launch #NVS02 pic.twitter.com/0pAkfafrp4— ANI Digital (@ani_digital) January 29, 2025#WATCH | Tirupati, Andhra Pradesh: ISRO launchs its 100th mission, the NVS-02 navigation satellite aboard the launch vehicle GSLV-F15 from Sriharikota in Andhra Pradesh at 6.23 am today.(Source: ISRO) pic.twitter.com/n5iY9N8N0p— ANI (@ANI) January 29, 2025కాగా, ఇస్రో శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 99 ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. ఈ వందో ప్రయోగం విజయవంతం కావడంతో.. మెరుగైన GPS తరహా నేవిగేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. భారత భూభాగంతో పాటు భారత భూభాగంలోని తీరం నుంచి దాదాపు 1,500 కిలోమీటర్ల వరకు ఈ నేవిగేషన్ సిస్టం పని చేయనుంది. -
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్తో పాటు లెగ్ స్పిన్నర్గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్లో ఐదు మ్యాచ్లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది. బౌలింగ్లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
శతకంతో చెలరేగిన శుబ్మన్ గిల్.. కానీ..
టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. రంజీ మ్యాచ్లో శతకంతో చెలరేగి తనను తాను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో గిల్ విఫలమైన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాలుగాయం కారణంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన ఈ పంజాబీ బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. అడిలైడ్లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి 59(31, 28) పరుగులు చేశాడు. అయితే, గబ్బాలో జరిగిన మూడో టెస్టులో గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, నాలుగో టెస్టు జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. దీంతో బాక్సింగ్ డే టెస్టుకు దూరమైన గిల్.. ఆ తర్వాత సిడ్నీ టెస్టు ఆడినా అందులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో వరుసగా 20, 13 పరుగులు సాధించాడు.రంజీ బరిలో పంజాబ్ సారథిగాకాగా కంగారూ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్లో ఓవరాల్గా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. తాజా ఎడిషన్ రెండో దశ పోటీల్లో భాగంగా కర్ణాటకతో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబ్ ఓపెనర్ రంగంలోకి దిగాడు.మొదటి ప్రయత్నంలో విఫలంఅయితే, మొదటి ప్రయత్నంలో గిల్కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి.. అవుటయ్యాడు. కర్ణాటక పేసర్ అభిలాష్ శెట్టి బౌలింగ్లో క్రిష్ణన్ శ్రీజిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గిల్తో పాటు పంజాబ్ మిగతా బ్యాటర్లు కూడా దారుణంగా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ అయింది.స్మరణ్ డబుల్ సెంచరీఈ క్రమంలో కర్ణాటక స్టార్ రవిచంద్రన్ స్మరణ్ (277 బంతుల్లో 203; 25 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీతో విజృంభించగా.. జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 475 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (20), దేవదత్ పడిక్కల్ (27) ఎక్కువసేపు నిలవలేకపోయిన చోట స్మరణ్ చక్కటి ఇన్నింగ్స్తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు ఆలౌటైన పంజాబ్... శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (1), అన్మోల్ప్రీత్ సింగ్ (14) అవుట్ అయ్యారు.గిల్ సూపర్ ఇన్నింగ్స్.. కానీఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న శుబ్మన్ గిల్ మూడో రోజు ఆటలో భాగంగా సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం 159 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్స్లు ఉన్నాయి. గిల్ ఓవరాల్గా 171 బంతుల్లో 102 పరుగులు సాధించగా.. మిగతా వాళ్ల నుంచి మాత్రం సహకారం అందలేదు. ఈ క్రమంలో 213 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. కర్ణాటక చేతిలో ఇన్నింగ్స్ 207 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.చదవండి: అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇదొక విన్నింగ్ టీమ్: డివిలియర్స్Shubman Gill gets his century.. a fine & confident innings #RanjiTrophy #KarvsPun pic.twitter.com/iA1gm6I1Ib— Manuja (@manujaveerappa) January 25, 2025Shubman Gill Celebration after One of best Hundred under pressure in Ranji trophy match against Karnataka 💥📹📷 @Sebashiyun pic.twitter.com/7IMnWegWSy— JassPreet (@JassPreet96) January 25, 2025 -
ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటులు వీళ్లే.. ఇండియా నుంచి ఓకే ఒక్కడు!
ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటుల జాబితాను ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఇండిపెండెంట్ వెల్లడించింది. 21 వ శతాబ్దంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దాదాపు 60 మందితో కూడిన సినీ నటుల పేర్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటుల పేర్లను ఇందులో చేర్చింది. అయితే భారత్ నుంచి ఏ ఒక్క స్టార్ హీరో లేకపోవడం గమనార్హం. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ లిస్ట్లో చోటు లభించలేదు.అయితే ఈ 60 ఉత్తమ నటీనటుల జాబితాలో ఇండియా నుంచి ఒక్క నటుడు మాత్రం స్థానం దక్కించుకున్నాడు. అతను మరెవరో కాదు.. విభిన్నమైన పాత్రలతో మెప్పించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే ఈ జాబితాలో నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఈ ప్రపంచంలో లేరు. 2020లో ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన చనిపోయాక అరుదైన జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.ఇర్ఫాన్ ఖాన్ సినీ ప్రయాణం..రాజస్థాన్లోని పఠాన్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ ఖాన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటన నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ముంబయికి వెళ్లిపోయారు. ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్లో లైఫ్ ఇన్ ఎ మెట్రో, ది డార్జిలింగ్ లిమిటెడ్, స్లమ్డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమర్, లైఫ్ ఆఫ్ పై, ది లంచ్బాక్స్, కిస్సా, హైదర్, పికు, తల్వార్, హిందీ మీడియం, ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్, ఖరీబ్ ఖరీబ్ సింగ్లే, కార్వాన్, ఆంగ్రేజీ మీడియం లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. తను చివరగా నటించిన ‘అంగ్రేజీ మీడియం’ షూటింగ్లోనూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో కొన్నాళ్లపాటు విరామం తీసుకుని మళ్లీ చిత్రీకరణ పూర్తి చేశారు.టాప్ 10 నటులు వీళ్లే..2014లో మరణించిన మరో దివంగత నటుడు ఫిలిప్ సేమౌర్ హాఫ్మన్ 21వ శతాబ్దపు ఉత్తమ నటుడిగా నిలిచారు. నటీమణుల్లో ఎమ్మా స్టోన్ 2వ స్థానం దక్కించుకుంది. క్రేజీ, స్టుపిడ్, లవ్, లా లా ల్యాండ్, ది ఫేవరెట్, పూర్ థింగ్స్ లాంటి చిత్రాల్లో నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన డేనియల్ డే-లూయిస్ 3 స్థానంలో నిలిచాడు. ది గ్లాడియేటర్ II నటుడు డెంజెల్ వాషింగ్టన్ 4వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నికోల్ కిడ్మాన్, డేనియల్ కలుయుయా, సాంగ్ కాంగ్ హో, కేట్ బ్లాంచెట్, కోలిన్ ఫారెల్, ఫ్లోరెన్స్ పగ్ వరుసగా స్థానాల్లో నిలిచారు. ఇండియా నుంచి కేవలం ఇర్ఫాన్ ఖాన్కు మాత్రమే ప్లేస్ దక్కింది. -
ఆసీస్ గడ్డపై తెలుగోడి సత్తా
-
నితీశ్ రెడ్డి వైల్డ్ ఫైర్
-
పుష్ప సాంగ్తో స్మృతి మంధాన సెంచరీ సెలబ్రేట్ చేసిన ప్రియుడు(ఫొటోలు)
-
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
-
తన్మయ్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (240 బంతుల్లో 124 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఉప్పల్ స్టేడియంలో ఆంధ్ర జట్టుతో మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. హైదరాబాద్ మాజీ కెపె్టన్ తన్మయ్ రోజంతా బ్యాటింగ్ చేసి అజేయ శతకంతో అలరించాడు. అభిరత్ రెడ్డి (114 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్), హిమతేజ (36; 7 ఫోర్లు) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (1)తో పాటు రోహిత్ రాయుడు (0) విఫలం కాగా.. నితీశ్ రెడ్డి (22), వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (22 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్ మోహన్, యరా సందీప్ చెరో వికెట్ తీశారు. తాజా సీజన్లో హైదరాబాద్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్లో గెలిచింది. మరో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్ల్లో ఓడింది. మొత్తం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు ఆంధ్ర జట్టు నాలుగు మ్యాచ్ల్లో మూడింట ఓడి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 124; అభిరత్ రెడ్డి (సి) మోహన్ (బి) విజయ్ 35; రోహిత్ రాయుడు (సి) (సబ్) జ్ఞానేశ్వర్ (బి) విజయ్ 0; హిమతేజ (సి) భరత్ (బి) సందీప్ 36; రాహుల్ సింగ్ (సి అండ్ బి) విజయ్ 1; నితీశ్ రెడ్డి (స్టంప్డ్) భరత్ (బి) మోహన్ 22; రాహుల్ రాదేశ్ (బ్యాటింగ్) 22; ఎక్స్ట్రాలు 4, మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 244. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, బౌలింగ్: శశికాంత్ 15–3–32–0; రఫీ 17–3–41–0; విజయ్ 27–4–85–3; లలిత్ మోహన్ 23–4–64–1; సందీప్ 8–0–18–1. -
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ విధ్వంసం.. 12 ఫోర్లు, 12 సిక్స్లతో ఊచకోత
మహిళల బిగ్ బాష్ లీగ్-2024లో హోబర్ట్ హరికేన్స్ మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్తో జరిగిన మ్యాచ్లో 72 పరుగులతో తేడాతో ఘన విజయాన్ని హోబర్ట్ అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో హోబర్ట్ హరికేన్స్ స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ లిజెల్ లీ విధ్వంసకర సెంచరీతో మెరిసింది.సిడ్నీ సిక్సర్స్తో జరిగిన మ్యాచ్లో విఫలమైన లీ.. ఈ మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ప్రత్యర్ధి బౌలర్లను ఈ దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఊచకోత కోసింది. ఆమెను ఆపడం పెర్త్ స్కార్చర్స్ బౌలర్లు వంతు కాలేదు. ఆమె బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు.ఓవరాల్గా 75 బంతులు ఎదుర్కొన్న లీ..12 ఫోర్లు, 12 సిక్స్లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీథర్ గ్రహమ్(23) రాణించింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో హోబర్ట్ హరికేన్స్ 3 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అనంతరం లక్ష్య చేధనలో పెర్త్ జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. హోబర్ట్ బౌలర్లలో హీథర్ గ్రహమ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్మిత్, స్ట్రానో తలా రెండు వికెట్లు సాధించారు. పెర్త్ బ్యాటర్లలో అనిస్వర్త్(41) ఒంటరి పోరాటం చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్గా లీ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్రేస్ హ్యారీస్(136 నాటౌట్) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో హ్యారీస్ అల్టైమ్ రికార్డును లీ బ్రేక్ చేసింది.చదవండి: BAN vs AFG 2nd Odi: మెరిసిన షాంటో.. అఫ్గాన్పై బంగ్లాదేశ్ ఘన విజయం -
స్మతి మంధాన రికార్డు సెంచరీ.. ప్రియుడి పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
సూర్యకుమార్ మళ్లీ ఫెయిల్.. రుతురాజ్ సూపర్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. తొలుత జమ్మూ కశ్మీర్తో మ్యాచ్లో 86 పరుగులతో రాణించిన ఈ మహారాష్ట్ర కెప్టెన్.. ముంబైతో మ్యాచ్లో శతకంతో చెలరేగాడు. తద్వారా తన ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్లో ఏడో సెంచరీని నమోదు చేశాడు.కాగా రంజీ టోర్నీలో భాగంగా ముంబై- మహారాష్ట్ర మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీలో వేదికగా టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. తొలి ఇన్నింగ్స్లో 126 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రుతురాజ్ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కావడం ప్రభావం చూపింది.సూర్యకుమార్ మళ్లీ ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై ఆదిలోనే ఓపెనర్ పృథీ షా(1) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ(176)తో రాణించాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(142) కూడా శతక్కొట్టాడు. అయితే, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరోసారి రెడ్బాల్ క్రికెట్లో విఫలమయ్యాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.రుతురాజ్ సూపర్ సెంచరీఅయితే, ఆయుశ్, శ్రేయస్ల భారీ సెంచరీల వల్ల ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 441 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఓపెనర్ సచిన్ దాస్(98) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 171 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 145 రన్స్ సాధించాడు.మూడో రోజు ఆటలో భాగంగా ఆదివారం రుతుతో పాటు అంకిత్ బావ్నే తన సూపర్ హాఫ్ సెంచరీని శతకం దిశగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్లో 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 377 రన్స్ స్కోరు చేసింది. కాగా ఇటీవల ఆస్ట్రేలియా టూర్కు ప్రకటించిన భారత్-‘ఎ’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగి కేవలం ఐదు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.మహారాష్ట్ర వర్సెస్ ముంబై తుదిజట్లుమహారాష్ట్రరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్ కీపర్), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్ఎస్ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్.ముంబైపృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్Ruturaj Gaikwad reaches a brilliant hundred and is still going strong! 💯🔥 Leading Maharashtra’s charge against Mumbai with his classy batting, more runs to come!#RuturajGaikwad #CenturyInProgress #RanjiTrophy2024 #MaharashtraCricket pic.twitter.com/J6EwHQPZtC— Maharashtra Cricket Association (@MahaCricket) October 20, 2024 -
తమిళనాడు 674/6 డిక్లేర్డ్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో తమిళనాడు భారీ స్కోరు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో తమిళనాడు 674/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ (269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ సెంచరీతో కదం తొక్కగా... ప్రదోష్ రంజన్ పాల్ (117; 13 ఫోర్లు) శతకం చేశాడు. అంతకుముందు ఓపెనర్ సాయి సుదర్శన్ (213; 25 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ద్విశతకం నమోదు చేసుకోవడంతో తమిళనాడు భారీ స్కోరు చేయగలిగింది. నారాయన్ జగదీశన్ (65), సిద్ధార్థ్ (66 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నవ్దీప్ సైనీ, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఓవర్నైట్ స్కోరు 379/1తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు జట్టు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. సనత్ సాంగ్వాన్ (23 బ్యాటింగ్), హర్‡్ష త్యాగీ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఢిల్లీ... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 631 పరుగులు వెనుకబడి ఉంది. -
మూడేళ్ల తర్వాత శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్.. నేను రెడీ!
శ్రేయస్ అయ్యర్ శతక్కొట్టాడు. మూడేళ్ల తర్వాత ఈ ముంబై బ్యాటర్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా వంద పరుగుల మార్కును దాటాడు.టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ మేర అద్భుత శతకం బాదిన శ్రేయస్ అయ్యర్.. రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు సందేశం పంపాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై రంజీ తాజా ఎడిషన్లో తొలుత బరోడాతో తలపడి ఓడిపోయింది.ఈ క్రమంలో రహానే సేన అక్టోబరు 18న మహారాష్ట్రతో తమ రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. సొంతమైదానంలో టాస్ ఓడిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. మహారాష్ట్రను తొలి ఇన్నింగ్స్లో 126 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్థి, షామ్స్ ములానీ మూడేసి వికెట్లతో చెలరేగగా.. శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డైస్ చెరో రెండు వికెట్లు కూల్చారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ(232 బంతుల్లో 176) పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ అతడికి సహకారం అందించాడు. మొత్తంగా 190 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 142 పరుగులు సాధించాడు. శ్రేయస్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి.ఆయుశ్ మాత్రే, శ్రేయస్ అయ్యర్ శతక ఇన్నింగ్స్ కారణంగా ముంబై తమ మొదటి ఇన్నింగ్స్లో 441 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి మహారాష్ట్ర 31 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది. ముంబై కంటే 173 పరుగులు వెనుకబడి ఉంది.ముంబై వర్సెస్ మహారాష్ట్ర తుదిజట్లుముంబైపృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్.మహారాష్ట్రరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్ కీపర్), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్ఎస్ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్. -
హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారీ లక్ష్య చేధనలో కంగారుల ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 129 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్స్లతో 154 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో మార్నస్ లబుషేన్(77) పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో పొట్స్, బెతల్, లివింగ్స్టోన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా...విల్ జాక్స్ (56 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెపె్టన్ హ్యారీ బ్రూక్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్లు), జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించారు. ఆ్రస్టేలియా బౌలర్లలో లబుషేన్, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టగా...ట్రవిస్ హెడ్కు 2 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం లీడ్స్లో జరుగుతుంది. -
SL vs NZ: శతక్కొట్టిన కమిందు.. లంక తొలి ప్లేయర్గా..
న్యూజిలాండ్తో తొలి టెస్టులో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ కుదేలైన తరుణంలో చిక్కుల్లో పడిన జట్టును తన సెంచరీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో శ్రీలంకను మెరుగైన స్థితిలో నిలిపాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా న్యూజిలాండ్ రెండు మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది.టాపార్డర్ను పడేసిన కివీస్ పేసర్లుఈ క్రమంలో గాలే వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే, స్పిన్కు అనుకూలించే పిచ్పై తొలుత న్యూజిలాండ్ పేసర్లు చెలరేగడం విశేషం. కివీస్ యువ ఫాస్ట్బౌలర్ ఒ రూర్కీ దిముత్ కరుణరత్నె(2)ను పెవిలియన్కు పంపి తొలి వికెట్ తీశాడు.అనంతరం మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(27)ను కూడా రూర్కీ అవుట్ చేయగా.. వన్డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్(30)ను కివీస్ కెప్టెన్ వెనక్కిపంపాడు. ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్తో కలిసి కమిందు మెండిస్ లంక ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. స్కోరు 106-4 వద్ద ఉన్న వేళ ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్కు 72 పరుగులు జతచేశారు.కమిందు- కుశాల్ జోడీ సెంచరీ భాగస్వామ్యంఅయితే, రూర్కీ మరోసారి ప్రభావం చూపాడు. మాథ్యూస్ను 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ కమిందుకు తోడయ్యాడు. ఈ క్రమంలో కమిందు సెంచరీ పూర్తి చేసుకోగా.. కుశాల్ కేవలం 68 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. కమిందుతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ కుశాల్ను అవుట్చేసి.. ఈ జోడీని విడదీయడంతో లంక ఇన్నింగ్స్ నెమ్మదించింది.మరోవైపు.. స్పిన్నర్ అజాజ్ పటేల్ కమిందు మెండిస్ను పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 88 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది. రమేశ్ మెండిస్ 14, ప్రభాత్ జయసూర్య 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.కమిందు మెండిస్ సరికొత్త చరిత్రకివీస్తో తొలి టెస్టులో 173 బంతుల్లో కమిందు మెండిస్ 114 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు ఉన్నాయి. కాగా కమిందుకు ఇది టెస్టుల్లో సొంతగడ్డపై తొలి సెంచరీ కాగా.. ఓవరాల్గా నాలుగోది.ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా టెస్టుల్లో నాలుగు శతకాలు బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్లలో కమిందు ఈ ఘనత సాధించగా.. మైకేల్ వాండార్ట్(21 మ్యాచ్లలో), ధనంజయ డి సిల్వ(23మ్యాచ్లలో) అతడి తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తరుణంలో కమిందు మరో రికార్డు సాధించాడు.మరో అరుదైన ఘనతవరుసగా ఏడు టెస్టు మ్యాచ్లలో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. కమిందు కంటే ముందు పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లోనూ కమిందు మెండిస్ అద్బుతంగా రాణించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ టెస్టులో శతకంతో అలరించాడు.చదవండి: Ind vs Ban: తుదిజట్టులో వారికి చోటు లేదు.. కారణం చెప్పిన గంభీర్ View this post on Instagram A post shared by Sri Lanka Cricket (@officialslc)A century at home, no less in your hometown, always special🙌🏽 #SLvNZ 🎥 SLC pic.twitter.com/eqwnFMPutm— Estelle Vasudevan (@Estelle_Vasude1) September 18, 2024 -
ఇషాన్ కిషన్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఇండియా-సి టీమ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అనంతపురంలో భారత్ ‘బి’ జట్టుతో గురువారం మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్లో భారత్ ‘సి’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫస్ట్క్లాస్ క్రికెట్ పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఇషాన్ కిషన్ శతక్కొట్టగా... మిగతా బ్యాటర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో భారత్ ‘సి’ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్ (75 బంతుల్లో 43; 8 ఫోర్లు), రజత్ పాటిదార్ (67 బంతుల్లో 40; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (136 బంతుల్లో 78; 9 ఫోర్లు) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు బంతులు ఎదుర్కోగానే మడమ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్... కోలుకొని తిరిగి క్రీజులో అడుగు పెట్టి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మానవ్ సుతార్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాన్ కిషన్... రెండో రౌండ్ మ్యాచ్లో చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇంద్రజిత్తో కలిసి మూడో వికెట్కు 189 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్లో జార్ఖండ్ తరఫున సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... ఇక్కడే అదే జోరు కొనసాగించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... నవ్దీప్ సైనీ, రాహుల్ చహర్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (బ్యాటింగ్) 46; సాయి సుదర్శన్ (సి) నవ్దీప్ సైనీ (బి) ముకేశ్ కుమార్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ కుమార్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చాహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ కుమార్ 12; మానవ్ సుతార్ (బ్యాటింగ్) 8; ఎక్స్ట్రాలు 19; మొత్తం (79 ఓవర్లలో 5 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345. బౌలింగ్: ముకేశ్ కుమార్ 21–3–76–3; నవ్దీప్ సైనీ 17–2–78–1; వాషింగ్టన్ సుందర్ 10–0–55–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–2–58–0; సాయికిశోర్ 12–0–46–0; రాహుల్ చహర్ 5–0–35–1. -
నల్లమలలో 11వ శతాబ్దం నాటి శిలాశాసనాలు
ఆత్మకూరు రూరల్: గతం తెలియని వారికి భవిష్యత్తు ఉండదని పెద్దలు చెబుతుంటారు. అందుకే గతకాలంలో జరిగిన విషయాలను పరిశోధించి, ఫలితాలను గుదిగుచ్చి చరిత్రగా మన ముందు ఉంచుతుంటారు చరిత్రకారులు. అలాంటి వారి దృష్టికి రాకుండా కొన్ని గతకాలపు ఆనవాళ్లు మరుగున పడిపోతుంటాయి. అలాంటివి కృష్ణా తీరంలో, నల్లమల అడవుల్లో ఎన్నో గుప్తంగా ఉండిపోతున్నాయి. ఇక్కడ కనపడుతున్న రెండు శిలాశాసనాలు కూడా అలాంటివే.. ఇవి నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు అటవీ డివిజన్లోని ఇందిరేశ్వరం బీట్లో పెద్ద గుమ్మితం వద్ద ఉన్నాయి. గుమ్మితం ఒక ప్రాచీన శైవ క్షేత్రం. కొండపైనుంచి దుమికే జలపాతాన్ని ఏర్పరచిన ఒక కొండ వాగు ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్ర ఆవరణలో పురాతన లిపి ఉన్న రెండు శిలా శాసనాలు ఉన్నాయి. బాగా పాతకాలంనాడు అప్పటి వారు ఉపయోగించిన తెలుగు లిపితో ఈ శాసనాలు ఉన్నాయి. ఇవి కాకతీయ – విజయనగర పాలన మధ్య కాలంలోనివి(క్రీశ11–12 శతాబ్ధాలు) అయి ఉండొచ్చునని చరిత్రపై అవగాహన ఉన్న కొందరు చెబుతున్నారు. ఇవి ఎర్రయ్య అనే వ్యక్తి వేయించిన దాన శాసనాలుగా తెలుస్తోంది. మల్లికార్జున స్వామికి ఏదో బహుమానం రూపంలో సమర్పించినట్లు లిపిని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తోంది. అయితే ఈ శిలాశాసనాలను పూర్తిస్థాయిలో పరిశోధిస్తే చరిత్రలో మరుగున పడ్డ విషయాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పాక్పై సూపర్ సెంచరీ.. బంగ్లా తొలి బ్యాటర్గా రికార్డు
పాకిస్తాన్తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అద్భుత శతకం(191)తో అలరించాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి పట్టుదలగా క్రీజులో నిలబడి సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో అతడికి ఇది పదకొండో సెంచరీ. అయితే, దురదృష్టవశాత్తూ డబుల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయినప్పటికీ జట్టును మాత్రం పటిష్ట స్థితిలో నిలపగలిగాడు ముష్ఫికర్ రహీం. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పర్యాటక బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బ్యాటర్ల శతకాలుబంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసిన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ సయీమ్ అయూబ్(56) రాణించగా.. సౌద్ షకీల్(141), మహ్మద్ రిజ్వాన్(171 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(93) శుభారంభం అందించాడు.అయితే, మరో ఓపెనర్ జాకిర్ హసన్(12), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో(16) పూర్తిగా నిరాశపరిచారు. వీరి తర్వాతి స్థానాల్లో వచ్చిన మొమినుల్ హక్(50) అర్ధ శతకం సాధించగా.. ముష్ఫికర్ రహీం విశ్వరూపం ప్రదర్శించాడు. మొత్తంగా 341 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 191 పరుగులు సాధించాడు.బంగ్లా తొలి బ్యాటర్గా రికార్డు ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో పదిహేను వేల పరుగుల మైలురాయిని దాటేశాడు ముష్ఫికర్ రహీం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్గానూ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున 2005లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు 80 టెస్టుల్లో 11 శతకాలు, 3 ద్విశతకాల సాయంతో 5867, 271 వన్డేల్లో 9 సెంచరీల సాయంతో 7792 రన్స్, 102 టీ20లలో 1500 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాక్- బంగ్లా తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా.. ముష్ఫికర్తో పాటు లిటన్ దాస్(56), మెహదీ హసన్ మిరాజ్(71 బ్యాటింగ్) రాణించడంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. 167.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 565 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 117 పరుగుల ఆధిక్యం సంపాదించింది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు తుదిజట్లుపాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, నసీం షా, ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లాం, జాకిర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహీద్ రాణా.Mushfiqur Rahim completes his 11th Test century, much to the delight of his teammates and fans 🇧🇩🏏#PAKvBAN | #TestOnHai pic.twitter.com/jWqAX7YVdR— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024 -
ఈ పోస్ట్కార్డు.. జీవితకాలం లేటు!
ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్ల కాలం. కానీ వందేళ్ల కిందట సమాచారం చేరవేతకు ఏకైక మార్గం పోస్టే. ఒక లెటర్ చేరడానికి మూడు నుంచి వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల నుంచి నెల దాకా కూడా పట్టేది. కానీ ఒక పోస్ట్కార్డు చేరడానికి ఏకంగా 121 ఏళ్లు పట్టింది! 1903లో పోస్ట్ చేసిన ఆ లేఖ శతాబ్దం ఆలస్యంగా చేరుకుంది. బ్రిటన్లో స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ అడ్రస్తో ఉన్న ఈ క్రిస్మస్ థీమ్ కార్డు క్రాడాక్ స్ట్రీట్ శాఖకు గతవారం చేరింది. ఆ చిరునామాలో గతంలో నివసించిన మిస్ లిడియా డేవిస్ బంధువులను కనిపెట్టి ఈ కార్డు ఎవరికి రాసిందో తెలుసుకుని వాళ్లకు చేర్చాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్ అనే వ్యక్తి లిడియాకు రాశారు.స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో 121 ఏళ్ల కిందట ఆండ్రూ డల్లీ తన భార్య మరియాతో కలిసి నివసించారు. వారి ఆరుగురు పిల్లల్లో పెద్ద కూతురు లిడియా. ఈ పోస్టు కార్డు పంపిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. వారి కుటుంబం గురించిన సమాచారం ఆన్లైన్లో చాలా తక్కువగా ఉందని స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ వర్గాలన్నాయి. ఆమెతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుగొని లేఖను అందజేస్తామని చెప్పుకొచ్చాయి.లేఖలో ఏముందంటే..‘డియర్ ‘ఎల్’.. నన్ను క్షమించండి. నేనా జత (ఏదో తెలియని వస్తువు) తీసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావని ఆశిస్తున్నా’ అని రాశారు. తన వద్ద 10 షిల్లింగ్లు ఉన్నాయని, రైలు చార్జీలను లెక్కించడం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ‘గిల్బర్ట్, జాన్లను కలవాలి.. గుర్తుంచుకోండి’ అంటూ ముగించారు. ‘అందరికీ ప్రేమతో’అంటూ సంతకం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. రేమండ్ కట్టడం
సైదాబాద్: నిజాం రాజు సైనికాధికారి, క్రైస్తవుడైన జనరల్ మాన్షియర్ రేమండ్ను అప్పటి స్థానికులైన ముస్లింలు మూసారహీంగా, హిందువులు రామ్గా పిలిచి తమ అభిమానాన్ని చాటుకునేవారు. అందుకే ఆయన పేరుగా ఆయన నివసించిన ఆ ప్రాంతం మూసారాంబాగ్గా ఏర్పడింది. అంతగా ప్రజల మన్ననలు పొందిన ఆయన స్మారకార్థం నిర్మించినవే రేమండ్ స్థూపం, సమాధులు. రెండో నిజాం రాజు నిజాం అలీ ఖాన్ పాలనలో ఫ్రెంచ్ దేశస్తుడైన రేమండ్ సైనికాధికారిగా రాజు సైన్యంలోని ఫిరంగి సేనలను పటిష్టంగా తీర్చిదిద్దారు. 1798లో ఆయన మరణానంతరం ఆయన మృతి చిహా్నలుగా అప్పటి మలక్పేటలోని ఎత్తైన కొండ ప్రాంతమైన ఆస్మాన్ఘడ్లో నిర్మాణాలు చేశారు. 18వ శతాబ్దంలో యూరోపియన్ రీతిలో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఎత్తైన కొండపై... ఎత్తైన కొండ ప్రాంతంపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడల్పుతో గద్దెను నిర్మించారు. ఆ గద్దెపై 23 అడుగుల ఎత్తులో రేమాండ్ స్మారక స్థూపాన్ని నిర్మించారు. స్తూపం పక్కనే 28 స్తంభాలతో గ్రీకు శిల్పకళారీతిలో నిర్మించిన ఆయన సమాధి ఉంటుంది. ఆయన స్థూపానికి సమీపంలోనే వారి కుటుంబ సభ్యుల పెంపుడు జంతువులైన గుర్రం, శునకం సమాధులను సైతం నిర్మించారు. 18వ శతాబ్దపు నిర్మాణ శైలితో ఉండే ఈ కట్టడాలు చూపరులను ఆకట్టుకుంటాయి.పురావస్తు శాఖ చొరవతో..దశాబ్దం క్రితం వరకూ ఈ కట్టడాల ప్రాంతంపై అధికారుల పర్యవేక్షణ కొరవడి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఆ తరువాత పురవాస్తుశాఖ అధికారుల చొరవతో కట్టడాల ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పచ్చటి లాన్లతో, మెరుగైన సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎత్తైన ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో ఇటీవల సినిమాలు, సీరియళ్లు సైతం విరివిగా చిత్రీకరిస్తున్నారు. -
డుప్లెసిస్ విధ్వంసకర సెంచరీ.. 12 ఫోర్లు, 5 సిక్స్లతో
మేజర్ లీగ్ క్రికెట్-2024లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ లీగ్లో భాగంగా సోమవారం చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లను డుప్లెసిస్ ఊచకోత కోశాడు. కేవలం 58 బంతుల్లోనే ఫాప్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. మేజర్ లీగ్ క్రికెట్లో డుప్లెసిస్కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(39) పరుగులతో రాణించాడు. వాష్టింగ్టన్ బౌలర్లలో నేత్రవల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, డిల్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వాష్టింగ్టన్కు ఓపెనర్ స్మిత్(26), హెడ్(36) మంచి ఆరంభాన్ని ఆంచారు. వీరిద్దరూ ధాటికి వాషింగ్టన్ 4 ఓవర్లలో 62 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. -
సుడిగాలి శతకంతో విరుచుకుపడిన టీమిండియా సారధి
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో (మహిళలు) టీమిండియా బ్యాటర్లు పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. ఇవాళ (జూన్ 19) జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక్కొట్టింది (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు).సుడిగాలి శతకంతో విరుచుకుపడిన హర్మన్ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించింది. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్లో మంధన, హర్మన్ సెంచరీలతో విజృంభించగా.. షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24), రిచా ఘోష్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్ ఓ వికెట్ పడగొట్టారు.CAPTAIN HARMANPREET KAUR COMPLETED HUNDRED WITH 4,6,4 🥶 pic.twitter.com/y26g5HRhDK— Johns. (@CricCrazyJohns) June 19, 2024చివరి ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్49వ ఓవర్ 2వ బంతి ఎదుర్కొనే సమయానికి 85 బంతుల్లో 88 పరుగులు చేసిన హర్మన్ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా 4, 6, 4 బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్లో సెంచరీ చేసిన మంధన భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్ రికార్డును (7) సమం చేసింది. -
వరుసగా రెండో మ్యాచ్లో శతక్కొట్టిన మంధన.. మిథాలీ రాజ్ రికార్డు సమం
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీలు సాధించి, పలు రికార్డులు బద్దలు కొట్టింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మంధన తొలి రెండు వన్డేల్లో శతక్కొట్టి, అరుదైన రికార్డులు నెలకొల్పింది.బెంగళూరు వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. తాజాగా అదే బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ మెరుపు సెంచరీతో (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిసింది.SMRITI MANDHANA - THE QUEEN. 👑 pic.twitter.com/jsadqWhYlr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2024మంధన మెరుపు శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికాతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మంధనతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (87 నాటౌట్) కూడా చెలరేగి ఆడుతుండటంతో 48 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 3 వికెట్ల నష్టానికి 302గా ఉంది. భారత ఇన్నింగ్స్లో మంధన, షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24) ఔట్ కాగా.. హర్మన్కు జతగా రిచా ఘెష్ (18) క్రీజ్లో ఉంది.తొలి భారత క్రికెటర్గా రికార్డువరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీలు చేయడంతో మంధన ఖాతాలో పలు రికార్డులు చేరాయి. మహిళల వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా మంధన రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో సెంచరీతో మంధన మరో రికార్డును సమం చేసింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. మిథాలీ, మంధన ఇద్దరు వన్డేల్లో 7 సెంచరీలు చేశారు. మంధన 7 వన్డే సెంచరీలను కేవలం 84 ఇన్నింగ్స్ల్లో చేస్తే.. మిథాలీ రాజ్కు 7 సెంచరీలు సాధించేందుకు 211 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. -
CSK Vs MI: శెభాష్ హిట్మ్యాన్.. ఓడినా గానీ! రోహిత్ శర్మ సూపర్ సెంచరీ
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 207 పరుగుల లక్ష్య చేధనలో ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి రోహిత్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరి వరకు అద్బుతమైన పోరాటం చేసినప్పటికి తన జట్టును మాత్రం హిట్మ్యాన్ గెలిపించలేకపోయాడు. రోహిత్కు మరో ఆటగాడి సపోర్ట్ ఉండి ముంబై కచ్చితంగా విజయం సాధించిండేది. రోహిత్ సెంచరీ చేసినప్పటికి ఎటువంటి సెలబ్రేషన్స్ కూడా జరుపుకోలేదు. రోహిత్ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. 63 బంతుల్లో హిట్మ్యాన్.. 11 ఫోర్లు, 5 సిక్స్లతో 103 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రోహిత్కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. రోహిత్ శర్మ చివరగా 2012 ఐపీఎల్ సీజన్లో సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పతిరానకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ROHIT SHARMA, A HUNDRED TO REMEMBER FOREVER. 🫡 What a fightback, Lone Warrior for MI. pic.twitter.com/neT5HwxiO7 — Johns. (@CricCrazyJohns) April 14, 2024 -
#Jos Buttler: ఇది కదా బట్లర్ అంటే.. సిక్స్తో సెంచరీ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బట్లర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్గా వచ్చిన బట్లర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. రాజస్తాన్ విజయానికి కేవలం ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఇదే సిక్స్తో తన సెంచరీ మార్క్ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 58 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. బట్లర్కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ క్రిస్ గేల్తో కలిసి సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్లతో 113 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అదరగొట్టాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఇస్లామాబాద్ యునైటెడ్తో ఇవాళ (మార్చి 10) జరుగుతున్న మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. ముల్తాన్ సుల్తాన్స్ భారీ స్కోర్ చేయడంలో ఉస్మాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషించాడు. వన్డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగిన ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో ఉస్మాన్ 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్గా మిగిలాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), క్రిస్ జోర్డన్ (7 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించారు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, హునైన్ షా తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ విల్లే భారీ హిట్టర్ అలెక్స్ హేల్స్ను డకౌట్ చేయగా.. అఘా సల్మాన్ను మొహమ్మద్ అలీ (2) పెవిలియన్కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత ఇస్లామాబాద్ స్కోర్ 38/2గా ఉంది. షాదాబ్ ఖాన్ (8 బంతుల్లో 13; 2 ఫోర్లు), కొలిన్ మున్రో (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) క్రీజ్లో ఉన్నారు. -
బంగ్లాదేశ్ ఓపెనర్ మెరుపు శతకం.. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ బ్యాటర్, బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ తంజిద్ హసన్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఖుల్నా టైగర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 20) జరుగుతున్న మ్యాచ్లో తంజిద్ 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న తంజిద్ 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో తంజిద్ చేసిన సెంచరీ మూడవది. తంజిద్కు ముందు తౌహిద్ హ్రిదోయ్, విల్ జాక్స్ సెంచరీలు చేశారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు తొలి ఓవర్ ముగిసే సరికి కేవలం రెండు పరుగులు (వికెట్ నష్టపోకుండా) మాత్రమే చేయగలిగింది. -
‘జై’స్వాల్ కమాల్
రాజ్కోట్ టెస్టులో రెండో రోజు వెనుకబడినట్లు కనిపించిన భారత్ ఒక్కసారిగా మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది... బజ్బాల్ మాయలో చేజేతులా వికెట్లు కోల్పోయి స్వీయాపరాధంతో ఇంగ్లండ్ తమ పతనానికి అవకాశం కల్పించగా... టీమిండియా చక్కటి బౌలింగ్తో పాటు దానిని అందిపుచ్చుకుంది. అశ్విన్ లేని లోటు కనిపించకుండా మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొట్టారు. ఆపై యువ యశస్వి మరో దూకుడైన ఇన్నింగ్స్తో వరుసగా రెండో సెంచరీ సాధించగా, గిల్ అండగా నిలిచాడు. ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించిన భారత్ మ్యాచ్ను శాసించే స్థితిలో నిలిచింది. దీంతో ఆదివారం మరిన్ని పరుగులతో అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచడం ఖాయం. రాజ్కోట్: ఇంగ్లండ్తో మూడో టెస్టును గెలిచి సిరీస్లో ఆధిక్యంపై భారత్ కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (133 బంతుల్లో 104 రిటైర్డ్హర్ట్; 9 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ సాధించగా, శుబ్మన్ గిల్ (120 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 155 పరుగులు జోడించారు. వెన్ను నొప్పితో బాధపడుతూ మైదానం వీడిన యశస్వి మళ్లీ ఆదివారం బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 207/2తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (41) ఫర్వాలేదనిపించగా... మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ ఓవరాల్గా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇటీవల కన్నుమూసిన మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్కు నివాళిగా భారత క్రికెటర్లు భుజాలకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. టపటపా... పటిష్ట స్థితిలో మూడో రోజు ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ శనివారం స్వయంకృతంతో మంచి అవకాశం చేజార్చుకుంది. ప్రధాన బ్యాటర్ జో రూట్ (18) చేసిన తప్పుతో జట్టు పతనం మొదలైంది. మూడో రోజు ఐదో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్లో అత్యుత్సాహంతో ‘రివర్స్ స్కూప్’ ఆడిన రూట్ స్లిప్లో యశస్వి సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో బెయిర్స్టో (0)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత 150 పరుగుల మార్క్ను అందుకున్న తర్వాత బెన్ డకెట్ (151 బంతుల్లో 153; 23 ఫోర్లు, 2 సిక్స్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో స్టోక్స్, బెన్ ఫోక్స్ (13) కలిసి క్రీజ్లో పట్టుదలగా నిలిచే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు మళ్లీ చెలరేగారు. వరుస బంతుల్లో స్టోక్స్, ఫోక్స్లను పెవిలియన్ పంపించారు. రేహన్ (6), హార్ట్లీ (9) కూడా ఒకే స్కోరు వద్ద అవుట్ కాగా...యార్కర్తో అండర్సన్ (1) పని పట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను సిరాజ్ ముగించాడు. 20 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ చివరి 5 వికెట్లు పడ్డాయి. భారీ భాగస్వామ్యం... అండర్సన్ తొలి ఓవర్లో రోహిత్ శర్మ (19) కొట్టిన రెండు ఫోర్లతో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. అయితే కొద్ది సేపటికే రోహిత్ను ఎల్బీగా అవుట్ చేసి రూట్ ఇంగ్లండ్లో కాస్త ఆనందం నింపాడు. కానీ అది ఆ కొద్ది సేపటికే పరిమితమైంది. గత టెస్టు సెంచరీ హీరోలు యశస్వి, గిల్ మరో భారీ భాగస్వామ్యంతో జట్టును ఆధిక్యంలో నిలిపారు. ఆరంభంలో వీరిద్దరు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా...ఆ తర్వాత దూకుడు పెంచారు. ముఖ్యంగా ఒక దశలో 73 బంతుల్లో 35 పరుగులతో ఉన్న యశస్వి ఆ తర్వాత మెరుపు షాట్లతో దూసుకుపోయాడు. అండర్సన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4 బాదడంతో ఇది షురూ అయింది. హార్ట్లీ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టిన అతను తొలి సిక్స్తో 80 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత సెంచరీని చేరేందుకు యశస్వికి మరో 42 బంతులే సరిపోయాయి. ఈ క్రమంలో అతను ఏ బౌలర్నూ వదలకుండా మరో 4 ఫోర్లు, 3 సిక్స్లు బాదాడు. అప్పటి వరకు ప్రేక్షకుడిగా ఉన్న గిల్ కూడా చెలరేగి వుడ్ ఓవర్లో సిక్స్, ఫోర్తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 153; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (సి) యశస్వి (బి) బుమ్రా 18; బెయిర్స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; స్టోక్స్ (సి) బుమ్రా (బి) జడేజా 41; ఫోక్స్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; రేహన్ (బి) సిరాజ్ 6; హార్ట్లీ (స్టంప్డ్) జురేల్ (బి) జడేజా 9; వుడ్ (నాటౌట్) 4; అండర్సన్ (బి) సిరాజ్ 1; ఎక్స్ట్రాలు 20; మొత్తం (71.1 ఓవర్లలో ఆలౌట్) 319. వికెట్ల పతనం: 1–89, 2–182, 3–224, 4–225, 5–260, 6–299, 7–299, 8–314, 9–314, 10–319. బౌలింగ్: బుమ్రా 15–1–54–1, సిరాజ్ 21.1–2–84–4, కుల్దీప్ 18–2–77–2, అశ్విన్ 7–0–37–1, జడేజా 10–0– 51–2. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (రిటైర్డ్హర్ట్) 104; రోహిత్ (ఎల్బీ) (బి) రూట్ 19; గిల్ (నాటౌట్) 65; పటిదార్ (సి) రేహన్ (బి) హార్ట్లీ 0; కుల్దీప్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 5; మొత్తం (51 ఓవర్లలో 2 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–30, 2–191. బౌలింగ్: అండర్సన్ 6–1–32–0, రూట్ 14–2–48–1, హార్ట్లీ 15–2–42–1, వుడ్ 8–0–38–0, రేహన్ 8–0–31–0. -
మ్యాక్స్వెల్ మహోగ్రరూపం.. విధ్వంసకర శతకం
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేశాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీ20ల్లో మ్యాక్స్వెల్కు ఇది ఐదో శతకం. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని శతకాలు చేశాడు. మ్యాక్సీ ఊచకోత ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాడిపోయారు. మ్యాక్స్వెల్ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్లోకి తరలించాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ 120 పరుగులు (55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాక్సీకి జతయ్యాడు. వీరిద్దరూ విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. SWITCH HIT FOR SIX BY MAXWELL 🤯🔥pic.twitter.com/wZ73ZsmhBm — Johns. (@CricCrazyJohns) February 11, 2024 వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడగా.. జోష్ ఇంగ్లిస్ (4) విఫలమయ్యాడు. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్ బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో విండీస్ బౌలింగ్ లైనప్ కకావికలమైంది. ఆ జట్టు బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అల్జరీ జోసఫ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో విండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ మ్యాచ్లో ఆసీస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 పెర్త్ వేదికగా ఫిబ్రవరి 13న జరుగనుంది. -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న విలియమ్సన్.. పలు రికార్డులు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో టాప్ రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కేన్.. తాజాగా మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు (118, 109) చేసిన కేన్.. ఈ ఘనత (ట్విన్ సెంచరీలు) సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. సెకెండ్ ఇన్నింగ్స్ సెంచరీతో టెస్ట్ సెంచరీల సంఖ్యను 31కి పెంచుకున్న కేన్.. అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్లో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేన్ (44).. స్మిత్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. తాజా సెంచరీతో కేన్ మరో రికార్డు కూడా సాధించాడు. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్ల్లో) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో (165 ఇన్నింగ్స్ల్లో) ఉండగా.. స్టీవ్ స్మిత్, విలియమ్సన్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ గత 10 ఇన్నింగ్స్ల్లో స్కోర్లు ఇలా ఉన్నాయి. 132, 1, 121*, 215, 104, 11, 13, 11, 118, 109. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్లో న్యూజిలాండ్ గెలుపు దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ప్రత్యర్ధి సౌతాఫ్రికా గెలవలేదు. కేన్ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి న్యూజిలాండ్ గెలుపుకు పునాది వేయగా.. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (240) చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. -
సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఇవాళ (జనవరి 21) ఆసక్తికర మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో అబుదాబీ నైట్రైడర్స్ సునాయాసంగా విజయం సాధించి, లీగ్లో తమ గెలుపును నమోదు చేసింది. మ్యాచ్ వరకు సాదాసీదాగా సాగినా ఓ సందర్భం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నైట్ రైడర్స్ ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశం ఉన్నా సహచర ఆటగాడి కారణంగా ఆ మార్కును అందుకోలేకపోయాడు. ఆఖర్లో గౌస్ సిక్సర్ కొడితే అతని సెంచరీ పూర్తి కావడంతో పాటు తన జట్టు కూడా గెలుస్తుంది. అయితే అప్పుడే క్రీజ్లోకి వచ్చిన ఇమాద్ వసీం.. స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా గెలుపు కావాల్సిన పరుగులు (ఫోర్) చేశాడు. ఇమాద్ సింగిల్ తీసి గౌస్కు స్ట్రయిక్ ఇచ్చుంటే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. అప్పటివరకు దూకుడుగా ఆడిన గౌస్.. సెంచరీ కోసమనే నిదానంగా ఆడుతూ 18వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లాడు. ఇమాద్.. గౌస్ సెంచరీ విషయాన్ని పట్టించుకోకుండా బౌండరీ కొట్టి మ్యాచ్ను ముగించడంతో అంతా ఆశ్చర్యపోయారు. టీ20 క్రికెట్లో సెంచరీ చేసే అవకాశం తరుచూ రాదు కాబట్టి గౌస్ పట్ల అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. అలీ ఖాన్ (3/29), సునీల్ నరైన్ (2/23), జాషువ లిటిల్ (1/21), ఇమాద్ వసీం (1/45), డేవిడ్ విల్లే (1/24) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులకు పరిమితమైంది. వైపర్స్ ఇన్నింగ్స్లో ఆడమ్ హోస్ (45) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఆండ్రియస్ గౌస్ రెచ్చిపోవడంతో నైట్రైడర్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గౌస్కు కైల్ పెప్పర్ (36), లారీ ఈవాన్స్ (21) సహకరించారు. గౌస్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 30 ఏళ్ల గౌస్ సౌతాఫ్రికాకు చెందిన వాడు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన గౌస్.. నైట్రైడర్స్ ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడు. -
రికీ భుయ్ అజేయ శతకం
విశాఖ స్పోర్ట్స్: బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 71 పరుగుల దూరంలో నిలిచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 133 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. రికీ భుయ్ (243 బంతుల్లో 107 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. ఓవర్నైట్ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయి మరో 220 పరుగులు సాధించింది. కెప్టెన్ హనుమ విహారి (51; 7 ఫోర్లు)తో కలిసి రికీ భుయ్ నాలుగో వికెట్కు 87 పరుగులు జత చేశాడు. అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి (30; 6 ఫోర్లు)తో ఆరో వికెట్కు రికీ భుయ్ 71 పరుగులు జోడించాడు. ప్రస్తుతం షోయబ్ మొహమ్మద్ ఖాన్ (31 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రికీ భుయ్ ఏడో వికెట్కు అజేయంగా 61 పరుగులు జత చేశాడు. బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 409 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి'.. రాజమౌళి ట్వీట్ వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేయడంపై ఆయన ట్వీట్ చేశారు. రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి అంటూ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డ్ను తుడిచిపెట్టేశాడు. (ఇది చదవండి: ఎయిర్పోర్ట్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టాడానికి. కానీ కానీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డును బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాదిలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. Records are meant to be broken, but no one in their wildest dreams dreamt of breaking Sachin's record when he announced his retirement. And the KING emerged. 🔥🔥 KOHLI 🙏🏻🙏🏻 — rajamouli ss (@ssrajamouli) November 15, 2023 -
భారత్ ప్రతాపం.. దక్షిణాఫ్రికా దాసోహం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ కష్టపెట్టింది. ఆరంభంలో రో‘హిట్స్’తో పరుగులు సులువైనా... తర్వాత గగనమైంది. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ కనిపెట్టుకొని పరుగులు పేర్చితే జట్టు స్కోరు 300 మార్కు దాటింది. ‘బర్త్డే బాయ్’ విరాట్ సెంచరీ పర్వాన్ని చూపిస్తే... ఆ తర్వాత బౌలర్లు వికెట్ల కూల్చివేతల్లో త్వరపడ్డారు. దీంతో వార్ వన్సైడ్ అయిన ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయంతో రోహిత్ శర్మ బృందం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ‘టాప్ ర్యాంక్’ను ఖరారు చేసుకుంది. కోల్కతా: అదేంటో ఈ ప్రపంచకప్లో యుద్ధం తప్పదనుకున్న మ్యాచ్ల్లోనే భారత్ సులువుగా దండయాత్ర చేసి గెలుస్తోంది. ఆ్రస్టేలియాతో మొదలైన టీమిండియా తొలి మ్యాచ్, క్రికెట్ ప్రపంచం గుడ్లప్పగించి చూసిన పాక్తో సమరం... భారీస్కోర్లతో చేలరేగుతున్న దక్షిణాఫ్రికాతో తాజా పోరు... ఇవన్నీ కూడా పోటాపోటీగా సాగుతాయనుకుంటే భారత్ వీరంగంతో ఏకపక్షమయ్యాయి. దీంతో ఆతిథ్య జట్టు కాస్తా అజేయ శక్తిగా మారిపోయింది. ఈ ప్రపంచకప్లో భారత జట్టు తర్వాత జోరుమీదున్న దక్షిణాఫ్రికా టీమిండియా దూకుడుకు దాసోహమైంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ 243 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. కోహ్లి పుట్టినరోజు (నవంబర్ 5) ఉదయం శుభాకాంక్షలతో మొదలైతే... సాయంత్రం వచ్చేసరికి శతక ప్రదర్శనతో ప్రశంసలు వెల్లువెత్తాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (121 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) సచిన్కు సరిసమానమైన 49వ వన్డే సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (87 బంతుల్లో 77; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్ (14) టాప్స్కోరర్! రవీంద్ర జడేజా (5/33) తన స్పిన్తో దక్షిణాఫ్రికాను చుట్టేశాడు. కుల్దీప్ యాదవ్, షమీ చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను ఈనెల 12న బెంగళూరులో నెదర్లాండ్స్ జట్టుతో ఆడుతుంది. రో‘హిట్స్’తో మొదలై... కెప్టెన్ , హిట్మ్యాన్ రోహిత్ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఎదురుదాడికి దిగడంతో స్కోరు సగటున 10 పరుగుల రన్రేట్తో దూసుకెళ్లింది. 6వ ఓవర్లోనే రబడ అతని వేగానికి కళ్లెం వేయగా... కోహ్లి, శుబ్మన్ గిల్ (24 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగానే ఆడటంతో 10 ఓవర్లలో భారత్ 91/1 స్కోరు చేసింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్కు దిగగానే పరిస్థితి ఒక్కసారిగా ‘స్విచ్చాఫ్’ చేసినట్లు మారింది. గిల్ను అవుట్ చేసి... సహకరించే పిచ్పై స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కట్టడి చేయడంతో తర్వాతి 16 ఓవర్లలో భారత్ 60 పరుగులే చేయగలిగింది. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ 151/1 స్కోరుతో వేగంలో వెనుకబడింది. ‘శత’క్కొట్టిన కోహ్లి పిచ్ సంగతి అర్థమైన కోహ్లి... కేశవ్ బౌలింగ్ ప్రమాదకరమని గుర్తించాడు. అవతలివైపు అయ్యర్నూ అలర్ట్ చేసి సింగిల్స్, డబుల్స్తోనే స్కోరును ముందుకు సాగనిచ్చాడు. కానీ షమ్సీని మాత్రం వదల్లేదు. చక్కగా బౌండరీలు బాదారు. కోహ్లి 67 బంతుల్లో, అయ్యర్ 64 బంతుల్లో ఫిఫ్టీలు సాధించారు. ఈ జోడి మూడో వికెట్కు 134 పరుగులు జతచేశాక అయ్యర్ ఆటను ఎన్గిడి ముగించాడు. రాహుల్ (8) వచ్చివెళ్లాడు. ఆఖరి దశలో సూర్యకుమార్ (14 బంతుల్లో 22; 5 ఫోర్లు) జోరును షమ్సీ అడ్డుకోగా... జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాకే భారత్ పుంజుకొని 300 దాటింది. కోహ్లి (119 బంతుల్లో) శతకం సాధించాడు. ఈ మేటి బ్యాటర్ క్రీజులో ఉన్నా కూడా... కేశవ్ పూర్తి కోటా వేసినా... ఒక్క బౌండరీ ఇవ్వకపోవడం విశేషం. సఫారీ పేకమేడలా... ఈ టోర్నీలోనే బాగా సెంచరీలు, భారీగా స్కోర్లు చేస్తున్న జట్టు... రన్రేట్లో ముందున్న జట్టు దక్షిణాఫ్రికానే! కానీ ఈ జట్టు కూడా భారత బౌలింగ్కు కుదేలైంది. ఇంకా చెప్పాలంటే వికెట్లు రాలిన ఉదంతాన్ని చూస్తే ఓ క్రికెట్ కూననే తలపించింది. సిరాజ్ డెలివరీకి డికాక్ (5) క్లీన్బౌల్డ్ అయ్యాడు. జడేజా ముందుగానే రంగంలోకి దించితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా క్రమం తప్పకుండా సఫారీ మేటి బ్యాటర్లను పడగొట్టేశాడు. బవుమా (11), క్లాసెన్ (1), మిల్లర్ (11)లను స్పిన్ ఉచ్చులో ఉక్కిరి బిక్కిరి చేయగా... మరోవైపు షమీ పేస్తో డసెన్ (13), మార్క్రమ్ (9)లను పెవిలియన్ చేర్చాడు. కుల్దీప్ కూడా తనవంతు మ్యాజిక్ చూపడంతో 40 పరుగులకే 5 వికెట్లను... 83 పరుగులకే దక్షిణాఫ్రికా మొత్తం వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బవుమా (బి) రబడ 40; గిల్ (బి) కేశవ్ 23; కోహ్లి (నాటౌట్) 101; అయ్యర్ (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 77; రాహుల్ (సి) డసెన్ (బి) జాన్సెన్ 8; సూర్యకుమార్ (సి) డికాక్ (బి) షమ్సీ 22; జడేజా (నాటౌట్) 29; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–62, 2–93, 3–227, 4–249, 5–285. బౌలింగ్: ఎన్గిడి 8.2–0–63–1, జాన్సెన్ 9.4–0–94–1, రబడ 10–1–48–1, కేశవ్ మహరాజ్ 10–0–30–1, షమ్సీ 10–0–72–1, మార్క్రమ్ 2–0–17–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; బవుమా (బి) జడేజా 11; డసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 13; మార్క్రమ్ (సి) రాహుల్ (బి) షమీ 9; క్లాసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 1; మిల్లర్ (బి) జడేజా 11; జాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; కేశవ్ (బి) జడేజా 7; రబడ (సి అండ్ బి) జడేజా 6; ఎన్గిడి (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (27.1 ఓవర్లలో ఆలౌట్) 83. వికెట్ల పతనం: 1–6, 2–22, 3–35, 4–40, 5–40, 6–59, 7–67, 8–79, 9–79, 10–83. బౌలింగ్: బుమ్రా 5–0–14–0, సిరాజ్ 4–1–11–1, జడేజా 9–1–33–5, షమ్సీ 4–0–18–2, కుల్దీప్ 5.1–1–7–2. ప్రపంచకప్లో నేడు శ్రీలంక Xబంగ్లాదేశ్ వేదిక: న్యూఢిల్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
అచ్యుతానందన్కు 100 ఏళ్లు
అలప్పుజ: కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం వెలిక్కకత్తు శంకర్ అచ్యుతానందన్ శుక్రవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2006–11 సంవత్సరాల్లో ఆయన సీఎంగా చేశారు. 1991 నుంచి 2016 దాకా మూడుసార్లు విపక్ష నేతగా ఉన్నారు. వీఎస్గా ప్రసిద్ధుడైన ఆయన 82 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన నేతగానూ రికార్డు సృష్టించారు. స్ట్రోక్ నేపథ్యంలో ఐదేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చివరికి 2016 ఎన్నికల్లో కూడా కేరళలో వామపక్ష కూటమి వీఎస్నే ముందు పెట్టుకుని ప్రచారం చేసింది. కాంగ్రెస్ను ఓడించి అధికారం చేపట్టింది. అభిమానులు ఆయన్ను ఫిడెల్ క్యాస్ట్రో ఆఫ్ కేరళ అని పిలుచుకుంటారు. అలప్పుజ జిల్లా పున్నప్ర గ్రామంలో 1923లో జన్మించిన వీఎస్ 11 ఏళ్లప్పుడే కన్నవారిని పోగొట్టుకున్నారు. మరుసటేడే స్కూలు మానేసి అన్న టైలరింగ్ షాపులో పనికి కుదురుకున్నారు. 15 ఏళ్ల వయసులో కాంగ్రెస్లో చేరారు. రెండేళ్ల తర్వాత సీపీఐలోకి మారి పారీ్టలో చకచకా ఎదిగారు. 1964లో సీపీఐ నుంచి బయటికొచ్చి సీపీఎంను ఏర్పాటు చేసిన 32 మంది నేతల్లో వీఎస్ ఒకరు. పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు వీఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. -
నాలుగోసారీ ఛేదించాం
మళ్లీ అదే వ్యూహం... అదే ఫలితం... పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం... ఆపై మెరుపు బ్యాటింగ్తో వేగంగా విజయాన్నందుకోవడం... 199, 272, 191, 256... ఇలా ప్రత్యర్థి స్కోర్లు మారడమే తప్ప భారత జట్టు ఆట మారలేదు... సమష్టి ప్రదర్శనతో సొంతగడ్డపై ప్రపంచకప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది... వరుసగా నాలుగో మ్యాచ్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా తమ విజయాల స్కోరును 4/4గా మార్చుకుంది... బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్పై సులువైన విజయంతో రోహిత్ బృందం సత్తా చాటింది. బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ నామమాత్రపు స్కోరుకు పరిమితం కాగా... రోహిత్, గిల్, కోహ్లి బ్యాటింగ్తో అలవోకగా భారత జట్టు లక్ష్యం చేరింది... చిన్నపాటి లక్ష్యంలో కూడా చివర్లో చెలరేగి కోహ్లి 48వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకోవడం మ్యాచ్లో హైలైట్. పుణే: తిరుగులేని ప్రదర్శనతో భారత్ వరల్డ్కప్లో మరో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. లిటన్ దాస్ (82 బంతుల్లో 66; 7 ఫోర్లు), తన్జీద్ హసన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 3 సిక్స్లు), మహ్ముదుల్లా (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ సాధించగా... గిల్ (55 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (40 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగారు. భారత్ ఆదివారం జరిగే తమ తర్వాతి పోరులో ధర్మశాలలో న్యూజిలాండ్తో తలపడుతుంది. ఓపెనర్ల జోరు... బంగ్లాకు ఓపెనర్లు తన్జీద్, దాస్ శుభారంభం అందించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. శార్దుల్ తొలి ఓవర్లో తన్జీద్ వరుసగా 6, 4, 6 బాదడంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. ఈ క్రమంలో 41 బంతుల్లో తన్జీద్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని కుల్దీప్ భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. అంతే...ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు వరుసగా విఫలమయ్యారు. 93/0తో ఒకదశలో పటిష్ట స్థితిలో కనిపించిన జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. నజు్మల్ (8), మిరాజ్ (3) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... 62 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న దాస్ వీరిని అనుసరించాడు. తౌహీద్ (16) బంతులు వృథా చేయగా, ముషి్ఫకర్ రహీమ్ (46 బంతుల్లో 38; 1 ఫోర్, 1 సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే మన పటిష్ట బౌలింగ్లో పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. చివర్లో మహ్ముదుల్లా ధాటిగా ఆడటంతో బంగ్లా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గాయం కారణంగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ప్రధాన పేసర్ తస్కీన్ అహ్మద్ ఈ మ్యాచ్కు దూరం కావడంతో ఆట ఆరంభానికి ముందే బంగ్లా బలహీన పడింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఎప్పటిలాగే రోహిత్ తనదైన శైలిలో దూకుడు చూపిస్తూ వరుస బౌండరీలతో దూసుకుపోయాడు. మరోవైపు నసుమ్ ఓవర్లో 2 సిక్స్లతో జోరు పెంచిన గిల్... ముస్తఫిజుర్ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. అయితే హసన్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన రోహిత్ తర్వాతి బంతికి అదే తరహా షాట్ ఆడబోయి వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి బాధ్యత తీసుకోగా... 52 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత గిల్ నిష్క్రమించాడు. చూడచక్కటి షాట్లు ఆడిన కోహ్లి 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... కోహ్లి, కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగా, వీరిని నిలువరించలేక బంగ్లా బౌలర్లు చేతులెత్తేశారు. 48 వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ (49) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు కోహ్లి మరో సెంచరీ దూరంలో ఉన్నాడు. రోహిత్ (31) మూడో స్థానంలో ఉన్నాడు. 4 వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఓ మ్యాచ్లో భారత జట్టుపై ఓపెనర్లిద్దరూ అర్ధ సెంచరీలు/సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు/సెంచరీలు చేసిన మూడు మ్యాచ్ల్లో భారత జట్టు ఓటమి చెందగా... నాలుగోసారి మాత్రం భారత్ గెలిచింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 51; లిటన్ దాస్ (సి) గిల్ (బి) జడేజా 66; నజ్ముల్ (ఎల్బీ) (బి) జడేజా 8; మిరాజ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 3; తౌహీద్ (సి) గిల్ (బి) శార్దుల్ 16; ముష్ఫికర్ (సి) జడేజా (బి) బుమ్రా 38; మహ్ముదుల్లా (బి) బుమ్రా 46; నసుమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 14; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; షరీఫుల్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–93, 2–110, 3–129, 4–137, 5–179, 6–201, 7–233, 8–248. బౌలింగ్: బుమ్రా 10–1–41–2, సిరాజ్ 10–0–60–2, పాండ్యా 0.3–0–8–0, కోహ్లి 0.3–0–2–0, శార్దుల్ 9–0–59–1, కుల్దీప్ 10–0–47–1, జడేజా 10–0–38–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) తౌహీద్ (బి) హసన్ 48; గిల్ (సి) మహ్ముదుల్లా (బి) మిరాజ్ 53; కోహ్లి (నాటౌట్) 103; అయ్యర్ (సి) మహ్ముదుల్లా (బి) మిరాజ్ 19; రాహుల్ (నాటౌట్) 34; ఎక్స్ట్రాలు 4; మొత్తం (41.3 ఓవర్లలో 3 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–88, 2–132, 3–178. బౌలింగ్: షరీఫుల్ 8–0–54–0, ముస్తఫిజుర్ 5–0–29–0, నసుమ్ 9.3–0–60–0, హసన్ 8–0–65–1, మిరాజ్ 10–0–47–2, మహ్మదుల్లా 1–0–6–0. ప్రపంచకప్లో నేడు ఆ్రస్టేలియా X పాకిస్తాన్ వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
షేక్ రషీద్ అజేయ శతకం
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఆంధ్ర 145 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. షేక్ రషీద్ (54 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్లు) అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడి అజేయ సెంచరీ చేశాడు. హనుమ విహారి (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రికీ భుయ్ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు), కరణ్ షిండే (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ధాటిగా ఆడారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర జట్టు బౌలర్లలో స్టీఫెన్ (3/10), కేవీ శశికాంత్ (2/2) రాణించారు. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 21న గుజరాత్తో ఆడుతుంది. -
కాన్వేతో కలిసి... గెలుపు ‘రచిన్’చాడు
గత ప్రపంచకప్ ఫైనల్కు ప్రతీకారమా అంటే సరిగ్గా ఈ మ్యాచ్కు ఆ విలువ లేకపోవచ్చు. కానీ ఇంగ్లండ్ను తాము చిత్తు చేసిన తీరు న్యూజిలాండ్కు మాత్రం పూర్తి సంతృప్తినిచ్చి ఉంటుంది. దుర్బేధ్యమైన జట్టు, ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు పేలవ బ్యాటింగ్ ఆపై పసలేని బౌలింగ్తో తమ స్థాయిపై సందేహాలు రేకెత్తించింది. కివీస్ మాత్రం అద్భుత ఆటతో తమపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని పడగొట్టి ఆపై సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్లో తాము ఆడిన తొలి మ్యాచ్ల్లోనే అజేయ మెరుపు సెంచరీలు సాధించి కాన్వే, రచిన్ రవీంద్ర మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు పేరిట గెలుపును లిఖించారు. రాహుల్+సచిన్ పేర్లను తన పేరులో ఉంచుకున్న రచిన్ అటు క్లాస్, ఇటు మాస్ ఆటను కూడా చూపించడం విశేషం. అహ్మదాబాద్: వన్డే వరల్డ్ కప్ తొలి పోరు ఏకపక్షంగా ముగిసింది. 2019 ఫైనలిస్ట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్ (86 బంతుల్లో 77; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, జోస్ బట్లర్ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం కివీస్ 36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్కు అభేద్యంగా 273 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో రెండో వికెట్కు న్యూజిలాండ్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గప్టిల్ –విల్ యంగ్ పేరిట ఉన్న 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని కాన్వే–రచిన్ సవరించారు. కీలక భాగస్వామ్యం... బలమైన లైనప్, చివరి ఆటగాడి వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఇంగ్లండ్ను చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. తొలి ఓవర్ రెండో బంతినే బెయిర్స్టో (35 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) సిక్సర్గా మలిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో ‘సిక్స్’తో స్కోరు మొదలు కావడం ఇదే తొలిసారి. అయితే ప్రత్యరి్థని కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. మలాన్ (14) విఫలం కాగా, ఆ తర్వాత తక్కువ వ్యవధిలో కివీస్ మరో 3 వికెట్లు పడగొట్టింది. రవీంద్ర ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన బ్రూక్ (25) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. ఈ దశలో రూట్, బట్లర్ ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 72 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని హెన్రీ విడదీశాక ఇంగ్లండ్ వేగంగా వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్లో ఎవరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో స్కోరు కనీసం 300 పరుగులకు చేరువగా కూడా రాలేదు. వన్డే చరిత్రలో ఆడిన 11 మందీ కనీసం రెండంకెల స్కోరు చేయడం ఇదే మొదటిసారి కాగా... ప్రతీ ఒక్కరు అంతంతమాత్రంగానే ఆడటంతో ఇంగ్లండ్కు ఫలితం దక్కలేదు. ఆడుతూ పాడుతూ... స్యామ్ కరన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే యంగ్ (0) అవుట్! దాంతో కివీస్ ఎలా లక్ష్యాన్ని ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ కాన్వే, రవీంద్ర అసలు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెరీర్లో 13వ వన్డే ఆడుతూ తొలిసారి ఓపెనర్గా బరిలోకి దిగిన రవీంద్ర పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడగా, ఐపీఎల్ అనుభవాన్ని కాన్వే అద్భుతంగా వాడుకున్నాడు. వీరిద్దరు ప్రత్యర్థిపై బౌలర్లందరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. 10 ఓవర్లలోనే స్కోరు 81 పరుగులకు చేరగా, చెరో 36 బంతుల్లోనే రవీంద్ర, కాన్వే అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిని కట్టడి చేయడంలో ఇంగ్లండ్ విఫలం కావడంతో 20 ఓవర్లకే స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఈ జోడి ఎదురులేకుండా దూసుకుపోయింది. ముందుగా కాన్వే 83 బంతుల్లో, ఆ తర్వాత రవీంద్ర 82 బంతుల్లో శతకాలను అందుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోగా... కివీస్ సునాయాసంగా లక్ష్యం చేరింది. విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో లాథమ్ కెప్టెన్గా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్స్టో (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 33; మలాన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; రూట్ (బి) ఫిలిప్స్ 77; బ్రూక్ (సి) కాన్వే (బి) రవీంద్ర 25; మొయిన్ అలీ (బి) ఫిలిప్స్ 11; బట్లర్ (సి) లాథమ్ (బి) హెన్రీ 43; లివింగ్స్టోన్ (సి) హెన్రీ (బి) బౌల్ట్ 20; కరన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; వోక్స్ (సి) యంగ్ (బి) సాన్ట్నర్ 11; ఆదిల్ రషీద్ (నాటౌట్) 15; వుడ్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–40, 2–64, 3–94, 4–118, 5–188, 6–221, 7–229, 8–250, 9–252. బౌలింగ్: బౌల్ట్ 10–1–48–1, హెన్రీ 10–1–48–3, సాన్ట్నర్ 10–0–37–2, నీషమ్ 7–0–56–0, రవీంద్ర 10–0–76–1, ఫిలిప్స్ 3–0–17–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (నాటౌట్) 152; యంగ్ (సి) బట్లర్ (బి) కరన్ 0; రచిన్ రవీంద్ర (నాటౌట్) 123; ఎక్స్ట్రాలు 8; మొత్తం (36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–10. బౌలింగ్: వోక్స్ 6–0–45–0, స్యామ్ కరన్ 6–2–47–1, వుడ్ 5–0–55–0, అలీ 9.2–0–60–0, రషీద్ 7–0–47–0, లివింగ్స్టోన్ 3–0–24–0. ప్రపంచకప్లో నేడు పాకిస్తాన్ X నెదర్లాండ్స్ వేదిక: హైదరాబాద్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
11వ శతాబ్దం నాటి విగ్రహం చోరీ
చంద్రగిరి (తిరుపతి జిల్లా): రాయల కాలం నాటి పురాతన విగ్రహాన్ని రాత్రికి రాత్రి చోరీ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థానంలో నకిలీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్కియాలజీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి రాయలవారి కోట ప్రాంగణంలో క్రీ.శ.11వ శతాబ్ధానికి చెందిన రాతి గోడలో అప్పటి రాజులు వినాయక స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే ఇటీవల ఆ విగ్రహంపై కన్నెసిన గుర్తు తెలియని కేటుగాళ్లు చోరీ చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అదే ప్రదేశంలో నకిలీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాతన విగ్రహం లోపల భాగంలో నిధులుంటాయని, వాటిని సొంతం చేసుకోవడానికే విగ్రహాన్ని చోరీ చేసి ఉంటారని ప్రచారం చక్కర్లు కొడుతోంది. -
Ind Vs Ban: భారత్కు బంగ్లా షాక్.. టీమిండియాకు తప్పని ఓటమి
కొలంబో: ఆసియా కప్లో అనూహ్య ఫలితం... ‘సూపర్–4’ దశలో రెండు ఘన విజయాలతో ముందే ఫైనల్ స్థానం ఖాయం చేసుకున్న భారత్కు చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఎదురైంది. ప్రాధాన్యత లేని మ్యాచ్లో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బరిలోకి దిగిన టీమిండియా చివరకు ఓటమి పక్షాన నిలిచింది. అయితే ఈ గెలుపు బంగ్లాదేశ్ ప్రదర్శనను తక్కువ చేసేది కాదు. ముందే ఫైనల్ రేసు నుంచి నిష్కమించినా చివరి వరకు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు చెప్పుకోదగ్గ విజయంతో స్వదేశానికి వెళ్లనుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. ఆసియా కప్లో గతంలో ఒకే ఒకసారి భారత్ను (2012)ఓడించిన బంగ్లాకు ఇది రెండో విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (85 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్స్లు), తౌహీద్ హృదయ్ (81 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్లు), నసుమ్ అహ్మద్ (45 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 49 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబ్, తౌహీద్ ఐదో వికెట్కు 101 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో శార్దుల్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. శుబ్మన్ గిల్ (133 బంతుల్లో 121; 8 ఫోర్లు, 5 సిక్స్లు) కెరీర్లో ఐదో సెంచరీతో చెలరేగాడు. ప్రతికూల పరిస్థితుల్లో స్పిన్కు బాగా అనుకూలిస్తున్న పిచ్పై అతను పట్టుదల కనబర్చి నిలబడ్డాడు. అయితే ఇతర బ్యాటర్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. చివర్లో అక్షర్ పటేల్ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా లాభం లేకపోయింది. ముస్తఫిజుర్ 3 వికెట్లు తీయగా... అరంగేట్ర బౌలర్ తన్జీమ్, మెహదీ హసన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్తో హైదరాబాదీ ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ వన్డేల్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 252వ ఆటగాడిగా తిలక్ నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందే తిలక్ 7 టి20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (బి) శార్దుల్ 13; లిటన్ దాస్ (బి) షమీ 0; అనాముల్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 4; షకీబ్ (బి) శార్దుల్ 80; మిరాజ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 13; తౌహీద్ (సి) తిలక్ (బి) షమీ 54; షమీమ్ (ఎల్బీ) (బి) జడేజా 1; నసుమ్ (బి) ప్రసిధ్ 44; మెహదీ హసన్ (నాటౌట్) 29; తన్జీమ్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–13, 2–15, 3–28, 4–59, 5–160, 6–161, 7–193, 8–238. బౌలింగ్: షమీ 8–1–32–2, శార్దుల్ 10–0–65–3, ప్రసిధ్ 9–0–43–1, అక్షర్ పటేల్ 9–0–47–1, తిలక్ 4–0–21–0, జడేజా 10–1–53–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అనాముల్ (బి) తన్జీమ్ 0; గిల్ (సి) తౌహీద్ (బి) మెహదీ 121; తిలక్ (బి) తన్జీమ్ 5; కేఎల్ రాహుల్ (సి) షమీమ్ (బి) మెహదీ 19; ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) మిరాజ్ 5; సూర్యకుమార్ (బి) షకీబ్ 26; జడేజా (బి) ముస్తఫిజుర్ 7; అక్షర్ (సి) తన్జీద్ (బి) ముస్తఫిజుర్ 42; శార్దుల్ (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 11; షమీ (రనౌట్) 6; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–2, 2–17, 3–74, 4–94, 5–139, 6–170, 7–209, 8–249, 9–254, 10–259. బౌలింగ్: తన్జీమ్ 7.5–1–32–2, ముస్తఫిజుర్ 8–0–50–3, నసుమ్ 10–0–50–0, షకీబ్ 10–2–43–1, మెహదీ హసన్ 9–1–50–2, మిరాజ్ 5–0–29–1. -
హండ్రెడ్ లీగ్లో చారిత్రక శతకం.. ఇంగ్లండ్ ఓపెనర్ ఖాతాలో రికార్డు
హండ్రెడ్ లీగ్లో చారిత్రక శతకం నమోదైంది. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ట్యామీ బేమౌంట్ లీగ్ హిస్టరీలోనే (పురుషులు, మహిళలు) అత్యధిక స్కోర్ (118) నమోదు చేసింది. ట్రెంట్ రాకెట్స్తో నిన్న (ఆగస్ట 14) జరిగిన మ్యాచ్లో వెల్ష్ఫైర్ ఓపెనర్ బేమౌంట్ 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. హండ్రెడ్ లీగ్ పురుషులు, మహిళల విభాగాల్లో ఇదే అత్యధిక స్కోర్ కాగా.. ఈ లీగ్ మహిళల విభాగంలో ఇదే మొట్టమొదటి సెంచరీ కావడం విశేషం. బేమౌంట్.. ఓవల్ ఇన్విన్సిబుల్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ అత్యధిక స్కోర్ (108) రికార్డును బద్దలుకొట్టి లీగ్ రికార్డ్స్లో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకుంది. రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ఫైర్.. బేమౌంట్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. మహిళల హండ్రెడ్ లీగ్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్ కావడం మరో విశేషం. వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్లో బేమౌంట్ రికార్డు సెంచరీతో కదం తొక్కగా.. డంక్లీ (24), సారా బ్రైస్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాకెట్స్ బౌలర్లలో క్రీస్టీ గార్డన్ 2, అలానా కింగ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. ఫ్రేయా డేవిస్ (2/19), అలెక్స్ హార్ట్లీ (1/28), షబ్నిమ్ ఇస్మాయిల్ (1/23), సోఫియా డంక్లీ (1/16) రాణించడంతో 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా వెల్ష్ ఫైర్ 41 పరుగుల తేడాతో గెలపొంది, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాకెట్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ స్మిత్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. లిజెల్ లీ (26), హర్మాన్ప్రీత్ కౌర్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
లబుషేన్ సెంచరీ.. పోరాడుతున్న ఆస్ట్రేలియా
మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆ్రస్టేలియాకు శనివారం వర్షం రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక ఆ జట్టు మ్యాచ్ చివరి రోజు ఆదివారం కూడా వాన కురవడంపై కూడా ఆశలు పెట్టుకోవాలి! 162 పరుగులు వెనుకబడి ఓవర్నైట్ స్కోరు 113/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పట్టుదలగా ఆడిన మార్నస్ లబుషేన్ (173 బంతుల్లో 111; 10 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్ మార్ష్ (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 103 పరుగులు జోడించారు. వాన కారణంగా శనివారం మొత్తం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, ఆస్ట్రేలియా మరో 101 పరుగులు జత చేసింది. అయితే ఆసీస్ ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. చివరి రోజు మిగిలిన ఐదు వికెట్లతో మరికొన్ని పరుగులు సాధించడంతో పాటు వర్షం కూడా అంతరాయం కలిగిస్తే ‘డ్రా’కు అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ్రస్టేలియా ‘యాషెస్’ను నిలబెట్టుకుంటుంది. -
సాయి సుదర్శన్ అజేయ సెంచరీ
కొలంబో: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 క్రికెట్ టోర్నీ లీగ్ దశలో భారత్ ‘ఎ’ జట్టు అజేయంగా నిలిచింది. పాకిస్తాన్ ‘ఎ’తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ‘ఎ’ 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఖాసిమ్ అక్రమ్ (48; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్వర్ధన్ హంగార్గేకర్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు, మానవ్ సుథర్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత ‘ఎ’ జట్టు 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు) పాక్ బౌలర్ల భరతంపట్టి అజేయ సెంచరీ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ తొలి వికెట్కు అభిõÙక్ శర్మ (20; 4 ఫోర్లు)తో 58 పరుగులు... రెండో వికెట్కు నికిన్ జోస్ (64 బంతుల్లో 53; 7 ఫోర్లు)తో 99 పరుగులు... మూడో వికెట్కు కెపె్టన్ యశ్ ధుల్ (21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో 53 పరుగులు జోడించాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం పొందింది. నాలుగు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో శ్రీలంక ‘ఎ’తో పాకిస్తాన్ ‘ఎ’; బంగ్లాదేశ్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడతాయి. ఫైనల్ 23న జరుగుతుంది. -
తొలి రోజే ‘తల’పోటు...
పిచ్పై తేమ, కాస్త పచ్చిక, ఆకాశం మేఘావృతం... అన్నీ పేస్ బౌలింగ్కు అనుకూలించే పరిస్థితులే. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. ఈ స్థితిలో ఏ కెప్టెనైనా ఏం చేస్తాడో అతను కూడా అదే చేస్తూ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలో షమీ, సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే ఫీల్డింగ్ ఎంచుకున్న నిర్ణయం సరైందనిపించింది... ఒక గంట గడిచింది. వాతావరణం అంతా మారిపోయింది... పిచ్ ఒక్కసారిగా బ్యాటర్ల పక్షాన చేరింది... హెడ్, స్మిత్ దీనిని అద్భుతంగా వాడుకున్నారు. సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేశారు. మెరుపు వేగంతో ఆడిన హెడ్ సెంచరీతో చెలరేగగా, స్మిత్ శతకానికి చేరువయ్యాడు. చివరి సెషన్లోనైతే మన బౌలర్లు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి... డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో తొలి రోజు పూర్తిగా ఆ్రస్టేలియాదే. రెండో రోజు వారిని నిలువరించలేకపోతే భారత్ ఈ టెస్టుపై ఆశలు కోల్పోవాల్సిందే! లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మొదటి రోజును ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. భారత్తో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (156 బంతుల్లో 146 బ్యాటింగ్; 22 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (227 బంతుల్లో 95 బ్యాటింగ్; 14 ఫోర్లు) చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అభేద్యంగా 251 పరుగులు జోడించారు. భారత తుది జట్టులో అశ్విన్కు స్థానం దక్కకపోగా, కీపర్గా భరత్కే చోటు లభించింది. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి కోసం టీమిండియా ఆటగాళ్లు మౌనం పాటించగా, ఇరు జట్ల క్రికెటర్లు నల్లబ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. రాణించిన వార్నర్... పేసర్లు షమీ, సిరాజ్ పదునైన బంతులతో ఆసీస్ ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మొదటి మూడు ఓవర్లు మెయిడిన్ కాగా, తర్వాతి ఓవర్లో ఫలితం దక్కింది. సిరాజ్ బంతిని ఆడలేక ఉస్మాన్ ఖ్వాజా (10 బంతుల్లో 0) కీపర్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి గంటలో 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 29 పరుగులే చేసింది. చెరో 2 ఓవర్లు వేసిన షమీ, సిరాజ్ వేసిన అనేక బంతులు వార్నర్ (60 బంతుల్లో 43; 8 ఫోర్లు), లబుషేన్ (62 బంతుల్లో 26; 3 ఫోర్లు) శరీరానికి తాకాయి. అయితే ఇద్దరు బ్యాటర్లు పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ను నడిపించారు. ఉమేశ్ ఓవర్లో నాలుగు ఫోర్లు బాది జోరు ప్రదర్శించిన వార్నర్ ఆ తర్వాతా దానిని కొనసాగించాడు. ఆసీస్ పటిష్ట స్థితికి చేరుతున్న దశలో శార్దుల్ భారత్కు కీలక వికెట్ అందించాడు. లంచ్ సమయానికి కాస్త ముందు లెగ్సైడ్ వెళుతున్న బంతిని వార్నర్ వెంటాడగా భరత్ అద్భుతంగా అందుకున్నాడు. వార్నర్, లబుషేన్ రెండో వికెట్కు 69 పరుగులు జోడించారు. విరామం తర్వాత షమీ చక్కటి బంతితో లబుషేన్ ను బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారీ భాగస్వామ్యం... ఐదు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా ఆనందాన్ని తర్వాతి భాగస్వామ్యం పూర్తిగా దెబ్బ కొట్టింది. స్మిత్, హెడ్ కలిసి ఇన్నింగ్స్ను నిర్మించారు. తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లోనే 6 ఫోర్లతో దూకుడు చూపించిన హెడ్ 60 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, రెండో సెషన్లో భారత్కు వికెట్ దక్కలేదు. చివరి సెషన్లోనూ ఈ జంట మరింత పట్టుదలగా ఆడింది. 144 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే హెడ్ 106 బంతుల్లోనే కెరీర్లో ఆరో శతకాన్ని అందుకున్నాడు. ఇదే ఊపులో భాగస్వామ్యం 200 పరుగులు దాటగా, భారత బృందం బేలగా చూస్తుండిపోయింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) శార్దుల్ 43; ఖ్వాజా (సి) భరత్ (బి) సిరాజ్ 0; లబుషేన్ (బి) షమీ 26; స్మిత్ (బ్యాటింగ్) 95; హెడ్ (బ్యాటింగ్) 146; ఎక్స్ట్రాలు 17; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 327. వికెట్ల పతనం: 1–2, 2–71, 3–76. బౌలింగ్: షమీ 20–3–77–1, సిరాజ్ 19–4– 67–1, ఉమేశ్ 14–4–54–0, శార్దుల్ 18–2– 75–1, జడేజా 14–0–48–0. -
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
ధోని కప్.. గిల్ సెంచరీ.. ఫైనల్ పై ఉత్కంఠ..
-
SRHvsRCB : కింగ్ కోహ్లితో అట్లుంటది మరి.. హైదరాబాద్ అంటే పూనకాలే (ఫొటోలు)
-
ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఉలిక్కిపడేలా చేసింది. 15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి బంగ్లాను నిర్మించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పలు రాజకీయా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సత్యరమే చర్చలు తీసుకోమని డిమాండ్ చేశాయి. ఈ అనూహ్య ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఢిల్లీలో జల్ విహార్లో 15వ శతాబ్దపు రాజభవనం(ప్యాలెస్) ఉంది. ఆ ప్యాలెస్లో ఢిల్లీ జల్ బోర్ మాజీ చీఫ్ ఉదిత్ ప్రకాశ్ రాయ్ అతని కుటుంబం ఉంటోంది. వాస్తవానికి ఈ స్మారక కట్టడం పఠాన్ కాలం నాటి రాజభవనం, ఇది సయ్యద్ రాజవంశానికి చెందిన ఖిజర్ ఖాన్ స్థాపించిన ఖిజ్రాబాద్ నగరానికి గుర్తుగా మిగిలిన కట్టడం. ఇది ఢిల్లీ జల్ బోర్డు పరిధిలో ఉంది. ఐతే 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, అతని కుటుంబం ఇందులో ఉంటోంది. కానీ ఆయన ప్రస్తుతం మిజోరాంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్యాలెస్ను ఖాళీ చేయాల్సిందిగా బుధవారం విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ అతని కుటుంబం అక్కడే నివశిస్తుంది. నిజానికి ఈ స్మారక కట్టడాన్ని జల్ బోర్డు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించాల్సి ఉంది. ఐతే జనవరిలో అధికారుల సంయుక్త సోదాల్లో అది మిస్ అయ్యినట్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో పేర్కొంది. అంతేగాదు 2021 జనవరిలో ఈ ప్యాలెస్ను అప్పగించాలని పురావస్తు శాఖ కోరిందని, ఐతే దాన్ని జరగనివ్వకుండా ఉదిత్ ప్రకాశ్ రాయ్ అడ్డుకున్నారని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ప్రదేశంలో అది పెద్ద విస్తీర్ణంలో కోట లాంటి నిర్మాణం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఐతే దాని ప్లేస్లో బంగ్లా నిర్మించినట్లు సమాచారం. సమీపంలో అందుకు సంబంధించి శిథిలాల భాగాలు కూడా కనిపించాయి. దీంతో ఈ ఘటనపై తక్షణమై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్తో సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. కాగా, ఇలాంటి దిగ్భ్రాంతి కర ఘటన భారత్లోనే జరిగింది, ఈ ఘటనతో భారత పురావస్తు, సాంస్కృతిక శాఖలు మరోసారి నిద్రపోతున్నాయనే అనే విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈ మేరకు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని దుయ్యబడుతూ..దీనిపై విచారణ జరిపించాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. (చదవండి: అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు 50 కేజీల మందుపాతరకు బలి) -
BGT 2023: కరువు తీరింది... సెంచరీల దరువు! ఈసారి శుబ్మన్ వంతు
India vs Australia, 4th Test- అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు పరుగుల కరువును తీర్చడమే కాదు... సెంచరీల దరువుతో సాగుతోంది. మోదీ స్టేడియంలో వరు సగా మూడో రోజూ శతకం నమోదైంది. భారత ఓపెనర్ శుబ్మన్ గిల్ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, 1 సిక్స్) మూడంకెల స్కోరు చేయడంతో భారత్ దీటైన జవాబిస్తోంది. శనివారం ఆట నిలిచే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 99 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఇంకా 191 పరుగులు వెనుకబడినప్పటికీ భారత్ చేతిలో 7 వికెట్లుండటం సానుకూలాంశం. అన్నింటికి మించి చాన్నాళ్ల తర్వాత విరాట్ కోహ్లి (128 బంతుల్లో 59 బ్యాటింగ్; 5 ఫోర్లు) టెస్టుల్లో అర్ధసెంచరీతో ఆకట్టుకోవడం భారత శిబిరంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రోహిత్ నిరాశ ఓవర్నైట్ స్కోరు 36/0తో ఆట కొనసాగించిన భారత ఇన్నింగ్స్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ 11 ఓవర్లపాటు నడిపించారు. అయితే క్రీజ్లో నిలదొక్కుకొని భారీ స్కోరు చేసేలా కనిపించిన దశలో కెప్టెన్ రోహిత్ (58 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటై నిరాశగా పెవిలియన్ చేరాడు. కునెమన్ ఈ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత గిల్, పుజారా కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. 90 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తయింది. కెపె్టన్ స్మిత్ స్పిన్నర్లు, పేసర్లను అదేపనిగా మార్చినా లాభం లేకపోయింది. 129/1 స్కోరు వద్ద లంచ్ విరామానికి వెళ్లగా, తొలిసెషన్లో భారత్ వికెట్ నష్టానికి 93 పరుగులు చేయగలిగింది. కోహ్లి అర్ధసెంచరీ క్రీజులో పాతుకుపోయినప్పటికీ పుజారాతో పాటు శుబ్మన్ కూడా అనవసర షాట్ల జోలికెళ్లకుండా బ్యాటింగ్ చేశారు. ఈ సెషన్లో ఇద్దరు నింపాదిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. కానీ ఆసీస్ శిబిరాన్ని గిల్–పుజారా జోడి నిరాశలో ముంచింది. ఇదే క్రమంలో గిల్ 194 బంతుల్లో టెస్టుల్లో రెండో శతకాన్ని సాధించాడు. ఈ ఏడాది జోరుమీదున్న గిల్ ఈ రెండున్నర నెలల్లోపే ఐదో సెంచరీ (మూడు ఫార్మాట్లలో కలిపి) సాధించడం విశేషం. మరో వైపు పుజారా (121 బంతుల్లో 42; 3 ఫోర్లు) అర్ధ సెంచరీకి చేరువవుతున్న దశలో మర్ఫీ అతన్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పుజారా రివ్యూ చేసినా లాభం లేకపోయింది. దీంతో రెండో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి క్రీజులోకి రాగా 188/2 స్కోరు వద్ద టీ బ్రేక్కు వెళ్లారు. ఆ తర్వాత ఆఖరి సెషన్లో గిల్, కోహ్లిలు తమదైన శైలిలో ఆ్రస్టేలియా బౌలర్లను ఎదుర్కొన్నారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 58 పరుగులు జతచేశాక జట్టు స్కోరు 245 పరుగుల వద్ద లయన్... శుబ్మన్ సుదీర్ఘ ఇన్నింగ్స్కు తెరదించాడు. అతన్ని ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. గిల్ ని్రష్కమించినప్పటికీ మూడో సెషన్లో భారత్కు ఇబ్బంది ఎదురు కాలేదు. జడేజా, కోహ్లిల జోడీ కుదురుకోవడంతో ఈ సెషన్లోనే 101 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే విరాట్ 107 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో అర్ధసెంచరీ తర్వాత మళ్లీ ఇంతకాలానికి అతను ఫిఫ్టీ బాదాడు. ఈ 14 నెలల వ్యవధిలో ఇంటా బయటా 8 టెస్టులాడిన విరాట్ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. ఆట నిలిచే సమయానికి కోహ్లి, జడేజా (16 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480 భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) లబుõషేన్ (బి) కునెమన్ 35; గిల్ (ఎల్బీ) (బి) లయన్ 128; పుజారా (ఎల్బీ) (బి) మర్ఫీ 42; కోహ్లి బ్యాటింగ్ 59; జడేజా బ్యాటింగ్ 16; ఎక్స్ట్రాలు 9; మొత్తం (99 ఓవర్లలో 3 వికెట్లకు) 289. వికెట్ల పతనం: 1–74, 2–187, 3–245. బౌలింగ్: స్టార్క్ 17–2–74–0, గ్రీన్ 10–0–45–0, లయన్ 37–4–75–1, కునెమన్ 13–0–43–1, మర్ఫీ 22–6–45–1. -
మార్క్రమ్ సెంచరీ: దక్షిణాఫ్రికా 314/8
వెస్టిండీస్ జట్టుతో సెంచూరియన్లో మంగళవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 82 ఓవర్లలో 8 వికెట్లకు 314 పరుగులు సాధించింది. ఓపెనర్లలో మార్క్రమ్ (174 బంతుల్లో 115; 18 ఫోర్లు) సెంచరీ సాధించగా... డీన్ ఎల్గర్ (118 బంతుల్లో 71; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్కు 141 పరుగులు జోడించారు. మార్కో జాన్సెన్ (17 బ్యాటింగ్; 3 ఫోర్లు), కోట్జీ (11 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జారి జోసెఫ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. -
దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్.. సీజన్లో మూడో సెంచరీ
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో తన ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోయినప్పటికి తన పరుగుల ప్రవాహం మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నాడు. వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ తాజాగా ఈ సీజన్లో మూడో సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు చూసుకుంటే గత 23 రంజీ ఇన్నింగ్స్ల్లో సర్ఫరాజ్ఖాన్కు ఇది పదో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు సర్ఫరాజ్ ఆరు మ్యాచ్లాడి 556 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఎలైట్ గ్రూప్-బిలో ఢిల్లీతో మ్యాచ్లో మంగళవారం సర్ఫరాజ్ సెంచరీ ఫీట్ సాధించాడు. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై ఓపికగా నిలబడి బ్యాటింగ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ 135 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం అందుకున్నాడు. 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును సర్ఫరాజ్ ఆదుకున్నాడు. సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నప్పటికి తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ముంబై తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 124, తనుష్ కొటెయిన్ క్రీజులో ఉన్నారు. Yet another 100 for Sarfaraz Khan. In testing conditions too at the Kotla pic.twitter.com/LkUWraNlHD — Vikrant Gupta (@vikrantgupta73) January 17, 2023 Sarfaraz Khan has 10 centuries in his last 23 innings in Ranji Trophy. Crazy run for Sarfaraz, he's insane! pic.twitter.com/xq3bTpnKHs — Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2023 చదవండి: స్టీవ్ స్మిత్కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు ఉప్పల్లో మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే! -
71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు
టీమిండియా సూపర్స్టార్.. కింగ్ కోహ్లి ఈ ఏడాదిని అద్భుతంగా ఆరంభించాడు. కొత్త ఏడాది ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలోనే రెండు శతకాలు కొట్టి తన ఫామ్ను కొనసాగించాడు. 74వ సెంచరీతో.. శతకాల వేట కొనసాగిస్తున్న కోహ్లి.. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్కప్లోనూ ఇదే ఫామ్ను కంటిన్యూ చేసి కప్ను అందుకోవాలని కోరుకుందాం. అయితే గడిచిన మూడేళ్లు కోహ్లికి గడ్డుకాలం. 2019లో చివరిసారి సెంచరీ సాధించిన కోహ్లి.. మూడేళ్ల పాటు ఒక్క సెంచరీ అందుకోలేకపోయాడు. ఒకానక దశలో సెంచరీ కాదు కదా కనీసం అర్థ సెంచరీ మార్క్ అందుకోవడంలోనూ విఫలం కావడంతో అతని ఆటపై సందేహాలు నెలకొన్నాయి.కోహ్లి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందంటూ విమర్శనాస్రాలు సంధించారు. ఇక కోహ్లి అభిమానులైతే అతని సెంచరీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఆ అభిమానం ఎంతదూరం వెళ్లిదంటే.. కొంతమంది అభిమానులు కోహ్లి సెంచరీ కొట్టేవరకు తమ టూర్లను వాయిదా వేసుకోవడం.. లేదంటే గడ్డం చేసుకోకపోవడం.. గర్ల్ఫ్రెండ్స్తో డేట్కు వెళ్లమని శపథాలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక అభిమాని చర్య విపరీతంగా వైరల్ అయింది. కోహ్లి 71వ సెంచరీ(మూడు ఫార్మాట్లు కలిపి) చేసేవరకు తాను పెళ్లి చేసుకోనంటూ సదరు అభిమాని టీమిండియా మ్యాచ్ సందర్భంగా మైదానంలో ప్లకార్డు పట్టుకొని కనిపించాడు. అన్నట్లుగానే కోహ్లి సెంచరీ సాధించేవరకు పెళ్లి చేసుకోలేదు. అయితే గతేడాది ఆసియాకప్ సందర్భంగా అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి 71వ సెంచరీ అందుకున్నాడు. దీంతో అభిమాని కల నెరవేరినప్పటికి పెళ్లికి ముహుర్తాలు లేకపోవడంతో నాలుగు నెలలు ఆగాల్సి వచ్చింది. అయితే ఈ గ్యాప్లోనే కోహ్లి మరో రెండు సెంచరీలు బాది ఆ సంఖ్యను 74కు పెంచుకున్నాడు.యాదృశ్చికంగా కోహ్లి 74వ సెంచరీ కొట్టిన రోజునే సదరు అభిమాని వివాహం జరిగింది. ఇంకేముంది తన అభిమాని ఆటగాడు సెంచరీ చేసిన రోజునే తన పెళ్లి కూడా జరగడంతో అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. అందుకే పెళ్లి తంతు ముగియగానే అదే పెళ్లి బట్టల్లో సరాసరి ఇంటికి వచ్చి కోహ్లి సెంచరీ ఫీట్ను టీవీలో చూస్తూ పరవశించిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. ఇక కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్లోనే రెండు సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో కోహ్లి 46 సెంచరీలు బాదాడు. సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం మూడు సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. కోహ్లి ఇప్పుడున్న ఫామ్ దృశ్యా అది పెద్ద కష్టమేమి అనిపించడం లేదు. ఇక న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న దృశ్యా కోహ్లి మరో సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్ల మధ్య బుధవారం(జనవరి 18న) ఉప్పల్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఉప్పల్ మైదానంలో కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. గతేడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో ఉప్పల్లో జరిగిన టి20 మ్యాచ్లో కోహ్లి (63 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. King Kohli with his 74th international hundred - the GOAT. pic.twitter.com/B93e7X1vYL — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2023 చదవండి: షార్ట్ టెంపర్కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం న్యూజిలాండ్తో తొలి వన్డే.. సూర్యకుమార్కు నో ఛాన్స్! కిషన్కు చోటు -
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
వేగంగా ‘సెంచురీ ప్యానల్స్’ నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యానల్స్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు కావడంతో సెంచురీ ఫ్లై సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021, డిసెంబర్ 24న భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్ తొలి దశ పనులను 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత తమిళనాడులో ఈ యూనిట్ను నెలకొల్పాలని భావించామని, కానీ ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తుండటంతో గోపవరం వద్ద ఏర్పాటుచేస్తున్నట్లు సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా శంకుస్థాపన సమయంలో ప్రకటించారు. తొలుత రూ.600 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయాలని భావించామని, కానీ ఇప్పుడు రూ.1,600 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గోపవరం వద్ద ఈ యూనిట్ ఏర్పాటు వల్ల కలప ఆధారిత అనుబంధ పరిశ్రమలు మరిన్ని వస్తాయని, తద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం -
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. 45 బంతుల్లోనే సెంచరీ
శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో కేవలం 45 బంతుల్లోనే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 112 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 9 సిక్స్లు, 7 ఫోర్లు ఉన్నాయి. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి లంక బౌలర్లకు సూర్య భాయ్ చుక్కలు చూపించాడు. ఈ మిస్టర్ 360 మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఇక ఓవరాల్గా సూర్యకు ఇది మూడో అంతర్జాతీయ సెంచరీ. అయితే మూడు సెంచరీలు కూడా టీ20ల్లో సాధించడం విశేషం. కాగా ఏడాది సూర్యకుమార్కు ఇది తొలి సెంచరీ. కాగా సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్
Australia vs South Africa, 2nd Test- David Warner : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో మెరిశాడు. దాదాపుగా గత మూడేళ్లుగా శతకం సాధించలేక విమర్శలపాలైన అతడు.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. అంతేకాదు ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో ఆసీస్.. సౌతాఫ్రికాతో తలపడుతోంది. ఇందులో భాగంగా రెండో మ్యాచ్లోనూ తుది జట్టులో చోటు దక్కించుకున్న వార్నర్కు ఇది 100వ టెస్టు. ఈ క్రమంలో మంగళవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ బౌలింగ్లో ఫోర్ బాది 100 పరుగుల మార్కు అందుకున్నాడు వార్నర్. అరుదైన ఘనతలు ఈ నేపథ్యంలో కెరీర్లో 25వ టెస్టు సెంచరీ నమోదు చేసిన వార్నర్.. దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. ఆడిన 100వ టెస్టులో శతకం సాధించిన 10వ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. అంతేగాక ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్గా నిలిచాడు. అంతకుముందు రిక్కీ పాంటింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఎనిమిదో ఆసీస్ ప్లేయర్గా వార్నర్ ఘనత వహించాడు. 100వ టెస్టులో సెంచరీ సాధించిన బ్యాటర్లు ►కోలిన్ కౌడ్రే- 104- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా- 1968 ►జావేద్ మియాందాద్- 145- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 1989 ►గోర్డాన్ గ్రీనిడ్జ్- 149- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్- 1990 ►అలెక్స్ స్టెవార్ట్- 105- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్-2000 ►ఇంజమాముల్ హక్ - 184- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2005 ►రిక్కీ పాంటింగ్- 120 , 143 నాటౌట్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- 2006 ►గ్రేమ్ స్మిత్- 131- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్- 2012 ►హషీం ఆమ్లా- 134- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంక- 2017 ►జో రూట్- 218- ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా- 2021 ►డేవిడ్ వార్నర్- 100 నాటౌట్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, 2022 చదవండి: Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే Ind Vs Ban: టీమిండియా దిగ్గజానికి మాతృ వియోగం.. సంతాపం ప్రకటిస్తూనే.. హ్యాట్సాఫ్ చెబుతూ 💯 in Test 💯! Well played, David Warner! #PlayOfTheDay#AUSvSA | @nrmainsurance pic.twitter.com/DsgFyoBvLR — cricket.com.au (@cricketcomau) December 27, 2022 -
AUS VS WI: లబుషేన్ హ్యాట్రిక్ సెంచరీ.. ట్రెవిస్ హెడ్ సెంచరీ
వెస్టిండీస్తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఆట తొలిరోజునే విండీస్ బౌలర్లను ఉతికారేస్తూ ఇద్దరు ఆసీస్ బ్యాటర్లు సెంచరీలతో అజేయంగా నిలిచారు. తొలిరోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(120 బ్యాటింగ్), ట్రెవిస్ హెడ్(114 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకముందు ఉస్మాన్ ఖవాజా 62 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో డెవన్ థామస్, అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్ తలా ఒక వికెట్ తీశారు. ఇక మార్నస్ లబుషేన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్ను కనబరుస్తున్నాడు. ఈ సిరీస్లో లబుషేన్కు ఇది మూడో సెంచరీ. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలు సాధించిన లబుషేన్ తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ సెంచరీ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. -
తండ్రికి తగ్గ తనయుడు.. తొలి పర్యటనలోనే సెంచరీ బాదిన చంద్రపాల్ కొడుకు
Shivnarine Chanderpaul: వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్నరైన్ చంద్రపాల్ కొడుకు టగెనరైన్ చంద్రపాల్.. తన తొలి అధికారిక విదేశీ పర్యటనలోనే సెంచరీ బాది అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న టగెనరైన్ చంద్రపాల్.. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి, దాదాపు 90 ఓవర్ల పాటు క్రీజ్లో ఉండి 7వ వికెట్గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్లో 293 బంతులు ఎదుర్కొన్న టగెనరైన్.. 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 119 పరుగులు చేశాడు. టగెనరైన్ ఇన్నింగ్స్ తండ్రి శివ్నరైన్ను గుర్తు చేసిందని క్రికెట్ అభిమానులు చర్చించుకున్నారు. అచ్చం తండ్రిలాగే ఓపికగా, సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నాడని కొనియాడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్లో విండీస్ ఇన్నింగ్స్ మొత్తంలో టగెనరైన్ ఒక్కడే రాణించడం విశేషం. కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ (47) ఓ మోస్తరుగా రాణించగా మిగతావారంతా దారుణంగా విఫలయ్యారు. ఫలితంగా ఆ జట్టు 234 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టు.. మ్యాట్ రెన్షా (81), మార్కస్ హ్యారిస్ (73), హ్యాండ్స్కోంబ్ (55) అర్ధసెంచరీలతో రాణించడంతో 91.5 ఓవర్లలో 322 పరుగులు చేసి ఆలౌటైంది. ఇవాళ (నవంబర్ 25) రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టు.. మ్యాట్ రెన్షా (71 నాటౌట్), హ్యాండ్స్కోంబ్ (75) మరోసారి అర్ధసెంచరీలతో రాణించడంతో డిన్నర్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ఆ జట్టు 252 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, నవంబర్ 30 నుంచి ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న టగెనరైన్.. విండీస్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైనట్లే. -
సుదీర్ఘ నిరీక్షణ.. కోహ్లికి 1021, వార్నర్కు 1043 రోజులు
క్రికెట్ చరిత్రలో గతం ఘనంగా ఉండి, సెంచరీ కోసం సుదీర్ఘకాలం పాటు నిరీక్షించిన క్రికెటర్లు ఎవరంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేర్లు ఇట్టే చెబుతారు. అంతర్జాతీయ కెరీర్లో 70 సెంచరీలు చేసిన కోహ్లి.. 71వ శతకం కోసం 1021 రోజులు నిరీక్షించగా, 43 సెంచరీలు బాదిన వార్నర్.. 44వ శతకం కోసం ఏకంగా 1043 రోజుల పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాడు. Finally, that iconic jump of David Warner. He has scored an International Hundred after a long wait of 1043 days. 👏 https://t.co/jOiUrGqgvk — Aditya (@Adityakrsaha) November 22, 2022 తమ తమ కెరీర్లలో దశాబ్దకాలం పాటు మకుటం లేని మహరాజుల్లా ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు.. ఒక్క సెంచరీ కోసం దాదాపు మూడేళ్ల పాటు ఎదురుచూశారు. ఈ మధ్యలో ఎన్నో అవమానాలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలు ఎదుర్కొన్న వీరు.. ఎట్టకేలకు గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి తామేంటో ప్రపంచానికి రుజువు చేశారు. Kohli didn't score a Century for 1021 days still he went for a SIX when He was batting on 94*. Can't believe people have a such short memory.pic.twitter.com/uyXjcQH9m5 https://t.co/UXYVbzMXYm — Aditya (@Adityakrsaha) November 19, 2022 కోహ్లి.. ఆసియా కప్-2022లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో తన సెంచరీ నిరీక్షణకు తెరదించగా.. ఇవాళ (నవంబర్ 22) ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో వార్నర్ శతక దాహాన్ని (వన్డేల్లో 19వ శతకం) తీర్చుకున్నాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో ఆసీస్ 48 ఓవర్లలో (వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్ను 48 ఓవర్లకు కుదించారు) 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై, భారీ తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలు ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించిన విషయం తెలిసిందే. -
68 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియాలో అవకాశమివ్వండి
విజయ్ హజారే ట్రోఫీలోనూ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన జోరును కనబరుస్తున్నాడు. టోర్నీలో రెండో శతకం సాధించిన తిలక్ వర్మ హైదరాబాద్ను నాకౌట్ స్టేజీకి మరింత దగ్గర చేశాడు. శనివారం మణిపూర్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో తిలక్ వర్మ(77 బంతుల్లో 126 నాటౌట్, 14 ఫోర్లు, ఏడు సిక్సర్లు), రోహిత్ రాయుడు(51 బంతుల్లో 39 నాటౌట్) నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 164 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఇందులో తిలక్ వర్మవే 126 పరుగులు ఉన్నాయంటే అతనెంత ఎంత ధాటిగా ఆడాడో అర్థమవుతుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. తొమ్మిదో నెంబర్ బ్యాటర్ బికాష్ సింగ్ 44 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్గా నిలవగా.. రెక్స్ సింగ్ 36 పరుగులు సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో ఎం. శశాంక్ 3, తిలక్ వర్మ, రోహిత్ రాయుడు చెరో రెండు వికెటక్లు తీశారు. ఇప్పటివరకు లిస్ట్ ఏ క్రికెట్లో 23 మ్యాచ్లు ఆడిన తిలక్వర్మకు ఇది ఐదో సెంచరీ కావడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబాయి ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు తిలక్వర్మ. 14 మ్యాచుల్లో 397 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ముంబాయి ఇండియన్స్ అతడిని రిటైన్ చేసుకుంది. Tilak Verma - The Young Champ 🥰 #mumbaiindians #IPL2022 #TilakVarma pic.twitter.com/juEpRWVf9S — Oh My Cricket (@OhMyCric) April 6, 2022 చదవండి: FIFA: సాకర్ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే కోహ్లిని మించిన కెప్టెన్ లేడు.. కింగ్ను ఆకాశానికెత్తిన రైజింగ్ స్టార్ -
Vijay Hazare Trophy: రోహిత్ రాయుడు, తిలక్ వర్మ సెంచరీలు
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో హైదరాబాద్ వీజేడీ పద్ధతిలో 17 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. రోహిత్ రాయుడు (156; 12 ఫోర్లు, 8 సిక్స్లు), తిలక్ వర్మ (132; 10 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కడంతో... తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 360 పరుగులు సాధించింది. అనంతరం హిమాచల్ 48 ఓ వర్లలో 9 వికెట్లకు 335 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురు మందగించడంతో ఆటను నిలిపి వేశారు. వీజేడీ పద్ధతిలో హిమాచల్ లక్ష్యాన్ని లెక్కించగా 353 పరుగులుగా వచ్చింది. దాంతో హైదరాబాద్ 17 పరుగులతో విజయాన్ని ఖాయం చేసుకుంది. బెంగళూరులో ఆంధ్ర, గోవా జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
సెంచరీతో జట్టును గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో మెరిశాడు. విషయంలోకి వెళితే.. శనివారం రైల్వేస్, మహారాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మహారాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 38.2 ఓవర్లలో టార్గెట్ను అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ శతకంతో జట్టును గెలిపించాడు. 123 బంతుల్లో 124 పరుగులు చేసిన రుతురాజ్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(80 బంతుల్లో 75 పరుగులు, 10 ఫోర్లు, ఒక సిక్స్) రాణించాడు. ఈ ఇద్దరి మధ్య తొలి వికెట్కు 165 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. శివమ్ చౌదరీ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కర్ణ్ శర్మ 40 పరుగులు చేశాడు. మహారాష్ట్ర బౌలర్లలో కాజీ రెండు వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరీ, మనో ఇంగాలే, ఎస్ఎస్ బచావ్, అజిమ్ కాజీలు తలా ఒక వికెట్ తీశారు. -
Sudesh Ramakant Narvekar: వందోసారి రక్తదానం
పణజీ: ప్రమాదంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి రక్తమిచ్చి సాయపడిన సుదేశ్ ఆ తర్వాతా ఆ పరంపరను కొనసాగించారు. అనుకోకుండా మొదలైన రక్తదాన వ్రతం ఇటీవల శతకం పూర్తిచేసుకుంది. గోవా బ్లడ్మ్యాన్గా పేరు తెచ్చుకున్న ఆయన పూర్తి పేరు సుదేశ్ రమాకాంత్ నర్వేకర్. 51 ఏళ్ల వయసున్న సుదేశ్ 18 ఏళ్ల వయసులో తొలిసారి రక్తదానం చేసి తోటి వ్యక్తికి సాయపడితే వచ్చే ఆత్మ సంతృప్తికి ఫిదా అయ్యాడు. అప్పటి నుంచి గత 33 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి సాయంగా రక్తదానం చేస్తూనే ఉన్నాడు. దక్షిణ గోవాలోని పండాలో నివసించే సుదేశ్ ఇటీవల వందోసారి రక్తదానం చేసిన సందర్భంగా ఆయనను పీటీఐ పలకరించింది. ‘ టీనేజీలో ఉన్నపుడు ఒక యాక్సిడెంట్లో రక్తమోడుతున్న వ్యక్తికి బ్లడ్ ఇచ్చాకే తెలిసింది ఆపత్కాలంలో సాయపడటం ఎంత ముఖ్యమో. అందుకే నాకు తోచినంతలో ఇలా ఆపదలో ఉన్న వారికి సాయమందిస్తున్నా. భారత్లో వంద సార్లు రక్తదానం చేయడం అరుదు అని ఈమధ్యే తెలిసింది’ అని ఇండియన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సుదేశ్ అన్నారు. ‘ మొదట్లో ఏడాదికి రెండు సార్లు డొనేషన్ చేసేవాడిని. తర్వాత శిబిరాలు పెరిగేకొద్దీ ఎక్కువసార్లు ఇవ్వడం స్టార్ట్చేశా. బెంగళూరు, పుణె, హుబ్లీ, బెళగామ్సహా పొరుగు రాష్ట్రాల్లోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశా. మూడేళ్ల క్రితం పది మంది స్నేహితులతో కలిసి సార్థక్ ఎన్జీవోను ప్రారంభించా. గోవా అంతటా క్యాంప్లు నిర్వహించాం. ఇప్పుడు వైద్యులతో కలిసి 30 మంది బృందంగా ఏర్పడి ఎన్జీవో సేవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాం. ఒక్క గోవా మెడికల్ కాలేజీలోనే 90సార్లు క్యాంప్లు పెట్టాం. గోవా విషయానికొస్తే మహిళలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు’ అని సుదేశ్ చెప్పారు. -
శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. సౌత్జోన్ విజయలక్ష్యం 529
దులీప్ ట్రోఫీ ఫైనల్ 2022లో భాగంగా వెస్ట్జోన్.. సౌత్జోన్ ముందు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 3 వికెట్ల నష్టానికి 376 పరుగుల క్రితంరోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా వెస్ట్జోన్కు 528 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ 265 పరుగులు చేసి ఔటవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శతకంతో చెలరేగాడు. సౌత్జోన్ బౌలర్లను ఉతికారేసిన సర్ఫరాజ్ 178 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్కు తోడుగా హేల్ పటేల్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 318/7తో ఆట కొనసాగించిన సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఫెదరర్ మ్యాచ్కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
యశస్వి జైశ్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్జోన్
సౌత్ జోన్, వెస్ట్జోన్ మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుంది. టీమిండియా యువ క్రికెటర్.. వెస్ట్జోన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 119 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న యశస్వి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం 140 పరుగుల లీడ్లో ఉన్న వెస్ట్ జోన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. కాగా శ్రేయాస్ అయ్యర్.. యశస్వి జైశ్వాల్కు సహకరిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అంతకముందు సౌత్జోన్కు తొలి ఇన్నింగ్స్లో 57 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 7 వికెట్ల నష్టానికి 318 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన సౌత్జోన్ జట్టు మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 327 పరుగులకు ఆలౌట్ అయింది.బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. మనీశ్ పాండే (48), కృష్ణప్ప గౌతమ్ (43), రోహిన్ కున్నుమ్మల్ (31) రాణించారు. వెస్ట్జోన్ బౌలర్లో ఉనాద్కట్ 4 వికెట్లు తీయగా.. సేత్ 3, చింతన్ గజా రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
Ind vs Eng 2nd ODI: హర్మన్ హరికేన్
కాంటర్బరీ: ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. మూడు మ్యాచ్ల సిరీస్ను గెలిచేందుకు అవసరమైన భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. బుధవారం జరిగిన ఈ డే–నైట్ మ్యాచ్లో మొదట భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (8) నిరాశపరచగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (34 బంతుల్లో 26; 4 ఫోర్లు) రెండో వికెట్కు 54 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద యస్తిక నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన హర్మన్ మొదట కుదురుగా ఆడింది. తర్వాత దూకుడు పెంచింది. ఇక ఆఖర్లో చుక్కలు చూపించింది. 64 బంతుల్లో ఫిఫ్టీ (4 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న హర్మన్ వంద బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు, 1 సిక్స్) సాధించింది.ఆమె వన్డే కెరీర్లో ఇది ఐదో శతకం. తర్వాత 11 బంతుల్లోనే 43 పరుగులు ధనాధన్గా చేసింది. 6 ఫోర్లు, 3 సిక్సర్ల రూపంలోనే 42 పరుగులు వచ్చాయి. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచింది. పూజ వస్త్రకర్ (18) తక్కువ స్కోరే చేయగా, దీప్తి శర్మ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కెప్టెన్తో కలిసి అజేయంగా నిలిచింది. -
కెవిన్ ఒబ్రెయిన్ సెంచరీ .. గుజరాత్ జెయింట్స్ ఘన విజయం
ఐర్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో శతకంతో మెరిశాడు. అతని విధ్వంసం ధాటికి గుజరాత్ జెయింట్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆష్లే నర్స్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. దినేశ్ రామ్దిన్ 31 పరుగులు చేశాడు. వీరిద్దరి మినహా మిగతావారెవరు పెద్దగా రాణించింది లేదు. గుజరాత్ జెయింట్స్ బౌలింగ్లో తిసారా పెరీరా, ఎమ్రిత్, అప్పన్న తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 18.4 ఓవర్లలో టార్గెట్ను అందుకుంది. కెవిన్ ఓబ్రెయిన్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగుల చేయగా.. పార్థివ్ పటేల్ 24, యష్పాల్ సింగ్ 21 పరుగులు చేశారు. ఇండియా క్యాపిటల్స్ బౌలింగ్లో ప్రవీణ్ తాంబే 3, లియామ్ ప్లంకెట్ 2, ఆష్లే నర్స్, మిచెల్ జాన్సన్లే తలా ఒక వికెట్ తీశారు. -
పృథ్వీ షా సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్జోన్
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా దులీప్ ట్రోఫీలో అద్భుత శతకంతో మెరిశాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో ఈ వెస్ట్జోన్ ఓపెనర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫలితంగా వెస్ట్జోన్ భారీ ఆధిక్యం దిశగా పరిగెడుతుంది. ఈ మధ్యన పృథ్వీ షా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలో ఎక్కువగా ఓపెనింగ్లో వచ్చిన పృథ్వీ షా.. ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిపోవడం.. అతను ఫామ్ కోల్పోవడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మూడోరోజు తొలి సెషన్లో వెస్ట్జోన్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పృథ్వీ షా(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 136 నాటౌట్), ఆర్మాన్ జాఫర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలపుకొని 314 పరుగుల లీడ్లో ఉంది. అంతకముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కర్ణ్శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఉనాద్కట్,తనుష్ కొటెన్లు చెరో 3 వికెట్లు తీయగా.. షెత్ 2, చింతన్ గజా, షామ్స్ ములాని చెరొక వికెట్ తీశారు. ఇక వెస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' 'డైరెక్టర్ గారూ.. ఫెదరర్కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?' -
Duleep Trophy: రికీ భుయ్ సెంచరీ
సేలం (తమిళనాడు): ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో దులీప్ ట్రోఫీలో నార్త్జోన్ తో జరుగుతున్న మ్యాచ్లో సౌత్జోన్ భారీస్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 324/2తో శుక్రవారం రెండో రోజు ఆటకొనసాగించిన సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 172.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 630 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హనుమ విహారి (134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఓవర్నైట్ స్కోరుకు 27 పరుగులు జతచేసి నిష్క్రమించాడు. అనంతరం రికీ .. కృష్ణప్ప గౌతమ్ (48; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (42; 4 ఫోర్లు, 1 సిక్స్)లతో కలిసి జట్టు స్కోరును 600 పరుగుల పైచిలుకు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నార్త్జోన్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. -
స్టార్టప్ ఇండస్ట్రీ: యూనికార్న్ల సెంచరీ
చెన్నై: స్టార్టప్ పరిశ్రమలో 100 యూనికార్న్లకు ఇండియా ఆవాసంగా నిలిచినట్లు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. వీటి మొత్తం ఉమ్మడి విలువ 250 బిలియన్ డాలర్లు(రూ. 20 లక్షల కోట్లు)గా తెలియజేశారు. గత కొన్నేళ్లలో ఈ సంస్థలు 63 బిలియన్ డాలర్ల(రూ. 5,04,000 కోట్లు) పెట్టుబడులను సమీకరించినట్లు వెల్లడించారు. దేశీయంగా అంకుర సంస్థలు(స్టార్టప్) ఊపిరి పోసుకునేందుకు అనువైన పటిష్ట వ్యవస్థ ఏర్పాటైనట్లు కాంచీపురం ఐఐఐటీ, డిజైన్, తయారీ నిర్వహించిన 10వ స్నాతకోత్సంలో కొత్త గ్రాడ్యుయేట్లనుద్ధేశించి మంత్రి ప్రసంగించారు. సిలికాన్ వ్యాలీలోని 25 శాతం స్టార్టప్లను భారత సంతతికి చెందినవారే నిర్వహిస్తుండటం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక్కడినుంచి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్గా మారి ఇతరులకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తారన్న అభిప్రాయంతో ఈ విషయాలను ప్రస్తావిస్తున్నట్లు తెలియజేశారు. 25 శాతం స్టార్టప్లను భారతీయులు నిర్వహిస్తున్న సిలికాన్ వ్యాలీపై ఇప్పటికే మీలో చాలా మంది దృష్టి పెట్టి ఉంటారని వ్యాఖ్యానించారు. -
మొన్న మెచ్చుకున్నారు.. ఇవాళ తిట్టుకుంటున్నారు
టీమిండియా స్టార్.. రన్మెషిన్ విరాట్ కోహ్లి అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ లేకుండానే వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాడు. బహుశా ఏ క్రికెటర్కు ఇలాంటి చెత్త రికార్డు లేదనుకుంటా. ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకొని ''కింగ్ కోహ్లి'' అని పిలిపించుకున్న కోహ్లి ఇప్పడు మాత్రం సెంచరీ లేక అల్లాడిపోతున్నాడు. ఒక్క సెంచరీ కోసం అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. మరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసినట్లుగానే కోహ్లి కూడా సెంచరీ లేకుండా వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం అతనికే సాధ్యమైంది. -సాక్షి, వెబ్డెస్క్ మొన్నటికి మొన్న అంతర్జాతీయ క్రికెట్లో 14 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లిని ఎవరైతే మెచ్చుకున్నారో.. ఇవాళ అదే నోటితో.. ''ఇంకెంతకాలం కోహ్లి.. సెంచరీ లేకుండా'' అని తిట్టుకుంటున్నారు. కోహ్లీ చివరి సారిగా నవంబర్ 23, 2019న ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్లో కోహ్లి 136 పరుగులు చేశాడు. అప్పట్నుంచి తన కెరీర్లో కోహ్లి ఎత్తుపల్లాలు చవిచూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి 68 మ్యాచ్లలో ఆడాడు. 82 ఇన్నింగ్స్లలో 34.05 సగటుతో అన్ని ఫార్మాట్లలో 2,554 పరుగులు చేశాడు. అంతేకాదు 24 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కానీ సెంచరీ మాత్రం సాధించలేకపోయాడు. 2019లో టెస్టుల్లో బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాక కోహ్లీ..18 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 32 ఇన్నింగ్స్లలో 27.25 సగటుతో 872 పరుగులు చేశాడు. ఆరుసార్లు యాభై పరుగుల మార్కును దాటాడు. ఇక చివరి సెంచరీ తర్వాత 23 వన్డేలు ఆడిన కోహ్లీ..35.82 సగటుతో 824 పరుగులు సాధించాడు. 89 పరుగుల అత్యుత్తమ స్కోరు. ఈ ఫార్మాట్లో పది అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ శతకాన్ని మాత్రం నమోదు చేయలేకపోయాడు. ఇక 27 టీ20ల్లో 42.90 సగటుతో 858 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యుత్తమ స్కోరు 94*. చివరి సెంచరీ తర్వాత టీ20ల్లో ఎనిమిది అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ శతకాన్ని మాత్రం కోహ్లీ సాధించలేకపోయాడు. ఆసియాకప్లోనైనా అందుకుంటాడా? మరో వారం రోజుల్లో ఆసియా కప్ మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లి సెంచరీ మార్క్ అందుకుంటాడని అంతా భావిస్తున్నారు. పైగా ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో(ఆగస్టు 28న) తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో కోహ్లి కచ్చితంగా సెంచరీ చేస్తాడని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే మెగా ఈవెంట్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. క్రికెట్ దిగ్గజాలుగా పేరొందిన సచిన్, గావస్కర్, పాంటింగ్, ద్రవిడ్, గంగూలీ.. ఇలా అందరూ ఏదో ఒక దశలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికి సెంచరీతో కమ్బ్యాక్ ఇచ్చారు. కానీ కోహ్లిలా సెంచరీ లేకుండా వెయ్యి రోజులు మాత్రం ఎవరు లేరు. మూడేళ్లలో ఒక్కసారి కూడా వెయ్యి పరుగుల మార్క్ లేకుండా.. 2020, 2021, 2022లో కోహ్లీ అత్యంత చెత్తగా ఆడుతున్నాడని చెప్పొచ్చు. ఈ మూడేళ్లలో ఒక్క కాలెండర్ ఇయర్ లో కూడా కోహ్లీ కనీసం ఒక్కసారి కూడా వెయ్యి పరుగుల మార్కును దాటలేకపోయాడు. 2019లో చివరి శతకం సాధించిన తర్వాత కోహ్లీ ఆ ఏడాది చివర్లో ఆరు మ్యాచ్లు ఆడాడు. ఆరు ఇన్నింగ్స్లలో 68.00 సగటుతో 272 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 94* పరుగులు. మూడు అర్ధ సెంచరీలు కొట్టి..2019ని బాగానే ముగించాడు. 2020లో కోహ్లీ 22 అంతర్జాతీయ మ్యాచ్లలో 842 పరుగులు చేశాడు. ఇక 2021లో 24 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 964 పరుగులు సాధించాడు. ఇక ఏడాది ఇప్పటి వరకు 16 మ్యాచ్లు ఆడగా..19 ఇన్నింగ్స్లలో.. 25.05 సగటుతో 476 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 79 పరుగుల అత్యుత్తమ స్కోరు. ఇప్పటి వరకు కేవలం నాలుగు అర్ధ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. చదవండి: Virat Kohli International Debut: 14 ఏళ్ల కెరీర్ పూర్తి.. కోహ్లి ఎమోషనల్ Virat Kohli: చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లే.. కానీ ఒంటరిగా ఫీలయ్యా! -
శతకంతో చెలరేగినా టీమిండియాలోకి రావడం కష్టమే!
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ చాన్నాళ్ల తర్వాత సూపర్ శతకంతో చెలరేగాడు. 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అతని ధాటికి ప్రత్యర్థి జట్టు 9 వికెట్ల తేడాతో భారీ పరజయాన్ని మూటగట్టుకుంది. విషయంలోకి వెళితే.. మహారాజ ట్రోపీ కెస్సీఏ టి20 చాలెంజ్లో భాగంగా శుక్రవారం శివమొగ్గ స్ట్రైకర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శివమొగ్గ స్ట్రైకర్స్ 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహన్ కదమ్ 52 బంతుల్లో 84, బీఆర్ శరత్ 51 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగగా.. ఎల్ ఆర్ చేతన్ 34, అనీస్ కెవి(35 నాటౌట్) సహకారమందించారు. ఇక మయాంక్ అగర్వాల్ టీమిండియా జట్టులో స్థానం కోల్పోయి చాలా కాలం అయిపోయింది. మళ్లీ జట్టులోకి వచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో కేఎల్ రాహుల్ వెళ్లిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ అటు బ్యాటింగ్లో.. ఇటు కెప్టెన్సీలో ఘోరంగా విఫలమయ్యాడు. మరోసారి లీగ్ దశలోనే పంజాబ్ ఇంటిబాట పట్టింది. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల ప్రతిభకు కొదువ లేదు. రోజుకో కొత్త క్రికెటర్ తెర మీదకు వస్తుండడం.. ఒక్కోసారి జట్టును ఎంపిక చేయడంలో బీసీసీఐకి కూడా తలనొప్పిగా మారిపోయింది. ఎఫ్టీపీలో భాగంగా టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఒక సీనియర్.. మరొకటి జూనియర్ జట్టుగా విడదీసి ఆయా టోర్నీలు ఆడేందుకు పంపిస్తున్నారు. ఇంత పోటీతత్వంలో మయాంక్ టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకుంటాడా అంటే చెప్పడం కష్టమే అవుతుంది. A great day in the field. 💯 Hungry for more. We march on🔥 #KBBlasters pic.twitter.com/4pN6sL97cI — Mayank Agarwal (@mayankcricket) August 13, 2022 చదవండి: Adam Lyth: సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్ క్రికెటర్ -
తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేశాడు. పుజారా అంటేనే నెమ్మదైన బ్యాటింగ్కు పెట్టింది పేరు. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్లో గ్రూఫ్-ఏలో వార్విక్షైర్తో జరిగిన మ్యాచ్లో ఈ 'నయావాల్' 73 బంతుల్లోనే శతకం మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 పరుగులు చేసిన పుజారా తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ జట్టు విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోవడం దురదృష్టకరమనే చెప్పొచ్చు. అయితే ఇన్నింగ్స్ 47వ ఓవర్లో పుజారా ప్రత్యర్థి బౌలర్కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 22 పరుగులు బాదాడు. లియామ్ నార్వెల్ వేసిన ఆ ఓవర్లో పుజారా 4,2,4,2,6,4తో 22 పరుగులు పిండుకున్నాడు. అయితే చివర్లో పుజారా ఔట్ కావడం జట్టు కొంపముంచిందనే చెప్పొచ్చు. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ రాబర్ట్ యేట్స్ 114 పరుగులతో మెరుపు శతకం అందుకోగా.. కెప్టెన్ రోడ్స్ 76, మైకెల్ బర్గెస్ 58 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. పుజారా, అలిస్టర్ ఓర్(81 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు ససెక్స్ విజయం దిశగానే సాగింది. అయితే పుజారా ఔటైన అనంతరం మిగతావారు రాణించడంలో విఫలం కావడంతో గెలుపుకు దగ్గరగా వచ్చి బోల్తా పడింది. ఇక పాయింట్ల పట్టికలో వార్విక్షైర్ 4 మ్యాచ్ల్లో రెండు గెలిచి.. రెండు ఓడి ఆరో స్థానంలో ఉండగా.. వార్విక్షైర్ 3 మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగో స్థానంలో ఉంది. 4 2 4 2 6 4 TWENTY-TWO off the 47th over from @cheteshwar1. 🔥 pic.twitter.com/jbBOKpgiTI — Sussex Cricket (@SussexCCC) August 12, 2022 చదవండి: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్వాష్ దిశగా వెస్టిండీస్ -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్.. హండ్రెడ్ లీగ్లో శతక్కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ద హండ్రెడ్ లీగ్ కాంపిటీషన్లో తొలి శతకం నమోదైంది. 2022 ఎడిషన్లో భాగంగా బర్మింగ్హామ్ ఫీనిక్స్కు చెందిన 20 ఏళ్ల యువ బ్యాటర్ విల్ స్మీడ్ లీగ్లో తొట్ట తొలి సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు సహచర ఆటగాడు, పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్) ప్లేయర్ లియామ్ లివింగ్స్టోన్ చేసిన 92 పరుగులే హండ్రెడ్ లీగ్ అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉండింది. నిన్న (ఆగస్ట్ 10) సథరన్ బ్రేవ్తో జరిగిన మ్యాచ్లో స్మీడ్ ఈ ఘనత సాధించాడు. First 💯 in #TheHundred = @CazooUK Match Hero 🏅 👏 @will_smeed 👏 pic.twitter.com/bTqyqrSSsT — The Hundred (@thehundred) August 10, 2022 స్మీడ్.. 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం నమోదు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న బర్మింగ్హామ్ జట్టు 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫీనిక్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో హెన్రీ బ్రూక్స్ (5/25), కేన్ రిచర్డ్సన్ (3/19) ధాటికి ప్రత్యర్ధి సథరన్ బ్రేవ్ 123 పరుగులకే చాపచుట్టేసింది. ఫీనిక్స్ ఇన్నింగ్స్లో స్మీడ్ అజేయమైన సెంచరీ బాదగా, లివింగ్స్టోన్ (20 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో స్టొయినిస్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ ఫుల్లర్, లిన్టాట్ తలో వికెట్ పడగొట్టారు.సథరన్ ఇన్నింగ్స్లో అలెక్స్ డేవిస్ (24 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, ప్రస్తుత ఎడిషన్లో బర్మింగ్హామ్ ఫీనిక్స్కు ఇది తొలి విజయం. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్లో ప్రస్తుతానికి లండన్ స్పిరిట్ 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చదవండి: దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్ -
వన్డేల్లో వెస్టిండీస్ ఓపెనర్ అరుదైన ఫీట్.. నాలుగో ఆటగాడిగా..!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్ అరుదైన ఘనత సాధించాడు. తన వన్డే కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన హోప్ సెంచరీతో మెరిశాడు. తద్వారా 100వ మ్యాచ్లో సెంచరీ సాధించిన 10 ఆటగాడిగా హోప్ నిలిచాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), క్రిస్ కెయిన్స్ (న్యూజిలాండ్), మొహమ్మద్ యూసుఫ్ (పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (వెస్టిండీస్) ట్రెస్కోథిక్ (ఇంగ్లండ్), రాంనరేశ్ శర్వాణ్ (వెస్టిండీస్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), శిఖర్ ధావన్ (భారత్) ఈ ఘనత సాధించారు. అదే విధంగా ఈ అరుదైన రికార్డు సాధించిన నాలుగో విండీస్ ఆటగాడిగా హోప్ రికార్డులకెక్కాడు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: విండీస్- బ్యాటింగ్ వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు) భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డేల్లో ప్రపంచ రికార్డు.. -
'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన ఫస్ట్క్లాస్ కెరీర్లో అత్యున్నత ఫామ్ను కనబరుస్తున్నాడు. ఇప్పటికే రంజీ ట్రోపీ 2022 సీజన్ మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్ తాజాగా నాలుగో సెంచరీ అందుకున్నాడు. బెంగళూరు వేదికగా మధ్య ప్రదేశ్తో జరుగున్న ఫైనల్ మ్యాచ్లో కీలక సమయంలో శతకంతో రాణించాడు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఓపికతో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ 190 బంతుల్లో శతకం మార్క్ను అందుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 40 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్ రెండో రోజు ఆటలో 152 బంతులాడి అర్థసెంచరీ మార్క్ను అందుకున్న సర్ఫరాజ్ తర్వాతి 50 పరుగులను మాత్రం కేవలం 38 బంతుల్లోనే అందుకోవడం విశేషం. సర్ఫరాజ్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు , ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఈ సీజన్లో ఇప్పటికే 900 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ వెయ్యి పరుగుల మార్కను అందుకునేందుకు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాడు. కాగా ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసి కీలక సమయంలో సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఆటకు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. 'నీ ఓపికకు సలాం.. మేము గులాం' అంటూ కామెంట్ చేశారు. ఇక 248/5 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ముంబై లంచ్ విరామం సమయానికి 8 వికెట్లు నష్టపోయి 351 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 119, తుషార్ దేశ్పాండే 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. మధ్య ప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 3, సారాన్ష్ జైన్ 2, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయా ఒక వికెట్ పడగొట్టాడు. 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 చదవండి: అర్థ సెంచరీతో ఆకట్టుకున్న జైశ్వాల్.. తొలి రోజు ముగిసిన ఆట టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం -
రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్కు బెంగాల్
రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్, జార్ఖండ్ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. జూన్ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్, మధ్యప్రదేశ్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. మరో సెమీఫైనల్లో ముంబై, ఉత్తర్ ప్రదేశ్ తలపడనున్నాయి. కాగా ఆటకు శుక్రవారం ఆఖరి రోజు కాగా.. ఫలితం వచ్చేలా కనబడకపోవడంతో గంట ముందుగానే మ్యాచ్ను నిలిపివేశారు. ఇక ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. టీమిండియా క్రికెటర్.. బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి సూపర్ సెంచరీతో మెరిశాడు.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్ను మనోజ్ తివారి తన ఇన్నింగ్స్తో నిలబెట్టాడు. 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అభిషేక్ పోరెల్(34) పరుగులతో కలిసి ఐదో వికెట్కు అమూల్యమైన 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్(46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్కు 96 పరుగులు జోడించాడు. ఓవరాల్గా మనోజ్ తివారి 185 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేశాడు. అంతకముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్ను 773 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా.. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 298 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్కు 475 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. చదవండి: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు -
సెంచరీల మీద సెంచరీలు.. గ్యాప్లో పాక్ బౌలర్కు చుక్కలు
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా తగ్గేదే లే అంటున్న పుజారా మరో సెంచరీతో చెలరేగాడు. ఈ గ్యాప్లోనే పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదికి చుక్కలు చూపించాడు. ఇక ఫామ్ కోల్పోయి టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన పుజారా.. కౌంటీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. టీమిండియా జట్టులోకి తిరిగి రావాలనే కసితో ఆడుతున్న పుజారా కౌంటీ చాంపియన్షిప్లో ససెక్స్ తరపున ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీతో మెరిశాడు. తాజాగా మిడిలెసెక్స్తో మ్యాచ్లో ఆదివారం పుజారా నాలుగో సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్లో టామ్ ఆల్సప్(66)తో కలిసి నాలుగో వికెట్కు 138 పరుగులు జోడించిన పుజారా.. ఆ తర్వాత టామ్ క్లార్క్తో(26*) కలిసి 92 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓవరాల్గా మూడోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా(149 బంతుల్లో 125 బ్యాటింగ్, 16 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ క్లార్క్(26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుజారా మెరుపులతో ససెక్స్ 270 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు మిడిలెసెక్స్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్లో 392 పరుగులకు ఆలౌటైంది. కాగా పుజారాకు ఈ సీజన్లో ఇది నాలుగో సెంచరీ కాగా.. ఇంతకముందు 201*(డెర్బీషైర్ జట్టుపై), 109(వోర్సెస్టర్షైర్ జట్టుపై), 203(డర్హమ్ జట్టుపై) సెంచరీలు అందుకున్నాడు. Fourth match, fourth 100+ score. 💯 🤯 It's a privilege to watch, @cheteshwar1. 👏 pic.twitter.com/IF8nLUt9Yg — Sussex Cricket (@SussexCCC) May 7, 2022 గ్యాప్లో పాక్ బౌలర్కు చుక్కలు.. సెంచరీతో మెరిసిన పుజారా షాహిన్ అఫ్రిది బౌలింగ్లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ససెక్స్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఓపెనర్ల వికెట్లు ఆరంభంలోనే కోల్పోవడంతో ససెక్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారా, టామ్ ఆల్సప్లు జాగ్రత్తగా ఆడారు. అయితే పుజారా తన ఇన్నింగ్స్ను దూకుడుగానే ఆరంభించాడు. షాహిన్ అఫ్రిది ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతిని బౌన్సర్ వేశాడు. అయితే పుజారా దానిని వదలకుండా బ్యాట్ ఎడ్జ్తో అప్పర్ కట్ చేశాడు. దీంతో బంతి బౌండరీ ఫెన్స్ దాటి అవతల పడింది. పుజారా కెరీర్లో అతి తక్కువగా ఆడిన షాట్లలో అప్పర్ కట్ ఒకటి. ఇక పుజారా, అఫ్రిదిలు ఎదురుపడడం ఇదే తొలిసారి. Shaheen Afridi 🆚 Cheteshwar Pujara A battle you don't want to miss. Watch it LIVE 👉 https://t.co/UVQbX7r83y#LVCountyChamp pic.twitter.com/GBHE5CdZzH — LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022 -
కౌంటీ క్రికెట్లో దుమ్మురేపుతున్న పుజారా.. వరుసగా మూడో శతకం
టీమిండియా సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కౌంటీలో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఫామ్లేక సతమతమయిన పుజారా టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. తన సహచరులంతా ఐపీఎల్లో బిజీగా ఉంటే పుజారా మాత్రం కౌంటీల్లో ఆడుతున్నాడు. బ్యాటింగ్లో ఇరగదీస్తున్న పుజారా సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నాడు. ససెక్స్ తరపున బరిలోకి దిగిన పుజారా డర్హమ్తో మ్యాచ్లో సెంచరీ సాధించాడు. శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా 128 పరుగులు నాటౌట్గా నిలిచాడు. కాగా ఈ సీజన్ కౌంటీలో పుజారాకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ససెక్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. దీంతో ససెక్స్ జట్టు డర్హమ్పై 139 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పుజారకు తోడుగా మహ్మద్ రిజ్వాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా పుజారా ఇంతకముందు వరుసగా డెర్బిషైర్పై 201 పరుగులు, వర్సిస్టర్ షైర్పై 109 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్కు వెళ్లనున్న భారత్.. ఆ పర్యటనలో ఒక టెస్టు, ఐదు టి20 మ్యాచ్లు ఆడనుంది. అంటే పుజరా టీమిండియా తరపున బరిలోకి దిగేది ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు ద్వారానే అని తెలస్తుంది. చదవండి: షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు : పాక్ మాజీ స్పిన్నర్ ANOTHER 💯!@cheteshwar1 🤯 👏 pic.twitter.com/4nqhzhQjqW — Sussex Cricket (@SussexCCC) April 29, 2022 -
బీజేపీ మరో ఘనత.. పెద్దల సభలో ‘సెంచరీ’
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. రాజ్యసభలోనూ ‘సెంచరీ’ కొట్టి రికార్డు సృష్టించింది. బీజేపీ చరిత్రలో తొలిసారిగా 100 మంది రాజ్యసభ సభ్యులను కలిగిన ఘనత సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో అసోం, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో సీటును గెలుచుకోవడంతో బీజేపీ ‘వంద’ మార్క్ను అందుకుంది. 1990 తర్వాత వంద మంది రాజ్యసభ సభ్యులను కలిగిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో మూడు ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్కటి చొప్పున బీజేపీ గెలుచుకుంది. ఈ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఐదు స్థానాలు ప్రతిపక్ష పార్టీలవే కావడం గమనార్హం. పంజాబ్లో తనకున్న ఒక స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఐదు స్థానాల్లోనూ విజయం సాధించింది. (క్లిక్: హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు) తాజా ఎన్నికల ఫలితాలను రాజ్యసభ అధికారిక వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో 97 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా గెలిచిన మూడు సీట్లు కలిపితే బీజేపీ సభ్యుల సంఖ్య వందకు చేరుకుంటుంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో మెజారిటీ మార్క్కు బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రాజ్యసభలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014లో రాజ్యసభలో బీజేపీకి 55 మంది సభ్యులు ఉండగా.. తర్వాత అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఈ సంఖ్య ఇపుడు సెంచరీ మైలురాయిని అందుకుంది. 1990లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 108 మంది సభ్యులు ఉన్నారు. తర్వాత నుంచి ప్రాంతీయ పార్టీల హవా మొదలుకావడంతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గుతూ వచ్చింది. కాగా, బీజేపీ కొద్దిరోజులు మాత్రమే సెంచరీ మార్క్ను నిలబెట్టుకునే అవకాశముంది. ఎందుకంటే త్వరలో మరో 52 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ సహా రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా స్కోప్ లేదు. కాబట్టి వంద మార్క్ను నిలుపుకోవడం కష్టమే. ఉత్తరప్రదేశ్లో ఖాళీకానున్న 11 స్థానాల్లో ఎనిమిదింటిని బీజేపీ గెలుచుకునే అవకాశముంది. యూపీ నుంచి రిటైర్ అవుతున్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. పెద్దల సభలో బీజేపీ బలం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో బిల్లులను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆమోదించుకునే వీలు కలుగుతుంది. అంతేకాదు త్వరలో జరగబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ గెలుపు సులువు అవుతుంది. (క్లిక్: ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్) -
జడేజా ‘కత్తి’ దూశాడు!
రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్కు శ్రీలంక కకావికలమైంది. గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన అతను తొలి మ్యాచ్లోనే తన విలువేంటో చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన జడేజా మెరుపు ప్రదర్శనతో శతకం బాదడంతో పాటు బౌలింగ్లో కీలక వికెట్ తీసి రెండో రోజే మ్యాచ్ను భారత్ చేతుల్లోకి తెచ్చాడు. అశ్విన్ కూడా ఇదే తరహా ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి పని పట్టాడు. అటు పేలవ బౌలింగ్, ఫీల్డింగ్తో పూర్తిగా చేతులెత్తేసిన లంక బ్యాటింగ్లోనూ తడబడి అప్పుడే నాలుగు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. లంకను ఎక్కువ ఓవర్లు ఆడించే క్రమంలో జడేజా డబుల్ సెంచరీకి అవకాశం ఇవ్వకుండా భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడమే రెండో రోజు ఆటలో కాస్త చర్చనీయాంశం! మొహాలి: శ్రీలంకతో తొలి టెస్టులో రెండో రోజే భారత్కు మ్యాచ్పై పట్టు చిక్కింది. ఓవర్నైట్ స్కోరు 357/6తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 129.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (228 బంతుల్లో 175 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్స్లు) కెరీర్లో అత్యుత్తమ స్కోరు సాధించగా, అశ్విన్ (82 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్కు 130 పరుగులు జత చేశారు. అనంతరం లంక ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 466 పరుగులు వెనుకబడి ఉంది. భారీ భాగస్వామ్యం... తొలి రోజు అజేయంగా నిలిచిన జడేజా, అశ్విన్ ద్వయం శనివారం అదే జోరును కొనసాగిస్తూ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో ఓవర్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు అశ్విన్ అండగా నిలిచాడు. వీరిద్దరూ వన్డే తరహాలో ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఫెర్నాండో ఓవర్లో జడేజా రెండు ఫోర్లు కొట్టడంతో స్కోరు 400 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. తొలి సెషన్లో అశ్విన్ వికెట్ కోల్పోయినా... 27 ఓవర్లలో భారత్ ఏకంగా 111 పరుగులు నమోదు చేసింది. ఎంబుల్డెనియా బౌలింగ్లో సింగిల్ తీసి 160 బంతుల్లో జడేజా సెంచరీ మార్క్ను అందుకున్నాడు. లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే జయంత్ యాదవ్ (2) వెనుదిరిగాడు. ఈ స్థితిలో జడేజా స్కోరు 104 పరుగులు. ఆ తర్వాత జడేజా మరింత చెలరేగిపోయాడు. 60 బంతుల్లోనే తర్వాతి 71 పరుగులు సాధించాడు. ఫెర్నాండో బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం ఎంబుల్డెనియా ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదాడు. డిసిల్వా బౌలింగ్లో మరో భారీ సిక్స్తో అతను 150 పరుగులకు చేరుకున్నాడు. షమీ (20 నాటౌట్) అతనికి చక్కగా సహకరించాడు. వీరిద్దరు 94 బంతుల్లోనే 103 పరుగులు జోడించగా జడేజానే 71 పరుగులు చేశాడు. అయితే డబుల్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అనూహ్యంగా భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శ్రీలంక ఓపెనర్లు కరుణరత్నే, తిరిమన్నె 18 ఓవర్ల పాటు భారత బౌలర్లను నిరోధించారు. అనంతరం అశ్విన్ బౌలింగ్లో తిరిమన్నె వికెట్ల ముందు దొరికిపోవడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత కరుణరత్నేను జడేజా... మాథ్యూస్ (22)ను బుమ్రా... ధనంజయ డిసిల్వా (1)ను అశ్విన్ పెవిలియన్కు పంపించారు. హ్యాడ్లీని దాటిన అశ్విన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ దిగ్గజం రిచర్ హ్యాడ్లీ (431)ను అశ్విన్ అధిగమించాడు. ప్రస్తుతం 432 వికెట్లతో అతను ఓవరాల్గా 11వ స్థానానికి చేరుకున్నాడు. మరో 3 వికెట్లు తీస్తే కపిల్దేవ్ (434)ను అశ్విన్ దాటుతాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 33; రోహిత్ (సి) లక్మల్ (బి) కుమార 29; విహారి (బి) ఫెర్నాండో 58; కోహ్లి (బి) ఎంబుల్డెనియా 45; పంత్ (బి) లక్మల్ 96; శ్రేయస్ (ఎల్బీ) (బి) డిసిల్వా 27; జడేజా (నాటౌట్) 175; అశ్విన్ (సి) డిక్వెలా (బి) లక్మల్ 61; జయంత్ (సి) తిరిమన్నె (బి) ఫెర్నాండో 2; షమీ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 28; మొత్తం (129.2 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 574. వికెట్ల పతనం: 1–52, 2–80, 3–170, 4–175, 5–228, 6–332, 7–462, 8–471. బౌలింగ్: లక్మల్ 25–1–90–2, ఫెర్నాండో 26–1–135–2, కుమార 10.5–1–52–1, ఎంబుల్డెనియా 46–3–188–2, డిసిల్వా 18.2–1–79–1, అసలంక 3.1–0–14–0. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే (ఎల్బీ) (బి) జడేజా 28; తిరిమన్నె (ఎల్బీ) (బి) అశ్విన్ 17; నిసాంక (బ్యాటింగ్) 26; మాథ్యూస్ (ఎల్బీ) (బి) బుమ్రా 22; డిసిల్వా (ఎల్బీ) (బి) అశ్విన్ 1; అసలంక (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్లకు) 108. వికెట్ల పతనం: 1–48, 2–59, 3–96, 4–103. బౌలింగ్: 7–3–17–0, బుమ్రా 9–2–20–1, అశ్విన్ 13–6–21–2, జయంత్ 5–2–14–0, జడేజా 9–3–30–1. -
కూతురు.. ఆ వెంటే తండ్రి మరణం.. అయినా జట్టు వెంటే!
Vishnu Solanki Sad Story: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకిను విధి వెంటాడింది. కన్న కూతురు మరణించిందన్న బాధను దిగమింకముందే.. మరో విషాదం తన కుటుంబం చోటు చేసుకుంది. విష్ణు సోలంకి తండ్రి ఆదివారం మరణించాడు. ఈ క్రమంలో అంత్యక్రియలకు హాజరు కాకుండా జట్టుతోనే ఉండి మరోసారి సోలంకి రియల్ హీరో అనిపించుకున్నాడు. జట్టుతో పాటు బయో బబుల్లోనే సోలంకి ఉన్నాడు. తన తండ్రి అంత్యక్రియలకు సోలంకి వీడియో కాల్లో మాత్రమే హాజరయ్యాడు. దీంతో సోలంకిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిస్తోంది. కాగా, రంజీట్రోఫీలో భాగంగా చంఢీగఢ్తో జరిగిన మ్యాచ్లో విష్ణు సోలంకి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్కు కొద్ది రోజులు ముందు విష్ణు సోలంకి కూతురు మరణించింది. ఆ బాధను దిగమింగుతూ కఠిన పరిస్థితుల్లో అద్భుతమైన సెంచరీ చేశాడు. కాగా తన కుమార్తె మరణించిన తర్వాత కుటుంబంతో ఉండమని సూచించినట్లు బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఆట మీద మక్కువతో జట్టును విడిచిపెట్టడానికి సోలంకీ ఇష్టపడలేదని అతడు పేర్కొన్నారు. ఇక బరోడా జట్టు మార్చి 4న హైదరాబాద్తో తల పడనుంది. చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే.. -
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
-
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
Baroda Player Vishnu Solanki: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి రంజీ ట్రోఫీ 2022 సీజన్లో సెంచరీతో మెరిశాడు. చంఢీఘర్తో జరుగుతున్న మ్యాచ్లో సోలంకి ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇందులో వింతేముంది.. అందరి క్రికెటర్ల లాగే తాను సెంచరీ బాదాడనుకుంటే పొరపాటే అవుతుంది. విష్ణు సోలంకి సెంచరీ వెనుక విషాధగాథ ఉంది. కొన్ని రోజుల క్రితం విష్ణు సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు కన్నుమూసింది. ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి.. హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చంఢీఘర్తో మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని మెచ్చుకోకుండా ఉండలేము. ''అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. నీ ఆటకు సలామ్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన బరోడా ఆల్రౌండర్ 161 బంతులెదుర్కొని 12 బౌండరీల సాయంతో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. సోలంకి సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఆట రెండో రోజు పూర్తైంది. ప్రస్తుతం బరోడా తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకముందు చంఢీఘర్ తొలి ఇన్నింగ్స్లో 168 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే బరోడా తొలి ఇన్నింగ్స్లో 230 పరుగుల ఆధిక్యంలో ఉండడం విశేషం. చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్గా రోహిత్! Ranji Trophy 2022: తమిళనాడు కవల క్రికెటర్ల సరికొత్త చరిత్ర.. ఒకే ఇన్నింగ్స్లో.. What a player . Has to be the toughest player i have known. A big salute to vishnu and his family by no means this is easy🙏 wish you many more hundreds and alot of success 🙏🙏 pic.twitter.com/i6u7PXfY4g — Sheldon Jackson (@ShelJackson27) February 25, 2022 -
రెండు దశల్లోనే సెంచరీ కొట్టాం
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల అసెంబ్లీ ఎన్నికల్లో తాము సెంచరీ కొట్టామని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం(పూర్తి మెజారిటీ) నాలుగో దశ ఎన్నికల కల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరోజాబాద్ ప్రాంతంలోని నాసిర్పూర్లో గురువారం ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ మాట్లాడారు. మొదటి రెండు దశల్లో మొత్తం 113 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఇందులో 100కు పైగా సీట్లు కచ్చితంగా గెలుకుంటామని పేర్కొన్నారు. సమాజ్వాదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులాల గణాంకాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాబాసాహెబ్ అంబేడ్కర్ అందజేసిన రాజ్యాం గాన్ని కాపాడేందుకు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. చట్టాన్ని అతిక్రమించేవారు, చట్టప్రకారం నడుచుకోనివారు తమ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. తొలిసారి ములాయం ఎన్నికల ప్రచారం సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఈ ఎన్నికల్లో తొలిసారిగా గురువారం మెయిన్పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అఖిలేశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను తమ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అమెరికా సహా ప్రపంచ దేశాల కళ్లు సమాజ్వాదీ పార్టీపైనే ఉన్నాయని చెప్పారు. ప్రచార వేదికపై అఖిలేశ్ యాదవ్ తన తండ్రి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాలు పొందారు. కర్హాల్లో మూడో దశలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఇక్కడ అఖిలేశ్పై బీజేపీ అభ్యర్థిగా ఎస్.పి.సింగ్ బఘేల్ పోటీకి దిగుతున్నారు. ములాయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. -
ఇదేం చిత్రం.. కోహ్లి సెంచరీ కోసం పాక్ ఆటగాళ్ల మొక్కులు
టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లి సెంచరీ మార్క్ సాధించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. కోహ్లి సెంచరీ లేకుండా ఇన్నేళ్లు ఉండడం ఇదే తొలిసారి. అతను ఎప్పుడు సెంచరీ కొడతాడా అని క్రికెట్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులే గాక.. పాక్ క్రికెటర్లు సహా ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లి సెంచరీ కోసం పరితపిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పీఎస్ఎల్(పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్)లో పాల్గొంటున్న ఇస్లామాబాద్ యునైటెడ్ స్ట్రాటెజీ మేనేజర్ హసన్ చీమా తన ట్విటర్లో వెల్లడించాడు. చదవండి: ర్యాంకింగ్స్లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్ ''పీఎస్ఎల్ గురించి ఎక్కువగా ట్వీట్ చేయకూడదు అనుకున్నా. కానీ ఒక విషయం నాకు జీర్ణం కావడం లేదు. పీఎస్ఎల్లో ఆడుతున్న పాక్ ఆటగాళ్ల దగ్గర నుంచి అభిమానుల వరకు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు. అదేంటంటే.. కోహ్లి 71వ సెంచరీ అందుకోవాలని. దీనికోసం పాక్ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. పేరుకే ప్రత్యర్థులం కానీ క్రికెట్లో రాణించే ఆటగాడికి ఏ దేశం నుంచైనా అభిమానులు ఉంటారన్న దానికి కోహ్లియే ఉదాహరణ. కోహ్లి కచ్చితంగా 71వ సెంచరీ సాధిస్తాడు.'' అని ట్వీట్ చేశాడు. ఇది విన్న టీమిండియా అభిమానులు.. ''ఇదేం చిత్రమో.. బయటకు మాత్రం మా చేతిలో పాక్ ఓడిపోతే.. మన దేశాన్ని తిడతారు.'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక కోహ్లి ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే వన్డే, టి20 కెప్టెన్గా పక్కకు తప్పుకున్నాడు. ఇకపై సీనియర్ బ్యాట్స్మన్గా జట్టుకు సేవలందించనున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్లో కోహ్లి పర్వాలేదనిపించాడు. అందరు విఫలమైనచోటు తాను కాస్త సక్సెస్ అయ్యాడు. కేప్టౌన్ టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ 21 పరుగుల తేడాతో ఆ ముచ్చట తీరకుండానే 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే , మూడో వన్డేలో హాఫ్ సెంచరీలు సాధించినప్పటికి.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. 71వ సెంచరీ సాధిస్తాడని ఎదురుచూస్తున్న కోహ్లి అభిమానుల కల.. విండీస్తో సిరీస్లోనైనా తీరుతుందేమో చూడాలి. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా వెస్టిండీస్తో సిరీస్ ఆడనుంది. చదవండి: సిక్స్ కొడితే ఫైనల్కు.. బౌలర్కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్ -
హైదరాబాద్ నగరంలో 17 శతాబ్దం నాటి అరుదైన బావి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర చరిత్రలోనే ప్రఖ్యాతి గాంచింది బన్సీలాల్పేటలోని పురాతన కోనేరు బావి. పదిహేడో శతాబ్దంలో తాగునీటి అవసరాల నిమిత్తం నిర్మించారు. కాలగమనంలో శిథిలావస్థకు చేరుకోవడంతో దీని పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం కట్టింది. నగరంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ( చదవండి: మూడు రోజులు ఇంటి ఎదుటే మృతదేహం.. గల్ఫ్ నుంచి భర్త రాకతో.. ) సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ కోనేరు బావి పునరుద్ధరణ పనులను గురువారం ఆయన మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సహిత స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి కల్పనా రమేష్తో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలకు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. బన్సీలాల్పేట్లో ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి 17వ దశాబ్దంలో కోనేరు బావిని నిర్మించారని, చెత్తాచెదారంతో నిండిన ఈ బావిని పునరుద్ధరించడానికి పనులు ప్రారంభించామన్నారు. ఆగస్టు 15 నాటికి కోనేరు బావి పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అరవింద్కుమార్ మాట్లాడుతూ.. కోనేరు బావి సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటి వరకు 50 లక్షలు ఖర్చు చేశామని, మరో రూ. కోటి ఖర్చు చేసిన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్తు శాఖ డీఈ శ్రీధర్ పాల్గొన్నారు. -
11ఫోర్లు..11 సిక్స్లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆటగాడు ఎవరంటే!
సూపర్ స్మాష్ లీగ్లో భాగంగా శనివారం సెంట్రల్ స్టాగ్స్తో వెల్లింగ్టన్ ఫైర్బర్డ్స్ తలపడింది. ఈ మ్యాచ్లో వెల్లింగ్టన్ ఫైర్బర్డ్స్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ సంచలనం సృష్టించాడు. కేవలం 65 బంతుల్లో 11ఫోర్లు,11 సిక్స్లతో 141 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. బ్రేస్వెల్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా సెంట్రల్ స్టాగ్స్పై వెల్లింగ్టన్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ స్టాగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 227 పరగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెల్లింగ్టన్ 24 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి తప్పదు అనుకున్న సమయంలో కెప్టెన్ బ్రేస్వెల్ సిక్సర్లు, ఫోర్లులతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో వెల్లింగ్టన్ సంచలన విజయం సాదించింది. కాగా సూపర్ స్మాష్ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ బ్రేస్వెల్దే కావడం విశేషం. అదే విధంగా అతడి టీ20 కేరిర్లో ఇదే తొలి సెంచరీ. చదవండి: SA vs IND:"రాహుల్ కాదు.. కోహ్లి స్థానంలో కెప్టెన్గా అతడే సరైనోడు" The sound off the bat! 😍 Michael Bracewell looking to tee off after a horror start for the Firebirds. Firebirds 38/4 (4.2) Watch play LIVE on @sparknzsport or free-to-air on @TVNZ 1 LIVE scoring https://t.co/v49vrPn7pO #WEAREWELLINGTON #SuperSmashNZ pic.twitter.com/RXCJkmL49h — Cricket Wellington (@cricketwgtninc) January 8, 2022 -
60 బంతుల్లో శతకం.. మిచెల్ మార్ష్ విధ్వంసం
బిగ్బాష్ లీగ్ 2021లో మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. బీబీఎల్లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న మార్ష్ 60 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు బాదాడు. హోబర్ట్ హరికేన్స్తో జరిగిన మ్యాచ్లో మార్ష్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. బీబీఎల్ మార్ష్కు ఇది డెబ్యూ సెంచరీ కాగా.. ఈ సీజన్లో రెండోది. ఓవరాల్గా బిగ్బాష్ లీగ్ చరిత్రలో 28వ శతకం. ఇంతకముందు పెర్త్ స్కార్చర్స్కే చెందిన ఓపెనర్ కొలిన్ మున్రో ఈ సీజన్లో తొలి శతకంతో మెరిశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ మిచెల్ మార్ష్(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్ మెక్డెర్మోట్ 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, ఆస్టన్ అగర్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు. Click Here For Video: Mitchel Marsh Century MITCH. MARSH. CENTURY.#BBL11 pic.twitter.com/I4zyNQyv9i — 7Cricket (@7Cricket) December 14, 2021 -
సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్తో కోహ్లి సరసన
Ruturaj Gaikwad Smashes 4th Century Vijay Hazare Trophy 2021.. సీఎస్కే స్టార్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మహారాష్ట్రకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రుతురాజ్ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన రుతురాజ్ తాజాగా చండీఘర్తో ముగిసిన లీగ్ మ్యాచ్లో మరో సెంచరీతో మెరిశాడు. 95 బంతుల్లో 100 పరుగులు చేసిన రుతురాజ్కు.. తాను ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం... ఈ సెంచరీతో విజయ్ హజారే ట్రోఫీలో 500 పరుగులు పూర్తి చేసిన రుతురాజ్ ఒక రికార్డును అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన వారిలో విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, పృథ్వీ షాలు మాత్రమే ఉన్నారు. తాజాగా వీరి సరసన రుతురాజ్ గైక్వాడ్ చేరాడు. విజయ్ హజారే ట్రోఫీ ద్వారా తన పరుగుల దాహాన్ని తర్చుకుంటున్న రుతురాజ్ ప్రస్తుతం సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారాడు. రుతురాజ్ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న కోరుతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసేలోపు రుతురాజ్ పేరును టీమిండియాలో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చదవండి: Martin Coetzee: 21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది మ్యాచ్ విషయానికి వస్తే.. లీగ్లో మహారాష్ట్ర మరో విజయాన్ని దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చంఢీఘర్ నిర్ణతీ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. కెప్టెన్ మనన్ వోహ్రా (139 బంతుల్లో 141, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో మెరవగా.. అర్స్లాన్ ఖాన్ 87, అంకిత్ కౌషిక్ 56 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 48.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రుతురాజ్ గైక్వాడ్(132 బంతుల్లో 168 పరుగులు, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) మరో అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో అజిమ్ కాజీ 73 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం రుతురాజ్ 5 మ్యాచ్ల్లో 603 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. -
సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్ గైక్వాడ్
సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తున్న రుతురాజ్ వరుసగా మూడో సెంచరీ సాధించాడు. కేరళతో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రుతురాజ్ 110 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 129 పరుగులు చేసిన రుతురాజ్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రుతురాజ్కు తోడుగా రాహుల్ త్రిపాఠి(108 బంతుల్లో 99 పరుగులు , 11 ఫోర్లు) రాణించడంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కేరళ ముందు 292 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా రుతురాజ్ ఇంతకముందు మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో (112 బంతుల్లో 136 పరుగులు), చత్తీస్ఘర్తో మ్యాచ్లో (143 బంతుల్లో 154 పరుగులు నాటౌట్) మెరిశాడు. చదవండి: Vijay Hazare Trophy: సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్ కాగా రుతురాజ్ ఇంతకముందు మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో (112 బంతుల్లో 136 పరుగులు), చత్తీస్ఘర్తో మ్యాచ్లో (143 బంతుల్లో 154 పరుగులు నాటౌట్) మెరిశాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో 635 పరుగులతో రుతురాజ్ టాప్ స్కోరర్గా నిలిచి సీఎస్కే టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ మెగావేలానికి ముందు సీఎస్కే తన రిటైన్ జాబితాలో జడేజా, ధోని, మొయిన్ అలీలతో పాటు రుతురాజ్ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
Ishan Kishan: సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔట్
Ishan Kishan Misses Century With 9 Runs.. టీమిండియా-ఏతో జరుగుతున్న నాలుగురోజుల అనధికారిక టెస్టులో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా-ఏ వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సారెల్ ఎర్వీ 85*, జుబేర్ హంజా 78* పరుగులతో క్రీజులో ఉన్నారు. 27 పరుగులు చేసిన పీటర్ మలన్ సైనీ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు టీమిండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 276 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు.153 బంతులెదుర్కొన్న ఇషాన్ కిషన్ 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 91 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్లో క్యూషిల్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హనుమ విహారి 63 పరుగులతో రాణించాడు. చదవండి: David Warner Ashes Series: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్ IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్ కిషన్, హనుమ విహారి -
ధనంజయ సెంచరీ.. డ్రా అయ్యే అవకాశమే ఎక్కువ
గాలే: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా అజేయ సెంచరీ (153 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్లు)తో కదం తొక్కాడు. దాంతో గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 279 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్నైట్ స్కోరు 46/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంకను ధనంజయ ఆదుకున్నాడు. నిసంక (66; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్కు 78 పరు గులు... లసిత్ ఎంబుల్దేనియా (25 బ్యాటింగ్; 1 ఫోర్)తో కలిసి అబేధ్యమైన తొమ్మిదో వికెట్కు 107 పరుగులు జోడించాడు. ఫలితంగా శ్రీలంక పటిష్ట స్థితిలో నిలిచింది. ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశం ఉంది. -
పాకిస్తాన్కు చుక్కలు చూపించిన లిటన్ దాస్..
Update: ఫస్ట్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 330 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ ఐదు వికెట్లు పడగొట్టగా, షహీన్ ఆఫ్రిది, ఆస్రఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. మిడిలార్డర్ మిడిలార్డర్ విఫలం అయినప్పటికీ, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీం 206 పరుగల భాగస్వామ్యాన్ని నమోదు చేసి గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (114),ముష్ఫికర్(91), మెహది హసన్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. ►తొలి టెస్టులో తొలి రోజు ఆటముగిసేసరికి పటిష్ట స్ధితిలో నిలిచిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆదిలోనే లిటన్ దాస్ వికెట్ను కోల్పోయింది. హాసన్ ఆలీ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 206 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. లిటన్ దాస్ 11 ఫోర్లు, 1 సిక్స్ తో 114 పరుగులు సాధించాడు. చిట్టగాంగ్: పాకిస్తాన్తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఒకదశలో 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాను లిటన్ దాస్ (113 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ (82 బ్యాటింగ్; 10 ఫోర్లు) ఐదో వికెట్కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. చదవండి: Shreyas Iyer: డాన్స్ తో ఇరగదీసిన రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్.. వీడియో వైరల్ -
అరంగేట్ర మ్యాచ్లో రికార్డులు సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
Shreyas Iyer Century in Debut match: టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర టెస్టు మ్యాచ్లో పలు రికార్డులు సృష్టించాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో మెరిశాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అదే విధంగా డెబ్యూ మ్యాచ్లో న్యూజిలాండ్పై సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. 168 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 105 పరుగులు శ్రేయాస్ అయ్యర్ సాధించాడు. 105 పరుగులు చేసిన అయ్యర్ సౌథీ బౌలింగ్లో విల్ యంగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కాగా తొలి రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ చేతుల మీదుగా టీమిండియా క్యాప్(303)ను శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు. 🎥 A moment to cherish for @ShreyasIyer15 as he receives his #TeamIndia Test cap from Sunil Gavaskar - one of the best to have ever graced the game. 👏 👏#INDvNZ @Paytm pic.twitter.com/kPwVKNOkfu — BCCI (@BCCI) November 25, 2021 చదవండి: IND-A Vs SA- A: టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్పై కోపంతో ఏం చేశాడంటే.. -
732 రోజులు.. సెంచరీ కోసం పరితపిస్తున్నాడు!
టీమిండియా మెషిన్గన్ విరాట్ కోహ్లి సెంచరీ చేసి రెండేళ్లవుతుంది. దాదాపు 732 రోజులు పాటు కోహ్లి ఒక్క ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేకపోయాడు. ఆఖరుగా కోహ్లి సెంచరీ చేసింది 2019లో.. అది బంగ్లాదేశ్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పింక్బాల్ టెస్టులో చేశాడు.ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి ఇప్పుడు మాత్రం ఒక్క సెంచరీ కోసం పరితపిస్తున్నాడు. చదవండి: 2025 చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో.. ఐసీసీకి పెద్ద సవాల్ టి20 ప్రపంచకప్ 2021 ముగిసిన అనంతరం టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. తాజాగా కివీస్తో జరిగిన టి20 సిరీస్కు దూరంగా ఉన్నాడు. ఇక నవంబర్ 25 నుంచి జరగనున్న తొలి టెస్టుకు దూరంగా ఉండనున్న కోహ్లి రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్ ప్రారంబించాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేసిన కోహ్లి.. గ్రౌండ్ మొత్తం పరిగెత్తి తన ఫిట్నెస్ లెవెల్ను పెంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ కోహ్లి ఫ్యాన్ ఒకరు ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక డిసెంబర్ 3 నుంచి ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టులో కోహ్లి సెంచరీ చేయాలని అతని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ►కోహ్లి చివరి సెంచరీ తర్వాత 12 టెస్టుల్లో 563 పరుగులు చేశాడు. ►732 రోజుల్లో కోహ్లి ఐదు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ►గత 21 ఇన్నింగ్స్ల్లో కోహ్లి మూడుసార్లు డక్.. నాలుగుసార్లు సింగిల్ డిజిట్కే పరిమితం ►అన్ని ఫార్మాట్లు కలిపి 56 ఇన్నింగ్స్లుగా కోహ్లి సెంచరీ చేయలేకపోవడం ఇదే తొలిసారి చదవండి: KL Rahul: కివీస్తో టెస్టుకు ముందు బిగ్షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్ Practice before the storm at mumbai only vk can relate pic.twitter.com/Vfw9mCMypM — king kohli ⚔️ (@kingkohliera1) November 23, 2021 -
SL Vs WI: కరుణరత్నే సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలె: వెస్టిండీస్తో ఆదివారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్లో శ్రీలంక క్రికెట్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 88 ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగులు సాధించింది. కెప్టెన్, ఓపెనర్ దిముత్ కరుణరత్నే (265 బంతుల్లో 132 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు.దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. 2021లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అత్యధికంగా 6 సెంచరీలు చేశాడు. కాగా మరో ఓపెనర్ పథుమ్ నిసాంక (140 బంతుల్లో 56; 7 ఫోర్లు)తో కలిసి కరుణరత్నే తొలి వికెట్కు 139 పరుగులు జోడించి లంకకు శుభారంభం ఇచ్చాడు. కరుణరత్నే టెస్టు కెరీర్లో ఇది 13వ సెంచరీ. నిసాంక అవుటయ్యాక ఒషాడా ఫెర్నాండో (3), మాథ్యూస్ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం కరుణరత్నేతో ధనంజయ డిసిల్వా (77 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించారు. చదవండి: IND Vs NZ: పాపం హర్షల్ పటేల్.. రాహుల్ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు.. -
శతక్కొట్టిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు.. 61 బంతుల్లో 119 నాటౌట్
Prabhsimran smashes Cracking Century Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి 2021-22 సీజన్లో భాగంగా గోవాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు ప్రభ్సిమ్రన్(61 బంతుల్లో 119; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా పంజాబ్ 81 పరుగుల తేడాతో గోవాపై భారీ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్సిమ్రన్ సహా శుభ్మన్ గిల్(36 బంతుల్లో 40; 2 ఫోర్లు), అభిషేక్ శర్మ(17 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం ఛేదనలో పంజాబ్ బౌలర్లు సిద్దార్ధ్ కౌల్(3/21), హర్ప్రీత్ బ్రార్(2/12), మయాంక్ మార్కండే(2/29) రాణించడంతో గోవా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 116 పరుగులకే పరిమితమైంది. గోవా ఇన్నింగ్స్లో సుయాశ్ ప్రభుదేశాయ్(30), శుభమ్ రాంజనే(19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్(ముస్తాక్ అలీ ట్రోఫి)లో ఐపీఎల్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్(చెన్నై), దీపక్ హుడా(పంజాబ్ కింగ్స్), ప్రభ్సిమ్రన్ సింగ్(పంజాబ్ కింగ్స్) చెలరేగి ఆడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో రుతురాజ్ 70.67 సగటుతో 212 పరుగులు చేయగా.. దీపక్ హుడా 195 సగటుతో 195, ప్రభ్సిమ్రన్ సింగ్ 71 సగటుతో 142 పరుగులు స్కోర్ చేశారు. చదవండి: T20 World Cup 2021: ఆసీస్ చేతిలో విండీస్ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..! -
అమీ హంటర్ సంచలన రికార్డు.. మిథాలీ రికార్డు బద్దలు
Amy Hunter Becomes Youngest Batter to Hit International Century: ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ మహిళా క్రికెటర్ అమీ హంటర్ సంచలన రికార్డు సృష్టించింది. జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో వన్డేలో 127 బంతుల్లో 7 ఫోర్లతో 121 పరుగులు చేసిన హంటర్.. అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్గా రికార్డులకెక్కింది. 16 ఏళ్ల అమీ హంటర్.. ఇంతకు ముందు భారత కెప్టెన్ మిథాలీరాజ్ పేరిట ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేసింది. అయితే ఆమె తన పుట్టినరోజునే ఈ ఘనతను సాధించడం గమనార్హం. విదేశాల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఐర్లాండ్ మహిళా క్రికెటర్గానూ అమీ హంటర్ రికార్డు క్రియాట్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ నీర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. కాగా 25 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 110 పరగులు చేసింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ కోనసాగుతుంది. చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో బయట పెట్టిన కోహ్లి... -
ఐపీఎల్లో రుతురాజ్ డెబ్యూ సెంచరీ.. రికార్డుల మోత
Ruturaj Gaikwad Debue Century In IPL.. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో తొలి సెంచరీతో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సెంచరీ మోత మోగించాడు. 60 బంతుల్లో 101 పరుగులు సాధించిన రుతురాజ్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు.. 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ తాను ఆడుతున్న సీఎస్కే జట్టుతో పాటు వ్యక్తిగతంగా పలు రికార్డులు సాధించాడు. ►రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ ►సీఎస్కే తరపున ఐపీఎల్లో తొమ్మిదో సెంచరీ చేసిన ఆటగాడిగా గైక్వాడ్ రికార్డు ►సీఎస్కే తరపున పిన్న వయసులో(24 ఏళ్ల 244 రోజులు) సెంచరీ కొట్టిన గైక్వాడ్ ►ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్పై ఒక ఆటగాడు సెంచరీ కొట్టడం ఇది ఏడోసారి ►ఇక సీఎస్కే తరపున సెంచరీ కొట్టిన మూడో ఆటగాడిగా గైక్వాడ్. ఇంతకముందు 2010లో మురళి విజయ్, 2018లో షేన్ వాట్సన్ సెంచరీలు సాధించారు. Courtesy: Youtube -
డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ.. స్మృతి మంధాన సరి కొత్త చరిత్ర
Smriti Mandhana Maiden Century: భారత ఓపెనర్ స్మృతి మంధాన (216 బంతుల్లో 127; 22 ఫోర్లు, 1 సిక్స్) ‘పింక్ బాల్’ టెస్టులో చరిత్రకెక్కింది. భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో ఆమె శతకం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన రెండో రోజు ఆటలో ఆమె సెంచరీ హైలైట్గా నిలిచింది. వర్షంతో ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. రెండో రోజు వర్షం, ప్రతికూల వాతా వరణంతో 57.4 ఓవర్ల ఆటే సా«ధ్యమైంది. డిన్నర్ బ్రేక్ తర్వాత ఆట కాసేపే (17 ఓవర్లు) జరిగింది. పటిష్టస్థితిలో భారత్ ఓవర్నైట్ స్కోరు 132/1తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ను స్మృతి పటిష్ట స్థితిలో నిలిపింది. ఆట మొదలైన రెండో ఓవర్లోనే పెర్రీ క్యాచ్ జారవిడువడటంతో బతికిపోయిన స్మృతి తర్వాత ఎలాంటి పొరపాటుకు తావివ్వలేదు. స్ట్రయిట్ డ్రైవ్లతో బౌలర్లను ఓ ఆటాడుకుంది. ఆఫ్సైడ్లో ఫీల్డర్లను పదేపదే పరిగెత్తించింది. ఆమె చేసిన 127 పరుగుల్లో 94 (22 ఫోర్లు, సిక్స్) పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. 170 బంతుల్లో కెరీర్లో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేసిన ఆమె రెండో వికెట్కు పూనమ్ రౌత్తో కలిసి 102 పరుగులు జతచేసింది. స్వల్ప వ్యవధిలో స్మృతితో పాటు రౌత్ (36; 2 ఫోర్లు) నిష్క్రమించాక 231/3 స్కోరు వద్ద భారత్ భోజన విరామానికెళ్లింది. తర్వాత కెపె్టన్ మిథాలీ రాజ్ (30; 5 ఫోర్లు), యస్తిక భాటియా (19) కాసేపు ఆడారు. ఆట నిలిచే సమయానికి దీప్తి శర్మ (12 బ్యాటింగ్), తానియా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సోఫీ మోలినెక్స్కు 2 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విదేశీ మహిళా క్రికెటర్గా స్మృతి గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు మోలీ హైడ్ (124 నాటౌట్–ఇంగ్లండ్; 1949లో) పేరిట ఉండేది. ఆ్రస్టేలియా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ స్మృతి. సంధ్యా అగర్వాల్ (134; 1984లో) తర్వాత ఆ్రస్టేలియా జట్టుపై టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్ స్మృతి. ఆ్రస్టేలియా జట్టుపై వన్డేల్లో, టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్ స్మృతి. గతంలో ఎనిడ్ బేక్వెల్ (ఇంగ్లండ్), దెబోరా హాక్లీ (న్యూజిలాండ్), క్లెయిర్ టేలర్ (ఇంగ్లండ్) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
11 సిక్సర్లతో లూయిస్ విధ్వంసం.. సెంచరీతో గెలిపించాడు
సెంట్కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఎవిన్ లూయిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఆద్యంతం సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించిన లూయిస్ సెంచరీతో నాటౌట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. 52 బంతుల్లో 102 పరుగులు చేసిన లూయిస్ ఇన్నింగ్స్లో 11 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ విజయంతో సెంట్ కిట్స్ పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి చేరుకొని ప్లేఆఫ్కు క్వాలిఫై అయింది. చదవండి: Nicholas Pooran: సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్కు మరింత చేరువగా మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్బాగో నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖర్లో సునీల్ నరైన్( 18 బంతుల్లో 33, 4 సిక్సర్లు, ఒక ఫోర్) ఆకట్టుకున్నాడు. సెంట్ కిట్స్ బౌలర్లలో డొమినిక్ డ్రేక్స్ , జాన్ జాగేసర్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్కు ఓపెనర్లు గేల్, లూయిస్లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా గేల్ ఉన్నంతసేపు దడదడలాడించాడు. 18 బంతుల్లో 35 పరుగులు చేసిన గేల్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, సిక్సర్ ఉన్నాయి. గేల్ ఔటైన తర్వాత బాధ్యతను ఎత్తుకున్న లూయిస్ మిగతా పనిని పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే సిక్సర్తో సెంచరీ పూర్తి చేసిన లూయిస్ మ్యాచ్ను గెలిపించాడు. చదవండి: IPL 2021: బెయిర్ స్టో స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు Evin Lewis 💯 This #IPL gonna be good! @rajasthanroyals 🔥🔥 #RR pic.twitter.com/kumGve2Hrc — Frank (@franklinnnmj) September 12, 2021 -
వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’
ఓవల్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) అద్భుత శతకంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 94 పరుగుల వద్ద మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది కెరీర్లో తొలి ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్గా రోహిత్కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. The greatest pleasure in life is doing what people say you cannot do 😊😊 — Rohit Sharma (@ImRo45) September 14, 2016 ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ ఎప్పుడో 2016లో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. దీన్ని ట్రోల్ చేస్తున్న అతని అభిమానులు రోహిత్ చెప్పాడంటే చేస్తాడంతే అంటూ కామెంట్ల రూపంలో హంగామా చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. మనం ఏదైతే చేయలేమని జనం అనుకుంటారో.. దానిని చేసి చూపించడం కంటే ఆనందం మరొకటి ఉండదని రోహిత్ 2016, సెప్టెంబర్ 14న ట్వీట్ చేశాడు. చదవండి: అచ్చం సెహ్వాగ్లాగే.. సచిన్ ఒక్కడే అత్యధికంగా ఇలా..! ఆ ట్వీట్ను ఇప్పుడు రోహిత్ అభిమానులు వైరల్గా మార్చేశారు. ఎందుకంటే.. టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతున్నా, విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడన్న అపవాదు రోహిత్పై ఉంది. మొత్తానికి ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో రోహిత్ ఆ అపవాదును చెరిపేసుకున్నాడు. కీలకమైన సమయంలో సెంచరీ చేసి తన సత్తా ఏంటో చాటడంతోపాటు జట్టును కూడా ఆదుకుని, తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం క్రీజ్లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. చదవండి: డుప్లెసిస్ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు.. -
Virat Kohli: కోహ్లి ఫిఫ్టి కొట్టాడు.. ఎలానో చూడండి..
లీడ్స్: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లీడ్స్ వేదికగా బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 78 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (7) మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. ఆండర్సన్ బౌలింగ్లో ఆఫ్ స్టంప్కి ఆవల వెళ్తున్న బంతిని వెంటాడి మరీ వికెట్ కీపర్ జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్ట్ల్లో కోహ్లిని అత్యధిక సార్లు(7) ఔట్ చేసిన బౌలర్గా ఆండర్సన్ రికార్డు నెలకొల్పాడు. Half-century for Virat Kohli… That’s 50 consecutive international innings without a century for the Indian skipper.#ENGvIND — Nic Savage (@nic_savage1) August 25, 2021 ఇదిలా ఉంటే, కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతను చివరిసారిగా 2019 నవంబర్లో బంగ్లాదేశ్పై (డే/నైట్ టెస్ట్) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అడపాదడపా అర్ధశతకాలు చేశాడు. ఇప్పటి వరకూ టెస్ట్లు, వన్డేల్లో కలిపి 70 శతకాలు సాధించిన కోహ్లి.. ఇంగ్లండ్ సిరీస్లోనైనా 71వ శతకాన్ని సాధిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన ఈ రన్ మెషీన్.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు. 2021లో కూడా అదే దిశగా సాగుతున్నాడు. We think @jimmy9 enjoyed this one! 💥 Scorecard/Videos: https://t.co/UakxjzUrcE 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/3zGBCmJlhQ — England Cricket (@englandcricket) August 25, 2021 కాగా, నేటి ఇన్నింగ్స్తో కోహ్లి శతక్కొట్టక 50 ఇన్నింగ్స్లు పూర్తి అయ్యాయి. మూడు ఫార్మాట్లలో కలిపి గడిచిన 50 ఇన్నింగ్స్లలో అతను మూడంకెల స్కోర్ను చేరుకోలేకపోయాడు. ఇందులో 18 టెస్ట్ ఇన్నింగ్స్లు, 15 వన్డే ఇన్నింగ్స్లు, 17 టీ20 ఇన్నింగ్స్లు ఉన్నాయి. దీంతో మూడో టెస్టుతో కోహ్లి హాఫ్ సెంచరీ కొట్టాడని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. కోహ్లీ 71 సెంచరీ చేయడం ఓ కలగా మిగిలిపోనుంది.. అతను రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. People waiting for Kohli's 71st century will remain a dream 😭😭 — Surendra Reddy☮️ (@Indiranandhan) August 25, 2021 Le Anushka:#INDvENG #Kohli pic.twitter.com/rK9WVT1hQ7 — Rahul Chauhan (@_NeverOnside) August 25, 2021 చదవండి: హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. -
బయటపడ్డ పదో శతాబ్దం నాటి శిల్పాలు..ఎలా ఉన్నాయో తెలుసా?
సాక్షి, నార్సింగి(తూప్రాన్): మెదక్జిల్లా నార్సింగి మండల కేంద్రశివారులో శైవవీరగల్లు వీరుల రాతి శిల్పాలు గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ అన్నారు. నార్సింగి శివారులో రెండోరోజు పర్యటనలో భాగంగా గురువారం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద రాష్ట్ర కూటుల కాలం నాటివిగా భావించే రాతిపై చెక్కిన శిల్పాలను గుర్తించామన్నారు. మూడు రకాల వీరగల్లుల శిల్పాలు ఉండగా, వాటిలో కత్తిని చేబట్టి చేతిలో ఫలం పట్టుకున్న ఆత్మాహుతి వీరగల్లు శిల్పం ముఖ్యమైందన్నారు. 10వ శతాబ్దానికి చెందిన ఈ శిల్పాలు పెద్ద పెద్ద మీసాలతో భయంగొలిపే ముఖంతో ఉన్నాయని తెలిపారు. శిల్పాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురిస్తామని చెప్పారు. క్షేత్ర పరిశోధనలో ఫొటోగ్రాఫర్ కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిదో నెంబర్ ఆటగాడు అజేయ శతకం; బంగ్లా భారీస్కోరు
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ మహ్ముదుల్లా (150 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. దీంతో 294/8 ఓవర్నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 126 ఓవర్లలో 468 పరుగుల వద్ద ఆలౌటైంది. మహ్ముదుల్లా, టెయిలెండర్ టస్కిన్ అహ్మద్ (75; 11 ఫోర్లు) తొమ్మిదో వికెట్కు 191 పరుగులు జోడించడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక తొమ్మిదవ వికెట్ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. కైటనో (33 బ్యాటింగ్), టేలర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
కోహ్లి.. ఇంకా ఎన్నాళ్లు ఈ నిరీక్షణ
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి 'మెషిన్ గన్' అని పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కోహ్లి బరిలో ఉన్నాడంటే సెంచరీ చేసేదాకా ఔటయ్యేందుకు ఇష్టపడేవాడు కాదు. అందుకు తగ్గట్టుగానే తన బ్యాటింగ్ కొనసాగిస్తూ ఫార్మాట్తో సంబంధం లేకుండా సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ పోయాడు. ముఖ్యంగా సెంచరీల విషయంలో వన్డేల్లో కోహ్లికి మంచి రికార్డు ఉంది. ఇప్పటికే 43 వన్డే సెంచరీలు సాధించిన అతను సచిన్ (49 సెంచరీల)రికార్డుకు మరో ఆరు సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇంతటి ఘనమైన రికార్డులు కలిగి ఉన్న విరాట్ కోహ్లి బ్యాట్ ఏడాదిన్నర నుంచి కళ తప్పింది. అతను సెంచరీ చేసి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది. కోహ్లి చివరగా 2019 నవంబర్లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో సెంచరీ(114*)తో మెరిశాడు. అప్పటినుంచి మళ్లీ అతని బ్యాట్ నుంచి ఒక్క ఫార్మాట్లోనూ శతకం రాలేదు. ఈ ఏడాదిన్నర కాలంలో కరోనా, లాక్డౌన్ కాలం తీసేస్తే టీమిండియా తరపున మూడు ఫార్మాట్లు కలిపి 41 మ్యాచ్లు ఆడి 1703 పరుగులు చేశాడు. ఇందులో 8 టెస్టుల్లో 345 పరుగులు చేయగా.. అత్యధిక స్కోరు 74, 15 వన్డేల్లో 649 పరుగులు.. అత్యధిక స్కోరు 89, ఇక చివరగా 18 టీ20ల్లో 709 పరుగులు చేసిన కోహ్లి 94* అత్యధిక స్కోరును సాధించాడు. మొత్తంగా 17సార్లు అర్థశతకాలను అందుకున్న కోహ్లి వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. ఇంకో విశేశమేమిటంటే 46 ఇన్నింగ్స్ల(అన్ని ఫార్మాట్లు) నుంచి ఒక్క శతకం లేకుండా ఉన్న కోహ్లి ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. దీనికి తోడు తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో.. మేజర్ ఈవెంట్స్లో ఒక్క టైటిల్ గెలవకపోవడంతో అతని కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో '' కోహ్లి నీ సెంచరీ కోసం ఇంకా ఎన్నాళ్లు నిరీక్షించాలో'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలాంటి అనుభవాలే గతంలో తొలి టెస్టు చాంపియన్షిప్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు ఎదురైంది. విచిత్రమేంటంటే విలియమ్సన్కు 23 ఇన్నింగ్స్ల పాటు రెండేసీసార్లు(2012, 2015-16) సెంచరీ మార్క్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతనితో పాటు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ 28 ఇన్నింగ్స్ల పాటు ఒక్క సెంచరీ నమోదు చేయలేదు. చదవండి: ఒక్క మ్యాచ్తో ప్రపంచ చాంపియనా: విరాట్ కోహ్లి 1983.. ఆ చరిత్రకు 38 ఏళ్లు -
వందేళ్లుగా వణికిస్తున్నాయి.. నిలబడుతూనే ఉన్నాం
కొవిడ్-19 మహమ్మారితో మానవాళి సహజీవనం ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. వైరస్ తీరు తెన్నులు గందరగోళంగా ఉండడంతో సరైన మందు కనిపెట్టడం పరిశోధకులకు కష్టంగా మారుతోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రమాదకరమైన అంటువ్యాధుల్ని, మహమ్మారుల్ని ఎదుర్కొన్నాం. తట్టుకుని నిలబడగలిగాం. స్పానిష్ ఫ్లూ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్గా స్పానిష్ ఫ్లూ చెప్తుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మందికి సోకినట్లు ఒక అంచనా. అదే విధంగా కోట్ల సంఖ్యలో మనుషులు స్పానిష్ ఫ్లూకి బలయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనిషి అపరిశుభ్రమైన అలవాట్ల నుంచి పుట్టిన ఈ వైరస్.. చాలా వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. భారత సైనికుల ద్వారా 1918లో బాంబే(ఇప్పుడు ముంబై) నుంచి తొలి కేసు మొదలై.. రైల్వే ప్రయాణాల వల్ల మన దేశంలో వేగంగా విస్తరించింది(బాంబే ఫీవర్గా పిలిచారు). బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్క్ష్యంతో కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. చివరికి.. విమర్శలతో మెరుగైన మందులు తీసుకొచ్చి వైద్యం అందించడం మొదలుపెట్టాక పరిస్థితి రెండేళ్లకు అదుపులోకి వచ్చింది. కలరా కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. 1961 టైంలో ఇండోనేషియా నుంచి ఎల్ టొర్ స్ట్రెయిన్ మొదలై.. మూడేళ్ల తర్వాత మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గంగా పరివాహక ప్రాంతంలో అపరిశుభ్రత, కలకత్తా(కొల్కట్టా) వాతావరణం ఈ కలరా విజృంభణకు దారితీసింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. దీని కట్టడికి ఏడాదిపైనే సమయం పట్టింది. ఇక కలరా నివారణకు వ్యాక్సిన్ను 1885లోనే తయారు చేసినా.. ఈ మహమ్మారి విజృంభణ ఆగకపోవడం విశేషం. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఇప్పటికీ కలరా ఉనికి ఉన్నప్పటికీ.. వైద్య రంగం అభివృద్ధితో తారా స్థాయిలో అది వ్యాపించడం లేదు. స్మాల్ఫాక్స్ అంటువ్యాధి మశూచి. ఈజిప్ట్ల కాలం నుంచే ఉందని భావిస్తున్న ఈ వ్యాధిని..1520లో అధికారికంగా గుర్తించారు. 1980లో నిర్మూలించబడిన వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగసంస్థ చేర్చింది. ఇక మన దేశంలో 1974 జనవరి నుంచి మే మధ్య ఐదు నెలలపాటు స్మాల్ఫాక్స్తో 15,000 మంది చనిపోయారు. తట్టుకోగలిగిన వాళ్లలో చాలా మంది చూపు పొగొట్టుకున్నారు. కకావికలం చేసిన ఈ అంటువ్యాధి.. చివరికి డబ్ల్యూహెచ్వో చొరవతో అదుపులోకి తేగలిగారు. 1977లో మన దేశంలో మశూచిని అదుపులోకి తేగలిగారు. అయితే మశూచికి 1796లోనే వ్యాక్సిన్(ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టాడు) తయారుచేసినప్పటికీ.. పూర్తిగా నిర్మూలించడానికి రెండు వందల సంవత్సరాలకు పైనే పట్టడం విశేషం. సూరత్ ప్లేగు భయంకరమైన అంటువ్యాధి. బ్యాక్టీరియా ద్వారా ఎలుకలు వాహకంగా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది. 1994లో గుజరాత్ సూరత్లో ప్లేగు కేసులు మొదలయ్యాయి. తెరిచి ఉన్న నాలలు, చెత్త కుప్పలు, చచ్చిన ఎలుకల ద్వారా ఇది మొదలైంది. దీంతో లక్షల మంది పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఇది వ్యాధి మరింత వ్యాపించడానికి కారణమైంది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యే దీని విజృంభణ కొనసాగింది. అయితే ఇది ఎక్కువగా విస్తరించకపోవడంతో 52 మంది మాత్రమే చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. పైగా దీని వ్యాప్తి విషయంలో నెలకొన్న గందరగోళం నడుమే.. ఈ వ్యాధి కనుమరుగుకావడం విశేషం. డెంగ్యూ, చికున్గున్యా 1635లో వెస్టిండీస్లో మొదటిసారిగా డెంగ్యూను అంటువ్యాధిగా గుర్తించారు. చికున్గున్యా కేసుల్ని 1952లో టాంజానియాలో గుర్తించారు. ఇక 2006లో ఒకేసారి డెంగ్యూ, చికున్గున్యా వ్యాధులు రాష్ష్ర్టాలను అతలాకుతలం చేశాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధులు.. ఢిల్లీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) ఎక్కువ ప్రభావం చూపెట్టాయి. 2006లో భారత్లో అధికారికంగా డెబ్భై వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 50 మరణాలు సంభవించాయి. దేశంలో పదకొండు లక్షల చికున్గున్యా కేసులు నమోదుకాగా.. ప్రభుత్వం మాత్రం మరణాల లెక్క సున్నా అని చెప్పడం విమర్శలకు దారితీసింది. ఎన్సెఫలిటిస్(మెదడువాపు) జపనీస్ ఎలిటిస్(జేఈ) 1871లో జపాన్లో మొదటి కేసును గుర్తించారు. ఎక్యుట్ ఎస్పెఫలిటిస్ సిండ్రోమ్(ఎఈఎస్) కేసును 1955లో మద్రాస్ రీజియన్లో గుర్తించారు. 1978 నుంచి పాతిక వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొన్న వ్యాధి ఇది. 2017లో గోరఖ్పూర్(యూపీ) నుంచి వీటి విజృంభణ ఎక్కువైంది. దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకి.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.ఆ ఏడాదిలో మొత్తం 4,759 ఎఈఎస్ కేసులు నమోదు కాగా, 595 మరణాలునమోదు అయ్యాయి. జేఈ కేసుల సంఖ్య 677 కాగా, 81 మరణాలు సంభవించాయి. చికిత్స ద్వారానే ఈ వ్యాధిని అదుపు చేయడం విశేషం. నిఫా వైరస్ జునోటిక్(జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది) వైరస్. మనుషులతో పాటు పందులపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. నిఫా వైరస్ గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1998లో మలేషియాలో నిఫామొదటి కేసును గుర్తించారు. అక్కడి సుంగై నిఫా అనే ఊరి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2018 మే నెలలో కేరళలో నిఫా కేసులు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో 18 మంది చనిపోగా.. కేవలం నెలలోనే పరిస్థితిని పూర్తిగా అదుపు చేసుకోగలిగింది కేరళ. దీనికి వ్యాక్సిన్ లేదు. అప్రమత్తంగా ఉండడమే మార్గం. సార్స్ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ రకాల్లో ఒకటి సార్స్. 21వ శతాబ్దంలో వేగంగా వ్యాపించే జబ్బుగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో చైనా ఫొషన్ నుంచి మొదలైంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2003లో సార్స్(సార్స్ కోవ్) మన దేశంలో మొదటి కేసు నమోదు అయ్యింది. మొత్తం మూడుకేసులు నమోదుకాగా.. అంతా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది సార్స్ బారినపడగా.. 774 మంది మృతిచెందారు. దీని కొత్త స్ట్రెయినే ఇప్పడు కరోనా వైరస్(సార్స్ కోవ్ 2)గా విజృంభిస్తోంది. -
శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్
సౌతాంప్టన్: ఇంగ్లండ్ పిచ్లకి టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తొందరగానే అలవాటుపడినట్లు కనిపిస్తోంది. ఈ నెల 3న సౌతాంప్టన్కి చేరుకున్న భారత క్రికెటర్లు.. గత మూడు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్లో బిజీగా గడుపున్నారు. ఈ క్రమంలో నిన్న భారత బృందం రెండు జట్లుగా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత శతకంతో (94 బంతుల్లోనే 121 పరుగులు) అజేయంగా నిలువగా, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అర్ధశతకంతో (135 బంతుల్లో 85 పరుగులు) రాణించాడు. వీరిద్దరి ధాటికి సహచర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోగా, ఇషాంత్ శర్మ(3/36) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ స్కోర్కు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంత స్కోరు చేశారన్న విషయాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, 2018లో మొదటిసారి ఇంగ్లండ్లో పర్యటించిన రిషబ్ పంత్.. సూపర్ సెంచరీతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్లోనూ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ పిచ్లపై అతని రికార్డు మరింత మెరుగుపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో.. పంత్ ఫామ్లోకి రావడం భారత జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది. కాగా, డబ్యూటిసీ ఫైనల్ తర్వాత భారత్.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది. చదవండి: India vs Sri Lanka: రేపటి నుంచి ధవన్ సేన క్వారంటైన్ షురూ -
పెట్రో సెగ: మరోసారి సెంచరీ కొట్టిన పెట్రోలు
సాక్షి, ముంబై: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 29 పైసలు, డీజిల్పై 31 పైసలు చొప్పున పెంచుతూ చముర కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో లీటరు పెట్రోలు ధర మరోసారి సెంచరీ కొట్టింది. దేశంలో పెట్రోలు ధర రూ.100 మార్కును దాటడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో మొదటిసారి 100 రూపాయలను దాటి వాహన దారులను బెంబేలెత్తించింది. రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ లీటరుకు రూ .102.15 ను తాకింది. ఇక్కడ డీజిల్ రేటు రూ .94.62 గా ఉంది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ .101.86 వద్ద ఉండగా, లీటరు డీజిల్ రేటు రూ. 92.90గా ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు 102 రూపాయలను తాకడం గమనార్హం. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ. 91.27, డీజిల్ రూ. 81.73 ముంబైలో పెట్రోల్ రూ .97.61, డీజిల్ రూ .88.82 కోల్కతాలో పెట్రోల్ రూ .91.41, డీజిల్ రూ .84.57 చెన్నైలో పెట్రోల్ రూ .93.15, డీజిల్ రూ .86.65 హైదరాబాద్లో పెట్రోల్ రూ .94.86, డీజిల్ రూ .89.11 అమరావతిలో పెట్రోల్ రూ .97.42 డీజిల్ రూ .91.12 -
కాన్పుల వేల్పు.. మదురై తొలి మహిళా డాక్టర్ పద్మావతి
వేల మందికి ఆరోగ్యవంతమైన పుట్టినరోజులను ప్రసాదించిన మదురై కార్పొరేషన్ తొలి మహిళా డాక్టర్ పద్మావతి నేడు తన నూరవ యేటను పూర్తి చేసుకుంటున్నారు. ఆడపిల్లేంటి, మెడిసిన్ చదవడమేంటి అనే ఆ కాలపు అభ్యంతరాలను ఎదుర్కొని, ప్రభుత్వ డాక్టర్ అయి, ప్రసూతి మరణాలను తగ్గించడానికి గర్భిణుల ఇళ్లకే డాక్టర్లు వెళ్లి డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు పద్మావతి. మెడికల్ ఆఫీసర్ గా కూడా మహిళల ఆరోగ్యం కోసం వైద్యచికిత్సల వ్యవస్థలో ఇంకా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఈ ఆబ్స్టెట్రీషియన్ వృత్తిగత, వ్యక్తిగత జీవిత విశేషాలివి. గత ఎనిమిదేళ్లుగా కీళ్లవాతం, గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ డాక్టర్ పద్మావతిని అడుగు తీసి అడుగు వేయకుండా చేస్తున్నాయి కానీ.. నూరేళ్లన్నది ఆమెను ఏమాత్రం నిరుత్సాహ పరిచే వయసు కాదు. ఏప్రిల్ 27న ఆమె 100వ పుట్టిన రోజును జరిపేందుకు ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే అది కేవలం ఆ ఇంటి వేడుక మాత్రమే కాదు. మదురై కార్పోరేషన్లోని ప్రతి ఇంటికి సంతోషాన్నిచ్చే సందర్భం. డాక్టర్ పద్మావతి ఆబ్స్టెట్రీషియన్. నార్మల్ డెలివరీలు చేయడంలో నిపుణురాలు. మదురై తొలి మహిళా డాక్టర్! తమిళనాడులోని మదురై 1950 లో మున్సిపాలిటీ అయింది. 1971లో కార్పోరేషన్ అయింది. 1949లో ఆమె మదురైలోని ‘గవర్నమెంట్ ఎర్స్కైన్ హాస్పిటల్’లో హౌస్ సర్జన్గా చేరారు. మద్రాస్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చేసింది. అయితే పద్మావతి ఏనాడూ అదొక ఉద్యోగంలా చేయలేదు. యజ్ఞంలా నిర్వహించారు. సుఖ సాధారణ ప్రసవాలు, మాతాశిశు ఆరోగ్యమే ఆ యజ్ఞఫలాలు. ఆమె చేరేటప్పటికే అక్కడ ఆమె తండ్రి సీనియర్ సివిల్ సర్జన్. ఆయన ఎంత గొప్ప వైద్యుడైనా గానీ, కూతుర్ని మెడిసిన్ చదివించడమే గొప్పతనంగా ఆనాడు ఆయన గుర్తింపు పొందారు! పద్మావతి ఆస్టిన్ కారును తనే డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి రావడం కూడా అప్పట్లో పెద్ద విశేషం అయింది. తండ్రి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో కదా అన్నారంతా. పెద్ద కుమారుడు గురుసుందర్ పెళ్లిలో పద్మావతి (కుడి చివర) యూఎస్లో కొందరు, చెన్నైలో కొందరుగా ఉన్న ముగ్గురు కొడుకులు, కూతురు, వాళ్ల జీవిత భాగస్వాములు, ఎనిమిది మంది మనవలు, నలుగురు మునిమనవలు పద్మావతి నూరవ పుట్టిన రోజు వేడుకలు చేయాలని ఉత్సాహ పడుతున్నారు. అయితే అందుకు ఆమె ఒప్పకోవడం లేదు.‘‘ఒక కేట్ కట్ చేయించి ఆ వీడియోను అందరికీ పంపిస్తే సరిపోతుంది’’ అని నిరంతరం తననే కనిపెట్టుకుని ఉండే పెద్ద కొడుకు డాక్టర్ గురుసుందర్కు ఆమె ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. కరోనా గురించే ఆమె ఆందోళన. 1921 ఏప్రిల్ ఇరవై ఏడున ఆమె పుట్టగానే ఆమె తండ్రి డాక్టర్ ఆర్. సుందరరాజన్ ఆమెను కారణ జన్మురాలు అనేశారు! తొలి బిడ్డ ఆమె. ఆపై అప్పటికప్పుడు చిన్న పాట కూడా రాశారు. ఆ పాటలో ఆమె పేరు ముని ప్రేమ. పద్మావతి తల్లి మునియమ్మాళ్ పేరు మీద ముని అని ముద్దుగా పిలుచుకున్నారు.‘‘పెరిగి పెద్దయి స్త్రీల ఆరోగ్యానికి సంరక్షకురాలివి కావాలి’’ అని దీవించారు. ఆయన దీవెనలు ఫలించాయి. వేల పురుళ్లు పోశారు పద్మావతి. ఆసుపత్రికి రాలేని గర్భిణులు ఉంటే వారి కోసం ఆసుపత్రి సిబ్బందినే వారి ఇళ్లకు పంపించారు. ప్రభుత్వ డాక్టర్ అయి ఉండి కూడా కాన్పు చేయడానికి తనకై తను ఇళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 1900 లలో మహిళలు ఎలా ఉండేవారో తెలిసే కూతుర్ని డాక్టర్ని చేశారు పద్మావతి తండ్రి. బాధ పడనన్నా పడతాం కానీ, మగ డాక్టరుకు మాత్రం చెప్పుకోము అన్నట్లుండేవారు. అప్పటికి ఆయన మదురైలో పేరున్న ‘లైసెన్స్›్డ మెడికల్ ప్రాక్టీషనర్’. తొమ్మిది మంది సంతానంలో పద్మావతితో పాటు ఐదుగురు ఆడపిల్లల్నీ ఆయన డాక్టర్లను చేశారు. మిగతా పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కూడా వైద్య వృత్తినే ఎంచుకున్నారు. ∙∙ పద్మావతి ఇంట్లో పెద్ద పిల్ల. ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు చూడాలి.. ‘‘మన ఇంటా ఒంటా ఉందా.. ఆడపిల్ల చదువుకోవడం’’ అని బంధువులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఆమె పుస్తకాల సంచిని భుజంపై నుంచి లాగేసి విసిరికొట్టేసేవారు. తండ్రి వెంటనే ఆమెకు కొత్త పుస్తకాల సెట్ కొని తెచ్చేవారు. ఆయనొక్కరే పద్మావతికి మద్దతు. అలాగే పదిహేనేళ్లు దాటితే ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలనే సంప్రదాయం బలంగా ఉండేది. దాన్ని కూడా కూతుర్ని వైద్యురాలిని చేయడం కోసం పక్కన పెట్టేశారాయన. ముదురైలోని అమెరికన్ కాలేజ్ లో ఇంటర్లో చేర్చారు! తర్వాత మెడిసిన్. గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్లకే మదురైలోని ‘మున్సిపల్ మెటర్నిటీ హోమ్స్’ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్ అయ్యారు. ప్రసవాలు సురక్షితంగా జరగడమూ మొదలైంది. ‘‘ఆమె చేతుల్లో పడితే చాలు’’ అనేంతగా మదురై అంతటా ఆమె పేరు తెలిసింది. 1969 లో ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పోలెండ్లో జరిగిన గర్భిణి, శిశు ఆరోగ్య వైద్య శిక్షణా సదస్సులకు హాజరయ్యారు. ఆ శిక్షణకు భారతదేశం నుంచి ఎంపికైన ముగ్గురు డాక్టర్లలో పద్మావతి ఒకరు. ఆమె సూచనలపై భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత కొన్ని మాతా శిశు సంరక్షణ విధానాలను అమలు పరిచింది. పద్మావతి పెళ్లి ఆమె 30వ యేట జరిగింది. భర్త రామస్వామి స్కూల్ హెడ్మాస్టర్. కొన్నాళ్లకే భర్త సహకారంతో మదురై పెరుమాళ్ కోయిల్ వీధిలో పది పడకల ఆసుపత్రి నిర్మించుకున్నారు. అదే వారి నివాసం కూడా. పద్మాలయ హెల్త్ క్లినిక్ అని ఆ వైద్య నివాసానికి పేరు పెట్టుకున్నారు. సిజేరియన్ సరంజామా లేని ప్రసూతి ఆసుపత్రి మదురై మొత్తంలో అదొక్కటే! కొడుకు, కూతురు చేత కూడా ఆమె ఒక ఆసుపత్రి పెట్టించారు. కొడుకు జనరల్ సర్జన్. కోడలు గైనకాలజిస్ట్. ‘‘మా అత్తగారు తన 90 వ యేట వరకూ కూడా నన్ను గైడ్ చేస్తూ వచ్చారు’’ అని కోడలు సుందరి చెబుతుంటారు. అంత ఉత్సాహం, అంత శక్తి ఆమెలో ఉండేవని. కోడలిగా ఆమె ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పారట పద్మావతి.. ‘ఆడమనిషి యజమానిగా ఉండే ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది’ అని. ఈ నూరేళ్ల వయసులోనూ పద్మావతి ఉదయాన్నే లేస్తారు. పూజ చేస్తారు. భక్తి గీతాలు పాడతారు. వార్తా పత్రికలు చదువుతారు. టీవీ చూస్తారు. ఫిజియో థెరపీ చేస్తారు. వేళకు భోంచేస్తారు. కరోనా వెళ్లిపోతే, వీల్ ఛెయిర్లో కాస్త బయటి తిరగాలని ఆమె ఆశపడుతున్నారు. -
పృథ్వీ షా మెరుపులు
న్యూఢిల్లీ: తన అద్వితీయ ఫామ్ను కొనసాగిస్తూ ముంబై జట్టు ఓపెనర్ పృథ్వీ షా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ సెంచరీతో (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్స్లు) కదంతొక్కాడు. దాంతో ముంబై 9 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజా ప్రదర్శనతో లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్గా పృథ్వీ షా ఘనత వహించాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని (183 నాటౌట్; శ్రీలంకపై 2005లో) పేరిట ఉండేది. తొలుత సౌరాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్లకు 284 పరుగులు చేసింది. సమర్థ్ వ్యాస్ (90 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), చిరాగ్ జానీ (53 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 41.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 285 పరుగులు చేసి గెలుపొందింది. టోర్నీలో అద్భుత ఫామ్లో ఉన్న షా ఈ మ్యాచ్లోనూ ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అతడికి యశస్వి జైస్వాల్ (104 బంతుల్లో 75; 10 ఫోర్లు, సిక్స్) తోడవ్వడంతో ముంబై ఛేదన సాఫీగా సాగింది. వీరిద్దరూ తొలి వికెట్కు 238 పరుగులు జోడించారు. అనంతరం జైస్వాల్ అవుటైనా క్రీజులోకి వచ్చిన ఆదిత్య తారే (20 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి పృథ్వీ లాంఛనం పూర్తి చేశాడు. ఈ టోర్నీలో షాకిది మూడో సెంచరీ. మరో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీపై ఉత్తరప్రదేశ్ 46 పరుగుల ఆధిక్యంతో నెగ్గింది. తొలుత ఉత్తరప్రదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 280 పరుగులు చేసింది. ఉపేంద్ర యాదవ్ (112; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ చేశాడు. కరణ్ శర్మ (83; 11 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఢిల్లీ 48.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. గురువారం జరిగే సెమీఫైనల్స్లో గుజరాత్తో ఉత్తరప్రదేశ్; కర్ణాటకతో ముంబై తలపడతాయి. -
వైరల్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు 5 లీటర్ల పెట్రోల్!
భోపాల్: పెట్రోధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. కొన్నిరాష్టాల్లో పెట్రోధరలు ఇప్పటికే సెంచరీ దాటేయగా, మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువలో ఉన్నాయి. డీజీల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తమదైన శైలీలో వ్యంగ్యంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కాగా, ఇటీవల భోపాల్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్.. పెట్రోల్ ధరల సమస్యను ప్రత్యేకమైన రీతిలో హైలైట్ చేసింది. ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్కు 5 లీటర్ల పెట్రో క్యాన్ను నిర్వాహకులు బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, సలావుద్దీన్ అబ్బసీ ఈ పెట్రో అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ భోపాల్ కాంగ్రెస్ నాయకుడు మనోజ్శుక్లా ఆధ్వర్యంలో జరిగింది. అయితే, ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ ముందు నిలబడి పెట్రోల్ రేటు సెంచరి కొట్టేసిందోచ్ అంటూ తన నిరసనను బ్యాట్ పైకెత్తి మరీ చూపించాడు.. కాగా, కరూర్ జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ యజమాని తిరుక్కురుల్ పద్యాలను తప్పులు లేకుండా చదివిన విద్యార్థులకు 1 లీటర్ పెట్రోల్ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పెట్రో బేజారు..సైకిల్ షి‘కారు’ -
15 నెలల తర్వాత.. అన్ని స్వదేశంలోనే
చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అచ్చం వన్డే తరహాలో దాటిగా ఆడిన రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది ఏడో శతకం కాగా.. చెన్నై వేదికగా సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి. 2019 అక్టోబర్లో రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ చివరి సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో రోహిత్ 212 పరుగులు చేశాడు. కాగా, టెస్టుల్లో రోహిత్ శర్మ నమోదు చేసిన ఏడు సెంచరీలు భారత గడ్డపైనే రావడం విశేషం. రెండో టెస్టుకు ముందు ఆసీస్ పర్యటనలోనూ రోహిత్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆసీస్ గడ్డపై మూడు, నాలుగు టెస్టులు ఆడిన రోహిత్ వరుసగా 26,52, 44,7 పరుగులు సాధించాడు. అనంతరం ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో వరుసగా 6,12 పరుగులు సాధించాడు. గత మూడు టెస్టులు కలిపి 24 సగటుతో 147 పరుగులు మాత్రమే చేశాడు. యువ ఓపెనర్ శుభమన్ గిల్ (0) రెండో ఓవర్లోనే డకౌటవగా.. ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ ఏ దశలోనూ పట్టుదల వీడలేదు. చతేశ్వర్ పుజారా (21)తో కలిసి రెండో వికెట్కి దూకుడుగా ఆడి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి, పుజారాలు అవుటైన తర్వాత మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించిన రోహిత్ రహానేతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో స్వీప్, కట్ షాట్లతో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. చదవండి: 'కమాన్ రోహిత్.. యూ కెన్ డూ ఇట్' కోహ్లి పేరిట మరో చెత్త రికార్డు -
ఈ రోజు ప్రత్యేకతేంటో తెలుసా?
2021 సంవత్సరంలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే!.. 21వ శతాబ్ధంలో.. 21వ సంవత్సరంలో వచ్చిన 21వ రోజు ఇది. 1846లో ఇదే రోజున చార్లెస్ డికెన్స్ ‘డైలీ న్యూస్’ మొదటి ఎడిషన్ విడుదలైంది. 1950లో ప్రముఖ నవల ‘ అనిమల్ ఫార్మ్’ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణించారు. వీటితో పాటు.. ► నేషనల్ హగ్గింగ్ డే ► నేషనల్ హగ్ యువర్ పప్పీ డే ► ఉమెన్స్ హెల్దీ వేయిట్ డే కూడా ఈ రోజే. అంతేకాకుండా.. ఈ సంవత్సరానికి కూడా ఓ ప్రత్యేక ఉంది. శుక్రవారంతో మొదలై.. శుక్రవారంతో ముగిసే లీపు సంవత్సరం ఇది. 2010 సంవత్సరాన్ని పోలిన ఈ సంవత్సరం క్యాలెండర్ 2027, 2100లో మాత్రమే మళ్లీ పునరావృతమవుతుంది. ఈ రోజు ప్రత్యేకతను అందరికీ తెలియజేస్తూ కొందరు నెటిజన్లు ట్వీట్లు చేసేస్తున్నారు. ‘‘ మన జీవితంలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఓ అడుగు ముందుకు వేసి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. Wishing everyone A very special n historical day of our life... Today is the *21st Day* of *21st Year* of the *21st Century*. ❣️ HAVE A NICE DAY ❣️ — लाखन सिंह बोहरा (@singhlakhan) January 21, 2021 *An unique Day of our life* Today is the 21st day of the 21st year of the 21st century. — Naresh Gera (@gerank) January 21, 2021 -
‘సెంచరీ’ టెస్టులో విక్టరీ దక్కేనా?
మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత్ ముందు మరో సవాల్ నిలిచింది. నేటి నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే ‘బాక్సింగ్ డే’ రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్ లో నెగ్గిన ఆసీస్ సిరీస్లో 1–0తో ప్రస్తుతం ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచ్లోనూ ఓడితే భారత్ సిరీస్ గెలుచుకునే అవకాశాలు ముగుస్తాయి. అడిలైడ్లో గెలిచిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగుతుండగా, భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. జడేజా, పంత్లకు చోటు గత టెస్టులాగే ఈసారి కూడా భారత మేనేజ్మెంట్ తుది జట్టును ఒక రోజు ముందే ప్రకటించింది. విఫలమైన పృథ్వీ షా స్థానంలో ఓపెనర్గా శుబ్మన్ గిల్, సాహా స్థానంలో మరో కీపర్ రిషభ్ పంత్ జట్టులోకి వచ్చారు. షమీ గాయం కారణంగా తప్పుకోవడంతో పేసర్ సిరాజ్కు చోటు దక్కింది. అయితే కోహ్లికి బదులుగా రెగ్యులర్ బ్యాట్స్మన్ను కాకుండా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించడం విశేషం. రాహుల్ రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నా... జడేజా వైపు జట్టు మొగ్గు చూపించింది. ఐదో బౌలర్గా అతను జట్టుకు మరింత బలం చేకూర్చగలడని టీమ్ భావిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్లలో రాణించడం గిల్, పంత్ ఎంపికకు కారణం. అయితే కోహ్లిలాంటి స్టార్ లేని నేపథ్యంలో సహజంగానే బ్యాటింగ్ కొంత బలహీనంగా కనిపిస్తోంది. మయాంక్, గిల్ శుభారంభం అందించడం కీలకం. ఇప్పుడు ప్రధానంగా పుజారా, రహానే బ్యాటింగ్పైనే జట్టు భారీ స్కోరు చేయడం ఆధారపడి ఉంది. ఆంధ్ర క్రికెటర్ విహారి తనకు లభించిన మరో అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. విదేశాల్లో అంతంత మాత్రమే రికార్డు ఉన్న జడేజా ఈసారి ఎలా ప్రభావం చూపిస్తాడనేది చూడాలి. బౌలింగ్లో ఇప్పుడు బుమ్రాపైనే పెను భారం పడింది. ఇంత కాలం అతను ఆడిన అన్ని మ్యాచ్లలో మరోవైపు నుంచి సీనియర్ ఇషాంత్ శర్మ లేదా షమీ సహకరించారు. ఉమేశ్ ఇప్పటికీ అద్భుతాలు చేయలేదు. ఇక సిరాజ్ ఆడుతోంది తొలి మ్యాచ్. అశ్విన్ గత మ్యాచ్లో లయ అందుకోవడం సానుకూలాంశం. మొత్తంగా కోహ్లి, షమీ దూరం కావడంతో రెండు విభాగాల్లోనూ కొంత బలహీనంగా మారిన జట్టు ఆసీస్ను నిరోధించాలంటే తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. స్మిత్ చెలరేగితే... వార్నర్ లేకపోవడంతో తొలి టెస్టులో ఆసీస్ ఓపెనింగ్ బలహీనంగా కనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో ప్రదర్శనతో బర్న్స్కు కావాల్సిన ఆత్మవిశ్వాసం దక్కగా, వేడ్ కూడా స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మెరుగైన ఆరంభాన్ని జట్టు ఆశిస్తోంది. ఇక గత మ్యాచ్లో విఫలమైనా... స్మిత్, లబ్షేన్లను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా భారత్పై అద్భుత రికార్డు ఉన్న స్మిత్ చెలరేగితే కష్టాలు తప్పవు. గ్రీన్ తనను తాను నిరూపించుకోగా, కెప్టెన్ పైన్ తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ట్రావిస్ హెడ్ మాత్రం ఇంకా కుదురుకోవాల్సి ఉంది. వీటన్నింటికి మించి ఆసీస్ బలం పేస్ బౌలింగ్ త్రయంపైనే ఉంది. స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్ సమష్టిగా చెలరేగితే పరిస్థితి ఎలా ఉంటుందో గత మ్యాచ్ చూపించింది. వీరికి లయన్ జత కలిస్తే ఆసీస్ పైచేయి సాధించడం ఖాయం. 100: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు కానుంది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్ల్లో, భారత్ 28 మ్యాచ్ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడి, 12 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. సిరాజ్కు తొలి ‘టెస్టు’... 24 ఏళ్ల తర్వాత భారత్ తరఫున టెస్టు ఆడనున్న మరో హైదరాబాదీ. సరిగ్గా ఐదు వారాల క్రితం నాన్న చనిపోయాడు. చివరి చూపునకు వెళ్లవచ్చని బోర్డు అనుమతించినా... గుండెల్లో తన వేదనను దాచుకుంటూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. సహచరులు ఇచ్చిన స్థయిర్యంతో తన సాధనను కొనసాగించాడు. ఇప్పుడు ఆ బాధకు కాస్త ఉపశమనం అందించే అరుదైన అవకాశం అతనికి దక్కింది. స్వదేశం తిరిగి వెళ్లిపోకుండా అతను తీసుకున్న నిర్ణయం సరైన ఫలితాన్నందించింది. షమీ అనూహ్యంగా గాయపడటంతో మొహమ్మద్ సిరాజ్కు భారత తుది జట్టులో చోటు దక్కింది. సాధారణ ఆటో డ్రైవర్ కొడుకుగా మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు భారత టెస్టు క్రికెటర్గా ఎదగడం అసాధారణం. రంజీల్లో సూపర్ మూడు టి20 మ్యాచ్లలో 3 వికెట్లు... ఏకైక వన్డే లో వికెట్ దక్కనే లేదు... సిరాజ్ అంతర్జాతీయ రికార్డు ఇది. దీనిని చూస్తే అతను జాతీయ జట్టు తరఫున విఫలమయ్యాడనిపిస్తుంది. కానీ సిరాజ్కు అవకాశం ఇవ్వడంలో సెలక్టర్లే పొరపడ్డారని అనిపిస్తుంది. దేశవాళీలో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లలోనే వచ్చాయి. ఎరుపు బంతితోనే అతను ఎక్కువగా తన పదును చూపించాడు. సీమ్ను సమర్థంగా ఉపయోగించుకునే అతని గ్రిప్, బౌన్సర్లు సిరాజ్ బౌలింగ్లో ప్రధాన బలాలు. తన తొలి రంజీ సీజన్ (2016–17)లోనే హైదరాబాద్ తరఫున 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్లో సన్రైజర్స్, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం చకచకా జరిగిపోయాయి. నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లు అతని సామర్థ్యంపై కొన్ని అనుమానాలు రేపినా ... తాజా ఐపీఎల్లో కోల్కతాపై 8 పరుగులకు 3 వికెట్లు తీసిన ప్రదర్శన సిరాజ్ను మళ్లీ సీన్లోకి తీసుకొచ్చింది. ఘనమైన రికార్డు 2018లో 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో సిరాజ్ 19.80 సగటుతో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో దక్షిణాఫ్రికా ‘ఎ’పై రెండుసార్లు ఇన్నింగ్స్లో ఐదేసి వికెట్లు తీయగా... ఆస్ట్రేలియా ‘ఎ’పై 8 వికెట్లతో చెలరేగిన ప్రదర్శన కూడా ఉంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో హెడ్, లబ్షేన్, ఖాజాలాంటి టెస్టు క్రికెటర్లున్నారు. భారత్ ‘ఎ’ తరఫున సిరాజ్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఇవన్నీ రంజీ ట్రోఫీకంటే నాణ్యతాపరంగా ఎక్కువ స్థాయివే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లలో కలిపి 12 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 27.63 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. షమీ లేక కొంత అదృష్టం కలిసొచ్చినా... ఈ గణాంకాలు చూస్తే టెస్టుల్లో అతనికి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయంగానే చెప్పవచ్చు. మొత్తంగా 38 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో కలిపి సిరాజ్ 23.44 సగటుతో 152 వికెట్లు తీశాడు. వన్డేలు, టి20లు ఎన్ని ఆడినా టెస్టు క్రికెటర్గా వచ్చే గుర్తింపే వేరు. ఇప్పుడు ఆ గౌరవాన్ని అందుకున్న సిరాజ్ మున్ముందు మరింత సత్తా చాటాలని చోటు పదిలం చేసుకోవాలని ఆశిద్దాం. వీవీఎస్ లక్ష్మణ్ (1996) తర్వాత హైదరాబాద్లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ సిరాజే కావడం విశేషం. మధ్యలో ప్రజ్ఞాన్ ఓజా ఆడినా... అతను భువనేశ్వర్లో పుట్టాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు కానుంది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్ల్లో, భారత్ 28 మ్యాచ్ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడి, 12 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. పిచ్, వాతావరణం ఈ టెస్టు కోసం డ్రాప్ ఇన్ పిచ్ను ఉపయోగిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్కు సమంగా అనుకూలిస్తుంది. చక్కటి బౌన్స్ కూడా ఉంది. రెండు రోజులపాటు చిరుజల్లులు పడే అవకాశం మినహా... వాతావరణం బాగుంది. టెస్టుకు ఇబ్బంది ఉండకపోవచ్చు. జట్ల వివరాలు భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), మయాంక్, గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, ఉమేశ్, సిరాజ్, బుమ్రా. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), బర్న్స్, వేడ్, లబ్షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, స్టార్క్, లయన్, కమిన్స్, హాజల్వుడ్. –సాక్షి క్రీడా విభాగం -
రిషభ్ పంత్ వీర విహారం
‘పింక్ టెస్ట్’కు ముందు జరుగుతున్న డే అండ్ నైట్ సన్నాహక పోరులో భారత బ్యాట్స్మెన్ పండగ చేసుకున్నారు. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న ముగ్గురు ఆటగాళ్లు కూడా రెండో ఇన్నింగ్స్లో సత్తా చాటారు. ఆరో బ్యాట్స్మన్గా అవకాశం కోరుకుంటున్న హనుమ విహారి శతకం సాధించగా... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పోటీ పడుతున్న రిషభ్ పంత్ తన బ్యాటింగ్ పదునేమిటో మెరుపు సెంచరీతో చూపించాడు. రెండో ఓపెనర్గా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న శుబ్మన్ గిల్ కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, ఇప్పటికే ఓపెనర్గా ఉన్న మయాంక్కు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే పృథ్వీ షా మాత్రం మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత్ ముందు తేలిపోయిన ఆస్ట్రేలియా ‘ఎ’ చివరి రోజు ఓటమిని తప్పించుకోగలదా చూడాలి. సిడ్నీ: మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తడబడిన భారత బ్యాట్స్మెన్ వెంటనే తమ ఆటను చక్కదిద్దుకున్నారు. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (194 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు), రిషభ్ పంత్ (73 బంతుల్లో 103 బ్యాటింగ్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. శుబ్మన్ గిల్ (78 బంతుల్లో 65; 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (120 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్లోని 86 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ ఆధిక్యం 472 పరుగులకు చేరింది. రెండో రోజు మధ్యలో కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించినా... ఇబ్బంది లేకుండా మొత్తం 90 ఓవర్ల ఆట సాగింది. నేడు మ్యాచ్కు ఆఖరి రోజు. పృథ్వీ షా విఫలం... చక్కటి బ్యాటింగ్ పిచ్పై కనీసం నిలబడే ప్రయత్నం చేయకుండా పృథ్వీ షా (3) పేలవ షాట్ ఆడి ఆరంభంలోనే నిష్క్రమించాడు. ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టు అవకాశాలు కూడా దూరం చేయవచ్చు! అయితే ఓపెనర్ స్థానం కోసం షాతో పోటీ పడుతున్న గిల్ మాత్రం మరోసారి సాధికారిక ఆటతీరు కనబర్చాడు. చూడచక్కటి కవర్డ్రైవ్లు, పుల్ షాట్లతో పాటు బ్యాక్ఫుట్పై పూర్తి నియంత్రణతో అతను ఆడిన తీరు సరైన టెస్టు బ్యాట్స్మన్ను చూపించాయి. 49 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే కొద్ది సేపటికే దురదృష్టవశాత్తూ అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో గిల్ వెనుదిరిగాడు. స్వెప్సన్ బౌలింగ్లో ఎల్బీ కోసం అప్పీల్ చేయగా... బంతి బ్యాట్కు తగిలిందని భావించిన అంపైర్ స్లిప్లో అబాట్ క్యాచ్ పట్టడంతో అవుట్గా ప్రకటించాడు. మరోవైపు మయాంక్ పట్టుదలగా క్రీజ్లో నిలబడ్డాడు. స్వెప్సన్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 91 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అనంతరం భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంత్ దూకుడు... తొలి ఇన్నింగ్స్లో విఫలమైన విహారి రెండో ఇన్నింగ్స్ను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో గులాబీ బంతి కొంత ఇబ్బంది పెడుతున్న సమయంలో అతను చక్కటి ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. అందమైన ఆన్ డ్రైవ్లు అతని ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచాయి. 98 బంతుల్లో విహారి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విహారి 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతనితో పంత్ జత కలిసిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. విహారి, పంత్ 147 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యంలో (22.4 ఓవర్లలో) విహారి స్కోరు 42 పరుగులు మాత్రమే కాగా పంత్ సెంచరీతో చెలరేగడం విశేషం. ప్రతీ బౌలర్పై విరుచుకుపడ్డ పంత్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు విల్డర్ముత్ బౌలింగ్లో సింగిల్తో 188 బంతుల్లో విహారి శతకం పూర్తయింది. అయితే రెండో రోజు చివరి ఓవర్కు ముందు ఓవర్ ఆఖరి బంతికి సదర్లాండ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ 81 పరుగుల వద్ద నిలిచాడు. విల్డర్ముత్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతి అతని పొట్టలో బలంగా తగిలింది. అనంతరం తర్వాతి ఐదు బంతుల్లో 4, 4, 6, 4, 4 బాదిన పంత్ 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 194; ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 108; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) స్వెప్సన్ (బి) స్టెకెటీ 3; మయాంక్ (సి) (సబ్) రోవ్ (బి) విల్డర్ముత్ 61; గిల్ (సి) అబాట్ (బి) స్వెప్సన్ 65; విహారి (బ్యాటింగ్) 104; రహానే (సి) క్యారీ (బి) స్టెకెటీ 38; పంత్ (బ్యాటింగ్) 103; ఎక్స్ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 386. వికెట్ల పతనం: 1–4; 2–108; 3–161; 4–239. బౌలింగ్: సీన్ అబాట్ 7–1–24–0; స్టెకెటీ 16–1–54–2; సదర్లాండ్ 16–5–33–0; విల్డర్ముత్ 15–2–79–1; స్వెప్సన్ 29–1–148–1; మ్యాడిసన్ 7–1–42–0 బౌలర్లకు ప్రాక్టీస్ కావాలి... విజయానికి సరిపడా స్కోరు సాధించినా భారత్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయలేదు. మన బ్యాట్స్మెన్కు ఫ్లడ్లైట్ల వెలుగులో రెండో రోజు మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే బౌలర్లు మాత్రం డే అండ్ నైట్ మ్యాచ్ కోసం మరింత సాధన కోరుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ‘ఎ’ 32.2 ఓవర్లకే కుప్పకూలింది. ఆ జట్టు పేలవ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే వారు రోజంతా నిలబడతారా అనేది సందేహమే. చీకటి పడే సమయానికి ముందే ఆసీస్ ‘ఎ’ ఇన్నింగ్స్ ముగిసిపోతే పింక్ బాల్తో మన బౌలర్లు ఆశించిన ప్రాక్టీస్ లభించదు. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా చివరి రెండు సెషన్లు ప్రత్యర్థికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భారత్ కోరుకుంటోంది. అందుకే భారత్ తమ బ్యాటింగ్ను కొనసాగించవచ్చు. -
అజహర్ అలీ సెంచరీ: పాక్ 273
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్; 21 ఫోర్లు) కెరీర్లో 17వ టెస్టు సెంచరీ చేయడంతోపాటు 6 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఓవర్నైట్ స్కోరు 24/3తో మూడో రోజు ఆదివారం ఆట కొనసాగించిన పాక్ను ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్ (5/56), బ్రాడ్ (2/40) దెబ్బ తీశారు. అంతకుముందు రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించారు. -
మోర్గాన్ సెంచరీ: ఇంగ్లండ్ 328
సౌతాంప్టన్: ఐర్లాండ్తో మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడి వన్డే కెరీర్లో 14వ సెంచరీ నమోదు చేశాడు. టామ్ బాంటన్ (51 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్)తో కలిసి మోర్గాన్ నాలుగో వికెట్కు 146 పరుగులు జోడించాడు. చివర్లో విల్లీ (51; 3 ఫోర్లు, 3 సిక్స్లు), టామ్ కరన్ (38 నాటౌట్; 4 ఫోర్లు) కూడా మెరిపించడంతో ఇంగ్లండ్ స్కోరు 300 పరుగులు దాటింది. 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కడపటి వార్తలు అందే సమయానికి 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకుంది. -
సూపర్ స్టోక్స్
మాంచెస్టర్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టుపై పట్టు బిగించేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 469 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బెన్ స్టోక్స్ (356 బంతుల్లో 176; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), డామ్ సిబ్లీ (372 బంతుల్లో 120; 5 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 260 పరుగులు జోడించడం విశేషం. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. క్యాంప్బెల్ (12) అవుట్ కాగా... బ్రాత్వైట్ (6 బ్యాటింగ్), అల్జారి జోసెఫ్ (14 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. మూడో రోజు విండీస్ బ్యాట్స్మెన్ ఎంత బాగా ఆడతారనేదానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. భారీ భాగస్వామ్యం తొలి రోజే క్రీజ్లో పాతుకుపోయిన సిబ్లీ, స్టోక్స్ శుక్రవారం కూడా తమ జోరు కొనసాగించారు. ఓవర్నైట్ స్కోరు 207/3తో ఆట మొదలు పెట్టిన వీరిద్దరు అంతే పట్టుదలతో నిలబడి పరుగులు రాబట్టారు. 93 ఓవర్లు ముగిసిన తర్వాత విండీస్ కొత్త బంతిని తీసుకున్నా లాభం లేకపోయింది. సుదీర్ఘ సమయం పాటు మైదానంలో గడిపిన సిబ్లీ ఎట్టకేలకు 312 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి సెషన్లో ఇంగ్లండ్ 57 పరుగులు చేయగా, విండీస్కు ఒక్క వికెటైన దక్కలేదు. లంచ్ ముగిసిన వెంటనే ఛేజ్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ బౌండరీతో 255 బంతుల్లో స్టోక్స్ శతకం మార్క్ను చేరుకున్నాడు. అతని కెరీర్లో ఇది 10వ సెంచరీ. ఎట్టకేలకు ఈ భారీ భాగస్వామ్యాన్ని ఛేజ్ విడదీశాడు. డీప్ మిడ్వికెట్లో రోచ్కు క్యాచ్ ఇవ్వడంతో సిబ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. స్టోక్స్ దూకుడు సెంచరీ తర్వాత స్టోక్స్ మరింత ధాటిగా ఆడాడు. 46 బంతుల్లోనే అతను 100నుంచి 150 పరుగులకు చేరుకున్నాడు. టీ విరామానికి ముందే ఒలీ పోప్ (7) వికెట్ పడింది. మూడో సెషన్లో డబుల్ సెంచరీ సాధించే అవకాశం కనిపించిన స్టోక్స్ చివరకు దానిని అందుకోలేకపోయాడు. వరుస బంతుల్లో స్టోక్స్, వోక్స్ (0)లను రోచ్ అవుట్ చేయడంతో విండీస్కు ఊరట దక్కింది. చివర్లో బట్లర్ (79 బంతుల్లో 40; 4 ఫోర్లు), బెస్ (26 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించగలిగింది. -
102 డిగ్రీల జ్వరాంతో 103 పరుగులు
టెస్టు క్రికెటర్గా, దిగ్గజ ఆటగాడిగా శిఖరాన నిలిచిన సునీల్ గావస్కర్ వన్డే కెరీర్ గణాంకాలు అంతంత మాత్రమే. 1983 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడిగా నిలిచినా... రెండేళ్ల తర్వాత దాదాపు అదే స్థాయి టోర్నీ వరల్డ్ చాంపియన్షిప్లో కెప్టెన్గా జట్టును విజయపథంలో నిలిపినా ఒక బ్యాట్స్మన్గా గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఏవీ అతని బ్యాట్ నుంచి రాలేదు. నాటి ప్రమాణాల ప్రకారం చూసినా గావస్కర్ ప్రదర్శన అతి సాధారణం. అయితే చివరకు తన ఆఖరి టోర్నీలో మాత్రం అతను ఒక అద్భుతమైన శతకంతో అభిమానులను అలరించాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ 1987 ప్రపంచకప్లో న్యూజిలాండ్పై సన్నీ చేసిన సెంచరీ ఎప్పటికీ మరచిపోలేనిది. సునీల్ గావస్కర్ ముందే ప్రకటించినట్లు 1987 రిలయన్స్ వరల్డ్కప్ అతని చివరి వన్డే టోర్నీ. ఆ తర్వాత గుడ్బై చెప్పేందుకు సన్నీ సిద్ధమైపోయాడు. టెస్టులతో పోలిస్తే గావస్కర్ వన్డే రికార్డు గొప్పది కాదు. పైగా 1975 ప్రపంచకప్లో ఏకంగా 174 బంతులు ఆడి 36 పరుగులతో నాటౌట్గా నిలిచిన చెత్త ఘనత కూడా అతని పేరిటే ఉంది. కెరీర్ చివరిదశలో కూడా మరో దూకుడైన ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్కు సహకారం అందించే రెండో ఓపెనర్ పాత్రలోనే అతడిని అంతా చూస్తున్నారు. కానీ న్యూజిలాండ్పై గావస్కర్ తన శైలికి భిన్నంగా ఆడి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. తప్పనిసరి పరిస్థితుల్లో... వరల్డ్కప్లో న్యూజిలాండ్తో నాగపూర్లో చివరి లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అప్పటి వరకు 106 వన్డేలు ఆడిన గావస్కర్ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. 27 హాఫ్ సెంచరీలు సాధించినా అందులో పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి కూడా ఏమీ లేవు. మ్యాచ్కు ముందు సన్నీ బాగా జ్వరంతో బాధపడుతున్నాడు. తాను ఆడలేనంటూ ముందే తప్పుకునే ప్రయత్నం చేశాడు. అయితే చీఫ్ సెలక్టర్ బాపు నాదకర్ణి ఒత్తిడితో బరిలోకి దిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు చేయగలిగింది. మామూలుగానైతే ఇది సునాయాస లక్ష్యమే. పైగా భారత్ అప్పటికే సెమీఫైనల్లోకి ప్రవేశించింది కాబట్టి ఒత్తిడి కూడా లేదు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. దూకుడైన బ్యాటింగ్తో... రన్రేట్తో నిమిత్తం లేకుండా మ్యాచ్ను గెలిస్తే భారత్ సెమీస్ ప్రత్యర్థి పాకిస్తాన్ అవుతుంది. అదీ పాక్కు వెళ్లి ఆడాలి. ముంబైలో ఇంగ్లండ్తో తలపడాలని కపిల్దేవ్ బృందం భావిస్తోంది. అలా జరగాలంటే కివీస్ విధించిన 222 పరుగుల లక్ష్యాన్ని 42.2 ఓవర్లలో అందుకోవాలి. అప్పటి లెక్కల ప్రకారం 5.25 రన్రేట్తో పరుగులు చేయడం అంత సులువు కాదు. పైగా ఓపెనర్గా గావస్కర్ సంగతి అందరికీ తెలుసు. జింబాబ్వేతో జరిగిన అంతకుముందు మ్యాచ్లో సన్నీ 50 పరుగులు చేసేందుకు ఏకంగా 114 బంతులు తీసుకున్నాడు. కాబట్టి ఈసారి పెద్దగా ఆశలు లేవు. అయితే ఇప్పుడు అలా జరగలేదు. గావస్కర్ తన సహచరుడు శ్రీకాంత్తో పోటీ పడి వేగంగా పరుగులు సాధించాడు. భారత అభిమానులంతా ఆశ్చర్యపోయేలా అద్భుతమైన షాట్లతో విరుచుకు పడ్డాడు. చాట్ఫీల్డ్ వేసిన ఓవర్లలో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో అతను 20 పరుగులు రాబట్టడం విశేషం. 58 బంతుల్లో 75 పరుగులు చేసిన శ్రీకాంత్ ఎట్టకేలకు వెనుదిరిగే సమయానికి భారత్ 136 పరుగులు చేసింది. ఆ తర్వాత గావస్కర్ జోరు ఆగలేదు. అజహర్ (41 నాటౌట్) ఆటతో మరింతగా తన ధాటిని ప్రదర్శించాడు. ఈ క్రమంలో తన అత్యధిక స్కోరు 92ను అధిగమించాడు. ఎట్టకేలకు మోరిసిన్ బౌలింగ్లో మిడాన్ దిశగా సింగిల్ తీయడంతో 85 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అప్పట్లో ప్రపంచకప్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. రెండో వికెట్కు సన్నీ, అజహర్ కలిసి అజేయంగా 88 పరుగులు జోడించారు. మొత్తంగా 6.96 రన్రేట్తో 32.1 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది. గ్రూప్ టాపర్గా నిలిచి సెమీస్లో ఇంగ్లండ్తో పోరుకు సిద్ధమైంది. మరో ఐదు రోజుల తర్వాత తన సొంత మైదానం వాంఖడేలో ఇంగ్లండ్తో సెమీస్తో కేవలం 4 పరుగులే చేసిన గావస్కర్ ఆ మ్యాచ్తో రిటైర్ అయ్యాడు. అయితే అతని ఏకైక సెంచరీ మాత్రం అభిమానుల మదిలో పదిలంగా నిలిచిపోయింది. చేతన్ శర్మ హ్యాట్రిక్ కూడా... న్యూజిలాండ్తో మ్యాచ్లో భారత పేసర్ చేతన్ శర్మ తీసిన హ్యాట్రిక్ కూడా మ్యాచ్ను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. కెన్ రూథర్ఫోర్డ్, ఇయాన్ స్మిత్, చాట్ఫీల్డ్లను వరుస బంతుల్లో అవుట్ చేసి చేతన్ ప్రపంచకప్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్గానూ గుర్తింపు పొందాడు. ఈ మూడు కూడా క్లీన్బౌల్డ్లే కావడం విశేషం. సన్నీ, చేతన్లు ఇద్దరికీ సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
తమీమ్ సెంచరీ: బంగ్లాదేశ్ విజయం
సిల్హెట్ (బంగ్లాదేశ్): చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ నాలుగు పరుగుల ఆధిక్యంతో జింబాబ్వేపై గెలుపొందింది. చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 20 పరుగులు అవసరం కాగా... 15 పరుగులు చేయగలిగింది. టిరిపానో (28 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) 50వ ఓవర్ మూడు, నాలుగు బంతులను సిక్స్లుగా మలచడంతో... జింబాబ్వే విజయం సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులకు మారింది. అయితే ఆ రెండు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించిన జింబాబ్వే సంచలన విజయాన్ని దూరం చేసుకుంది. తొలుత బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 322 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (136 బంతుల్లో 158; 20 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ చేశాడు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. సికిందర్ రాజా (66; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మదెవెరె (52; 5 ఫోర్లు), తినాశే (51; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. తాజా విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను బంగ్లాదేశ్ 2–0తో గెల్చుకుంది. -
పాండ్యా సూపర్ ఇన్నింగ్స్
ముంబై: గాయం నుంచి కోలుకొని ఫిట్గా మారిన భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో చెలరేగాడు. డీవై పాటిల్ టి20 కప్లో భాగంగా రిలయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను మెరుపు సెంచరీ బాదాడు. ‘కాగ్’ జట్టుతో జరిగిన మ్యాచ్లో పాండ్యా 39 బంతుల్లోనే 8 ఫోర్లు, 10 సిక్సర్లతో 105 పరుగులు సాధించాడు. పాండ్యా దూకుడుతో రిలయన్స్ 252 పరుగులు నమోదు చేయగా... 151 పరుగులే చేసిన ‘కాగ్’ జట్టు 101 పరుగులతో ఓడింది. పునరాగమనంలో పాండ్యాకు ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్లో పాండ్యా 25 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. గత సెప్టెంబరులో భారత్ తరఫున అతను చివరిసారిగా మ్యాచ్ (దక్షిణాఫ్రికాపై టి20) ఆడాడు. ఆ తర్వాత వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో పాల్గొని ఫిట్గా మారాడు. దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు పాండ్యా మళ్లీ ఎంపికయ్యే అవకాశం ఉంది. (చదవండి: అగార్కర్కు షాక్ ఇచ్చిన సీఏసీ) -
లిటన్ దాస్ శతకం: బంగ్లాదేశ్ భారీ గెలుపు
సిల్హెట్: ఓపెనర్ లిటన్ దాస్ (105 బంతుల్లో 126 రిటైర్డ్ హర్ట్) కెరీర్లో రెండో సెంచరీ సాధించడంతో... జింబాబ్వేతో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 169 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం నమోదు చేసింది. పరుగుల పరంగా వన్డేల్లో బంగ్లాదేశ్కిదే భారీ విజయం. మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 321 పరుగులు చేసింది. మొహమ్మద్ మిథున్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 39.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫుద్దీన్ (3/22), మష్రఫె మొర్తజా (2/35), మిరాజ్ (2/33) ఆకట్టుకున్నారు. -
సెంచరీతో చెలరేగిన హనుమ విహారి
0, 1, 0... న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగేందుకు అవకాశం ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్లు ప్రాక్టీస్ మ్యాచ్లో చేసిన స్కోర్లు ఇవి. నిజానికి కివీస్ ఎలెవన్తో ఈ మ్యాచ్ను ఓపెనర్ల సామర్థ్యానికి పరీక్షగా భావించగా... కాస్త పచ్చిక ఉన్న పిచ్పై ముగ్గురూ అందులో విఫలమయ్యారు. అసలు టీమిండియా తుది జట్టులో ఉంటాడా లేదా అనే సందేహమున్న మిడిలార్డర్ బ్యాట్స్మన్ హనుమ విహారి మాత్రం సెంచరీతో సత్తా చాటాడు. విహారికి తోడుగా సీనియర్ పుజారా కూడా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు మోస్తరు స్కోరు సాధించింది. కెప్టెన్ కోహ్లి మాత్రం బ్యాటింగ్కు దూరంగా ఉండిపోవడమే శుక్రవారం ఆటలో విశేషం. హామిల్టన్: పిచ్పై కాస్త బౌన్స్, మరికాస్త స్వింగ్ కలగలిస్తే భారత బ్యాట్స్మెన్ తడబడతారనేది గతంలో చాలా సార్లు రుజువైంది. అయితే కోహ్లి సారథ్యంలోని ప్రస్తుత జట్టు వాటికి అతీతమని, ఎక్కడైనా రాణించగలదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై మాత్రం పెను సవాల్ ఎదురు కానుందని ప్రాక్టీస్ మ్యాచ్లోనే తేలిపోయింది. కివీస్ ద్వితీయ శ్రేణి బౌలర్లను కూడా సమర్థంగా మన బ్యాట్స్మెన్ ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ ఎలెవన్తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 78.5 ఓవర్లలో 263 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (182 బంతుల్లో 101 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అజేయంగా నిలిచాడు. పుజారా (211 బంతుల్లో 93; 11 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకోగా... ఇతర బ్యాట్స్మెన్లో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా దాటలేకపోయారు. విహారి, పుజారా ఐదో వికెట్కు 195 పరుగులు జోడించారు. టపటపా... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కుగ్లీన్ వేసిన తొలి ఓవర్లోనే అనూహ్యంగా పైకి లేచిన బంతిని ఆడలేక పృథ్వీ షా (0) షార్ట్లెగ్లో దొరికిపోయాడు. ఆ తర్వాత కుగ్లీన్ బౌలింగ్లోనే ఆఫ్స్టంప్పై దూసుకొచ్చిన బంతిని ఆడి మయాంక్ (1) కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని, వాటిని జాగ్రత్తగా ఆడాలంటూ వ్యాఖ్యానించిన శుబ్మన్ గిల్ (0) ఈ ఇన్నింగ్స్లో షార్ట్ పిచ్ బంతినే ఆడలేక గల్లీలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనుభవజ్ఞుడైన రహానే (18) కూడా నీషమ్ వేసిన స్వింగ్ బంతికి స్లిప్లో క్యాచ్ ఇవ్వడం ఆశ్చర్యపరచింది. భారీ భాగస్వామ్యం... భారత్ స్కోరు 38/4గా నిలిచిన దశలో పుజారా, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేసినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. తాను ఆడిన తొలి 80 బంతుల్లో పుజారా ఒకే ఫోర్ కొట్టాడు. పిచ్ సాధారణంగా మారిపోయిన తర్వాత ఇద్దరూ చక్కటి షాట్లు ఆడారు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర బౌలింగ్లో విహారి కొట్టిన మూడు సిక్సర్లు హైలైట్గా నిలిచాయి. అర్ధసెంచరీ చేసేందుకు పుజారాకు 153 బంతులు, విహారికి 132 బంతులు పట్టాయి. అయితే ఆ తర్వాత సెంచరీ అందుకునేందుకు విహారి మరో 48 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. మరో వైపు పుజారా మాత్రం సెంచరీకి చేరువలో కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా... శతకం పూర్తి కాగానే విహారి రిటైర్డ్ అవుట్గా తప్పుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు మిగిలిన సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసే ప్రయత్నంలో భారత బ్యాట్స్మన్ వెంటవెంటనే అవుటయ్యారు. 18 పరుగుల వ్యవధిలో చివరి నలుగురు బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) కుగ్లీన్ 0; మయాంక్ (సి) క్లీవర్ (బి) కుగ్లీన్ 1; పుజారా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 93; గిల్ (సి) సీఫెర్ట్ (బి) కుగ్లీన్ 0; రహానే (సి) బ్రూస్ (బి) నీషమ్ 18; విహారి (రిటైర్డ్ అవుట్) 101; పంత్ (సి) కుగ్లీన్ (బి) సోధి 7; సాహా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 0; అశ్విన్ (ఎల్బీ) (బి) సోధి 0; ఉమేశ్ (నాటౌట్) 9; జడేజా (సి) అలెన్ (బి) సోధి 8; ఎక్స్ట్రాలు 26; మొత్తం (78.5 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–0; 2–5; 3–5; 4–38; 5–233; 6–245; 7–246; 8–246; 9–250; 10–263. బౌలింగ్: కుగ్లీన్ 14–2–40–3; టిక్నర్ 15–3–37–0; మిషెల్ 7–1–15–0; నీషమ్ 13–3–29–1; గిబ్సన్ 10–1–26–2; సోధి 14.5–0–72–3; రవీంద్ర 5–1–30–0. ఓపెనింగ్ చేసేందుకు సిద్ధం! హామిల్టన్: విహారి కెరీర్ 7 టెస్టు మ్యాచ్లే కావచ్చు. కానీ తనకు టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు అవకాశం ఇచ్చినా దానిని వృథా చేయలేదు. ఎక్కడైనా, ఏ స్థానంలోనైనా ఆడగలనని ఈ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ నిరూపించాడు. ఏడాది క్రితం మెల్బోర్న్ టెస్టులో అనూహ్యంగా అతడిని ఓపెనర్గా పంపారు. 8, 13 పరుగులే చేసినా... తొలి ఇన్నింగ్స్లో దాదాపు 80 నిమిషాల పట్టుదలగా క్రీజ్లో నిలిచి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం జట్టుకు పనికొచ్చింది. అతని ఈ ప్రదర్శనను కెప్టెన్ కోహ్లి స్వయంగా ప్రశంసించాడు. ఇప్పుడు అలాంటిదే మరో అవకాశం అతని కోసం ఎదురు చూస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్లో ముగ్గురు ఓపెనర్లూ విఫలం కాగా, ఓపెనర్లకు ఉండే సమర్థవంతమైన టెక్నిక్తో విహారి సెంచరీ చేయడం అతనికి కొత్త అవకాశాన్ని సృష్టించింది. దీనిపై స్పందించిన విహారి ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. ‘ఒక ఆటగాడిగా ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సన్నద్ధమయ్యాను. టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు నాతో ఏమీ చెప్పలేదు. ఎవరూ మాట్లాడలేదు. అయితే గతంలో చెప్పినట్లు జట్టు అవసరాల దృష్ట్యా ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధం. కొన్ని సార్లు జట్టు కూర్పు గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దాని వల్ల బాధ పడకూడదు. స్వదేశంలో ఆడినప్పుడు మన జట్టు ఐదుగురు బౌలర్లతో దిగుతుంది కాబట్టి ఒక బ్యాట్స్మన్ను తప్పించాల్సిందే. నాకు తుది జట్టులో చోటు దక్కకపోవడానికి అదే కారణమని భావిస్తున్నా’ అని శుక్రవారం మీడియా సమావేశంలో విహారి వ్యాఖ్యానించాడు. -
‘ఎ’ జట్ల రెండో టెస్టు డ్రా
లింకన్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే ‘ఎ’ జట్టు తరఫున అజేయ సెంచరీతో సత్తా చాటాడు. భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టు సోమవారం డ్రాగా ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 234/1తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 467 పరుగులు చేసింది. అజింక్య రహానే (148 బంతుల్లో 101 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకం సాధించగా... విజయ్ శంకర్ (103 బంతుల్లో 66; 9 ఫోర్లు) రాణించాడు. ఆదివారం సెంచరీ పూర్తి చేసిన శుబ్మన్ గిల్ (136), చతేశ్వర్ పుజారా (66) తమ స్కోర్లకు మరికొన్ని పరుగులు జోడించారు. ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కేఎస్ భరత్ (22) విఫలమయ్యాడు. తాజా ఫలితంతో ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ 0–0తో డ్రాగా ముగిసింది. -
మనీశ్ పాండే మెరుపు సెంచరీ
సాక్షి, విజయనగరం: వన్డౌన్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే (54 బంతుల్లో 129 నాటౌట్; 12 ఫోర్లు, 10 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో కర్ణాటక మూడో విజయం నమోదు చేసింది. సర్వీసెస్తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (43 బంతుల్లో 75; 8 ఫోర్లు, 4 సిక్స్లు) కూడా వీరవిహారం చేశాడు. మనీశ్ పాండే, దేవదత్ రెండో వికెట్కు కేవలం 13.5 ఓవర్లలో ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడిపోయింది. కర్ణాటక బౌలర్ శ్రేయస్ గోపాల్ 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, మయాంక్ మిశ్రా ‘హ్యాట్రిక్’... మంగళవారం ఇతర వేదికల్లో జరిగిన మ్యాచ్ల్లో రెండు హ్యాట్రిక్లు నమోదయ్యాయి. బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్లో హ్యాట్రిక్ తీసిన దీపక్ చాహర్... ఈ టోర్నీలో రాజస్తాన్ తరఫున బరిలోకి దిగాడు. తిరువనంతపురంలో విదర్భతో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో దీపక్ చాహర్ (4/18) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దర్శన్, శ్రీకాంత్, అక్షయ్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. వర్షంవల్ల ఈ మ్యాచ్ను 13 ఓవర్లకు కుదించగా... విదర్భ 9 వికెట్లకు 99 పరుగులు చేసింది. అనంతరం వీజేడీ పద్ధతిలో రాజస్తాన్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 107 పరుగులుగా నిర్ణయించారు. అయితే రాజస్తాన్ 8 వికెట్లకు 105 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. విశాఖపట్నంలో గోవాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో ఉత్తరాఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా (4/6) హ్యాట్రిక్ సాధించాడు. మయాంక్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో ఆదిత్య, అమిత్ వర్మ, సుయశ్లను అవుట్ చేశాడు. తొలుత గోవా 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు సాధించగా... ఉత్తరాఖండ్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి గెలిచింది. -
రహ్మత్ షా శతకం
చిట్టగాంగ్: అఫ్గానిస్తాన్ బ్యాట్స్మన్ రహ్మత్ షా (187 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్లు) పేరు ఆ దేశ టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. బంగ్లాదేశ్తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్టులో సెంచరీ బాదిన అతడు అఫ్గాన్ తరఫున ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. షాకు తోడు అస్గర్ అఫ్గాన్ (160 బంతుల్లో 88 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి అఫ్గాన్ ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్... ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ (21), ఇహ్సానుల్లా (9) వికెట్లను త్వరగానే కోల్పోయింది. లంచ్ సమయానికి నాలుగో నంబరు బ్యాట్స్మన్ హష్మతుల్లా షహీదీ (14) కూడా ఔట్ కావడంతో జట్టు 77/3తో నిలిచింది. ఈ దశలో షా, అస్గర్ నాలుగో వికెట్కు 120 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ వెంటనే నబీ (0) వెనుదిరిగాడు. అస్గర్, వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ (90 బంతుల్లో 35 బ్యాటింగ్; 4 ఫోర్లు, సిక్స్) ఆరో వికెట్కు అబేధ్యంగా 74 పరుగులు జోడించి రోజును ముగించారు. స్పిన్నర్ల పైనే భరోసా ఉంచిన బంగ్లా ఈ మ్యాచ్కు ప్రధాన పేసర్లు లేకుండానే బరిలో దిగింది. ఆ జట్టు తరఫున 8 మంది బౌలింగ్ చేయడం గమనార్హం. రషీద్... చిన్న వయసు టెస్టు కెప్టెన్ బంగ్లాతో టెస్టులో అఫ్గాన్కు నాయకత్వం వహించడం ద్వారా మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (20 ఏళ్ల 350 రోజులు) అతి చిన్న వయసు కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు జింబాబ్వేకు చెందిన తతెంద తైబు (20 ఏళ్ల 358 రోజులు– 2004లో శ్రీలంకపై) పేరిట ఉన్న రికార్డును రషీద్ సవరించాడు. 1962లో 21 ఏళ్ల 77 రోజుల వయసులో భారత్కు సారథ్యం వహించిన దివంగత మన్సూర్ అలీఖాన్ పటౌడీ... అతి చిన్న వయసు కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. -
మరో సెంచరీ బాదేసిన స్మిత్
మాంచెస్టర్ : యాషెస్ సిరీస్లో స్టీవ్ స్మిత్ తన భీకరపామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఓల్డ్ట్రాఫర్డ్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండోరోజు ఆటలో స్మిత్(100, 163 బంతుల్లో) సెంచరీ సాధించి టెస్టు కెరీర్లో 26 వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండోరోజు లంచ్ సమయానికి ఆసీస్ 5 వికెట్లకు 245 పరుగులు చేసింది. మొదటిరోజు 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మార్నస్ లబుషేన్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 116 పరుగులు జోడించారు. లబూషేన్ ఔటయ్యాక ఇతర బ్యాట్సమెన్ల సహకారంతో రెండోరోజు ఆటను కొనసాగించిన స్మిత్ 163 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్మిత్కు ఈ సిరీస్లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. కాగా, మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. -
కోహ్లి కొట్టాడు...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: మొదట్లో, చివర్లో తడబడినా... మధ్యలో కెప్టెన్ విరాట్ కోహ్లి (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, సిక్స్) సెంచరీ, యువ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, సిక్స్) చక్కటి అర్ధ సెంచరీలతో మెరవడంతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్పై టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... ఓపెనర్లు విఫలమైనా కోహ్లి, అయ్యర్ ఇన్నింగ్స్ను నిలబెట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. వన్డేల్లో కోహ్లి 42వ శతకం సాధించాడు. విండీస్ బౌలర్లలో బ్రాత్వైట్ (3/53) రాణించగా, కాట్రెల్, హోల్డర్, చేజ్లకు ఒక్కో వికెట్ దక్కింది. కడపటి వార్తలు అందేసరికి... వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి వెస్టిండీస్ 12.5 ఓవర్లలో రెండు వికెట్లకు 55 పరుగులు చేసింది. భువనేశ్వర్ బౌలింగ్లో క్రిస్ గేల్ (24 బంతుల్లో 11; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా... ఖలీల్ బౌలింగ్లో ౖషై హోప్ (1) బౌల్డయ్యాడు. వ్యక్తిగత స్కోరు 7 పరుగుల వద్ద క్రిస్ గేల్ విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. బ్రియాన్ లారా (10,348 పరుగులు) పేరిట ఉన్న రికార్డును గేల్ అధిగమించాడు. వారే నిలిపారు... ఓపెనర్ ధావన్ (2) పరుగుల ప్రయాస కొనసాగడంతో భారత్కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో బంతికే అతడు కాట్రెల్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఔటివ్వకున్నా విండీస్ రివ్యూ కోరి ఫలితం రాబట్టింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (34 బంతుల్లో 18; 2 ఫోర్లు)... 11వ బంతికి ఖాతా తెరిచాడు. ఆ తర్వాతా ఇబ్బందిగానే కనిపించాడు. సమన్వయ లోపంతో రెండుసార్లు రనౌటయ్యే ప్రమాదం ఎదుర్కొన్నాడు. ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్న కోహ్లి తనదైన శైలిలో సాధికారికంగా ఆడాడు. చకచకా అర్ధసెంచరీ (57 బంతుల్లో) అందుకున్నాడు. ఈ దశలో చేజ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి రోహిత్ పెవిలియన్ చేరాడు. వీరి మధ్య రెండో వికెట్కు 74 పరుగులు జతకూడితే ఇందులో విరాట్వే 50 ఉండటం గమనార్హం. నాలుగో స్థానంలో పంత్ (35 బంతుల్లో 20; 2 ఫోర్లు) ప్రయోగం ఈసారీ విఫలమైంది. శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి బౌలర్లు వేసిన బంతులకు పంత్ ఇబ్బంది పడ్డాడు. బ్రాత్వైట్ స్లో డెలివరీని ఫైన్ లెగ్లోకి స్కూప్ చేసే యత్నంలో బౌల్డయ్యాడు. అప్పటికి స్కోరు 22.2 ఓవర్లలో 101/3. మరో వికెట్ పడకుండా చూసుకుంటూ కోహ్లి, అయ్యర్ స్వేచ్ఛగా ఆడారు. శ్రేయస్ సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలుచూసుకుని బౌండరీలు బాదాడు. మొదటి నుంచి అతడి స్ట్రయిక్ రేట్ 100పైనే నిలిచింది. హోల్డర్ బౌలింగ్లో సింగిల్తో కోహ్లి సెంచరీ (112 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అయ్యర్ అర్ధశతకం (49 బంతుల్లో) అందుకున్నాడు. థామస్ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది స్కోరు పెంచే యత్నం చేసిన కోహ్లి అదే ఊపులో బ్రాత్వైట్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి వెనుదిరిగాడు. కోహ్లి–అయ్యర్ నాలుగో వికెట్కు 115 బంతుల్లోనే 125 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్ 42.2వ ఓవర్ వద్ద ఉండగా వర్షం 25 నిమిషాలు ఆటంకం కలిగించింది. తిరిగి ప్రారంభమయ్యాక రోచ్ ఓవర్లో చక్కటి సిక్స్ కొట్టిన అయ్యర్ కెరీర్లో తొలి సెంచరీ సాధించేలా కనిపించాడు. కానీ, అతడిని హోల్డర్ పెవిలియన్ చేర్చాడు. జాదవ్ (16), భువనేశ్వర్ (1) విఫలమైనా జడేజా (16 నాటౌట్) కాసిన్ని పరుగులు జోడించాడు. కోహ్లి శతక నిరీక్షణ తీరింది... ప్రపంచ కప్ నుంచి సాగుతున్న కోహ్లి సెంచరీల నిరీక్షణకు తెరపడింది. కప్లో 9 మ్యాచ్ల్లోనూ సెంచరీ చేయలేకపోయిన విరాట్ విండీస్పై రెండో వన్డేలో అవకాశాన్ని వదల్లేదు. మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లి శతకం (123) బాదాడు. ఆ సిరీస్లో మిగతా రెండు మ్యాచ్లు, తర్వాత ప్రపంచ కప్లో 9 మొత్తం 11 మ్యాచ్ల్లోనూ సెంచరీ కొట్టలేకపోయాడు. గతంలో ఓసారి అతడు వరుసగా 18 మ్యాచ్ల్లో శతకం అందుకోలేకపోయాడు. ఓవ రాల్గా వెస్టిండీస్పై అతడికిది 8వ సెంచరీ. ఆసీస్, శ్రీలంకపైనా ఎనిమిదేసి సెంచరీలు చేశాడు. నాలుగులో అయ్యర్ కాదు.. పంత్ ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మళ్లీ చర్చనీయాంశమైంది. నాలుగో స్థానంలో నిఖార్సైన బ్యాట్స్మన్ కోసం ఎదురుచూస్తూ, అందుకే అన్నట్లుగా ఎంపిక చేసిన అయ్యర్ను కాదని పంత్ను ముందుగా పంపారు. రోహిత్ ఔటైన ఆ సమయానికి ఇంకా 34.3 ఓవర్లున్నాయి. కెప్టెన్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ను నడిపించేందుకు, నాణ్యమైన నంబర్–4 బ్యాట్స్మన్ దిగేందుకు ఇది అనువైన పరిస్థితి. భారత్ భవిష్యత్ అవసరాలరీత్యా చూసినా శ్రేయస్నే దింపాలి. కానీ, ఊహించని విధంగా పంత్ వచ్చాడు. వస్తూనే రెండు ఫోర్లు కొట్టిన రిషభ్ ఆ తర్వాత జోరు చూపలేకపోయాడు. అతడు ఎదుర్కొన్న చివరి 14 బంతుల్లో 12 బంతులకు పరుగే రాలేదు. అయ్యర్,పంత్ బ్యాటింగ్ చేసిన తీరును పోల్చి చూసినా నంబర్–4లో ఎవరు సరైనవారో తెలిసిపోతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కాట్రెల్ 2; రోహిత్ శర్మ (సి) పూరన్ (బి) చేజ్ 18; విరాట్ కోహ్లి (సి) రోచ్ (బి) బ్రాత్వైట్ 120; రిషభ్ పంత్ (బి) బ్రాత్వైట్ 20; శ్రేయస్ అయ్యర్ (బి) హోల్డర్ 71; కేదార్ జాదవ్ (రనౌట్) 16; జడేజా (నాటౌట్) 16; భువనేశ్వర్ (సి) రోచ్ (బి) బ్రాత్వైట్ 1; షమీ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 279. వికెట్ల పతనం: 1–2, 2–76, 3–101, 4–226, 5–250, 6–258, 7–262. బౌలింగ్: కాట్రెల్ 10–0–49–1, రోచ్ 7–0–54–0, హోల్డర్ 9–0–53–1, థామస్ 4–0–32–0, చేజ్ 10–1–37–1, బ్రాత్వైట్ 10–0–53–3. ► 120 పరుగులు ► 14ఫోర్లు ► 1సిక్స్ గంగూలీని దాటిన కోహ్లి... కోహ్లి అరుదైన రికార్డుకు రెండో వన్డే వేదికైంది. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ జాబితాలో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (311 మ్యాచ్ల్లో 11,363)ని అధిగమించి అతడు రెండో స్థానానికి చేరాడు. దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ (463 మ్యాచ్ల్లో 18,426 పరుగులు) టాప్లో ఉన్నాడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఆగస్టులో శ్రీలంకపై తొలి వన్డే ఆడిన కోహ్లి... ఇప్పటివరకు 238 మ్యాచ్లు, 229 ఇన్నింగ్స్ల్లో 11,406 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అతను ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
జలియన్వాలా బాగ్కు వందేళ్లు
అమృత్సర్/న్యూఢిల్లీ: జలియన్వాలా బాగ్ మారణకాండ జరిగి నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ నరమేధంలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకున్నారు. వెంకయ్య నాయుడు జలియన్వాలా బాగ్ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అలాగే సిక్కు గురువులు పాడిన శ్లోకాలను ఆలకించారు. ఈ నరమేధం జ్ఞాపకార్థం వెంకయ్య నాయుడు స్మారక నాణెం, తపాలా బిళ్లను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం ఎంత విలువైనదో జలియన్వాలా బాగ్ దురంతం మనందరికీ గుర్తు చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. 1919 ఏప్రిల్ 13న సిక్కుల ముఖ్య పండుగ వైశాఖీ సందర్భంగా అమృత్సర్లోని జలియన్వాలా బాగ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని మోదీ నివాళులు జలియన్వాలా బాగ్ దురంతంలో అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆ పోరాట వీరులు దేశం కోసం పనిచేయడానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ‘జలియన్వాలా బాగ్ నరమేధం జరిగి నేటికి వందేళ్లు. ఈ సందర్భంగా ఆ ఘటనలో అమరులైన వారికి భారత్ నివాళులర్పిస్తోంది. వారి విలువైన ప్రాణ త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. దేశం కోసం మరింత కష్టపడి పనిచేయడానికి వారు స్ఫూర్తిగా నిలిచారు’అని మోదీ ట్వీట్ చేశారు. స్మారకం వద్ద రాహుల్ నివాళి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జలియన్వాలాబాగ్ స్మారకం వద్ద నివాళులర్పించారు. రాహుల్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా అంజలి ఘటించారు. నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ‘స్వాతంత్య్రపు విలువ ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రాణత్యాగం చేసిన నాటి పోరాట వీరులకు అభివాదం చేస్తున్నాం’అని రాహుల్ సందర్శకుల పుస్తకంలో రాశారు. -
డి కాక్ సెంచరీ: దక్షిణాఫ్రికాదే సిరీస్
డర్బన్: ఓపెనర్ క్వింటన్ డి కాక్ (108 బంతుల్లో 121; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించడంతో... శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 71 పరుగుల తేడాతో గెలిచింది. వరుసగా మూడో విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 331 పరుగులు చేసింది. డసెన్ (50), మిల్లర్ (41 నాటౌట్) రాణించారు. అనంతరం వర్షం రావడంతో శ్రీలంక లక్ష్యాన్ని 24 ఓవర్లలో 193 పరుగులుగా నిర్దేశించారు. అయితే శ్రీలంక 24 ఓవర్లలో ఐదు వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. -
‘కోహ్లి 100 సెంచరీలు కొడతాడు’
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వంద అంతర్జాతీయ శతకాలు సాధించగలడని మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫిట్నెస్ కాపాడుకుంటూ ఇదే ఫామ్ కొనసాగిస్తే అతడు వంద సెంచరీలు కొట్టడం ఖాయమన్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం అడిలైడ్లో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సెంచరీ చేశాడు. వన్డేల్లో అతడికిది 39వ సెంచరీ. టెస్టులు, వన్డేలు కలిపి ఇప్పటివరకు 64 సెంచరీలు సాధించాడు. అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్, పాంటింగ్ తర్వాత మూడో స్థానంలో కోహ్లి ఉన్నాడు. (కోహ్లి సెంచరీ.. ధోని ఫినిషింగ్ టచ్) ‘విరాట్ కోహ్లి నిలకడగా బాగా ఆడుతున్నాడు. ఫిట్గా ఉంటే 100 సెంచరీల మార్క్ను కచ్చితంగా చేరుకుంటాడు. కోహ్లి గొప్ప ఆటగాడు. అతడు సెంచరీ చేసినప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే టీమిండియా ఓడిపోయింద’ని అజారుద్దీన్ పేర్కొన్నాడు. అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై కూడా అజర్ ప్రశంసలు కురిపించాడు. ధోని బాగా బ్యాటింగ్ చేశాడని, చివరివరకు వికెట్ కాపాడుకుని విన్నింగ్ షాట్ కొట్టడం అతడికే చెల్లిందని మెచ్చుకున్నాడు. దినేశ్ కూడా బాగా బ్యాటింగ్ చేశాడని, మొత్తంగా టీమిండియా ప్రదర్శన బాగుందని అభిప్రాయపడ్డాడు. -
షాన్ మార్ష్ సెంచరీ
అడిలైడ్: భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ షాన్ మార్ష్ సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో 10 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ. శతకంతో ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేశాడు మార్ష్. ఖవాజాతో కలిసి మూడో వికెట్కు 56 పరుగులు జోడించారు. హ్యాండ్స్కోంబ్తో కలిసి నాలుగో వికెట్కు 52 పరుగులు, స్టొయినిస్తో కలిసి ఐదో వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 247/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. -
పుజారా శతకం.. భారీ స్కోరు దిశగా భారత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. 280 బంతులు ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్లతో ఈ సిరీస్లో రెండో శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో 17 సెంచరీలు పూర్తిచేసిన పుజారాకు ఆసీస్పై ఇది నాలుగో శతకం. విరాట్ కోహ్లి కూడా పుజారాకు చక్కటి తోడ్పాటు అందిస్తున్నాడు. వీరిద్దరు నిలకడగా ఆడుతుండటంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. ఓవర్ నైట్ స్కోరు 215/2తో రెండో రోజు బ్యాటింగ్ దిగిన టీమిండియా లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా(103), కోహ్లి(69) క్రీజులో ఉన్నారు. -
హిమ్మత్ సింగ్ సెంచరీ: భారత్ హ్యాట్రిక్
కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ కప్ టోర్నీలో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో హిమ్మత్ సింగ్ (126 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 260 పరుగులు చేసింది. ఫెర్నాండో (80; 6 ఫోర్లు, 1 సిక్స్), గుణరత్నే (67 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో శివమ్ మావి 3, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 47.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి గెలిచింది. 20 పరుగులకే 2 టాపార్డర్ వికెట్లను కోల్పోయిన భారత్ను హిమ్మత్, రుతురాజ్ గైక్వాడ్ (67; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 148 పరుగులు జోడించడంతో భారత్ విజయం సులువైంది. ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్ చేరిన భారత్ అన్ని మ్యాచ్ల్లో గెలిచి 6 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్లో పాకిస్తాన్తో భారత్; బంగ్లాదేశ్తో శ్రీలంక తలపడతాయి. -
పరుగుల యంత్రం కోహ్లి మరో సెంచరీ
పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బాల్ నోట వచ్చిన మాట. వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లి తాజాగా చేసిన శతకాన్ని చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తోంది. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి శతకాలు బాదేస్తున్నాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లి.. మూడో వన్డేలోను తన జోరును కొనసాగిస్తూ.. వరుసగా మూడో సెంచరీ సాధించాడు.110 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్తో కెరీర్లో 38వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఫుల్ ఫామ్లో ఉన్న కోహ్లిని ఆపడం విండీస్ బౌలర్ల నుంచి కావడం లేదు. మరోవైపు కోహ్లి మినహా మిగతా టాపార్డర్ బ్యాట్స్మన్ రోహిత్(8), ధావన్ (35), రాయుడు (22), పంత్ (24), ధోని(7)లు విఫలమయ్యారు. దీంతో భారత్ 194 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లి ఒక్కడే బాధ్యతనంతా తన భుజాలపై వేసుకోని గెలుపు కోసం పోరాడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లితో పాటు భువనేశ్వర్ ఉన్నాడు. -
10,000
ఐదంకెల మార్క్ను అందుకునే క్రమంలో... ► అతి తక్కువ ఇన్నింగ్స్లలో (205) పది వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగా కోహ్లి కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్) పేరిట ఈ ఘనత ఉంది. సచిన్కంటే 54 ఇన్నింగ్స్లు అతను తక్కువగా ఆడటం విశేషం. 205 ఇన్నింగ్స్లు ముగిసేసరికి కోహ్లి తర్వాత డివిలియర్స్ మాత్రమే గరిష్టంగా 9,080 పరుగులు చేయడం విరాట్ ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ►అరంగేట్రం చేసిన నాటి నుంచి అతి తక్కువ రోజుల్లో 10 వేలు మైలురాయిని చేరింది కూడా కోహ్లినే. అతను 10 ఏళ్ల 67 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ద్రవిడ్కు ఈ ఘనత సాధించేందుకు 10 ఏళ్ల 317 రోజులు పట్టింది. ►10 వేల కోసం ఎదుర్కొన్న బంతులను చూసినా కోహ్లిదే రికార్డు. జయసూర్య 11,296 బంతులు ఆడితే కోహ్లికి 10,813 మాత్రమే సరిపోయాయి. ► పిన్న వయసులో 10 వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. అతను 29 ఏళ్ల 353 రోజుల వయసులో ఈ మైలురాయి చేరుకోగా, సచిన్ 27 ఏళ్ల 341 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు. ►10 వేల పరుగులు పూర్తి చేసే సమయానికి అత్యధిక సగటు (59.53) కోహ్లిదే. ధోని మినహా మరెవరూ 50కి పైగా సగటుతో ఈ మైలురాయిని చేరలేదు. ►కోహ్లి ఒక్క భారత గడ్డపైనే 78 ఇన్నింగ్స్లలో 4,127 పరుగులు చేయగా, మిగతా ఎనిమిది దేశాలలో కలిపి 127 ఇన్నింగ్స్లలో 5,949 పరుగులు చేశాడు. ►భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కోహ్లి పేరిటే ఉంది. 2013లో ఆస్ట్రేలియాతో జైపూర్లో జరిగిన మ్యాచ్లో అతను 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 52 బంతుల్లోనే శతకం బాదాడు. ► కెరీర్లో అత్యధికంగా 153 మ్యాచ్లలో మూడో స్థానంలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లి 1, 2, 4, 5, 6, 7 స్థానాల్లో కూడా ఆడాడు. ►వన్డేల్లో అఫ్గానిస్తాన్, యూఏఈలతో ఒక్కో మ్యాచ్ ఆడిన కోహ్లి... ఈ రెండు దేశాలు మినహా తాను ప్రత్యర్థిగా ఆడిన ప్రతీ జట్టుపై సెంచరీ సాధించాడు. అఫ్గాన్తో బ్యాటింగ్కు దిగని కోహ్లి, యూఏఈపై అజేయంగా 33 పరుగులు చేశాడు. ఇదే కాకుండా తాను ఆడిన 9 దేశాల్లోనూ అతను శతకాలు సాధించాడు. ►భారత జట్టు గెలిచిన 128 మ్యాచ్లలో భాగంగా ఉన్న కోహ్లి ఆ మ్యాచ్లలో 78.47 సగటుతో 7,220 పరుగులు చేయగా... ఓడిన 73 మ్యాచ్లలో 35.61 సగటుతో 2,564 పరుగులు చేశాడు. జట్టు విజయాల్లో అతని పాత్ర ఏమిటో దీనిని బట్టి చెప్పవచ్చు. ► 50కి పైగా సగటుతో 10 వేల మార్క్ చేరిన ఇద్దరు ఆటగాళ్లలో ధోని ఒకడు కాగా, మరొకడు కోహ్లి. ►తొలుత బ్యాటింగ్ సమయంలో 89 ఇన్నింగ్స్లలో 49.92 సగటుతో 4,469 పరుగులు చేసిన కోహ్లి...ఛేదనలో 116 ఇన్నింగ్స్లలో 68.54 సగటుతో 6,032 పరుగులు సాధించాడు. ► కోహ్లి ఒక్క తిసారా పెరీరా (శ్రీలంక) బౌలింగ్లోనే 262 పరుగులు చేశాడు. టాప్ –5 స్కోర్లు 183 పాకిస్తాన్పై, 2012 160 నాటౌట్ దక్షిణాఫ్రికాపై, 2018 157 నాటౌట్ వెస్టిండీస్పై, 2018 154 నాటౌట్ న్యూజిలాండ్పై, 2016 140 వెస్టిండీస్పై, 2018 ►మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు: 30 ►మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు: 6 -
హఫీజ్ శతకం: పాక్ 255/3
దుబాయ్: ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (106; 16 ఫోర్లు) శతకం బాదడంతో ఆస్ట్రేలియాతో ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. మరో ఓపెనర్ ఇమాముల్ హక్ (188 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్) అర్ధశతకంతో రాణించడంతో ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 వికెట్లకు 255 పరుగులు చేసింది. రెండు సెషన్ల పైగా క్రీజులో నిలిచిన హఫీజ్, ఇమాముల్ తొలి వికెట్కు 205 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో పాటు రెండు ఓవర్లలో ఆట పూర్తవుతుందనగా ప్రధాన బ్యాట్స్మన్ అజహర్ అలీ (18) అవుటయ్యాడు. దీంతో ఆసీస్కు కొంత ఊరట దక్కింది. హరిస్ సొహైల్ (15 బ్యాటింగ్), అబ్బాస్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సిడిల్, నాథన్ లయన్, హోలాండ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. -
తొలి టెస్టులోనే సెంచరీ చేసిన పృధ్వీ షా
-
వారెవ్వా రిషబ్.. సూపర్ సెంచరీ
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఓటమి అంచుల్లోకి వెళ్లిన టీమిండియా అద్భుత పోరాట పటిమన ప్రదర్శిస్తొంది. కేవలం రెండు పరుగులకే ధావన్, కోహ్లి, పుజారా వికెట్లు కోల్పొయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్.. ప్రస్తుతం 298/5తో నిలిచి గెలుపు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపు ఇన్సింగ్స్తో (142), యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్(101, 118 బంతుల్లో) సెంచరీలతో చెలరేగిపోయారు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన పంత్ ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ క్రమంలో కెరీర్లో మొదటి శతకానికి అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియా విజయానికి ఇంకా 166 పరుగులు చేయాల్సిఉంది. చివరి సెషన్ కాబట్టి వికెట్లు కాపాడుకుంటూ ఇదే వేగాన్ని కొనసాగిస్తే భారత్కు అద్భుత విజయం దక్కుతుంది. -
భరత్ సెంచరీ
బెంగళూరు: ఆంధ్ర బ్యాట్స్మన్ కోన శ్రీకర్ భరత్ సెంచరీతో (106; 12 ఫోర్లు, సిక్స్) అదరగొట్టాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (52; 5 ఫోర్లు) బ్యాటింగ్లో రాణించాడు. దీంతో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 505 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టుకు 159 పరుగుల ఆధిక్యం లభించింది. సోమవారం 223/3 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ కాసేపటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ను కోల్పోయింది. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన భరత్, శుభ్మన్ గిల్ (50; 7 ఫోర్లు)కు జతయ్యాడు. ఇద్దరు కలిసి స్కోరును 300 పరుగులకు చేర్చారు. అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే గిల్ నిష్క్రమించగా... గౌతమ్ (20), కుల్దీప్ యాదవ్ల అండతో శ్రీకర్ శతకాన్ని సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. -
అఖరి ఇన్సింగ్స్లో కుక్ సెంచరీ
లండన్ : భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్లో ఇంగ్లండ్ ఆటగాడు అలెస్టర్ కుక్ అద్భుత శతకంతో చెలరేగాడు. చివరి టెస్ట్ మ్యాచ్లో కుక్ శతకం సాధించి తన కెరీర్లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కుక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. విహారి వేసిన ఇన్సింగ్స్ 70వ ఓవర్లో సింగిల్ ద్వారా కుక్ 100 పరుగుల మార్కును అందుకున్నాడు. అతని సెంచరీ పూర్తి చేయగానే స్టేడియం చప్పట్లతో హోరెత్తింది. 2006లో నాగపూర్ టెస్ట్ ద్వారా భారత్పై తన అరంగ్రేటం మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కిన కుక్.. తన చివరి మ్యాచ్లో కూడా భారత్పై సెంచరీతో చెలరేగిపోయాడు. 2006లో నాగపూర్లో జరిగిన టెస్ట్లో కుక్ 104 పరుగులతో నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే. 114/2 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి నుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కుక్-రూట్ జోడి క్రీజ్లో పాతుకుపోయి ఎడాపెడా బౌండరీలతో చెలరేగిపోయారు. మరో ఆటగాడు రూట్ కూడా సెంచరీ దిశగా వెళ్తున్నాడు. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 243/2తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. క్రీజ్లో కుక్ (103), రూట్ (93) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 283 పరుగుల ఆధిక్యంతో ఉంది. -
మయాంక్ అగర్వాల్ శతకం
బెంగళూరు: ఫామ్లో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (114 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్స్లు) శతకం బాదడంతో నాలుగు జట్ల వన్డే టోర్నీలో భారత్ ‘బి’ జయకేతనం ఎగురవేసింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో తొలుత భారత్ ‘ఎ’ 49 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. అంబటి రాయుడు (75 బంతుల్లో 48; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్. సంజూ శాంసన్ (50 బంతుల్లో 32; 2 సిక్స్లు), కృష్ణప్ప గౌతమ్ (32 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లు రవి సమర్థ్ (0), సూర్యకుమార్ యాదవ్ (11) సహా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (20)లను త్వరగా అవుట్ చేసి... పేసర్ ప్రసిధ్ కృష్ణ (4/50) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. శ్రేయస్ గోపాల్ (2/38) పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఛేదనలో మయాంక్కు తోడుగా ఇషాన్ కిషన్ (25), శుబ్మన్ గిల్ (42), కెప్టెన్ మనీశ్ పాండే (21 నాటౌట్) తలోచేయి వేయడంతో‘బి’ జట్టు 41.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికా ‘ఎ’ పై 32 పరుగులతో ఆస్ట్రేలియా ‘ఎ’ గెలిచింది.