Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Counter Chandrababu Year Governance With Debt Statistics1
బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది?

గుంటూరు, సాక్షి: చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని ఎక్స్‌ ఖాతాలో లెక్కలతో సహా సోమవారం ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ఏడాది పాలనలో ఏపీ ఆర్థిక స్థితి.. చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చటంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్‌, మోస్పి (CAG & MOSPI) గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ ఒక పోస్ట్‌ చేశారాయన. . @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025

BJP MLA Raja Singh Sensational Comments2
నోటీస్‌ కాదు.. నన్ను సస్పెండ్‌ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రధానంగా నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్‌ షాపుకు రాజాసింగ్‌ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్‌ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్‌ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ్‌.. ‘ మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్‌కు నోటీస్‌ ఇవ్వడానికి పార్టీ ప్లాన్‌ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్‌ కాదు.. ఏకంగా నన్ను సస్పెండ్‌ చేయండి’ అంటూ రాజాసింగ్‌ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్‌. ఒకవేళ నన్ను సస్పెండ్‌ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా’ అని రాజాసింగ్‌ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్‌ గుర్రుగా ఉన్నారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తన్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌.. రాజాసింగ్‌ వద్దకు వెళ్లి రాజీ చేసే యత్నం చేశారు. పార్టీ అభివృద్ధి కలిసి నడవాలని రాజాసింగ్‌కు సూచించారు. ఆ సమయంలో బండి సంజయ్‌తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా తాజా ఎపిసోడ్‌తో రాజాసింగ్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కిషన్‌రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?‘టైమ్ పాస్ మీటింగ్‌లతో అలసిపోయాం’

Who Saved Accused AIADMK To DMK3
‘సర్’ ని ఎవరు కాపాడే యత్నం చేశారు?

చెన్నై: అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ యువతిపై గతేడాది జరిగిన అత్యాచార కేసులో ​39 ఏళ్ల జ్ఞానశేఖరన్‌ అనే వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ చెన్నై మహిళా కోర్టు ఈరోజు(సోమవారం, జూన్‌ 2) తీర్పునిచ్చింది. జ్ఞానశేఖరన్‌ను దోషిగా తేల్చిన మహిళా కోర్టు.. కనీసం 30 ఏళ్ల జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. 2024లో అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన అత్యాచార కేసుకు సంబంధించి గత కొన్నాళ్లుగా అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నా డీఎంకేల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ తీర్పులో ఇప్పటివరకూ నిందితుడిగా ఉన్న జ్ణానశేఖర్‌ను ఎట్టకేలకు దోషిగా తేల్చింది మహిళా కోర్టు. ఆధారాలు నిరూపణ కావడంతో జీవితఖైదు విధించింది. ఈ తీర్పు తర్వాత ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే.. డీఎంకే పార్టీని టార్గెట్‌ చేసింది. డీఎంకే మద్దతుదారుడైన జ్ఞానశేఖరన్‌ను కాపాడటానికి అధికార పార్టీ తన వంతు కృషి చేసిందంటూ సెటైర్లు వేసింది. ఎఫ్‌ఐఆర్‌లో ‘సర్‌’ అని పేర్కొనడాన్ని ఇక్కడ ఉదహరిస్తూ అన్నాడీఎంకే నేత పళనిస్వామి.. డీఎంకే ప్రెసిడెంట్‌, సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. ‘ ఇంతకాలం ‘సర్‌’ని ఎవరు కాపాడారు?, ఈ కేసులో జ్ఞానశేఖరన్‌ తప్ప ఎవరు నిందితులు కాదు. మరి ఇంతకాలం పాటు విచారణ జరపడానికి డీఎంకే ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసింది?, కాపాడే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలన్నీ బలంగా ఉండటంతో ఇంకేమీ చేయలేకపోయారు’ అంటూ పళనిస్వామి విమర్శించారు. తమ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తే అన్నింటికీ సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.దీనికి సీఎం స్టాలిన్‌ బదులిస్తూ.. ‘ మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టే.. తొందరగా తీర్పు వచ్చింది. కోర్టు కూడా ఈ కేసులో పోలీసుల సాధించిన పురోగతిని కొనియాడింది. మహిళల రక్షణ అనేది మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం అనే విషయం గుర్తించుకోండి’ అని ట్వీట్‌ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏంటంటే..గతేడాది డిసెంబర్‌ 23వ తేదీన జ్ఞానశేఖరన్‌ అన్నామలై క్యాంపస్‌లోకి ప్రవేశించాడు. ముందుగా ఆ బాధిత విద్యార్థిని స్నేహితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై తాను టార్గెట్‌ చేసిన యువతిపై లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా, యూర్శివర్శిటీ సాక్షిగా అత్యాచార యత్నం చేశాడు. దీన్ని వీడియోగా చిత్రీకరించి ఆ యువతిని అక్కడే బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. దీనిపై యువతి ఫిర్యాదు చేయగా, డిసెండర్‌ 24వ తేదీన కేసు నమోదైంది. ఆరు నెలల తర్వాత వచ్చిన తీర్పులో అతనికి 30 ఏళ్ల పాటు జీవితఖైదుతో పాటు రూ, 90 వేల జరిమానా విధించింది మహిళా కోర్టు. రోడ్డు పక్కన బిర్యానీలు అమ్ముకునే జ్ఞానశేఖరన్‌పై సుదీర్ఘమైన క్రిమినల్‌ రికార్డు కూడా ఉన్నట్లు పోలీస్‌ దర్యాప్తులో తేలింది.

Vallabhaneni Vamsi Discharge From Ayush Hospital4
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే

సాక్షి,విజయవాడ: పలు అనారోగ్య సమస్యలతో గత మూడు రోజులగా ఆయుష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్‌2న) డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. గత మూడు రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్‌ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్దారించారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వంశీ ఐసీయూలో లేనందున ఆరోగ్యం కుదుటపడేందుకు స్లీప్ మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్‌ చేశారు. ఆయుష్ ఆసుపత్రిలో వైద్యులు వంశీకి అందించిన చికిత్స తాలూకూ మెడికల్ రిపోర్టులు, డిశార్జ్‌ సమ్మరీతో సహా సీల్డ్ కవర్‌లో ఈనెల 5వ తేదీన జైలు అధికారులు హై కోర్టుకు సమర్పించనున్నారు.గత గరువారం ..వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం (జూన్‌ 5) నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ లక్ష్మణరావు విచారణ జరిపారు.

ICC Women’s ODI World Cup 2025 Schedule Released5
వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. పాకిస్తాన్‌ మ్యాచ్‌లన్నీ అక్కడే..!

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్‌ 2) విడుదల చేసింది. ఈ టోర్నీకి సంబంధించిన వేదికలు, తేదీలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 5-నవంబర్‌ 2 మధ్యలో భారత్‌, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది.భారత్‌లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్‌లు జరుగుతాయి. 2025 ICC Women's Cricket World Cup schedule 𝐑𝐄𝐕𝐄𝐀𝐋𝐄𝐃!Read more ➡ https://t.co/myj2Gfamkv pic.twitter.com/zl3IYWC2e6— ICC (@ICC) June 2, 2025ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు ప్రేమదాస​ స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు. భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు హైబ్రిడ్‌ పద్దతి ప్రకారం దుబాయ్‌లో జరిగాయి. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్‌ కూడా భారత్‌లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు. భారత్‌, పాక్‌ మధ్య తాజా పరిస్థితుల (ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత) నేపథ్యంలో పాక్‌ జట్టు మన దేశంలో మ్యాచ్‌లు ఆడతామన్న భారత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు.కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30న బెంగళూరులో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత ప్రత్యర్థి క్వాలిఫయర్‌ పోటీల ద్వారా నిర్ణయించబడుతుంది. అక్టోబర్‌ 29న తొలి సెమీఫైనల్‌ (గౌహతి లేదా కొలొంబో (పాక్‌ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్‌ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్‌ 2న ఫైనల్‌ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతుంది.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే.

IndiGo Flight Suffers Bird Hit At 4,000 Feet6
ఆకాశంలో అల్లకల్లోలం.. 170మందితో వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో..

రాంచీ: ఓ పక్షి ఆకాశంలో అల్లకల్లోలం సృష్టించింది. 170 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానాన్ని,అందులోని ప్యాసింజర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అ‍యితే, పైలెట్‌ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా భయపడ్డారు. వారిలో పలువురు ప్రయాణికులకు గాయలైనట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1.14 గంటల సమయంలో ఇండిగో ఎయిర్‌బస్ 320 (Airbus 320) విమానం పాట్నా నుండి రాంచీ(ranchi)కి రావాల్సి ఉంది. ఆ సమయంలో ఎయిర్‌బస్‌ 320ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదంతో అప్రమత్తమైన పైలెట్‌ చాకచక్యంగా ల్యాండింగ్‌ చేయాల్సిన ఎయిర్‌ పోర్టుకు కాకుండా సమీపంలో ఉన్న రాంచీ బిర్సా ముండా విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాంచీ సమీపంలో ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఫ్లైట్‌ 3,000 నుండి 4,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇండిగో విమానం పాట్నా నుండి రాంచీకి వస్తుండగా, పైలట్ ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది’ అని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య తెలిపారు.ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, పక్షి ఢీకొట్టడం వల్ల విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంజనీర్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారు’ అని అన్నారు. కాగా, ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. Ranchi-bound IndiGo flight suffers bird hit, makes emergency landing, all 175 passengers safe: Official pic.twitter.com/KtzhnVH9KL— Press Trust of India (@PTI_News) June 2, 2025

Tesla unlikely to manufacture vehicles in India7
భారత్‌లో టెస్లా తయారీ లేనట్లే!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ టెస్లా తన కార్లను భారతదేశంలో తయారు చేసే అవకాశం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. కానీ, దేశంలో షోరూమ్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంపెనీ వాహనాలను భారత్‌లో విక్రయించేందుకు ఆసక్తిగా ఉందని చెప్పారు. అందుకోసం జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి టెస్లా నేరుగా దేశంలో వాహనాలను దిగుమతి చేసుకునే వీలుందని అంచనా వేశారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో టెస్లా కార్లు తయారవుతాయని భావించిన వారికి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.కొత్త ఈవీ పాలసీభారత్‌లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో భాగంగా దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ప్రధాన అంతర్జాతీయ వాహన తయారీదారులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది. రాయిటర్స్ నివేదించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని ఖరారు చేసింది. ఇది వాహన తయారీదారులకు కేవలం 15% దిగుమతి సుంకంతో 35,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ తక్కువ టారిఫ్‌లకు అర్హత పొందేందుకు కంపెనీలు దేశంలో తయారీ ప్లాంట్‌ను స్థాపించాల్సి ఉంటుంది. అందుకు 486 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉండాలి. నిర్ణీత గడువులోపు స్థానికంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం ప్రారంభించాలి.దేశీయ వాహన తయారీదారులను అంతర్జాతీయ పోటీ నుంచి రక్షించడానికి భారత్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనుకునే వారు తమ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల్లో కనీసం 25% మొదటి మూడేళ్లలో స్థానిక కంపెనీల నుంచే తీసుకోవాలి. క్రమంగా తర్వాత ఐదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలనే నిబంధనలున్నాయి. మెర్సిడెస్ బెంజ్, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, హ్యుందాయ్, కియా వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు.భారత్‌లో టెస్లా ప్రణాళికలుటెస్లా ఇప్పటికే ముంబయి, ఢిల్లీలో రెండు షోరూమ్‌లను ఖరారు చేసింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో 4,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని సిద్ధం చేస్తుంది. టెస్లా ఈ ప్రాంతంలో అత్యధిక నెలవారీ లీజు రేట్లతో ఈ స్థాలాన్ని దక్కించుకుంది. నెలకు సుమారు రూ.35 లక్షలు (చదరపు అడుగుకు సుమారు రూ.900) చెల్లించడానికి సిద్ధమైంది. ఐదేళ్ల కాలపరిమితితో లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ మరో విస్తరణ చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్‌లో రెండో షోరూమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో తన మోడల్ 3, మోడల్ వై లను పరీక్షిస్తోంది. త్వరలో స్థానికంగా వీటిని ఆవిష్కరించేదుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!ట్రంప్‌కు భయపడ్డారా..?ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ పాలసీను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా యూఎస్‌ కంపెనీలు స్థానికంగా అమెరికాలోనే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చైనా, భారత్‌లో తయారీ సాగిస్తున్న యాపిల్‌ వంటి దిగ్గజ కంపెనీకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ టెస్లా భారత్‌లో తయారీని ప్రారంభిస్తే ట్రంప్‌ తీవ్రంగా స్పందిస్తారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలాన్‌మస్క్‌ ఎంత సన్నిహితుడైనా దేశ అభివృద్ధికి ఆటంకం కలిగితే మాత్రం ట్రంప్‌ ఊరుకోరని నిపుణులు చెబుతున్నారు. దాంతో రిస్క్‌ చేయడం ఎందుకనే భావనతో భారత్‌లో తయారీని వాయిదా వేసుకుంటున్నారా అనే అంచనాలు వెలువడుతున్నాయి.

Kaleshwaram Commission: KCR Likely Extend His Present8
కాళేశ్వరం నోటీసులు.. కేసీఆర్‌ కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరయ్యే విషయంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావుతో పలు దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే ఆయన విచారణకు హాజరవుతారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో.. ఇప్పుడు విచారణకు మరింత గడువు కోరే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. జూన్ 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్​కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీన విచారణకు రాలేనని.. బదులుగా మరో తేదీని కేటాయించాలని ఆయన ఇప్పుడు కమిషన్‌కు బదులు ఇవ్వబోతున్నారట!. ఇతర కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని, కావాలంటే ఈ నెల 11వ తేదీన హాజరవుతానని ఆయన లేఖలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ ఇప్పటికే ప్రాజెక్టు కోసం పని చేసిన ముఖ్య అధికారులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది కూడా.ఇదీ చదవండి: అదే స్పూర్తిని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించాలి

Videos Of Pak Social Media Influencers Circulated Check Details Here9
ఏకాంత వీడియోలు ఒక్కొక్కరివిగా బయటకు..!

పొరుగుదేశం పాకిస్తాన్‌లో డిజిటల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ల కమ్యూనిటీని వణికిపోతోంది. గత కొన్నిరోజులుగా అక్కడి ఇన్‌ఫ్లుయెన్సర్ల పరువు బజారున పడుతోంది. వరుసబెట్టి ఒక్కొక్కరి ఏకాంత వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనాలు వాళ్లను తిట్టిపోస్తుండగా.. మరోవైపు వాళ్ల కవరింగ్‌లు, వివరణలు, చట్టపరమైన చర్యలతో ప్రస్తుతం ఈ అంశం అక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది.పాక్‌లో టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాపులర్‌ అయిన కొందరు యువతుల ప్రైవేట్‌ వీడియోలు గత కొన్నిరోజులుగా వైరల్‌ అవుతున్నాయి. విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న మినాహిల్‌ మాలిక్‌, ఇమ్‌షా రెహమాన్‌ల వీడియోలు తొలుత సర్క్యులేట్‌ కావడంతో.. వాళ్లకున్న మిలియన్ల ఫాలోవర్లు షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే టాక్‌ షోలు, మ్యూజిక్‌ వీడియోలతో పాపుల్‌ అయిన మథీరా ఖాన్‌ వీడియో వైరల్‌ అయ్యింది. తాజాగా.. కన్వాల్‌ అఫ్తాబ్‌ అనే మరో ఇన్‌ఫ్లుయెన్సర్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.ఈ వీడియోలను ఆ ఇన్‌ఫ్లుయెన్సర్లు(Influencers) ఖండిస్తున్నారు. అవి తమవి కావని, ఇదంతా ఏఐ సృష్టి అని వివరణలు ఇస్తున్నారు. పనిలో పనిగా ఫిర్యాదులు చేస్తూ.. చట్టపరమైన చర్యలకు వెెళ్తున్నామని ప్రకటించారు. మినాహిల్‌ ఓ అడుగు ముందుకు వేసి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది. అయితే ఆ కామెంట్‌ తీవ్ర విమర్శలకు దారి తీసింది. అందుకు కారణం.. ఆమె చేసింది బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ గతంలో చెప్పిన మాటలు కావడం!.ఇదిలా ఉంటే.. ఈ డర్టీ వ్యవహారంలో భారత్‌ ప్రస్తావనతో అక్కడి టీవీ చానెల్స్‌లో చర్చలు నడిపిస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor) నేపథ్యంతో అక్కడి మీడియా ఛానెల్స్‌ను, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో చాలామందిని భారత్‌ నిషేధించింది. ఈ క్రమంలో ఇది భారత్‌ నుంచి జరుగుతున్న వ్యవహారమేనని అక్కడి మీడియా చర్చ జరపడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌కు చెందిన ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రముఖంగా ఓ కథనం ఇచ్చింది.SHOCKING NEWS 🚨 Private videos of several Pakistani influencers of Pakistan have leaked online.Pakistan’s influencer community is facing a wave of scandals one after another 😱After viral incidents involving TikTok stars Minahil Malik and Imsha Rehman, now videos of Mathira… pic.twitter.com/rFdRAPIBY8— BALA (@erbmjha) June 1, 2025

Kamal Haasan approached the Karnataka High Court to secure the release of Thug Life in the state10
హైకోర్టుకు కమల్‌ హాసన్‌.. ‘థగ్‌లైఫ్‌’ సినిమాను అడ్డుకొని తీరుతాం

సాక్షి,బెంగళూరు: కన్నడ భాషా వివాదంపై ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కర్ణాటక హైకోర్టును (karanataka high court) ఆశ్రయించారు. ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ‘థగ్‌లైఫ్‌’ (Thug Life) సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జూన్‌ 5న ఈ సినిమా విడుదల ఎలాంటి అడ్డంకులు లేకుండా తగిన భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ ఎం.నరసింహులు కమల్‌ హాసన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. కన్నడ భాషనే కాదు, రాష్ట్రాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కమల్‌ హాసన్‌ కన్నడ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.🚨THUG LIFE BAN ISSUE IN KARNATAKA : #KamalHaasan has approached the #Karnataka HC seeking directions to ensure the release and screening of the film #ThugLife in the state, following widespread backlash over his recent comments about the origins of the Kannada language. pic.twitter.com/IGrUQFHU0d— Venkatramanan (@VenkatRamanan_) June 2, 2025 ‘కమల్‌ హాసన్‌ (kamal hasan) క్షమాపణలు చెప్పాలనేది సినిమా ఇండస్ట్రీ కోసం కాదు.. రాష్ట్రం కోసం. కమల్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ రాజకీయ,కన్నడ అనుకూల సంస్థలు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పాయి. క్షమాపణలు చెప్పకుండా థగ్‌ లైఫ్‌ సినిమాను విడుదల చేస్తామంటే తాము ఒప్పుకోబోమని, అడ్డంకులు సృష్టించామని సూచించారు. రాష్ట్రంలో ఎగ్జిబిటర్లు,డిస్టిబ్యూటర్లు సినిమాను విడుదల చేయడం లేదు. క్షమాపణలు చెప్పకుండా థగ్‌లైఫ్‌ ఎలా విడుదల చేస్తామో మేమూ చూస్తాం’ అని హెచ్చరికలు జారీ చేశారు.తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్‌ హాసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, కన్నడ భాషను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్‌ తన వ్యాఖ్యలకు క్షమాణలు చెప్పాలని కోరారు. ఆ విజ్ఞప్తులపై కమల్‌ హాసన్‌ స్పందిస్తూ బలవంతంగా తనతో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేయొద్దని నొక్కాణించారు. ఈ తరుణంలో థగ్‌ లైఫ్‌ సినిమా విడుదల కోసం కమల్‌ హాసన్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement