ప్రధాన వార్తలు

ఇరాన్ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెలీ అవీవ్, ఇతర ప్రాంతాలను టార్గెట్గా ఇరాన్ భారీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో, టెలీ అవీవ్ సహ దాదాపు 400 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోవైపు.. తమపై దాడి చేసి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా బాంబు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ..మరోవైపు.. అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్ను టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్తో ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్లోని జెరూసలెంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య ఇజ్రాయెల్లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరిగినట్టు సమాచారం. ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. జూన్ 27వ తేదీ వరకు ఇజ్రాయెల్ విమాన సర్వీసులను రద్దు చేసింది.'హార్ముజ్ జలసంధి' మూసివేత!ఇదిలా ఉండగా.. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇక, ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది. 🚨⚡BREAKING AND UNUSUALBrigadier General Tangsiri, Commander of the IRGC Navy:The Strait of Hormuz will be closed within a few hours. pic.twitter.com/ca1cYFwvvf— RussiaNews 🇷🇺 (@mog_russEN) June 22, 2025 భారత్పై ఎఫెక్ట్.. ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.

చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ సూపర్ స్టార్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో భారత్తో జరిగిన టెస్టుల్లో 1589 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గడ్డపై సచిన్ 1575 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రూట్ తన మార్క్ చూపించలేకపోయాడు. కేవలం 28 పరుగులు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.ఇంగ్లండ్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*👉సచిన్ టెండూల్కర్ (భారత్) – 1575👉రాహుల్ ద్రవిడ్ (భారత్) – 1376👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196👉సునీల్ గవాస్కర్ (భారత్) – 1152👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..తొలి ఇన్నింగ్స్లో భారత్కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్,శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్గా

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

‘అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. తాజాగా ఇరాన్ అణుశక్తి సంస్థ (ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్) ఆదివారం తెల్లవారుజామున తమ దేశంలోని మూడు అణుశక్తి కేంద్రాలపై జరిగిన దాడులను ధృవీకరించింది. ఈ విధంగా అణుకేంద్రాలపై దాడులు జరిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించింది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల కారణంగా ఎంత నష్టం జరిగిందో స్పష్టం చేయకుండా, దాడుల వివరాలను ప్రకటించారని ఇరాన్ పేర్కొంది. అణు కేంద్రాలపై సాగించిన దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకువస్తుందని టెహ్రాన్ ఏజెన్సీ పేర్కొంది. అమెరికా సైన్యం తాజాగా ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ అణుశక్తి సంస్థపై శత్రువుల కుట్రలు సాగుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రయత్నాలతో ఏర్పడిన ఈ జాతీయ పరిశ్రమ అభివృద్ధిని ఆపబోమని ఇరాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ఫోన్లో సంభాషిస్తూ జియోనిస్ట్ పాలనలోని దురాక్రమణకు తమ ప్రతిస్పందన మరింత వినాశకరంగా ఉంటుందని హెచ్చరించారని అధికారిక ఇర్నా వార్తా సంస్థ పేర్కొంది. ఈ దాడుల కారణంగా టెహ్రాన్కు దక్షిణంగా ఉన్న కోమ్ నివాసితులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని పర్వతాలలోగల అణు కేంద్రంపై అమెరికా దాడి చేసింది.ఇది కూడా చదవండి: ట్రంప్ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు

మళ్లీ అదే రాజ్యాంగ ఉల్లంఘన
సాక్షి, అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరితెగించింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్ల జారీకి సిద్ధమైంది. గత నెలలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులిస్తూ బాండ్లు విడుదల చేసి రూ.3,489 కోట్లు సమీకరించింది. అయితే.. ఇది జరగడానికి ముందే కూటమి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకోవాలని హైకోర్టులో పలువురు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే.. మే 8న ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. తాజాగా ఈ నెల 24న రెండోసారి జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ బాండ్లు కొనేవారికి రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించడమే కాకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్తు ఆదాయాల పైనా ప్రత్యేక హక్కు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల బేస్ వాల్యూతో బాండ్లు జారీచేయగా... రూ.3,489 కోట్ల బాండ్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు.అత్యధిక వడ్డీ భారం మే 8న 9.30 శాతం వడ్డీ రేటుతో ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసింది. ఇది చాలా ఎక్కువ రేటు. రాష్ట్ర ఖజానాపై డైరెక్ట్ డెబిట్ హామీ ఇవ్వడంతో పాటు ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత కూడా ఇంత ఎక్కువ వడ్డీ అంటే దారుణమే. బాండ్లు కొనుగోలు చేసినవారికి అన్ని రకాల ప్రయోజనాలు సమకూర్చి కూడా ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.⇒ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 6.71 శాతం వడ్డీ రేటుతో స్టేట్ డెవలప్మెంట్ లోన్ (ఎస్డీఎల్) తీసుకుంది. కానీ, అదే నెలలో దీనికంటే 2.59 శాతం ఎక్కువ వడ్డీ రేటుకు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఖజానాపై అతి భారమైన అప్పుగా నిలిచి అనేక జవాబు లేని ప్రశ్నలను లేవనెత్తింది.⇒ గతంలో ఏపీ సీఆర్డీఏ (ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ), ఏపీ ఎస్బీసీఎల్ (ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్)లు ఎటువటి తాకట్టులు లేకుండానే తక్కువ వడ్డీ రేటుకు ఎన్సీడీ బాండ్లు జారీ చేసి డబ్బు సమకూర్చుకున్నాయి. కానీ, ఇప్పుడు ఖనిజాభివృద్ధి సంస్థ రూ.1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ గనులను తాకట్టు పెట్టి కూడా అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం గమనార్హం. ⇒ రూ.లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టిన తర్వాత కూడా అంత ఎక్కువ వడ్డీ భారాన్ని రాష్ట్రం నెత్తిన మోపడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఎస్డీఎల్ లోన్తో సమానమైన వడ్డీ రేటు ఇవ్వాల్సి ఉండగా... ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ అప్పు ద్వారా... బాండ్లు కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు ఎక్కడా లేని భద్రత, అధిక వడ్డీలు, ప్రత్యేక సదుపాయాలు దక్కుతుండగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తీవ్ర నష్టం కలుగుతోంది. హైకోర్టులో కేసున్నా...ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారంపై ఇప్పటికే ఒక పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. మే 7న కోర్టు దీనిపై ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేసు న్యాయ విచారణలో ఉన్నా లెక్కచేయకుండా ప్రభుత్వం మళ్లీ అదే తరహాలో బాండ్ల జారీకి ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై ముందుకెళ్లడం తప్పు. ఒకసారి ఆ తప్పు చేసి మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం నైతికంగా, నైతికంగా సరికాదు‘ అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి నేరుగా అప్పు తీసుకోవడం ఆర్టికల్ 293 (1) ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా శాసనసభ పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవడం ఆర్టికల్స్ 203, 204 ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థపై నీలి నీడలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల కుంపటి వ్యవహారం దేశంలో అమలవుతున్న ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్మ్యాప్పై మాయని మచ్చగా మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధమైన అప్పుల విధానాన్ని అనుసరిస్తే కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సమతుల్యత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కీలక ప్రశ్నలు–రాష్ట్రం పేరు మీద కాకుండా.. రాష్ట్ర ఖజానా ఆధారంగా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?–డైరెక్ట్ డెబిట్ మాండేట్ ద్వారా ఖజానాను అందుబాటులో పెట్టడం ఎంతమేరకు చట్టబద్ధం?–హైకోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ అదే విధంగా బాండ్ల జారీకి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?–ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టడం న్యాయం?–రూ.1.90 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టి అధిక వడ్డీ రేటుకు అప్పు తేవడం మన రాష్ట్రానికి మంచిదా?

క్లాస్రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వీడియో వైరల్
జాల్నా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఓ టీచర్ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు.మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్ గ్రామంలో ఉన్న మరాఠీ మీడియం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న వీకే ముండే.. ఇటీవల తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు పాఠాలు చదువుకుంటుండగా, ఆయన కుర్చీలో వెనక్కి వాలి.. కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ సుమారు 30 నిముషాలు గాఢ నిద్రలో మునిగిపోయారు.ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. "మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు? ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

‘సింధు ఒప్పందం’పై పాక్కు కంగుతినిపించిన అమిత్ షా
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అయితే ఈ పరిణామంతో కంగుతిన్న పాక్ తిరిగి సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు వేడుకుంటోంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా మరోమారు ఈ విషయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారు.ఇస్లామాబాద్తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటికీ పునరుద్ధరించబోదని, పాకిస్తాన్కు ప్రవహించే సింధు నీటిని భారత అంతర్గత వినియోగం కోసం మళ్లించనున్నామని హోంమంత్రి అమిత్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కాశ్మీర్లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన అనంతరం సింధు నదీ వ్యవస్థ వినియోగాన్ని నియంత్రించే 1960 ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం కింద భారతదేశంలోని మూడు నదుల నీటిని పాకిస్తాన్లోని 80శాతం పొలాలకు అందించేందలా నాడు ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం రద్దుపై తాజాగా స్పందించిన అమిత్ షా.. ఒక కాలువ నిర్మించడం ద్వారా పాకిస్తాన్కు ప్రవహిస్తున్న నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామని, అప్పుడు పాకిస్తాన్కు నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఈ ఒప్పందంపై చర్చల కోసం తపిస్తున్న ఇస్లామాబాద్ ఆశలను నీరుగార్చాయి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయాలని ఇస్లామాబాద్ యోచిస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?

అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..!
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్ 22న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది.ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!)

OTT: ‘గ్యాంగర్స్’మూవీ రివ్యూ
తమిళనాట సుందర్.సి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తుంటారు. ఆయన కథల్లో సామాన్యులు కూడా అనితరసాథ్యమైన ఫీట్లు చేస్తుంటారు. అలానే కథలు రాసుకుంటారు సుందర్.సి. అదే కోవలో తీసుకువచ్చిన మరో యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గ్యాంగర్స్(Gangers Movie Review ). ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా లభ్యమవుతోంది. సుందర్.సి ఈ కథను తానే రాసుకుని, అదే కథకు తాను నిర్మాతగా కూడా వ్యవహరించి దర్శకత్వం కూడా తానే చేశారు. అరసన్ హైస్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్ సుజి తన స్టూడెంట్ రమ్య కనబడకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రారంభమయ్యే ఈ సినిమా ఒక ఉత్కంఠభరిత యాక్షన్ థ్రిల్లర్. సుజి స్కూల్ కరస్పాండెంట్ మలైయరసన్ అలాగే అతని సోదరుడు కొట్టైయరసన్లపై రమ్య గురించి చేసిన ఆరోపణలతో కథ ఊపందుకుంటుంది. ఈ ఫిర్యాదు తరువాత దానిని విచారణ చేయడానకి ఓ రహస్య అధికారిగా శరవణన్ PT టీచర్గా ఆ స్కూల్ లో కి వస్తాడు. శరవణన్ ఆ స్కూల్ లోకి వచ్చీ రాగానే స్కూల్ లో స్టూడెంట్స్ తీసుకుంటున్న మత్తుపదార్ధాల బండారాన్ని బయట పెట్టడంతో పాటు రమ్య కేసును కూడా విచారిస్తుంటాడు.రమ్య కనబడకుండా పోవడానికి కారణం ఈ ఊరి డాన్ అయిన ముదియరసన్ అని శరవణన్ తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ ఊరిలో అక్రమంగా ముదియరసన్ దాదాపు 100 కోట్లకు పైగా డబ్బులు దాచి పెట్టాడని శరవణన్ కు తెలుస్తుంది. తన తోటి టీచర్లతో కలిసి ఆ డబ్బును కొట్టేయడానికి ప్లాన్ వేస్తాడు శరవణన్. మరి ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మాత్రం గ్యాంగర్స్ సినిమాలోనే చూడాలి. సాధారణ టీచర్లు 100 కోట్ల రూపాయలను ఓ డాన్ దగ్గర నుండి కొట్టేయాలని ఏం చేస్తారు అన్నదే ఈ సినిమాలో సూపర్ పాయింట్. సినిమా ఆద్యంతం యాక్షన్ కామెడీతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వర్ధమాన తమిళ హాస్య నటుడు వడివేలు పండించిన కామెడీ ఈ సినిమాకు హైలైట్. ఓవరాల్ గా ఈ సినిమా వీకెండ్ కు మంచి కాలక్షేపం.- హరికృష్ణ ఇంటూరు
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్
ఇరాన్ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!
గిరులు.. సంప్రదాయాల సిరులు
కొత్త లుక్తో హోండా సిటీ స్పోర్ట్ కారు
ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?
అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం
పొలం రిజి్రస్టేషన్కు డబ్బులు డిమాండ్
క్లాస్రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వీడియో వైరల్
గాల్లో ఎగిరే బైక్..! 'స్కై స్కూటర్'..
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
సాక్షి కార్టూన్ 20-06-2025
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
తోడబుట్టిన బలగం
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్
ఇరాన్ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!
గిరులు.. సంప్రదాయాల సిరులు
కొత్త లుక్తో హోండా సిటీ స్పోర్ట్ కారు
ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?
అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం
పొలం రిజి్రస్టేషన్కు డబ్బులు డిమాండ్
క్లాస్రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వీడియో వైరల్
గాల్లో ఎగిరే బైక్..! 'స్కై స్కూటర్'..
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
సాక్షి కార్టూన్ 20-06-2025
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
తోడబుట్టిన బలగం
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
సినిమా

రష్మిక సాంగ్ ఎందుకు తీసేశారు?.. శేఖర్ కమ్ముల క్లారిటీ!
ధనుశ్, నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ కుబేర. క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో నాగ్ ఫ్యాన్స్తో పాటు ధనుశ్ అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. కుబేర సక్సెస్ కావడంతో ఇది శేఖర్ కమ్ముల మార్క్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక సైతం తన పాత్రకు వస్తున్న ఆదరణను చూసి సంతోషంగా ఉందని తెలిపింది.అయితే తాజాగా కుబేర సక్సెస్ కావడంతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో నాగార్జునతో పాటు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో పీపీ..డుమ్ డుమ్ అనే రష్మిక సాంగ్ను ఎందుకు తొలగించారంటూ దర్శకుడికి ప్రశ్న ఎదురైంది. దీనిపై శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చారు.పాన్ ఇండియా సినిమా కావడం వల్ల కొన్ని అలాంటి సాంగ్స్ ఉండాలకున్నామని శేఖర్ కమ్ముల తెలిపారు. అయితే ఈ సాంగ్ను కావాలని మేము తీయలేదన్నారు. కానీ కథలో ఎక్కడైనా ఈ పాట అడ్డుగా వస్తుందేమోనని వద్దనుకున్నట్లు వెల్లడించారు. వేరే మంచి సీన్ తొలగించి ఈ పాటను పెట్టడానికి నేను కథను అలా రాసుకోలేదన్నారు. ఈ చిత్రంలో ఒక్క సీన్, ఒక్క డైలాగ్ తీసేసినా ఈ సినిమా ఉండదు.. అలా కథ రాసుకున్నానని శేఖర్ కమ్ముల వివరించారు.

రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
ఏ సినిమా అయినా సరే హీరోయిజం పండాలంటే అందుకు ఎదురుగా ఉన్న పాత్ర కూడా అంతే పండాలి. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' విషయంలోనూ ఇదే జరిగినట్లు అనిపిస్తుంది. ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna Akkineni) లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ తనదైన విలనిజంతో నటుడు జిమ్ షర్బ్ ఆకట్టుకున్నాడు. ఇదే ఇతడికి తొలి సినిమా అయినా సరే.. విలనిజంతో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇంతకీ ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ముంబైకి చెందిన జిమ్ షర్బ్ సీనియర్ నటుడేం కాదు. ఇతడి వయసు జస్ట్ 37 ఏళ్లే. తండ్రి ఉద్యోగం వల్ల చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్.. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చేశాడు. తర్వాత 2014లో హిందీలో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తొలి మూవీ షురురత్ కి ఇంటర్వెల్ ఫ్లాప్. దీంతో రెండేళ్లు వెయిటింగ్ తప్పలేదు. 2016లో వచ్చిన 'నీర్జా' ఇతడి కెరీర్ని మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. అలా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)బాలీవుడ్లో పద్మావత్, సంజు సినిమాల్లో ఇతడు విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలా శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు. 'కుబేర'లో అవకాశం దక్కించుకున్నాడు. స్వతహాగా హిందీ నటుడు అయినప్పటికీ.. డబ్బింగ్కి సరిపోయేలా యాక్టింగ్ చేయగలిగాడు. సినిమాలో ఇతడి నటనకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. మూవీ చివర్లో ఇతడి పాత్ర కూడా బిచ్చగాడిగా కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.అలా తెలుగులో 'కుబేర' సినిమాతో తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్న జిమ్.. త్వరలో మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగులో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ విలనిజం చూసి చూసి జనాలకు మొనాటనీ వచ్చేసింది. ఇలాంటి టైంలో జిమ్కి అవకాశాలు వస్తే టాలీవుడ్లో కొత్త విలన్ పుట్టుకొచ్చినట్లే.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)

'మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు'.. బ్రహ్మనందం కామెంట్స్ వైరల్!
మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కన్నప్ప'. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ప్రమోషన్స్తో బిజీగా మేకర్స్. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన హాస్యనటుడు బ్రహ్మనందం యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బ్రహ్మనందంను యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఈవెంట్లో నవ్వులు పూయించారు. ఒకవేళ మోహన్ బాబు గారి సినిమాల్లో మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఏ సినిమాను ఎంచుకుంటారు? అని ప్రశ్నించింది. అందులో మూడు ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఒకటి అల్లుడుగారు, రెండోది పెదరాయుడు, మూడో ఆప్షన్గా అసెంబ్లీ రౌడీగా చెప్పింది.దీనికి బ్రహ్మనందం అసెంబ్లీ రౌడీ సినిమాను ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో మొదట నన్నే అడిగారని అన్నారు. అయితే తాను రిజెక్ట్ చేశానని తెలిపారు. ఆ తర్వాత మోహన్ బాబు మా ఇంటికి ప్రాధేయపడితే ఏ చేస్తాం సుమ? అని సర్లే చేసుకోపో అని చెప్పానంటూ నవ్వులు పూయించారు. అయితే యమదొంగలో కూడా మిమ్మల్నే అడిగారంటా అని సుమ మరో ప్రశ్న వేసింది. యమదొంగలో మాత్రం నన్ను అడగలేదు.. అలాంటి పాత్రలకు ఆయనైతేనే కరెక్ట్గా సరిపోతాడు.. బయట సరిపోతాడు.. అలాగే స్క్రీన్ మీద కూడా ఆయనే సెట్ అవుతాడంటూ అందరినీ నవ్వించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతేకాకుండా మోహన్ బాబులో మీకు నచ్చేది? నచ్చనిది ఏది? అంటూ సుమ అడిగింది. దీనికి మోహన్ బాబు అంటే నాకు అస్సలు నచ్చడంటూ సరదాగా మాట్లాడారు. ఓ మహ నటుడిని ఎవరు ఇష్టపడరమ్మా? అంటూ నవ్వుతూ మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
ఇండియన్ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్-10 చిత్రాలేవో చూసేయండి.ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్ దంగల్ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్తో సమానంగా సౌత్ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.ప్రపంచవ్యాప్తంగా దంగల్ ఎక్కువ వసూళ్లు సాధించినప్పటికీ భారత్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది మాత్రం బాహుబలి 2 మూవీయే! 2017లో బాహుబలి 2: ది కన్క్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.బాహుబలి-2 కంటే కేవలం రూ. 46 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్-2 మూవీతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్ దీటైన జవాబు.. తొలి ఇన్నింగ్స్లో 209/3
జైస్వాల్, గిల్ వేసిన బాటలో... పంత్ చెలరేగిపోయి సెంచరీ బాదడంతో ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేయగా... అదే స్థాయిలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విజృంభించినా...అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ప్రస్తుతానికి ఇరు జట్లు సమాన స్థితిలోనే ఉన్నా... మూడో రోజు తొలి సెషన్లో బుమ్రాను ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఈ మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది!లీడ్స్: బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ స్కోర్లతో రెచి్చపోవడంతో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. బుమ్రా మినహా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్... టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది. పోప్తో పాటు బ్రూక్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. కెపె్టన్ శుబ్మన్ గిల్ (227 బంతుల్లో 147; 19 ఫోర్లు, 1 సిక్స్) టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేసుకోగా... రిషభ్ పంత్ (178 బంతుల్లో 134; 12 ఫోర్లు, 6 సిక్స్లు) ధనాధన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒంటరి పోరాటం... సిరీస్ ఆరంభానికి ముందు అంతా ఊహించినట్లు... ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రానే అని నిరూపించుకున్నాడు. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కాగా... తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీ (4)ని పంత్ వెనక్కి పంపాడు. అదే తీవ్రత కొనసాగిస్తూ బుమ్రా రెచ్చిపోతుంటే... ఇంగ్లండ్ బ్యాటర్లు ప్రతీ బంతికీ బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీశారు. ఈ క్రమంలో ఎడ్జ్ల ద్వారా కాస్త పరుగులు రాగా... మనవాళ్ల పేలవ ఫీల్డింగ్ ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఇంగ్లండ్ వంటి పేస్ పిచ్లపై స్లిప్స్లో దూసుకొచ్చే బంతులను అందుకోవడంలో యువ ఆటగాళ్ల అనుభవ రాహిత్యం కొట్టిచి్చనట్లు కనిపించింది. బుమ్రా బౌలింగ్లోకు ఫీల్డర్ల మద్దతు లభించి ఉంటే ఈ పాటికి మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చి ఉండేదే! కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న బెన్ డకెట్, పోప్ కుదురుకున్నాక చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. బుమ్రా బౌలింగ్ను కాచుకున్న ఈ జంట... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో స్వేచ్ఛగా ఆడింది. దీంతో ఏ దశలోనూ పరుగుల వేగం తగ్గలేదు. టీ విరామం అనంతరం మరోసారి బంతినందుకున్న బుమ్రా... డకెట్ను క్లీన్ బౌల్డ్ చేయగా... చివరి సెషన్లో పోప్ చెలరేగిపోయాడు. ఎడాపెడా షాట్లు ఆడుతూ... 125 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే రూట్ (28)ను బుమ్రా బుట్టలో వేసుకోగా... ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది. అదరగొట్టిన పంత్.. తొలి రోజు ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న భారత బ్యాటర్లు... రెండో రోజు తొలి సెషన్ ఆరంభంలోని దాన్ని కొనసాగించారు. ఓవర్నైట్ బ్యాటర్లు గిల్, పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిల్ కాస్త సంయమనం పాటించగా... పంత్ మాత్రం భారీ షాట్లతో రెచి్చపోయాడు. ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల వద్ద బషీర్ బౌలింగ్లో భారీ సిక్సర్తో మూడంకెల స్కోరు అందుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో పల్టీలు కొడుతూ సంబరాలు జరుపుకున్నాడు. గతేడాది బంగ్లాదేశ్పై సెంచరీ అనంతరం పంత్కు ఇదే తొలి మూడంకెల స్కోరు. వన్డే తరహాలో ఆడిన ఈ జోడీ చకచకా పరుగులు రాబట్టింది. నాలుగో వికెట్కు 301 బంతుల్లో 209 పరుగులు జోడించిన అనంతరం గిల్ అవుటయ్యాడు. షోయబ్ బషీర్ బంతికి క్రీజు వదిల బయటకు వచ్చి భారీ షాట్కు యతి్నంచిన గిల్... బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో టంగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 430 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అదే సమయంలో వాతావరణంలో స్వల్ప మార్పులతో మేఘావృతం కాగా... ఇంగ్లండ్ పేసర్లు రెచి్చపోయారు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ (0) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఎక్స్ట్రా కవర్స్లో పోప్ పట్టిన మెరుపు క్యాచ్కు వెనుదిరిగాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్లో పంత్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోగా... పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ (1) అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 454/7తో లంచ్కు వెళ్లిన భారత జట్టు ఆ తర్వాత మరో 17 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. జడేజా (11) ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుట్ కావడం దెబ్బకొట్టింది. ఓవరాల్గా టీమిండియా 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (సి) టంగ్ (బి) బషీర్ 147; పంత్ (ఎల్బీ) (బి) టంగ్ 134; కరుణ్ నాయర్ (సి) పోప్ (బి) స్టోక్స్ 0; జడేజా (బి) టంగ్ 11; శార్దుల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 1; బుమ్రా (సి) బ్రూక్ (బి) టంగ్ 0; సిరాజ్ (నాటౌట్) 3; ప్రసిధ్ కృష్ణ (బి) టంగ్ 1; ఎక్స్ట్రాలు 31; మొత్తం (113 ఓవర్లలో ఆలౌట్) 471. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221, 4–430, 5–447, 6–453, 7–454, 8–458, 9–469, 10–471. బౌలింగ్: వోక్స్ 24–4–103–0; కార్స్ 22–5–96–1; టంగ్ 20–0–86–4; స్టోక్స్ 20–2–66–4; బషీర్ 27–6–100–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) కరుణ్ నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (బ్యాటింగ్) 100; రూట్ (సి) కరుణ్ నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206. బౌలింగ్: బుమ్రా 13–2–48–3; సిరాజ్ 14–0–50–0; ప్రసిధ్ కృష్ణ 10–0–56–0; జడేజా 9–2–25–0; శార్దుల్ 3–0–23–0.ఆ మూడు క్యాచ్లు పట్టుంటే... బుమ్రా బౌలింగ్లో డకెట్ రెండు సార్లు బతికిపోయాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి డకెట్ ఇచి్చన క్యాచ్ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జడేజా కూడా డకెట్ క్యాచ్ నేలపాలు చేశాడు. డకెట్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఇచి్చన క్యాచ్ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్లో పోప్ ఇచి్చన క్యాచ్ను సైతం జైస్వాల్ నేలపాలు చేశాడు.

టీమిండియాతో తొలి టెస్టు.. రెండో రోజు ఇంగ్లండ్దే
లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియాపై ఇంగ్లండ్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో వైస్ కెప్టెన్ ఓలీ పోప్(100), హ్యారీ బ్రూక్ (0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.

జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్గా
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 2021 నుంచి తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా బుమ్రా నిలిచాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఈ రేర్ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.2021 నుంచి బుమ్రా ఇప్పటివరకు తొలి ఓవర్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా స్పీడ్ స్టార్, ఆసీస్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ తొలి ఓవర్లో 7 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్తో ఈ ఇద్దరి పేసర్లను బుమ్రా అధిగమించాడు.ఇంగ్లండ్ ఓపెనర్ మైండ్ బ్లాంక్..కాగా బుమ్రా తొలి ఓవర్లోనే క్రాలీని బోల్తా కొట్టించాడు. మొదటి ఓవర్లో ఐదో బంతిని బుమ్రా.. క్రాలీకి మిడిల్ స్టంప్పై అవుట్-స్వింగర్ వేశాడు. క్రాలీ ఆ బంతిని లెగ్సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో కరుణ్ నాయర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో 4 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ నిరాశతో పెవిలియన్కు చేరాడు.ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో29 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. రెండు వికెట్లు కూడా బుమ్రానే పడగొట్టాడు.

అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్
స్టుపిడ్..స్టుపిడ్.. స్టుపిడ్.. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కోల్పోవడంతో కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు అదే గవాస్కర్ రిషబ్ పంత్ను ప్రశంసలతో ముంచెత్తాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.రెండో రోజు ఆటలో తన ఏడో టెస్టు సెంచరీ మార్క్ను రిషబ్ అందుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ 99 పరుగుల వద్ద సిక్సర్ బాది మరి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ కొనియాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. విమర్శించిన నోళ్లతోనే పొగిడించుకోవడం చాలా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్గా 178 బంతులు ఎదుర్కొన్న పంత్.. 12 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సెంచరీతో టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్గా ధోని రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్కు ఇది ఏడో టెస్టు సెంచరీ.తొలి ఇన్నింగ్స్లో భారత స్కోరంతంటే?ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు..
బిజినెస్

వాణిజ్యంపై యుద్ధ ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమైతే మనదేశ వాణిజ్యంపై ఏ మేరకు ప్రభావం పడుతుందన్న దానిపై కేంద్ర వాణిజ్య శాఖ కీలక సమావేశం నిర్వహించింది. షిప్పింగ్ సంస్థలు, ఎగుమతిదారులు, కంటెయినర్ కంపెనీలు, ఇతర శాఖలు, భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ దీనికి నేతృత్వం వహించారు. హర్ముజ్ జలసంధిలో ప్రస్తుతానికి తటస్థ పరిస్థితులే నెలకొన్నట్టు, ఓడల రవాణాలకు ఎలాంటి ఆటంకాల్లేనట్టు ప్రతినిధులు వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్యంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రత్నామ్నాయాలను గుర్తించాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. యుద్ధం తీవ్రతరమైతే అది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. హర్ముజ్ జలసంధి, రెడ్సీ ద్వారా ఓడల రవాణాకు ఆటంకాలు ఏర్పడతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో సముద్ర, వాయు రవాణా చార్జీలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. హర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం. కేవలం 21 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ఈ జలసంధి ద్వారానే ప్రపంచంలో 20 శాతం మేర ముడి చమురు రవాణా అవుతోంది. అంతేకాదు మన చమురు దిగుమతుల్లో మూడింట రెండొంతులు, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం మేర హర్ముజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయి. వీటికి ఆటంకాలు ఏర్పడితే చమురు ధరలు, రవాణా, బీమా చార్జీల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ ప్రభావం మన దేశ వాణిజ్యంపై గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే వాణిజ్య శాఖ ఈ సమావేశం నిర్వహించింది.

హెచ్డీఎఫ్సీ కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొన్నాళ్ల క్రితం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను కొనుగోలుపై ఆసక్తి చూపింది. అందుకోసం ఆఫర్ కూడా ఇచ్చింది. కానీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ చందా కొచర్తో నిర్వహించిన చర్చాగోష్టి సందర్భంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మాజీ చైర్మన్, సీనియర్ బ్యాంకర్ దీపక్ పరేఖ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘ఐసీఐసీఐతోనే హెచ్డీఎఫ్సీ ప్రారంభమైంది. అలాంటప్పుడు సొంతింటికి తిరిగి రావచ్చు కదా, అని ఒకసారి మీరు ఆఫర్ ఇచ్చిన సంగతి నాకు గుర్తుంది. కానీ దాన్ని నేను తిరస్కరించాను. అది సముచితం కాదని చెప్పాను‘ అని పరేఖ్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత నియంత్రణ నిబంధనల ఒత్తిడి కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సంస్థను విలీనం చేశామని, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ తమకు కొంత తోడ్పాటు అందించిందని ఆయన చెప్పారు. విలీనమనేది సంస్థకు మేలు చేసేది కాగా, భారీ స్థాయి బ్యాంకులు ఉండటమనేది దేశానికే మంచి చేస్తుందని పరేఖ్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భారతీయ బ్యాంకులు ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా మరింత బలోపేతం కావడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 44 ఏళ్ల చరిత్ర గల హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థ రివర్స్ మెర్జర్ ద్వారా అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ రివర్స్ మెర్జర్కి ముందు దాన్ని కొనుగోలు చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతిపాదన చేసింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్ మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్ ఆర్థికంగా తోడ్పాటు అందించింది.

రూ.43 వేల కోట్ల పడపై పెళ్లి...
ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడి ప్రతి కదలికా వార్తే.. విశేషమే. మరి ఆయన పెళ్లి చేసుకుంటుంటే... ఆర్భాటం కాకుండా ఉంటుందా? అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలోని చారిత్రక వెనిస్ నగరంలో మూడు రోజులపాటు వివాహ వేడుక జరగనుంది.61 ఏళ్ల బెజోస్, 55 ఏళ్ల సాంచెజ్ లకు ఇదివరకే వేరొకరితో వివాహాలు జరిగి పిల్లలు ఉన్నారు. జెఫ్ బెజోస్ తాజా వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరుగుతుందని వెనిస్ మేయర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్తో చెప్పారు. శాన్ జార్జియో మాగియోర్ ద్వీపంలో జరిగే ఈ వేడుకకు సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు.ఈ మెగా వెడ్డింగ్ తీసుకురానున్న టూరిస్ట్ ట్రాఫిక్ పై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం వైఖరి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటాలియన్ దినపత్రిక ఇల్ గాజెట్టినో ప్రకారం, వెనిస్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ మోరిస్ సెరాన్ దీని కోసం గట్టిగా ప్రయత్నించారు. వేడుక కోసం డోల్స్ అండ్ గబ్బానాకు చెందిన డిజైనర్ డొమెనికో డోల్స్ ను కూడా రంగంలోకి దింపారు. గత శతాబ్దంలో ఇప్పటికే 5.9 అంగుళాలు మునిగిపోయిన వెనిస్ నగరం వేడుకకు వచ్చే జనంతో మరింత ఒత్తిడి ఎదురవుతుందన్నది స్థానికుల ఆందోళన.విలాసవంతమైన నావపై..వెనీషియన్ సరస్సులో లంగరు వేయనున్న బెజోస్కు చెందిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43 వేల కోట్లు) సూపర్ యాచ్ (విలాస నౌక) కోరులో అసలు వేడుక జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అబియోనా అనే మరో సహాయక నౌక కూడా ఉంటుంది. వెనిస్ అంతటా పలు ప్రాంతాలు వివాహ కార్యక్రమాలకు నేపథ్యంగా పనిచేస్తాయి. కాక్టెయిల్ రిసెప్షన్లు, వేడుకలు గ్రాండ్ కెనాల్ పై ఉన్న 15 వ శతాబ్దపు ప్యాలెస్ పాలాజ్జో పిసాని మోరెట్టా, పునరుజ్జీవన కళాఖండమైన స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, అడ్రియాటిక్ సముద్రం నుండి వెనిస్ మడుగును వేరుచేసే ద్వీపమైన లిడోలోని ఐకానిక్ హోటల్ ఎక్సెల్సియర్ వద్ద జరుగుతాయని భావిస్తున్నారు.గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..పూర్తి జాబితా గోప్యంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపార, రాజకీయ అధి నాయకులు ఇందులో ఉంటారని భావిస్తున్నారు. ఆహ్వాన జాబితాలో బ్రిటీష్ నటుడు ఓర్లాండో బ్లూమ్, అతని కాబోయే భార్య కేటీ పెర్రీతో పాటు మిక్ జాగర్, కిమ్ కర్దాషియాన్, క్రిస్ జెన్నర్, ఓప్రా విన్ఫ్రే, ఈవా లాంగోరియా, లియోనార్డో డికాప్రియో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరు బస చేసేందుకు అత్యంత విలాసవంతమైన హోటళ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.భారీగా పెళ్లి ఖర్చువెనిస్ లో బెజోస్, సాంచెజ్ల వివాహానికి భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ఒక వివరణాత్మక అంచనా ప్రకారం.. ఈ వివాహానికి ఖర్చు సుమారు 16 మిలియన్ డాలర్లు (రూ.132 కోట్లు) కావచ్చు. పూల ఏర్పాట్లు, వేదిక అలంకరణ కోసం 1 మిలియన్ డాలర్లు, వెడ్డింగ్ ప్లానింగ్ సేవలకు 3 మిలియన్ డాలర్లు, చారిత్రాత్మక ప్రదేశాల అద్దెకు 2 మిలియన్ డాలర్లు, క్యాటరింగ్ కోసం మరో 1 మిలియన్ డాలర్లు, సాంచెజ్ వార్డ్ రోబ్ కోసం 1.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్ లేడీ గాగా ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పుడు ఇల్లు.. ఇలా కొనడమే ఇష్టం
గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్ట్లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2023లో రెడీ టూ మూవ్, లాంచింగ్ ప్రాజెక్ట్లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి చేరింది. అలాగే రూ.కోటిన్నర ధర ఉన్న లగ్జరీ గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2024 నాటికి 35 శాతానికి పెరిగిందని ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోబాల్కనీ మస్ట్.. 1, 2, 3 బీహెచ్కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించగా, 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. అనరాక్ రీసెర్చ్ దేశంలోని పలు నగరాలలో 5,510 మందిపై ఆన్లైన్లో సర్వే నిర్వహించింది. గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారుల విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్కేలకు, 17 శాతం 1 బీహెచ్కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్కే జై కొడుతున్నారు.పెట్టుబడులకు రియలే బెటర్.. ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2023 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్–ఎక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు.
ఫ్యామిలీ

కొత్తకారు కొన్న ఫహద్ ఫాసిల్.. ధర ఎంతో తెలుసా?
మలయాళ నటుడు, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కొత్త కారును కొనుగోలు చేశాడు. వోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTIని కొనుగోలు చేశాడు. తన కార్ల గ్యారేజ్లో కొత్త వెహికల్ వచ్చిన విషయాన్ని ఫోక్స్ వ్యాగన్ ఇన్స్టాలో షేర్ చేసింది. వోక్స్వ్యాగన్ GTI భారత మార్కెట్ కోసం కేటాయించిన 150 యూనిట్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన వోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTI కారు గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్ రంగులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 53 లక్షలు (ఎక్స్-షోరూమ్). పవర్-ప్యాక్డ్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో వచ్చిన ఈ కారు గరిష్టంగా 265 హార్స్పవర్, 370 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో 0 -100 కి.మీ./గం.కు చేరుకుంటుందిఫోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTIతో పాటు, ఫహద్ ఫాసిల్ తన గ్యారేజీలో అనేక ఇతర అన్యదేశ కార్లను కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో మినీ కంట్రీమ్యాన్, లంబోర్గిని ఉరుస్, పోర్షే 911, ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఉన్నాయి. కాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన బ్లాక్బస్టర్మూవీ పుష్పకు సీక్వెల్గా వచ్చిన పుష్ప 2: ది రూల్లో భన్వర్ సింగ్ షెకావత్గా ఫహద్ ఫాసిల్ విలనిజాన్ని పండించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. Yoga విల్లులా వంగే పాలరాతి శిల్పం.. శిల్పా శెట్టి, వైరల్ వీడియో View this post on Instagram A post shared by Volkswagen Kayamkulam (@volkswagen_kayamkulam)

Yoga విల్లులా వంగే పాలరాతి శిల్పం.. శిల్పా శెట్టి, వైరల్ వీడియో
International Yoga Day 2025 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా (shilpa shetty) అద్భుతమైన యోగాసనాలు వేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.బాలీవుడ్ బ్యూటీ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తుంది. ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శిల్పా శెట్టి తన సోషల్ మీడియాలో, ఫిట్నెస్ యాప్లో యోగా, ధ్యానం, ఫిట్నెస్ వ్యాయామాలను పంచుకుంటుంది. తన అద్భుతమైన శరీరాకృతి, ఫిట్నెస్కు యోగానే కారణమని చాలా సార్లు వెల్లడించింది. తాజాగా యోగా డే సందర్భంగా ఇన్ష్టాలోషేర్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. 50 ఏళ్ల వయసులో చాలా ఫిట్గా యంగ్ లుక్లో తన అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. శిల్పా తరచుగా తన అభిమానులతో విభిన్న యోగాసనాలు లేదా భంగిమల్ని పంచుకుంటూ , అభిమానులకు ప్రేరణనిస్తుంది. ఇదీ చదవండి: జిమ్కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్ గ్లో కోసం..! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

‘ నేను నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ : స్వీట్ కపుల్ జాయ్ రైడ్ వీడియో వైరల్
ఒక స్వీట్ కపుల్ అండ్ ఓల్డ్ కపుల్ (Elderly Couple) గాల్లో తేలినట్టుందే..అంటూ దర్జాగా రాయల్ ఎన్ఫీల్డ్ (టైటానిక్) బుల్లెట్ మీద రయ్య్మని దూసుకుపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంత వైరల్ అంటే 3.5 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయంటే ఈ వీడియో క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.కమలాక్షి అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు: " అందమైన వృద్ధ జంట అందమైన వింటేజ్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ చూశాను. సూపర్.. పొగడ్త తరువాత తాతగారి నవ్వు చూడాలి.. అమూల్యం’’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రశంసకు ఉబ్బితబ్బిబ్బవుతూ తాతగారి నవ్విన నవ్వు ఈ వీడియోకే హైలైట్ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Kamalakshi (@the_green_bonneville)> ఈ వీడియోలో,బామ్మగార్ని వెనుక కూర్చోబెట్టుకున్న తాతగారు బామ్మగారు ‘నేను నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ అంటూ దూసుకుపోతున్నారు. ఇది చూసి కమలాక్షి వారిని పొగడ్తల్లో ముంచెత్తింది. దీంతో పబ్లిక్షాక్డ్ , చాచా రాక్డ్ అంటూ కమెంట్ చేశారునెటిజన్లు.అంతేకాదు టైటానిక్ జాక్ అండ్ రోజ్ అని కొందరు, అర్జున్ రెడ్డి, ప్రీతి అంటూ మరికొందరు ఈ వీడియోను ఎంజాయ్ చేయడం విశేషం.

మూలికా వైద్యం, కోలుకుంటున్న జగన్నాథుడు
భువనేశ్వర్: జ్యేష్ట పూర్ఠణిమ నుంచి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు తెర చాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు. స్వామి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో వైపు యాత్ర దగ్గర పడుతుంది. స్వామి ఆగమనం కోసం భక్త జనం నిరీక్షిస్తోంది. రాజ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాత్రింబవళ్లు ఉపచారాలు చేస్తున్నారు. శుక్రవారం పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీ మందిరంలో చక్కా విజే సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాటుల్ని రాతి పీఠంపైకి తరలించారు. ఇది స్వామి ఆరోగ్యం కోలుకుంటున్నట్లు సంకేతం. భోగ మండప సేవ పూర్తి అయిన తరువాత జయ, విజయ ద్వారం మూసివేసి బెహరణ్ ద్వారం తెరిచారు. ధుకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్య సేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను పూజించడం చక్కా విజే సేవగా పేర్కొంటారు. దశ మూల మోదకాల వైద్యం ఆయుర్వేద పద్ధతులు, గ్రంథాల ప్రకారం జగతి నాథునికి వైద్యం కొనసాగుతుంది. ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సమయోచితంగా సవరించుకుని ఔషదీయ పదార్థాల్ని నివేదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్వామి కోసం దశ మూలికల మోదకం తయారు చేశారు. శ్రీ మందిరం రాజ వైద్య సేవకులు తరతరాలుగా మహా ప్రభువుని సేవిస్తున్నారు. ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికల్ని వినియోగించడం విశేషం. ఈ మిశ్రమంతో తయారు చేసిన ఔషధాన్ని వేర్వేరుగా 3 మట్టి పాత్రల్లో పేర్చి వాటిపై కర్పూరం చల్లి మూతబెట్టి శ్రీ మందిరంలో గోప్య సేవలు అందజేస్తున్న వర్గాలకు అందజేశారు. (Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత)ఆషాఢ కృష్ణ పక్ష దశమి రోజున మూడు రాతి పీఠాలపైకి చేర్చిన మర్నాడు సంప్రదాయం ప్రకారం దేవ దేవుళ్ల కోసం రాజ వైద్యుల కుటుంబీకులు తయారు చేసిన దశ మూలికల ఔషధాన్ని వైద్యంలో భాగంగా నివేదిస్తారు. ఆషాఢ కృష్ణ పక్ష ఏకాదశి నాడు మూల విరాటులకు పతి మహాపాత్రొ వర్గం సేవకులు వీటిని సమర్పిస్తారు. పవిత్ర ఏకాదశి తిథి నాడు రాత్రి పూట ఆలయ వైద్యుడి సలహా మేరకు పతి మహాపాత్రో సేవకులు వీటిని సమర్పిస్తారు.కోలుకుంటున్న జగన్నాథుడు
ఫొటోలు
అంతర్జాతీయం

ట్రంప్కు ‘నోబెల్ శాంతి’ ఇవ్వాలి
ఇస్లామాబాద్/న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ఆగేలా ట్రంప్ కృషి చేశారని, అందుకు నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. మూడు రోజుల క్రితం ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వైట్హౌస్లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్–పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్–పాక్ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని స్పష్టంచేసింది. రక్త పిపాసులకా! నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రతిపాదించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇంటా బయ టా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్ సర్కారు తీరును పలువురు తప్పుపట్టారు. పాక్ పౌరులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రచయితలతోపాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ నిపుణులు కూడా వీరిలో ఉన్నారు. ఒకవైపు గాజాలో మారణహోమం సృష్టిస్తూ, మరోవైపు ఇరాన్లో రక్తం పారిస్తున్న ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలా? అని మండిపడ్డారు. హింసాకాండను సమరి్థస్తున్న వ్యక్తి ఈ బహుమతికి ఎలా అర్హుడో చెప్పాలని నిలదీశారు. పాక్ ప్రభుత్వం ఆత్మగౌరవం అనేది లేకుండా ట్రంప్ చేతిలో కీలు»ొమ్మగా మారిందని సామాజిక కార్యకర్తలు ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. శాంతి, న్యాయం కోసం నిజాయతీగా కృషి చేసినవారికే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, అమాయక ప్రజల రక్తంతాగే వారికి కాదని తేల్చిచెప్పారు. పాక్ సర్కారు నిర్ణయానికి ప్రజల ఆమోదం లేదని స్పష్టంచేశారు. నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాకు నోబెల్ శాంతి బహుమతి దక్కదేమో డొనాల్డ్ ట్రంప్ నిర్వేదం భారత్–పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేసినందుకు లేదా రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు నివారించేందుకు కృషి చేస్తున్నందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కదేమోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక బహుమతి తనకు రాసిపెట్టి లేదేమోనని నిర్వేదం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను ఎన్ని మంచి పనులు చేసినా నోబెల్ శాంతి బహుమతి రాదన్నారు. దశాబ్దాలుగా యుద్ధ రంగంలో తలపడుతున్న కాంగో, రువాండా మధ్య శాంతికి చొరవ తీసుకుంటున్నానని, అందుకు చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఇరు దేశాల మధ్య ఒప్పందం జరగబోతోందని, ఆఫ్రికాతోపాటు ప్రపంచానికి అదొక గొప్ప రోజు కాబోతోందని వివరించారు. సెర్బియా, కొసావో మధ్య ఘర్షణలకు చరమగీతం పాడేశానని, ఈజిప్టు, ఇథియోపియా మధ్య శాంతిని కొనసాగిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం లేదని ట్రంప్ నిరాశకు లోనయ్యారు.

ఇస్ఫహాన్ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ భీకర దాడులు
టెహ్రాన్/టెల్ అవీవ్/దుబాయ్/న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఇరాన్ అణుబాంబు తయారీ క్రతువును కట్టడిచేసేందుకు కంకణం కట్టుకునిమరీ కదనరంగంలోకి దూకిన ఇజ్రాయెల్ అదే పనిలో బిజీగా మారింది. ఇరాన్లోని ప్రముఖ ఇస్ఫహాన్ అణుకేంద్రంపై శనివారం తెల్లవారుజామున ముప్పేట దాడికి తెగించింది. దీంతో న్యూక్లియర్ ప్లాంట్ పాడైపోయింది. అయితే అణుకేంద్రం నుంచి రేడియోధారి్మకత, విష వాయువులు వెలువడలేదని వార్తలొచ్చాయి. వారం క్రితం సైతం యుద్ధం మొదలైన వెంటనే ఇదే ప్లాంట్పై ఇజ్రాయెల్ స్వల్పస్థాయిలో దాడిచేసింది. ప్లాంట్లో ఇంకా కొన్ని అణుబాంబు తయారీకి పనికొచ్చే కీలక పరికరాలు భద్రంగా ఉన్నాయనే అనుమానంతో శనివారం ఇలా మరోసారి దాడిచేసింది. ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ సృష్టించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)లో విదేశీ విభాగమైన ఖుద్స్ ఫోర్స్లో సీనియర్ కమాండర్లను దాడుల్లో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. వీరిలో కమాండర్ సయీద్ ఇజాదీ సైతం ఉన్నారు. ఖ్వామ్ సిటీలో జరిగిన దాడిలో ఇజాదీ మరణించారని ఇరాన్ సైతం ధ్రువీకరించింది. 2023అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసిన హమాస్కు అన్నిరకాలుగా సాయంచేసిన కమాండర్ సయీదేనని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఖుద్స్ ఫోర్స్లో ఆయుధాల తరలింపు యూనిట్ కమాండర్ అయిన బెహా్నమ్ షాహ్రియారీని పశి్చమ ఇరాన్లో కారులో ప్రయాణిస్తుండగా దాడి చేసి హతమార్చారు. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన దాడిలో ఇరాన్ డ్రోన్ విభాగ కమాండర్ను సైతం ఇజ్రాయెల్ చంపేసింది. ఖుద్స్ ఫోర్స్ అనేది విదేశాల్లో సైనిక, నిఘా కార్యకలాపాల బాధ్యతలు చూసుకుంటుంది. మహ్వజ్లోని క్షిపణి లాంఛర్ల స్టోరేజీ, సైనికస్థావరాలపైనా తమ యుద్దవిమానాలు 50 సార్లు దాడిచేశాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) తెలిపింది. దాడుల్లో మరణించిన తమ అణుశాస్త్రవేత్తల సంఖ్య 10కి పెరిగిందని ఇరాన్ ఒప్పుకుంది. గతవారం జరిగిన దాడిలో న్యూక్లియర్ సైంటిస్ట్ ఇసార్ తబాతబీ ఘోమ్శే చనిపోయారని పేర్కొంది. ఖుజెస్తాన్ ప్రావిన్సులో చాలా చోట్ల బాంబుపేలుళ్ల శబ్దాలు వినిపించాయి. హొవేజే సిటీలోని ఎమర్జెన్సీ సెంటర్, అహ్వజ్ వైద్య విశ్వవిద్యాలయం పైనా క్షిపణి దాడి చేశారు. దాడుల్లో పశి్చమ ఇరాన్లోని సుమార్లో ఐదుగురు ఇరాన్ సైనికులు చనిపోయారు. ఇంటర్నెట్ సేవలు దాదాపు నిలిచిపోవడంతో అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలీక ఇరానీలు మరింత భయపడిపోతున్నారు. దేశం నుంచి పారిపోతున్న వారి సంఖ్య పెరిగింది. సరిహద్దులకు దారితీసే రహదారులపై జనం పెద్దసంఖ్యలోకనిపిస్తున్నారు. ప్రతిదాడులు చేసిన ఇరాన్ ఏకబిగిన క్షిపణులను ఎక్కుపెడుతున్న ఇజ్రాయెల్పైకి ఇరాన్ సైతం బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా నిఘా సంస్థ మొస్సాద్కు చెంది కార్యాలయాలపై దాడులను తీవ్రతరంచేసింది. పెద్దసంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. కొన్నింటిని నేలకూల్చామని ఇజ్రాయెల్ బలగాలు తెలిపాయి. అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణవ్యవస్థలను చేధించిమరీ డ్రోన్లు లక్ష్యాలను ఢీకొట్టాయి. ఇజ్రాయెల్ నగరాలైన బాట్ యామ్, టెల్ అవీవ్లలో దాడుల భయంతో జనం వీధుల్లోకి రావడం మానేశారు. దీంతో చాలా వరకు వీధులు నిర్మానుష్యంగా తయారయ్యాయి. ఇరాన్ అధ్యక్షుడితో మేక్రాన్ ఫోన్ మంతనాలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో యూరప్ దేశాల విదేశాంగ మంత్రులతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ బాఘ్చీ శుక్రవారం జరిపిన మధ్యవర్తిత్వ చర్చలు ఎటూ తేలకపోవడంతో ఈసారి వేదికను తుర్కియేకు మార్చారు. ఇస్తాంబుల్లో చర్చలు శనివారం రాత్రే మొదలవుతాయని తొలుత వార్తలొచ్చాయి. ఈ యుద్ధంలో అమెరికా జోక్యంచేసుకుంటే పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా జోక్యంచేసుకుంటే ఎర్రసముద్రంలో అమెరికా రవాణా నౌకలపై దాడులుచేస్తామని యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు శనివారం ప్రకటించారు. ‘అణు’చర్చలు జరగకూడదనే దురుద్దేశంతోనే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ అన్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్తో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఫోన్లో మంతనాలు జరిపారు. ఇస్తాంబుల్లో మధ్యవర్తిత్వ చర్చలు సఫలీకృతం అయ్యేలా కృషిచేస్తానని మసూద్కు మాటిచ్చానని మేక్రాన్ చెప్పారు. ప్రాణాలతో బయటపడిన మాజీ సలహాదారు జూన్ 13నాటి దాడుల నుంచి ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ సలహాదారు, మాజీ సెక్యూరిటీ చీఫ్ అలీ షామ్ఖానీ గాయాలతో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.మాటమార్చిన ట్రంప్ మరికొద్దివారాల్లో అణుబాంబును ఇరాన్ తయారుచేసే ప్రమాదం ముంచుకురావడంతోనే ఇజ్రాయెల్ దాడులను మొదలెట్టిందని ట్రంప్ చెప్పారు. ఇరాన్కు అంతటి సామర్థ్యంలేదని మీ నిఘా విభాగమే తేల్చిచెప్పిందని మీడియా ఆయనను ప్రశ్నించగా ట్రంప్ కోపగించుకున్నారు. ‘‘ఆ మాట ఎవరన్నారు?’అని ఎదురు ప్రశ్నించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ మహిళా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మార్చినెలలో కాంగ్రెస్ ఎదుట ఇదే విషయం చెప్పారని మీడియా గుర్తుచేసింది. దీంతో ట్రంప్ వెంటనే ‘‘ఆమె అబద్ధం చెప్పారు. నేను చెప్పిందే నిజం. త్వరలో ఇరాన్ అణుబాంబు సిద్ధమవుతోంది. అందుకే అప్రమత్తమయ్యాం’’అని దాడులను సమరి్థంచారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత శుక్రవారం తులసీ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ట్వీట్చేశారు. ‘‘వారాల్లో లేదా నెలల్లో ఇరాన్ అణుబాంబు తయారుచేయబోతోందని మాకు సమాచారం అందింది. బాంబుగనక బిగిస్తే ఇక అంతే. అయితే పరిస్థితి అంతదాకా రాకుండా ట్రంప్ అడ్డుకుంటారని నాకు తెలుసు’’అని ఆమె ట్వీట్చేశారు. అంతకుముందు ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ మాట్లాడారు. ‘‘ఇరాన్కు రెండు వారాల గడువు ఇచ్చా. ఆలోపు ఒప్పందం కుదుర్చుకోకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదు’’అని అన్నారు. ఈయన మాటలకు తగ్గట్లు వేల కేజీల బంకర్ బస్టర్ బాంబును జారవిడిచే బీ2 స్టెల్త్ విమానాలు గ్వామ్ దీవి దిశగా బయల్దేరినట్లు వార్తాలొచ్చాయి. ఫోర్డో భూగర్భ అణుశుద్ధికర్మాగారాన్ని భూస్థాపితం చేయాలంటే ఈ విమానం నుంచి మాత్రమే జీబీయూ–57 మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్ బాంబును పడేయడం సాధ్యమవుతుంది.

జంట భూకంపాలా? అణుపరీక్షలా?
ఇజ్రాయెల్ విశ్రాంతి లేకుండా విరుచుకుపడుతుంటే ఇరాన్ ఓవైపు ప్రతిదాడి చేస్తూనే మరోవైపు అణుపరీక్షలు జరిపిందన్న వార్తలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత? అనే ప్రశ్న వెంటనే తలెత్తింది. ఈ వార్తల్లో వాస్తవముందని వాదించే వాళ్లు రెండు అంశాలను తెరమీదకు తెచ్చారు. ఈ వారం మొదట్లో ఇరాన్లో రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చింది. తాజాగా శుక్రవారం 5.1 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. భీకరపోరు చేస్తున్న దేశంలో వెంటవెంటనే భూకంపాలు రావడం, అదికూడా అంతరిక్ష కేంద్రం, క్షిపణి ఉత్పత్తి కర్మాగారాలు ఉన్న సెమ్నాన్ ప్రావిన్సులోనే సంభవించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఓవైపు అణుబాంబును తయారుచేసే స్థాయికి యురేనియంను ఇరాన్ ఇంకా శుద్ధిచేయలేదన్న వార్తలొస్తుండగా అణుపరీక్షల వేళ అణుబాంబు పేల్చడం వల్లే భూమి కంపించి అది రిక్టర్ స్కేల్పై నమోదైందని మరికొందరు వాదిస్తున్నారు. వీటిల్లో నిజమెంత అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అవి భూకంపనాలు కాదు, అణుబాంబు పేలుళ్లేనని నిర్దారణ అయితేగనక ప్రపంచంలో పదో అణ్వస్త్రదేశంగా ఇరాన్ అవతరించిందని భావించాల్సి ఉంటుంది. అప్పుడు అణ్వస్త్రదేశంపై దాడులను కొనసాగించడంపై ఇజ్రాయెల్, దానికి మద్దతు పలకడంపై అమెరికా పునరాలోచన చేయడం ఖాయం. తొలుత ఫోర్డోలో.. తర్వాత సెమ్నాన్లో.. ఇజ్రాయెల్ క్షిపణిదాడుల తర్వాతే ఫోర్డోలో 2.5 తీవ్రతతో అదే రోజు భూకంపం సంభవించింది. ఇది జరిగిన ఐదు రోజులకు అంటే జూన్ 20వ తేదీ రాత్రి 9.19 గంటలకు ఉత్తర ఇరాన్లో 5.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. సెమ్నాన్కు ఆగ్నేయంగా 36 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం ధాటికి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీప ప్రాంతాల్లో భూమి బాగా కంపించింది. ఇదే సమయంలో నటాంజ్, ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ బాంబులవర్షం కురిపించింది. దీంతో ఈ అణుకేంద్రాలు దెబ్బతిన్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ చిత్రాల్లో చూస్తే అణుకేంద్రాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోందిగానీ వినాశనానికి కారణం బాంబు దాడులా, అణుబాంబు పేలుళ్ల అనేది ఎవరికీ తెలీడం లేదు. అవి నిజమైన భూకంపాలంటూ మరో వాదన తాజా భూప్రకంపనలు కేవలం భూకంపాల కారణంగా సంభవించాయని, అణుపరీక్షలు జరగలేదని కొందరు వాదిస్తున్నారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇరాన్ భౌగోళికంగా భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతంలో ఉంది. ఆలై్ఫన్–హిమాలయన్ భూకంప పట్టీలో ఇరాన్ ఉంది. ఇక్కడ ఏటా సూక్ష్మస్తాయిలో ఏకంగా 2,000 భూకంపాలు వస్తాయి. రిక్టర్ స్కేల్పై 5 అంతకంటే ఎక్కువ తీవ్రతతో డజనుకుపైగా భూకంపాలు నమోదవుతాయి. 2006 నుంచి 2015 ఏడాదిదాకా గణాంకాలను పరిశీలిస్తే ఇరాన్లో 96,000 సార్లు భూకంపాలు వచ్చాయి. సాధారణంగా భూగర్భంలో అణుపరీక్షలు జరిపితే భూమి పైపై పొరలపై ఒత్తిడి కల్గి స్వల్పస్థాయిలో భూమి కంపిస్తుందని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. అణుబాంబు పేలిన కారణంగా మొదలయ్యే భూకంపం తీవ్రత కొంతదూరానికే పరిమితమవుతుంది. అణుబాంబు పేలితే కేవలం పీ–బ్యాండ్ తరంగాలే ఉద్భవిస్థాయి. నిజంగా భూకంపం వస్తే పీ–బ్యాండ్తోపాటు ఎస్–బ్యాండ్ తరంగాలు కూడా వస్తాయి. ఎస్–బ్యాండ్ తరంగాలు తమ కేంద్రస్థానం నుంచి వెదజల్లబడి సూక్ష్మస్థాయిలో తిరిగి కేంద్రాన్ని చేరతాయి. పలు రకాల పరికరాల ద్వారా భూకంప శాస్త్రవేత్తలు దీనిని గుర్తించగలరు. ఈ లెక్కన 2.5 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలకు సహజ భూకంపమే కారణమని నిపుణులు నిర్ధారించారు. అయితే భూకంపం వచ్చిన అదే సమయానికి అదే ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హంఆపరేషన్ సిందూర్ వేళ.. మే నెలలో నాలుగురోజులపాటు పాకిస్తాన్పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’భీకర దాడుల వేళ సైతం పాకిస్తాన్లో భూకంపాలు సంభవించాయి. దీంతో పాకిస్తాన్లో అణుపరీక్షలు జరిగాయనే వాదన వినిపించింది. అయితే ఆ వాదన తప్పు అని తర్వాత తేలింది. సమగ్ర అణ్వస్ర వ్యాప్తినిరోధక ఒప్పదం(సీటీబీటీఓ), యూఎస్జీఎస్, స్వతంత్య్ర భూగోళశాస్త్ర అధ్యయనకారుల వాదన ప్రకారం ఒకవేళ భూప్రకంపనలు నమోదైతే, వాటి కేంద్రాన్ని 10 కి.మీ.ల లోతులో గుర్తిస్తే అది ఖచ్చితంగా సహజ భూకంపమే. ఎందుకంటే పది కిలోమీటర్ల లోతుకు భూమిని తవ్వి అక్కడ అణుబాంబును పేల్చడం అసాధ్యం. శుక్రవారం నమోదైన భూకంపం సంబంధ నాభి స్థానాన్ని 10 కి.మీ.ల లోతులో గుర్తించారు. ఈ లెక్కన ఇరాన్లో అణుపరీక్షలు జరగలేదనే వాదన తాజాగా బలపడింది. – సాక్షి, నేషనల్ డెస్క్

గాల్లో ఉండగా మంటలు.. 8 మంది దుర్మరణం
బ్రెజిల్ గగనతలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు చెలరేగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. శాంటా కాటరినా రాష్ట్రం ప్రియాగ్రాండే నగరంలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బెలూన్ గాల్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది నేలపై కూలిపోయింది. ఆ సమయంలో బెలూన్లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్లలో 13 మంది ప్రాణాలతో బయటపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.#Brazil: At least eight people have died following an accident involving a hot air balloon in the southern region of Santa Catarina.Governor Jorginho Mello said, rescue teams were searching for other people, as preliminary information indicated there were 22 people on board.… pic.twitter.com/usUJ3Mzfh0— All India Radio News (@airnewsalerts) June 21, 2025వారం కిందట సావో పాలో రాష్ట్రంలో కూడా ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. వారం వ్యవధిలో వరుస ఘటనల నేపథ్యంలో హాట్ ఎయిర్ బెలూన్ పర్యటనల భద్రతపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.🚨🇧🇷 BREAKING: A hot air balloon caught FIRE and CRASHED with 22 people on board in Santa Catarina, Brazil.🎥 Shocking footage shows one person jumping out to escape the flames mid-air.#Brazil #Balloon #SantaCatarina pic.twitter.com/fisGaJHjrd— Breaking News (@PlanetReportHQ) June 21, 2025
జాతీయం

రాహుల్ గాంధీ డిమాండ్ను తిరస్కరించిన ఈసీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లలోని CCTV ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపర్చలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాల డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చేయడం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఈసీ వర్గాలు ఏం చెప్పాయంటే.. ఓటర్ల గోప్యత: సీసీటీవీ ఫుటేజీ ఫుటేజ్ ద్వారా ఓటు వేసినవారిని, వేయని వారిని గుర్తించవచ్చు. తద్వారా వాళ్లపై వివక్ష లేదంటే బెదిరింపులకు పాల్పవచ్చు. చట్టపరమైన పరిమితులు: ఈ ఫుటేజ్ను బయట పెట్టడం ద్వారా.. ప్రజాప్రతినిధుల చట్టం (Representation of the People Act) ఉల్లంఘన అవుతుంది. పైగా ఓటు వేయడం.. ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. అంతర్గత వినియోగం మాత్రమే: ఈ వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతాం. ఫుటేజ్ తొలగింపు: ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత వీడియో ఫుటేజ్ను తొలగించడం సాధారణ ప్రక్రియనే అని ఈసీ తెలిపింది కిందటి ఏడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మయూతీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ పదే పదే చెబుతూ వస్తోంది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ మధ్యే 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కన్సాలిడేటెడ్, డిజిటల్ ఓటర్ రోల్స్ను ప్రచురించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, మహారాష్ట్రలో ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ బూత్లలో రికార్డ్ అయిన అన్ని CCTV ఫుటేజ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసీ తాజాగా చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ఫిక్సింగ్ అని.. ప్రజాస్వామ్యానికి ఇదొక విషమని పేర్కొంటూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు.

DGCA సీరియస్.. ఎయిరిండియా నుంచి ముగ్గురి తొలగింపు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

Bihar: దగ్గరపడుతున్న ఎన్నికలు.. పింఛను పెంచిన సీఎం నితీష్
పట్నా:ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రలోని రాజకీయ పార్టీలు ఉత్సాహంగా తమ పనులు మొదలుపెట్టాయి. నేడు(శనివారం) బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్టంలోని వృద్ధులు, వికలాంగులు,వితంతువులకు ఇచ్చే నెలవారీ పెన్షన్ను రూ.400 నుండి రూ.1,100కి పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని కోటీ తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది. मुझे यह बताते हुए खुशी हो रही है कि सामाजिक सुरक्षा पेंशन योजना के तहत सभी वृद्धजनों, दिव्यांगजनों और विधवा महिलाओं को अब हर महीने 400 रु॰ की जगह 1100 रु॰ पेंशन मिलेगी। सभी लाभार्थियों को जुलाई महीने से पेंशन बढ़ी हुई दर पर मिलेगी। सभी लाभार्थियों के खाते में यह राशि महीने की 10…— Nitish Kumar (@NitishKumar) June 21, 2025‘సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇకపై ప్రతి నెలా రూ. 400 కు బదులుగా రూ. 1,100 పెన్షన్ అందజేయనున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. జూలై నుండి పెరిగిన పెన్షన్ లభిస్తుంది. దీనివలన ఒక కోటి 9 లక్షల 69 వేల 255 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని’ నితీష్ కుమార్ ప్రకటించారు. వృద్ధులు సమాజంలో విలువైన భాగస్వాములు, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం మా బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటుంది’ అని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇటువంటి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో..

కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో..
ఫరీదాబాద్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. భర్త, అత్తామామల వేధింపులకు ఒక మహిళ బలయ్యింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. హర్యానాలోని ఫరీదాబాద్లోని ఒక వీధిలో 10 అడుగుల లోతైన గుంత నుంచి పోలీసులు ఒక మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్లోని షికోహాబాద్ నివాసి తనూ(24)గా గుర్తించారు. ఫరీదాబాద్లోని రోషన్ నగర్కు చెందిన అరుణ్తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతంలో తను భర్త, మామ, అత్త, మరొక దగ్గర బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంటిపక్కన మురుగు కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో తనూను ఆమె భర్త, అత్తామామాలు పూడ్చిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.తనూకు 2023లో వివాహం జరిగిందని, అనంతరం ఆమె అత్తవారింటిలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురైందని ఆమె సోదరి ప్రీతి ఆరోపించింది. వివాహం జరిగిన వెంటనే తనూ భర్త అరుణ్, అతని తల్లిదండ్రులు బంగారు నగలు, డబ్బు డిమాండ్ చేశారని పేర్కొంది. తాము వారి డిమాండ్లను తీర్చడానికి ప్రయత్నించినప్పటికీ, ఇంకా ఏదో కావాలని తనూను వేధించారని ఆమె తెలిపింది. వారు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక తనూ పుట్టింటిలోనే నెల్లాళ్ల పాటు ఉందని, తరువాత ఆమెను తాము అత్తారింటికి పంపామని అప్పటినుంచి తమ సోదరికి మరింతగా వేధింపులు పెరిగాయని ప్రీతి పేర్కొంది.ఏప్రిల్ 23న తనూ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె అత్తమామలు తమకు చెప్పారని, దీంతో ఆమెకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా, కాల్ కలవలేదని ప్రీతి తెలిపారు. దీంతో తమకు మరింతగా అనుమానం పెరిగి, పోలీసులను ఆశ్రయించామన్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతలో తనూ ఇంటికి సమీపంలో ఆమె మామ గొయ్యిని తవ్వారు. దానికి మురుగునీటి పారుదలకు అని ఆయన చుట్టుపక్కల వారికి చెప్పాడు. అయితే ఆ తరువాత నుంచి తనూ కనిపించలేదు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఉషా కుండు మీడియాతో మాట్లాడుతూ వారం రోజల క్రితం ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. గుంతలో నుండి తనూ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

వివాహేతర సంబంధం: చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టి హత్య
నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య(35)కు ఇంకా వివాహం కాలేదు. జానయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గతేడాది ఇదే విషయమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, జానయ్యకు మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా నడిచాయి. ఇదే విషయంపై జానయ్యపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అతడు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక కూడా జానయ్య ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి జానయ్యను అంతమొందించాలని ఆ మహిళ భర్త నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యతోనే జానయ్యను శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన జానయ్య కళ్లలో కారం చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి ఆ మహిళతోపాటు ఆమె భర్త కర్రలతో చితకబాదారు. అనంతరం మరికొందరితో కలసి ఇంటి పక్కన ఉన్న వీధిలో చెట్టుకు జానయ్యను తాళ్లతో కట్టేసి అతడి తల, కాళ్లు, చేతులు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన జానయ్య అసస్మారకస్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి జానయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి జానయ్యను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై జానయ్య తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.

బాలాపూర్ అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తండ్రి మందలించాడని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు తర్వాతే మృతికి గల కారణాలపై ఓ అంచనాకి వస్తామని చెబుతున్నారు.వినీల (17), అఖిల (16) అక్కాచెల్లెళ్లు. వినీల ఈ మధ్య ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి కులాంతర వివాహం వద్దని సర్దిచెప్పి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని ఆ అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించగా.. మనస్థాపానికి గురైన ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రెయిలింగ్కి చున్నీతో ఉరి వేసుకున్నారు!. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఉరివేసుకొని మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఈ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబ స్వస్థల నెల్లూరు జిల్లా ఉదయగిరిగా సమాచారం.

మాదాపూర్లో మరో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో మరో భారీ మోసం బయటపడింది. బై బ్యాక్ పేరుతో ఏవీ ఇన్ఫ్రా రూ.500 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామంటూ మోసానికి పాల్పడింది. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో వెంచర్లు అంటూ మోసానికి తెరలేపింది. అమౌంట్ ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ హామీ ఇచ్చింది.సుమారు 500 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలకు డబుల్ అమౌంట్ ఇస్తానని భారీగా వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
సనత్నగర్(హైదరాబాద్): కోరిక తీర్చాలంటూ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్ ప్రాంతానికి చెందిన మహిళ (26) బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి 2023లో మానేసింది. ఆ సమయంలో ఆమెకు ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న పనీశ్ (52) పరిచయమయ్యాడు. ఆమెను తన కూతురిలా భావిస్తున్నానని చెప్పేవాడు. అవసరాలకు డబ్బు ఇచ్చేవాడు. 2024లో మహిళ హైటెక్ సిటీలోని మరో బ్యాంకులో పనిలో చేరింది. కాగా ఏప్రిల్ 2024 నుంచి మనీష్ ప్రవర్తనలో మార్పును బాధితురాలు గుర్తించింది. తరచూ ఆమెకు వాట్సప్లో తాను ఇచ్చిన డబ్బు ఇవ్వాలని, లేకుంటే తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకరంగా దూషిస్తూ వాట్సప్ సందేశాలు పంపేవాడు. ఆమె పనిచేస్తున్న బ్యాంక్కు వెళ్లి అక్కడి సిబ్బందికి బాధితురాలి గురించి చెడుగా ప్రచారం చేయగా వారు ఆమెను పనిలోకి రావద్దని చెప్పారు. దీంతో బాధితురాలు శనివారం బేగంపేట పీఎస్లో ఫిర్యాదు చేయగా పనీ‹Ùపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.