Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

US effect Will Iran Close The Strait of Hormuz1
ఇరాన్‌ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!

టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్‌.. ఇజ్రాయెల్‌ను టార్గెట్‌ చేసింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెలీ అవీవ్‌, ఇతర ప్రాంతాలను టార్గెట్‌గా ఇరాన్‌ భారీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో, టెలీ అవీవ్‌ సహ దాదాపు 400 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోవైపు.. తమపై దాడి చేసి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా బాంబు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్‌ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్‌ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌ గగనతల నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను మీడియా ఛానెల్‌ ప్రసారం చేసింది.ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ..మరోవైపు.. అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ను టార్గెట్‌ చేసి ఇరాన్‌ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్‌తో ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య ఇజ్రాయెల్‌లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరిగినట్టు సమాచారం. ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌ గగనతలాన్ని మూసివేసింది. జూన్‌ 27వ తేదీ వరకు ఇజ్రాయెల్‌ విమాన సర్వీసులను రద్దు చేసింది.'హార్ముజ్ జలసంధి' మూసివేత!ఇదిలా ఉండగా.. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇక, ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్‌ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది. 🚨⚡BREAKING AND UNUSUALBrigadier General Tangsiri, Commander of the IRGC Navy:The Strait of Hormuz will be closed within a few hours. pic.twitter.com/ca1cYFwvvf— RussiaNews 🇷🇺 (@mog_russEN) June 22, 2025 భారత్‌పై ఎఫెక్ట్‌.. ఇరాన్‌ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడ్డ భారత్‌ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్‌ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్‌ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.

 Joe Root Creates History, Breaks Sachin Tendulkar's All-Time Record2
చ‌రిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్ రికార్డు బ్రేక్‌

ఇంగ్లండ్ సూప‌ర్ స్టార్ జో రూట్ మ‌రో అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య టెస్టుల్లో అత్య‌ధిక‌ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లండ్‌లో భార‌త్‌తో జ‌రిగిన టెస్టుల్లో 1589 ప‌రుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై స‌చిన్ 1575 ప‌రుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో స‌చిన్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. కేవ‌లం 28 ప‌రుగులు మాత్ర‌మే చేసి జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఇంగ్లండ్‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు..👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*👉సచిన్ టెండూల్కర్ (భారత్‌) – 1575👉రాహుల్ ద్రవిడ్ (భార‌త్‌) – 1376👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196👉సునీల్ గవాస్కర్ (భార‌త్‌) – 1152👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్‌..తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్‌ (131 బంతుల్లో 100 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్‌ డకెట్‌ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్‌ పంత్‌,శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌ సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs ENG: జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. ఫస్ట్‌ ఓవర్‌ కింగ్‌గా

2 Arrested for Sheltering Pakistani Terrorists3
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్‌

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్‌ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: అమెరికా అంతటా హై అలర్ట్‌.. ఇరాన్‌పై దాడుల ఫలితం

LPU Student Secures Record Breaking Rs 2 5 Crore Placement Offer4
ఐఐటీలకు ధీటుగా ఎల్‌పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్‌ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్‌పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్‌పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్‌పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్‌పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్‌పీయూ తాజా ప్లేస్‌మెంట్‌ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్‌పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్‌పీయూ ఎందుకంటే?ఎల్‌పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్‌మెంట్‌ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్‌ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్‌ ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ పొందుతారు.‘ఎల్‌పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్‌మెంట్‌ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

Nuclear Sites Violates International Law says Iranian Atomic Energy Agency5
‘అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్‌

టెహ్రాన్: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్‌ ప్రపంచం దృష్టి సారించింది. తాజాగా ఇరాన్‌ అణుశక్తి సంస్థ (ఆటమిక్‌ ఎనర్జీ ఆర్గనైజేషన్‌) ఆదివారం తెల్లవారుజామున తమ దేశంలోని మూడు అణుశక్తి కేంద్రాలపై జరిగిన దాడులను ధృవీకరించింది. ఈ విధంగా అణుకేంద్రాలపై దాడులు జరిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించింది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల కారణంగా ఎంత నష్టం జరిగిందో స్పష్టం చేయకుండా, దాడుల వివరాలను ప్రకటించారని ఇరాన్‌ పేర్కొంది. అణు కేంద్రాలపై సాగించిన దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకువస్తుందని టెహ్రాన్ ఏజెన్సీ పేర్కొంది. అమెరికా సైన్యం తాజాగా ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ అణుశక్తి సంస్థపై శత్రువుల కుట్రలు సాగుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రయత్నాలతో ఏర్పడిన ఈ జాతీయ పరిశ్రమ అభివృద్ధిని ఆపబోమని ఇరాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ జియోనిస్ట్ పాలనలోని దురాక్రమణకు తమ ప్రతిస్పందన మరింత వినాశకరంగా ఉంటుందని హెచ్చరించారని అధికారిక ఇర్నా వార్తా సంస్థ పేర్కొంది. ఈ దాడుల కారణంగా టెహ్రాన్‌కు దక్షిణంగా ఉన్న కోమ్ నివాసితులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని పర్వతాలలోగల అణు కేంద్రంపై అమెరికా దాడి చేసింది.ఇది కూడా చదవండి: ట్రంప్‌ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు

Coalition government ready to issue NCD bonds through APMDC6
మళ్లీ అదే రాజ్యాంగ ఉల్లంఘన

సాక్షి, అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరి­తెగించింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌) బాండ్ల జారీకి సిద్ధమైంది. గత నెలలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులిస్తూ బాండ్లు విడుదల చేసి రూ.3,489 కోట్లు సమీకరించింది. అయితే.. ఇది జరగడానికి ముందే కూటమి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకోవాలని హైకోర్టులో పలువురు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే.. మే 8న ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. తాజాగా ఈ నెల 24న రెండోసారి జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ బాండ్లు కొనేవారికి రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించడమే కాకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్తు ఆదాయాల పైనా ప్రత్యేక హక్కు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల బేస్‌ వాల్యూతో బాండ్లు జారీచేయగా... రూ.3,489 కోట్ల బాండ్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు.అత్యధిక వడ్డీ భారం మే 8న 9.30 శాతం వడ్డీ రేటుతో ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసింది. ఇది చాలా ఎక్కువ రేటు. రాష్ట్ర ఖజానాపై డైరెక్ట్‌ డెబిట్‌ హామీ ఇవ్వడంతో పాటు ఏపీఎండీసీ భవిష్యత్‌ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత కూడా ఇంత ఎక్కువ వడ్డీ అంటే దారుణమే. బాండ్లు కొనుగోలు చేసినవారికి అన్ని రకాల ప్రయోజనాలు సమకూర్చి కూడా ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.⇒ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 6.71 శాతం వడ్డీ రేటుతో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్‌ (ఎస్‌డీఎల్‌) తీసుకుంది. కానీ, అదే నెలలో దీనికంటే 2.59 శాతం ఎక్కువ వడ్డీ రేటుకు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఖజానాపై అతి భారమైన అప్పుగా నిలిచి అనేక జవాబు లేని ప్రశ్నలను లేవనెత్తింది.⇒ గతంలో ఏపీ సీఆర్‌డీఏ (ఏపీ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ), ఏపీ ఎస్‌బీసీఎల్‌ (ఏపీ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)లు ఎటువటి తాకట్టులు లేకుండానే తక్కువ వడ్డీ రేటుకు ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి డబ్బు సమకూర్చుకున్నాయి. కానీ, ఇప్పుడు ఖనిజాభివృద్ధి సంస్థ రూ.1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ గనులను తాకట్టు పెట్టి కూడా అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం గమనార్హం. ⇒ రూ.లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టిన తర్వాత కూడా అంత ఎక్కువ వడ్డీ భారాన్ని రాష్ట్రం నెత్తిన మోపడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఎస్డీఎల్‌ లోన్‌తో సమానమైన వడ్డీ రేటు ఇవ్వాల్సి ఉండగా... ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ అప్పు ద్వారా... బాండ్లు కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు ఎక్కడా లేని భద్రత, అధిక వడ్డీలు, ప్రత్యేక సదుపాయాలు దక్కుతుండగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తీవ్ర నష్టం కలుగుతోంది. హైకోర్టులో కేసున్నా...ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారంపై ఇప్పటికే ఒక పిటిషన్‌ హైకోర్టులో విచారణలో ఉంది. మే 7న కోర్టు దీనిపై ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేసు న్యాయ విచారణలో ఉన్నా లెక్కచేయకుండా ప్రభుత్వం మళ్లీ అదే తరహాలో బాండ్ల జారీకి ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై ముందుకెళ్లడం తప్పు. ఒకసారి ఆ తప్పు చేసి మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం నైతికంగా, నైతికంగా సరికాదు‘ అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి నేరుగా అప్పు తీసుకోవడం ఆర్టికల్‌ 293 (1) ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా శాసనసభ పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవడం ఆర్టికల్స్‌ 203, 204 ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థపై నీలి నీడలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల కుంపటి వ్యవహారం దేశంలో అమలవుతున్న ఫిస్కల్‌ కన్సాలిడేషన్‌ రోడ్‌మ్యాప్‌పై మాయని మచ్చగా మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధమైన అప్పుల విధానాన్ని అనుసరిస్తే కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సమతుల్యత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కీలక ప్రశ్నలు–రాష్ట్రం పేరు మీద కాకుండా.. రాష్ట్ర ఖజానా ఆధారంగా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?–డైరెక్ట్‌ డెబిట్‌ మాండేట్‌ ద్వారా ఖజానాను అందుబాటులో పెట్టడం ఎంతమేరకు చట్టబద్ధం?–హైకోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ అదే విధంగా బాండ్ల జారీకి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?–ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్‌ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టడం న్యాయం?–రూ.1.90 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టి అధిక వడ్డీ రేటుకు అప్పు తేవడం మన రాష్ట్రానికి మంచిదా?

Maharashtra Teacher Naps Snores For 30 Minutes In Class Full Of Children7
క్లాస్‌రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్‌.. వీడియో వైరల్

జాల్నా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఓ టీచర్‌ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు.మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్ గ్రామంలో ఉన్న మరాఠీ మీడియం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీకే ముండే.. ఇటీవల తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు పాఠాలు చదువుకుంటుండగా, ఆయన కుర్చీలో వెనక్కి వాలి.. కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ సుమారు 30 నిముషాలు గాఢ నిద్రలో మునిగిపోయారు.ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. "మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు? ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Indus Waters Treaty with Pakistan will Never Berestored8
‘సింధు ఒప్పందం’పై పాక్‌కు కంగుతినిపించిన అమిత్ షా

న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం పాక్‌- భారత్‌ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.‌ అయితే ఈ పరిణామంతో కంగుతిన్న పాక్‌ తిరిగి సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు వేడుకుంటోంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా మరోమారు ఈ విషయంలో భారత్‌ వైఖరిని స్పష్టం చేశారు.ఇస్లామాబాద్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటికీ పునరుద్ధరించబోదని, పాకిస్తాన్‌కు ప్రవహించే సింధు నీటిని భారత అంతర్గత వినియోగం కోసం మళ్లించనున్నామని హోంమంత్రి అమిత్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన అనంతరం సింధు నదీ వ్యవస్థ వినియోగాన్ని నియంత్రించే 1960 ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం కింద భారతదేశంలోని మూడు నదుల నీటిని పాకిస్తాన్‌లోని 80శాతం పొలాలకు అందించేందలా నాడు ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం రద్దుపై తాజాగా స్పందించిన అమిత్‌ షా.. ఒక కాలువ నిర్మించడం ద్వారా పాకిస్తాన్‌కు ప్రవహిస్తున్న నీటిని రాజస్థాన్‌కు మళ్లిస్తామని, అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఈ ఒప్పందంపై చర్చల కోసం తపిస్తున్న ఇస్లామాబాద్ ఆశలను నీరుగార్చాయి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయాలని ఇస్లామాబాద్ యోచిస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్‌ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?

Ambubachi Mela 2025:  Menstruation Period Of Goddess Kamakhya Devi9
అరుదైన వేడుక ‘ఈస్టర్న్‌ మహా కుంభమేళా’..!

అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్‌ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్‌ 22న ప్రారంభమై జూన్‌ 26న ముగుస్తుంది.ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్‌ వేడుకే..!)

Gangers Movie Review In Telugu10
OTT: ‘గ్యాంగర్స్’మూవీ రివ్యూ

తమిళనాట సుందర్.సి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తుంటారు. ఆయన కథల్లో సామాన్యులు కూడా అనితరసాథ్యమైన ఫీట్లు చేస్తుంటారు. అలానే కథలు రాసుకుంటారు సుందర్.సి. అదే కోవలో తీసుకువచ్చిన మరో యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గ్యాంగర్స్(Gangers Movie Review ). ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా లభ్యమవుతోంది. సుందర్.సి ఈ కథను తానే రాసుకుని, అదే కథకు తాను నిర్మాతగా కూడా వ్యవహరించి దర్శకత్వం కూడా తానే చేశారు. అరసన్ హైస్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ టీచర్ సుజి తన స్టూడెంట్ రమ్య కనబడకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రారంభమయ్యే ఈ సినిమా ఒక ఉత్కంఠభరిత యాక్షన్ థ్రిల్లర్. సుజి స్కూల్ కరస్పాండెంట్ మలైయరసన్ అలాగే అతని సోదరుడు కొట్టైయరసన్‌లపై రమ్య గురించి చేసిన ఆరోపణలతో కథ ఊపందుకుంటుంది. ఈ ఫిర్యాదు తరువాత దానిని విచారణ చేయడానకి ఓ రహస్య అధికారిగా శరవణన్ PT టీచర్‌గా ఆ స్కూల్ లో కి వస్తాడు. శరవణన్ ఆ స్కూల్ లోకి వచ్చీ రాగానే స్కూల్ లో స్టూడెంట్స్ తీసుకుంటున్న మత్తుపదార్ధాల బండారాన్ని బయట పెట్టడంతో పాటు రమ్య కేసును కూడా విచారిస్తుంటాడు.రమ్య కనబడకుండా పోవడానికి కారణం ఈ ఊరి డాన్ అయిన ముదియరసన్ అని శరవణన్ తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ ఊరిలో అక్రమంగా ముదియరసన్ దాదాపు 100 కోట్లకు పైగా డబ్బులు దాచి పెట్టాడని శరవణన్ కు తెలుస్తుంది. తన తోటి టీచర్లతో కలిసి ఆ డబ్బును కొట్టేయడానికి ప్లాన్ వేస్తాడు శరవణన్. మరి ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మాత్రం గ్యాంగర్స్ సినిమాలోనే చూడాలి. సాధారణ టీచర్లు 100 కోట్ల రూపాయలను ఓ డాన్ దగ్గర నుండి కొట్టేయాలని ఏం చేస్తారు అన్నదే ఈ సినిమాలో సూపర్ పాయింట్. సినిమా ఆద్యంతం యాక్షన్ కామెడీతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వర్ధమాన తమిళ హాస్య నటుడు వడివేలు పండించిన కామెడీ ఈ సినిమాకు హైలైట్. ఓవరాల్ గా ఈ సినిమా వీకెండ్ కు మంచి కాలక్షేపం.- హరికృష్ణ ఇంటూరు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement