Top Stories
ప్రధాన వార్తలు

ఏడాది పాలన పొట్ట విప్పి చూడ..!
చంద్రబాబు అనే నాలుగు అక్షరాలకు అర్థమూ, తాత్పర్యమూ, నిర్వచనమూ అన్నీ కూడా అభివృద్ధేనని యెల్లో మీడియా మనకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నది. ముప్పయ్యేళ్ల లోపు వయసున్న తరానికైతే దొండాకు పసరు నాడే ఈ వసను కూడా కలిపి తాగించారు. అటువంటి రెండు కాళ్ల మీద నడిచే అభివృద్ధి నాలుగోసారి కుర్చీ ఎక్కి సంవత్సరకాలం పూర్తవు తున్నది. ఈ ఏడాది కాలంలో విరగబూసిన అభివృద్ధిని కళ్లారా వీక్షించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు? ఆ వీక్షణ కోసం కొన్ని ‘వ్యూ పాయింట్స్’ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.హిందూపూర్ రైల్వే స్టేషన్ కూడా ఒక వ్యూ పాయింట్.హిందూపూరంటే చంద్రబాబు పార్టీకి కంచుకోట కదా! ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదట! పైగా ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది ప్లస్ వియ్యంకుడు ప్లస్ మాస్ మసాలా హీరో – బాక్సాఫీస్ బొనాంజా బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇంత బిల్డప్ ఉన్నచోట అభివృద్ధి దద్దరిల్లకుండా ఉంటుందా? ఉదయం నాలుగున్నర నుంచి రెండు గంటలసేపు ఆ స్టేషన్లో నిలబడితే రైలు కూత వాయిస్లో అభివృద్ధి సౌండ్ వినిపిస్తుంది.బెంగళూరు నగరంలోని ఇళ్లలో పాచి పనులు చేసేందుకు, వీధుల్లో మూటలు మోసేందుకూ, ఇంకా ఇతర పనుల కోసం దాదాపు మూడు వేలమంది దాకా రోజూ అక్కడ ప్యాసింజర్ బండ్లెక్కి వెళుతున్నారు. ఇలా ప్రతిరోజూ వెళ్లి పనిచేసుకుని రావడం కొత్తేమీ కాదు. కాకపోతే ఏడాది కిందట వీరి సంఖ్య ఆరేడు వందలు దాటేది కాదు. ఈ ఏడాదిలో క్రమంగా మూడు వేల మార్కుకు చేరుకున్నది. ఈ పెరుగుదలను ఏడాది పాలన అభివృద్ధి ఖాతాలోనే కదా వేయాల్సింది. రోజువారీ చాకిరీ ముగిసిన తర్వాత మళ్లీ రైలు బండెక్కి రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మళ్లీ పొద్దున మూడు గంటలకే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటేనే... స్టేషన్లో బతుకు బండిని అందుకోగలుగుతారు.మహానగరానికి సమీపంలో ఉన్నందువలన హిందూపూర్ వలసల్లో డైలీ షటిల్ పద్ధతి కనిపిస్తున్నది. ఆ సమీపంలోనే ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోనైతే మూడో వంతు జనాభా మాత్రమే మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మిగిలిపోయిన వాళ్లలో వృద్ధులూ, పిల్లలే ఎక్కువ. భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి నెల్లూరు నగరంలో స్థిరపడ్డ కార్మికుల్లో ఇరవై వేలమంది ఈ మధ్యకాలంలోనే పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ వలసలపై గ్రామ సచివాలయాల సర్వేను ఆధారం చేసుకొని ఇటీవల ‘ప్రజాశక్తి’ పత్రిక ఒక కథ నాన్ని ప్రచురించింది. దానిప్రకారం ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా వలసలు పెరిగాయి. గణనీయ సంఖ్యలో జనం వలస బాట పట్టారు.వలసలన్నీ అభివృద్ధికి వ్యతిరేకమైనవి కావు. మెరుగైన జీవితం కోసం, నైపుణ్యతకు తగిన ఉపాధి కోసం, ఉన్నతో ద్యోగాల కోసం నిరంతరం వలసలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వలసలను ప్రగతిశీలమైనవిగానే పరిగణిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ తరహా వలసల సంఖ్య చాలా తక్కువనీ, బతుకుదెరువు వలసలే ఎక్కువనీ సర్వే సారాంశమట! వ్యవ సాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతన్నలకు చేసిన హామీలను ఎగవేయడం, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బిల్లులు ఆపేయడం, నిర్మాణరంగం పూర్తిగా కుదేలవడం వంటి కారణాలు పెద్ద ఎత్తున వలసలకు కారణమయ్యాయి.తొలి ఏడాది అభివృద్ధికి సంబంధించి పెరిగిన వలసలు ఒక కొలమానమైతే, అధికారిక లెక్కలు వెల్లడించే డాక్యుమెంట్లు మరో బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ సాక్ష్యాలను ముందుపెట్టుకొనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర యథార్థ పరిస్థితులను మీడియా సమావేశం ద్వారా మొన్న జనం ముందు ఉంచారు. ఈ సమావేశంలో తన పార్టీ వాళ్లు తయారుచేసిన నివేదికల ఆధారంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వం తయారుచేసిన బడ్జెట్ పత్రాల్లోని లెక్కల్ని ఆధారంగా చేసుకునే మాట్లాడారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రిపోర్టుల్లోని విషయాలపైనే మాట్లాడారు. ‘కాగ్’కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణీ ఉండదనేది తెలిసిందే. తప్పొప్పులను తూర్పారపట్టడమే దాని పని. ఈ లెక్కల ఆధారంగానే కూటమి సర్కార్ మాటల్లోని కపటత్వాన్నీ, వారి ప్రచారాల్లోని డొల్లతనాన్నీ ఆయన చీల్చి చెండాడారు. ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారికంగా, ఎంత శక్తిమంతంగా జనంలోకి వెళ్లిందంటే... మూడు రోజులు గడిచినా సర్కార్ వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. కొన్ని పిల్లి అరుపులు వినిపించడం, కొన్ని కుప్పిగంతులు కనిపించడం తప్ప!మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికీ, ఉద్యోగాల కల్పనకూ, జీడీపీ ఉద్దీపనకూ ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది. మరి, అభివృద్ధికి పర్యాయపదంగా యెల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూల ధన వ్యయం ఏ మేరకు పెరిగింది? పెరగలేదు సరికదా,అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 17.80 శాతం తగ్గిందని ‘కాగ్’ నివేదికలోని అంశాన్ని జగన్ జనం ముందు పెట్టారు. జగన్ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం రూ. 23,330 కోట్లయితే చంద్రబాబు తొలి సంవత్సరం అది రూ. 19,177 కోట్లు మాత్రమేనని ‘కాగ్’ కుండబద్దలు కొట్టింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు! కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39 శాతం తగ్గింది. జగన్మోహన్రెడ్డి జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైనది ఎక్సైజ్ ఆదాయం.ఎందుకంటే అంతకుముందు కంటే మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా ఓ పర్మిట్ రూమ్ తయారైంది. ఇక బెల్ట్షాపుల సంఖ్య నలభై వేలు దాటింది. ఒక్కో బెల్ట్షాపు అనధికార పాటల్లో పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్షాపుల కేటాయింపులోనే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల మేరకు అనధికారిక డీల్ కనబడుతుంటే... ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్ ఆదాయం కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమే!ఇక ఈ 40 వేల పైచిలుకు బెల్ట్ షాపుల్లో అమ్మిన సరుకెంత? వచ్చిన ఆదాయమెంత? 4,400 మద్యం దుకాణాల్లో, వాటికి అనుబంధంగా కొత్తగా వెలసిన పర్మిట్ రూమ్ల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని? వచ్చిన ఆదాయమెంత? మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు, బెల్ట్షాపులు, బార్లు రౌండ్ ది క్లాక్ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయమెంత? ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళుతున్నది? లేని స్కామ్పై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలివ్వడం వెనుక రహస్యమేమిటి? ఆధారాలు తుడిచేశారని ‘ఈనాడు’, దర్యాప్తు ఇప్పుడప్పుడే పూర్తి కాదని ‘ఆంధ్రజ్యోతి’ రాయడం వెనుక మర్మమేమిటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటికొస్తుందేమోనని భయ పడుతున్నారా? కేవలం 24 శాతం పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్ ఆదాయం తీగ అవినీతి డొంకను కదిలించింది.సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకొని, యెల్లో మీడియా కితాబులందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.08 శాతం మాత్రమే! అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76 శాతం పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12 శాతం పెరిగింది. అప్పుల్లో మాత్రం 30 శాతం అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హైజంప్ చేసింది. ఇది బడ్జెటరీ అప్పుల సంగతే! అమరావతి అప్పులు, ఇతరత్రా అప్పులు వేరే ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 41 శాతాన్ని చంద్రబాబు సర్కార్ తొలి సంవ త్సరంలోనే చేసేసిందని జగన్మోహన్రెడ్డి ఆధారసహితంగా జనం ముందు పెట్టారు. ఒకపక్క అప్పులు పెరుగుతున్నాయి. అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది. అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి సంపద సృష్టికీ, అభివృద్ధికీ బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనాతీలు, భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు. అసలా అమరావతి నిర్మాణమే అతి పెద్ద స్కామ్గా గణాంకాల సహితంగా జగన్ నిరూపించారు.గతంలో పిలిచిన టెండర్లను, అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక, టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకనున్న మర్మం కమీషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు. సచివాలయం, హెచ్ఓడీ భవనాలను 53 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్నీ, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ. 8,931గా నిర్ణయించడంలో లోగుట్టునూ కూడా ఆయన ప్రశ్నించారు.అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉన్నది. ఎన్నికలకు ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పారు. భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చనీ, ఆ రకంగా అది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమనీ ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరచిపోలేదు. ఇప్పుడేమో తొలిదశ 50 వేల ఎకరాలకే రూ.80 వేల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారు. అందులో 30 వేల కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు. మరో 45 వేల ఎకరాలతో రెండో దశ భూసమీకరణ కూడా జరుగుతుందట! ఈ లెక్కన రాజధాని నగరానికి రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడవుతుందని జగన్మోహన్రెడ్డి కూడా హెచ్చరించారు. భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని, చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుదిబండ కాబో తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించ గలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఒక రూపు తీసుకుంటుంది. రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఒక అర్థం ఉన్నది.ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమ యం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకితభావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందు బాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ప్రాంతంలో జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే పదేళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు! ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికిడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాల్లో ఒక అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు. ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్ని స్తున్నారు. శిరస్సుల మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుము కొని ఏడాది ఉత్సవాల పల్లకీలపై ఏలికలు ఊరేగబోతున్నారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

ఒక్కో బిల్డింగ్కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు
సాక్షి, అమరావతి: ‘మామూలుగా భవనాల (బిల్డింగ్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైవ్ స్టార్ వసతులు కల్పిస్తూ నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500కు మించి ఖర్చు కాదు’ అని ఇంజినీరింగ్ నిపుణులు తేల్చి చెబుతుంటే రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు వచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్ బిల్డింగ్కు మార్చేశారు. చదరపు అడుగుకు రూ.10,418.97 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజినీరింగ్ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్ మార్బుల్స్తో ఫైవ్ స్టార్ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగు రూ.4వేలు–రూ.4,500కు మించదని హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా.. బంగారపు పూత పూస్తున్నారా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి వెళ్తోందంటూ అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అప్పు తెచ్చిన సొమ్ముతో...ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేఎఫ్డబ్ల్యూ (జర్మనీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెర తీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం (ఐదు ఐకానిక్ టవర్లు), మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల (క్వార్టర్స్) నిర్మాణ పనులకు 2016–18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఇటీవల సీఆర్డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65 శాతం నుంచి 105 శాతం వరకు పెంచేసి టెండర్లు పిలిచి.. అధిక ధరలకు సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్టు ఒప్పందం విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో ఎనిమిది శాతం ముఖ్య నేత, మిగతా రెండు శాతం కాంట్రాక్టర్లు నీకింత.. నాకింత.. అంటూ పంచుకున్నారు. మంత్రుల బంగ్లా వ్యయం రూ.6.99 కోట్లు రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను రూ.495.86 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ.. టెండర్ డాక్యుమెంట్ను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,418.97. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.6.99 కోట్లు. పైగా ఇసుక ఉచితం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.4 కోట్లలోపేనని బిల్డర్లు ఎత్తి చూపుతున్నారు. ఐఏఎస్ల బంగ్లా చదరపు అడుగు రూ.9,771 రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను రూ.516.02 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు అప్పగించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,771.25. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,500కు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఏఎస్ అధికారుల ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.4.49 కోట్లు. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.నాడూ నేడు ఒకే రీతిలో దోపిడీ ⇒ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లు ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ⇒ ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ⇒ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి సీఎం తరఫున కమీషన్లు వసూలు చేసి, ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నుంచి అధికారుల నివాసాల వరకు.. డిజైన్ మారిందని.. పని స్వభావం మారిందని.. ధరలు పెరిగాయనే సాకు చూపి.. 2015–19 తరహాలోనే దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం ఆకాశమంత ⇒ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్ృజెనిసిస్ ప్లానర్స్ృడిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు (ఆకృతులు) రూపొందించాయి. ⇒ ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ⇒ నాలుగు టవర్లను బీ+జీ+39 అంతస్తులతో.. ఐదో టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనుంది. ఈ ఐదు టవర్ల మొత్తం నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి చూస్తే ఐకానిక్ టవర్లలో మిగిలిన పనుల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.8,981.56. ఈ లెక్కన చూసుకుంటే 2018 నాటితో పోల్చితే ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,417.68 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ అంటే.. అంచనా వ్యయం 105 శాతం పెంచేశారన్న మాట. నిజానికి 2018ృ19 ధరలతో పోల్చితే ప్రస్తుతం సిమెంటు, స్టీలు, పెట్రోల్, డీజిల్ సహా నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ఇసుక ఉచితం. ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి వీల్లేదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించి వ్యయం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఒకే ఇంట్లో షెహన్షా, బాద్షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్గా షారుక్ ఖాన్
ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్స్టార్ 'షారుక్ ఖాన్'ను కందేరే ప్రీమియం లైఫ్స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్కు, మరోవైపు ఆధునికత, డిజైన్పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్కు షారుక్ ఖాన్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్గా 75కి పైగా రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్షా (బచ్చన్) మరియు బాద్షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

మనమంతా టీమిండియా
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలను ‘టీమిండియా’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అవి కలసికట్టుగా పని చేస్తే ఏ అభివృద్ధి లక్ష్యమూ అసాధ్యం కాబోదని ధీమా వెలిబుచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 10వ భేటీకి ఆయన సారథ్యం వహించారు. వికసిత భారత్–2047 థీమ్తో భేటీ సాగింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు భేటీలో పాల్గొన్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొనలేదని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి లక్ష్యాల్లో జమ్మూకశీ్మర్లో పర్యాటకాన్ని దెబ్బ తీయడం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రమూ ప్రగతి సాధించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు దేశమంతా దానంతటదే వృద్ధి చెందుతుంది. గడువు లోపలే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా అభివృద్ధి పనుల వేగం మరింత పెంచుదాం. 140 కోట్ల పైచిలుకు భారతీయుల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్లో పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కనుక నగరాలను సుస్థిరాభివృద్ధి, ఇన్నోవేషన్ల కలబోతగా, భవిష్యత్ అవసరాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘‘మహిళా శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే మనమంతా ఆశించిన విధంగా దేశప్రగతి సాధ్యపడుతుంది. శ్రామిక శక్తిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు, విధానాలను రూపొందించుకోవాలి’’ అని మోదీ చెప్పారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం: సీఎంలుకేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తమిళనాడు, పంజాబ్ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్, భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తామని మాటిచ్చారు. కానీ 33.16 శాతమే ఇస్తున్నారు. తమిళనాడు దేశంలోకెల్లా అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రానికి ప్రత్యేక పట్టణీకరణ మిషన్ను మంజూరు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. నమామి గంగ తరహాలో తమిళనాడులోని కావేరీ, వైగే తదితర నదుల ప్రక్షాళనకు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలి’’ అని స్టాలిన్ కోరారు. ఆ ప్రాజెక్టులకు పేర్లను ఇంగ్లిష్లోనే పెట్టాలన్నారు. పంజాబ్లో పాకిస్తాన్ను ఆనుకుని ఉండే ఆరు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని కేంద్రానికి మాన్ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని రూ.30 వేలకు పెంచాలన్నారు. సిక్కిం, పశ్చిమబెంగాల్లోని సిలిగురిలను కలుపుతూ ప్రపంచస్థాయి జాతీయ రహదారి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సిక్కిం సీఎం ప్రేంసింగ్ తమాంగ్ అన్నారు.విధాన అడ్డంకులు తొలగించాలన్నారు: సీఈఓ భేటీ వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలని, తద్వారా ఇతోధికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించుకోవాలని హితవు పలికారు’’ అని చెప్పారు. భేటీలో పాల్గొన్న సీఎంలు, నేతలు ఆపరేషన్ సిందూర్ను ముక్తకంఠంతో సమరి్థంచారన్నారు. జైరాంతో కాంగ్రెస్కే చేటు: బీజేపీ నీతి ఆయోగ్ ఓ ‘అయోగ్య’ (అసమర్థ) సంస్థ అన్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్కే చేటు చేసే వివాదాలను సృష్టించడం ఆయన నైజమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ను జైరాం భూస్థాపితం చేయడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ జోస్యం చెప్పారు.నవ్వుల్ పువ్వుల్ ఆయోగ్ భేటీలో సరదా సన్నివేశాలు ప్రధాని, ముఖ్యమంత్రుల నడుమ పలు సరదా సన్నివేశాలకు నీతి ఆయోగ్ భేటీ వేదికైంది. సమావేశం ముగిశాక రేవంత్రెడ్డి, స్టాలిన్ తదితరులతో మోదీ సరదా సంభాషణలు జరిపారు. నవ్వుతూ, వారిని నవి్వస్తూ కని్పంచారు. భగవంత్ మాన్ (పంజాబ్), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), కొన్రాడ్ సంగ్మా (నాగాలాండ్) తదితరులు మోదీతో చాలాసేపటిదాకా కరచాలనం చేస్తూ కన్పించారు. వారితో ప్రధాని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలంతా తేనీరు సేవిస్తూ ఉల్లాసంగా గడిపారు.

బ్రాండ్ బాజా విరాట్
పుష్కర కాలం కిందటి మాట. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి సిరీస్ ఆడుతున్నాడు. ఆ సిరీస్ తొలి టెస్టులో ఒక యువ ఆటగాడు.. ‘ఎంఆర్ఎఫ్’స్టిక్కర్ అంటించి ఉన్న బ్యాట్తో తొలిసారి క్రీజ్లో వచ్చాడు. అప్పటివరకు భారత అభిమానుల దృష్టిలో ‘ఎంఆర్ఎఫ్’బ్యాట్ అంటే సచిన్దే. ఇప్పుడు మరో యువ ప్లేయర్ బ్యాట్పై ఫ్యాన్స్ ఆ బ్రాండ్ను చూశారు. ఆ కుర్రాడు సచిన్ స్థాయి ఆటను ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. అంతే కాదు.. ఆ తరవాత జరిగిన ‘ఎంఆర్ఎఫ్’ఒప్పందం భవిష్యత్తులో వాణిజ్యపరంగా కూడా బ్రాండింగ్ ప్రపంచంలో ఒక సంచలనమైంది. ఆ యువ ఆటగాడే విరాట్ కోహ్లి. నాటితో మొదలుపెట్టి అసంఖ్యాక ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో రెండు ఫార్మాట్లనుంచి తప్పుకున్నా.. బ్రాండింగ్ విలువ ఏమాత్రం తగ్గకపోవడం కోహ్లీ కింగేనని రుజువుచేస్తోంది. స్పోర్ట్స్ వేర్, ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, ఎలక్ట్రానిక్స్, సాంప్రదాయ దుస్తులు, ఎడ్యుకేషన్ యాప్, స్నాక్స్, టూరిజం, బెవరేజెస్, న్యూట్రిషన్, ఆటోమొబైల్, భవన నిర్మాణ రంగం... ఇలా విభిన్నమైన రంగాల ఉత్పత్తులకు విరాట్ కోహ్లి ప్రచారం చేస్తూ కనిపిస్తాడు. బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సహజంగానే ఉండే నిబంధనల ప్రకారం ఈ అన్ని ఉత్పత్తులకూ అతను పూర్తి స్థాయిలో ప్రకటనల్లో కనిపించడు. కొన్ని అంతర్జాతీయ బ్రాండ్లకు వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు ఆయా ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో సంవత్సరానికి కనీసం 2–3 చోట్ల వ్యక్తిగతంగా పాల్గొనాల్సి ఉంటుంది. మరికొన్నింటిలో సదరు ఉత్పత్తికి సంబంధించి ఒక సంక్షిప్త వ్యాఖ్య మాత్రమే జోడించే స్వల్ప ప్రకటనలో అతను కనిపిస్తాడు. మరికొన్నింటికి సదరు బ్రాండింగ్ మాత్రమే కనిపించే జెర్సీ ధరించి లేదా బ్యాట్ చేతపట్టి ఒక ఫొటో ఇస్తాడు. దాన్నే వారు వాడుకోవాలి. ఇలా స్థాయిని బట్టి కోహ్లి బ్రాండింగ్ రేటు ఉంటుంది. మార్కెట్ అంచనా ప్రకారం అతను ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. 8 ఏళ్లకు రూ.100 కోట్లు! విరాట్ కోహ్లి కెరీర్లో 2014 నుంచి 2019ని అత్యుత్తమ దశగా చెప్పొచ్చు. వరుస రికార్డుల ప్రదర్శనతో అతని స్థాయి ఎంతో పెరగడంతో పాటు వాణిజ్యపరంగా కూడా అతని విలువ శిఖరాగ్ర స్థాయికి చేరింది. అందుకే మొదటిసారి ఎంఆర్ఎఫ్ చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే తర్వాత చాలా పెద్ద మొత్తం ఆఫర్ చేసింది. 2017లో ఎనిమిదేళ్ల కాలానికి రూ.100 కోట్లతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం అప్పట్లో సంచలనం. మరోవైపు అదే సమయంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ ‘ప్యూమా’తో బ్రాండింగ్ ఒప్పందం అతని కెరీర్లో మరో పెద్ద రికార్డు. ‘ప్యూమా’కూడా ఎనిమిదేళ్లకు రూ.100 కోట్లతో జత కట్టడం విశేషం. ‘ప్యూమా’తో కలిసి భాగస్వామ్యంతో కోహ్లి తన సొంత బ్రాండ్ను కూడా సృష్టించుకున్నాడు. తన జెర్సీ నంబర్ 18ని గుర్తుచేసేలా ‘వన్ 8’పేరుతో మార్కెట్లోకి వచ్చిన దుస్తులకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం కోహ్లి దాదాపు 30 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండగా.. మరో 10 రకాల వ్యాపారాల్లో అతని భాగస్వామ్యం లేదా అతని పేరు ఉన్నాయి. స్టార్టప్లలో పెట్టుబడులుముఖ్యంగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడంలో కోహ్లీ మొదటి నుంచి ఆసక్తి కనబరిచేవాడు. స్పోర్ట్స్ కాన్వో, డిజిట్ ఇన్సూరెన్స్, రేజ్ కాఫీ, వన్8 వంటి స్పోర్ట్స్, ఫ్యాషన్, ఆహారం, పానీయాల విభాగాల్లో ఎన్నో స్టార్టప్లలో విరాట్ పెట్టుబడులు పెట్టాడు. ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 17 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కానీ ఆ టీమ్కు ఉండే విలువ మొత్తం ఒక్క కోహ్లి వల్లనే వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. లీగ్ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు జట్టు మారని ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచిన కోహ్లిని చూపిస్తూనే టీమ్ బ్రాండింగ్ సాగుతుంది. ఇందులో తన వ్యక్తిగత ప్రకటనకర్తలను కూడా చేరుస్తూ అతను ఆ టీమ్ వాణిజ్య అంశాలను కూడా శాసిస్తున్నాడు. మరి కోహ్లి విలువ పడిపోతుందా? కోహ్లీ టెస్టులనుంచి రిటైర్ కావడం అతడి బ్రాండ్ మార్కెట్ మీద ఏమాత్రం ప్రభావం చూపదని మార్కెటింగ్ వ్యూహకర్త దినేశ్ అరోరా అంటున్నారు. ‘బ్రాండింగ్ ప్రపంచంలో కోహ్లి ఒక సామ్రాజ్యం నెలకొల్పాడు. అది అంత తొందరగా కనుమరుగు కాదు. దానికి పలు కారణాలున్నాయి. కోహ్లి తన అత్యుత్తమ ఫార్మాట్ అయిన వన్డేల్లో కనిపిస్తాడు. ఐపీఎల్లో ఒప్పందం ప్రకారం ఎలాగూ కనీసం 2027 సీజన్ వరకు అవకాశం ఉంది. పైగా అతను మైదానంలో ఎక్కువగా కనపడకున్నా ఇప్పటికిప్పుడు ఫ్యాన్స్ మరిచిపోయే స్థాయి కాదు అతనిది. సచిన్, ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా పలు ప్రకటనల్లో ఇంకా కనిపిస్తున్నారు. వారితో పోలిస్తే కోహ్లి బ్రాండింగ్ విలువ చాలా ఎక్కువ. కార్పొరేట్ సంస్థలు అతనిపై మున్ముందూ నమ్మకాన్ని కొనసాగిస్తాయి’అని ఆయన చెప్పారు.బాలీవుడ్ స్టార్లను దాటి... ప్రఖ్యాత బ్రాండింగ్ వాల్యుయేషన్ సంస్థ ‘క్రోల్’ప్రకారం విరాట్ ప్రస్తుత బ్రాండింగ్ విలువ అక్షరాలా రూ.1900 కోట్లు. 2016 నుంచి 2023 వరకు చూస్తే ఎనిమిదేళ్లలో.. రెండు సార్లు మినహా ప్రతీ ఏటా అతను బ్రాండింగ్ విలువ పరంగా భారత సెలబ్రిటీల్లో అగ్రస్థానంలోనే ఉన్నాడు. గతేడాది కూడా బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్లకంటే కూడా కోహ్లి విలువే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పుడు అతను అంతర్జాతీయ క్రికెట్లో టి20లు, టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఇకపై వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. టీవీల్లో అతను కనిపించడం కాస్త తగ్గుతుంది. ఇన్స్ట్రగామ్లో పోస్టుకు రూ.10 కోట్లు ఇన్స్ట్రగామ్లో 27 కోట్ల ఫాలోవర్లు ఉన్న కోహ్లి తన ఒక్కో కమర్షియల్ పోస్టుకు దాదాపు రూ.10 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అతను ఒక మాట చెబితే చాలు కోట్లాది మందికి చేరుతుంది కాబట్టి ఆ మొత్తం చెల్లించేందుకు ఎవరూ వెనుకాడరు. విరాట్ ప్రచారకర్తగా ఉన్న సంస్థలు ప్యూమా, మింత్రా, హెచ్ఎస్బీసీ, నాయిస్, మొబైల్ ప్రీమియర్ లీగ్, బ్లూ స్టార్, ఆడి ఇండియా, మాన్యవర్, టూత్సి, గ్రేట్ లెరి్నంగ్, లక్సర్, వొలిని, వెల్మాన్, వివో, డ్యూరోఫ్లెక్స్, అమెరికన్ టూరిస్టర్, ఆవాస్ లివింగ్, ఎంఆర్ఎఫ్, ఎసిలార్, లివ్స్పేస్, హెర్బలైఫ్, హీరో మోటార్స్ కోహ్లి భాగస్వామిగా ఉన్నవీ.. సొంత కంపెనీలు బ్లూ ట్రైబ్, రేజ్ కాఫీ, వన్8, హైపర్ఐస్, చిసెల్ ఫిట్నెస్, డిజిట్ ఇన్సూరెన్స్, రాంగ్ క్లాతింగ్, గ్యాలక్టస్ ఫన్వేర్, ఐఎస్ఎల్ టీమ్ గోవా ఎఫ్సీ, నూవా రెస్టారెంట్, స్పోర్ట్స్ కాన్వో, టీమ్ బ్లూ రైసింగ్, వన్8 కమ్యూన్ రెస్టారెంట్స్ చైన్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజినెస్

సామ్సంగ్కు ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలను టారిఫ్ల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేయాలని, లేకపోతే సుంకాల బాదుడుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆయన యాపిల్ కంపెనీకి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ సంస్థకు సైతం ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25 శాతం టారిఫ్ విధిస్తామని సామ్సంగ్కు ట్రంప్ తేల్చిచెప్పారు. ఆయన తాజాగా వైట్హúస్లో మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో ఎల్రక్టానిక్ ఉత్పత్తులు విక్రయించుకొనే ఏ సంస్థ అయినా సరే వాటిని ఇక్కడే తయారు చేయాలని, లేనిపక్షంలో సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తయారీ ప్లాంట్లను అమెరికాలో నెలకొల్పితే ఎలాంటి టారిఫ్లు ఉండవని చెప్పారు. మరెక్కడో తయారు చేసి, ఇక్కడ విక్రయించుకొని, సొమ్ము చేసుకుంటామంటే అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం టారిఫ్లు విధించడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్ కంపెనీకి సంబంధించి 90 శాతం ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి ప్లాంట్లను భారత్కు తరలించేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఇంతలోనే ట్రంప్ కన్నెర్ర చేశారు. మరోవైపు సామ్సంగ్కు చైనాలో తయారీ ప్లాంట్లు లేవు. చివరి ప్లాంట్ 2019లో మూతపడింది. సామ్సంగ్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు ఎక్కువగా భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్లోనే తయారవుతున్నాయి. భారత్లోనే తయారు చేస్తారా? మీ ఇష్టం.. యాపిల్ కంపెనీకి ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్కు తరలించుకోవాలంటే తరలించుకోండి. మేము వద్దనడం లేదు. కానీ, ఐఫోన్లను అమెరికాలో విక్రయించుకోవాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే. సుంకాలు లేకుండా మీరు ఐఫోన్లు ఇక్కడ అమ్ముకోలేరు’’అని పేర్కొన్నారు.

427 మంది రోహింగ్యాల జల సమాధి
బ్యాంకాక్: మయన్మార్ ముస్లిం మైనారిటీ వర్గం రోహింగ్యాలు ప్రయాణిస్తున్న పడవలు మునిగి 427 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం (యూఎన్హెచ్సీఆర్) తెలిపింది. ఈ నెల 9, 10వ తేదీల్లో మయన్మార్ తీరానికి సమీపంలో ఈ దారుణ విషాదం చోటుచేసుకుందని పేర్కొంది. పడవల మునకకు కారణాలు, కచ్చితంగా ఎందరు జల సమాధి అయ్యారనే వివరాలను తెలుసుకునేందుకు కృషి కొనసాగుతోందని వివరించింది. ఈ నెల 9వ తేదీన పడవ మునిగి 267 మంది ప్రాణాలు కోల్పోగా అందులోని కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, 10వతేదీన మరో పడవ మునగ్గా 247 మంది రోహింగ్యాలు చనిపోగా, 21 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారని యూఎన్హెచ్సీఆర్ వివరించింది. సజీవులైన వారు బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరానికి, మయన్మార్లోని రఖైన్ ప్రాంతానికి తిరిగి వెళ్లిపోయారని పేర్కొంది.

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం....ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృషభం...చేపట్టిన పనులలో కొంత ఇబ్బంది ఏర్పడినా అధిగమిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మిథునం...మధ్యలో కొన్ని సమస్యలు, వివాదాలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. పట్టుదల మరింత పెరుగుతుంది. అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఇంతకాలం నైరాశ్యంలో ఉన్న మీకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు నెమరువేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. పసుపు, నేరేడురంగులు. గణేశాష్టకం పఠించండి.కర్కాటకం....నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. శ్రీమహావిష్ణుధ్యానం పఠించండి.సింహం....మొదట్లో వివాదాలు, సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.కన్య...కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరే సమయం. బంధువుల సలహాలు కొన్ని స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు కష్టానికి ఫలితం దక్కుతుంది. గృహయోగం. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తుల....మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడంలో స్వశక్తిపైనే ఆధారపడతారు. ఆప్తుల నుంచి పిలుపు రావడంతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులను కలుసుకుని మీ భావాలను వెల్టడిస్తారు. ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.వృశ్చికం...ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా అధిగమిస్తారు. ఎదురుచూస్తున్న ఒక అవకాశాలు మాత్రం చేజారే వీలుంది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. శ్రీసూర్యప్రార్ధన మంచిది.ధనుస్సు...మధ్యమధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. మీ ఆలోచనలకు మరింత పదునుపెడతారు. ఎటువంటి పనులైనా నేర్పుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. భూవివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పెండింగ్లో ఉంచిన పెళ్లి మాటలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆప్తులతో విభేదాలు. ఎరుపు, నీలం రంగులు. హయగ్రీవ ధ్యానం చేయండి.మకరం....నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. తెలుపు, గులాబీ రంగులు. శివాష్టకం పఠించండి.కుంభం...అందరిలోనూ మీ మాటకు ఎదురుండదు. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. లక్ష్యాల సాధనలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు శుభవర్తమానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ పూర్తి చేస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి కొంత వరకూ సానుకూలం. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. శ్రీకృష్ణస్తుతి మంచిది.మీనం....ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు ఎదురుకావచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. బంధువుల వైఖరితో మనస్తాపం చెందుతారు. వ్యాపారాలు స్వల్ప లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో కొంత జాప్యం. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలు ఆచితూచి అడుగువేయడం మంచిది. వారం మధ్యలో శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. ఆస్తిలాభం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కార్పొరేట్ల కోసమే ఈ నిర్మూలనా?
‘ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వంద లాది గ్రామాలలో వేలాది రైతుల నుండి వ్యవసాయ శాస్త్రవేత్త డా‘‘ రిఛారియా 22,000 లకు పైగా వరి వంగడాలను, 1,800లకు పైగా ఆకుకూరలను సేకరించి వాటి జర్మ్ ప్లాస్క్ను రాయ్పూర్లోని ‘ఇందిరా గాంధీ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం’లో 1950, 1960లలో భద్రపరిచారు. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డినిచ్చేవి, ఎక్కువ గడ్డినిచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైన– పొట్టి రకాలు, ఏ కాలంలోనైనా పండే అనేక వంగడాలు ఉన్నాయి. అయితే మన దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్ ప్లాస్క్ను అమెరికా తదితర దేశాల బహుళజాతి కంపెనీలు దొంగిలించుకు పోయాయి. మనీలాలోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్’ (ఐఆర్ఆర్ఎ)లలో అభివృద్ధి చేశామని చెప్తూ ఇలా దొంగిలించుకు పోయిన వంగడాలను వివిధ పేర్లతో (ఐఆర్–36, ఐఆర్–72 తదితర) బహుళజాతి కంపెనీలు భారత్ లాంటి అనేక దేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు గడిస్తున్నాయి. విత్తనాల కోసం భారతదేశ రైతులు ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తు న్నారు...’ ఈ మాటలు విదేశీ జర్నలిస్టు అల్ఫ్ బ్రెనన్ కు 2022లో ఇచ్చిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరాజువి. ఈ దేశ ప్రజల పరంపరాగత జ్ఞానం పట్ల, దేశీయత పట్ల, వనరుల పట్ల ఆయన వైఖరిని సూచించే మాటలు ఇవి.దేశభక్తి అనే ఒక్క మాటతో ఈ రోజు అందరినీ శిలువ ఎక్కించి పరీక్షిస్తున్నారు. కానీ నిజంగానే దేశం పట్ల ప్రేమ ఉంటే ఎలా ఆలోచించాలో బసవరాజు చేసిన ఈ సూక్ష్మ పరిశీలన తెలియజేస్తోంది. జాతీయత పేరుతో మావోయిస్టు నిర్మూలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తరుణంలో ఏది దేశభక్తి, ఏది ప్రజల మీది ప్రేమ అనే చర్చ జరగలవసి ఉన్నది.మావోయిస్టుల ఆలోచనలు విదేశీయమని కొందరు చెబుతుంటారు. మావోయిస్టుల వల్ల ఈ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, అభివృద్ధికి వాళ్లు ఆటంకంగా ఉన్నారని అంటున్నారు. కానీ కొద్దిగా ఈ దేశ రాజకీయార్థిక వ్యవహారాలను పరిశీలిస్తే ఎవరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నదీ అర్థమవుతుంది. గతంలో కంటే తీవ్రంగా అభివృద్ధి అనే మాట ఇప్పుడు చలామణీలోకి వచ్చింది. కానీ ఇది ఎవరి అభివృద్ధి అనేది అతి ముఖ్యమైన ప్రశ్న.ఏడాదిన్నరగా మావోయిస్టు నిర్మూలన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ కేవలం సైనిక చర్య కాదు. అభివృద్ధి నమూనా కేంద్రంగా సాగుతున్న రాజకీయార్థిక యుద్ధం. సరిహద్దుల కోసం పక్క దేశ ప్రజలపై యుద్ధం చేసే భారత ప్రభుత్వం అభివృద్ధి నమూనా విషయంలో జరుగుతున్న సంఘర్షణను అంతర్యుద్ధంగా మార్చేసింది. తన దేశ ప్రజల మీదే దండయాత్ర చేస్తోంది. యుద్ధాల్లో ఆయుధాలు, విమానాలు, డ్రోన్ లు చేసే వికృత ధ్వనుల వెనుక రాజకీయార్థిక విధ్వంసాలు ఉంటాయి.కగార్ పేరుతో అదే జరుగుతోంది. అందుకే మావోయిస్టు ప్రభా విత మధ్య భారత రాష్ట్రాల్లో హత్యాకాండ ఆపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆదివాసుల జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ చట్టాల చర్చగానే ఇది ముగిసి పోవడం లేదు. ఈ రక్తపాతం వెనుక ఉన్న పాలకుల అభివృద్ధి నమూనా ఉంది. ఈ ఏడాదిలోనే వందలాది మంది ఆదివాసుల హత్య వెనుక ఉన్న అభివృద్ధి–విధ్వంసాల సంఘర్షణకు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావు హత్య ఒక పరాకాష్ఠ.ఒకప్పుడు మావోయిస్టులు, వాళ్ల అభిమానులు మాత్రమే పాలకుల అభివృద్ధి నమూనాను మౌలికంగా విమర్శించేవాళ్లు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఎట్లా ఉండాలో చెప్పేవాళ్లు. ఈ దేశ ప్రజల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఉండాలని విశ్లేషించేవాళ్లు. ఈ దేశ వనరులు ఇక్కడి ప్రజల కోసమే వినియోగించాలనే వాళ్లు. చిన్న చిన్ని సవరణలు ఎన్ని చేసినా అది ప్రజలకు పనికి రాదని, చాలా మందికంటే భిన్నమైన వైఖరిని ప్రకటించేవాళ్లు. విప్లవం ద్వారా మౌలిక మార్పు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అనేవాళ్లు.ఇదే విమర్శ ఇప్పుడు దేశంలోనే ఒక ప్రధాన విమర్శగా ఎదిగింది. ఈ దేశం పిడికెడు మంది కార్పొరేట్లది కాదని, అసంఖ్యాక ప్రజలదనే అవగాహన అనేక రకాలుగా ప్రచారంలోకి వచ్చింది. కార్పొరేటీకరణ ఉద్ధృతంగానే సాగుతూ ఉండవచ్చు. కానీ దాని మీద విమర్శ పదునెక్కుతోంది. అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తి, జాతీయత అనే భావనలను ఆ పక్క పాలకులు ప్రచారంలో పెట్టే కొద్దీ... ఈ పక్క నుంచి రోజువారీ జీవిత సంక్షోభంలోంచి ప్రజా ప్రయోజనాల చర్చ వేగవంతం అవుతున్నది.మావోయిస్టు ఉద్యమం ఈ విషయాలను చర్చించడంతో సరి పెట్టుకోలేదు. వాళ్లకు బలం ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్ ఉద్యమాలను నిర్మిస్తోంది. మిగతా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు ప్రజా పోరాటాలకు మద్దతు ఇస్తున్నది. వాటిలో తనకు వీలైన పద్ధతిలో పాలుపంచుకుంటోంది. ఈ దేశంలో మౌలిక స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి నమూనా చర్చను ప్రజా ఆచరణలోకి మళ్లిస్తున్నది. ఇది ముఖ్యంగా కేంద్ర పాలకులకు ఆగ్రహం తెప్పించింది. పైకి మావో యిస్టు ఉద్యమం గురించి అప్పుడప్పుడు శాంతి భద్రతల సమస్యగా చెప్పినా... ఇది తాను ఎంచుకొన్న అభివృద్ధి నమూనాకు ఆటంకం అని గ్రహించింది. అడవుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే అశేష పీడిత ప్రజానీకానికీ, కార్మికులకూ, నానాటికీ పెరుగుతున్న మధ్య తరగతికీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న అభివృద్ధి నమూనా ప్రమాదకరమనే చైతన్యం పెరగడంలో మావోయిస్టుల పాత్ర ఉన్నది.కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే తాను ఎంచుకున్న కార్పొరేట్ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. కొన్ని తేడాలతో గత ప్రభుత్వాలది కూడా ఇదే వరుస. వాళ్లు చూసిన దారిని మరింత నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా నేటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ మేరకు వివిధ ప్రజా పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. వ్యవస్థ మౌలిక మార్పులో కీలకమైన ఉత్పత్తి సంబంధాల చర్చను, కొత్త దోపిడీ రూపాల సమస్యను మావోయిస్టు ఉద్యమం కేంద్ర స్థానంలోకి తీసుకొని వచ్చింది. కార్పొరేట్ పెట్టుబడి, దాని వనరుల దాహం, శ్రమశక్తిని కొల్లగొడుతున్న పద్ధతుల మీద విమర్శను ప్రజల కామన్ సెన్స్లో భాగం చేసింది. కాబట్టి కార్పొరేట్ ఇండియాను సాధించడానికి మావోయిస్టు రహిత భారత్ ఒక షరతుగా మారిపోయింది.వ్యక్తిగా నంబాళ కేశవరావు భౌతిక కాయం అరమోడ్పు కన్నులతో ఈ నేలలో కలిసిపోవచ్చు. కానీ ఆయన చూపు, మేధ,హృదయం, చైతన్యం మాత్రం పాలకుల అభివృద్ధి నమూనాను గురి చూస్తూనే ఉంటాయి. పాణి వ్యాసకర్త ‘విరసం’ కార్యవర్గ సభ్యుడు

పారిపోండ్రోయ్..!!
ఇస్లామాబాద్: శత్రువు ఎదురొస్తే అతని ప్రాణం తీయడమో లేదంటే తన ప్రాణాలు పోయేదాకా పోరాడటమే వీరుని లక్షణం. పాకిస్తాన్ సైన్యాధికారికి ఇవేం లేనట్లు తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. ఆపరేషన్ సిందూర్ వేళ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరంపై భారత్ దాడులు చేస్తుంటే దీటుగా స్పందించాల్సింది పోయి పారిపోయిన పాక్ బ్రిగేడ్ కమాండర్ పలాయనపర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత క్షిపణులు పాక్ సైనికుల వెన్నులో వణుకు పుట్టించిందన్న వార్త వాస్తవమని తాజా ఘటనతో నిరూపితమైంది. నాయకుడై ముందుండి నడిపించాల్సిందిపోయి తన కింద పనిచేసే జవాన్లకు పిరికిమందు నూరిపోసిన బ్రిగేడ్ కమాండర్ వివరాలు అక్కడి ఒక జూనియర్ ఆఫీసర్ చేసిన ‘రేడియో సిగ్నళ్ల’డీకోడ్ ద్వారా వెల్లడయ్యాయి. అంతా సర్దుకున్నాక తాపీగా వస్తా జూనియర్ అధికారి ఇతర అధికారులకు ‘రేడియో సిగ్నళ్ల ద్వారా పంపిన సందేశాలను భారత సైన్యం విజయవంతంగా డీకోడ్ చేయగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ముజఫరాబాద్ వద్ద పాక్ ఆర్మీలోని 75వ ఇన్ఫ్యాంట్రీ బ్రిగేడ్ స్థావరం ఉంది. దానికి ఒక కమాండర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్పై భారత్ సైనిక చర్య మొదలెట్టింది. ఈ 75వ బ్రిగేడ్ స్థావరం మీదా భారత్ దాడులు జరిపింది. వెంటనే భయంతో వణికిపోయిన కమాండర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తాలేకుండా పోయిన కమాండర్ గురించి అక్కడి జూనియర్ అధికారి ఆరాతీశాడు. కమాండర్ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు తెల్సింది. వెంటనే ఆర్మీబేస్కు రావాలని జూనియర్ అధికారి కోరగా.. ‘‘నేనిప్పుడు రాను. భారత దాడి ఆగిపోయాక, పరిస్థితి అంతా సద్దుమణిగాక వస్తా. మీరు కూడా అక్కడ ఉండకండి. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోండి. ఉద్రిక్తతలు తగ్గాక ఆర్మీ బేస్ కార్యాలయాన్ని తాపీగా తెరుద్దాం’’అని కరాఖండిగా చెప్పేశాడు. ఇది విన్న జూనియర్ ఆఫీసర్ హుతాశుడై సంబంధిత సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేశాడు. ఇతర అధికారులతో చెబుతున్న రేడియో చాటింగ్ వివరాలను భారత సైన్యం డీకోడ్ చేసింది.
భర్తల ప్రాణాల కోసం వేడుకోకుండా... ఉగ్రవాదులపై తిరగబడాల్సింది
అధైర్యపడొద్దు..
అసూర్యంపశ్య
సగం విశ్వమానవాళికి సంక్షోభాల సెగ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అంబులెన్స్ డ్రైవర్ అమానుషం
‘స్టెమ్’లో జెమ్స్ లేరా?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
ఆన్లైన్ షాపింగ్ మరింత సులభంగా...
చిన్నారిని చిదిమేసినా.. చలించని మంత్రులు
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
గంట సేపు సముద్రం చీలుతుంది
భారత్కు అండగా ఉంటాం
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నీఫర్ల రొమాంటిక్ సాంగ్ విడుదల
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
హైదరాబాద్ మెట్రో రెండో దశ.. స్టేషన్లు ఇవే
ముగ్గెట్టా పోసేది..?!
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి
భర్తల ప్రాణాల కోసం వేడుకోకుండా... ఉగ్రవాదులపై తిరగబడాల్సింది
అధైర్యపడొద్దు..
అసూర్యంపశ్య
సగం విశ్వమానవాళికి సంక్షోభాల సెగ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అంబులెన్స్ డ్రైవర్ అమానుషం
‘స్టెమ్’లో జెమ్స్ లేరా?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
ఆన్లైన్ షాపింగ్ మరింత సులభంగా...
చిన్నారిని చిదిమేసినా.. చలించని మంత్రులు
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
గంట సేపు సముద్రం చీలుతుంది
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
భారత్కు అండగా ఉంటాం
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నీఫర్ల రొమాంటిక్ సాంగ్ విడుదల
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
హైదరాబాద్ మెట్రో రెండో దశ.. స్టేషన్లు ఇవే
ముగ్గెట్టా పోసేది..?!
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 24-05-2025
సినిమా

ఆలియా అరంగేట్రం అదిరిందయ్యా
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు హీరోయిన్ ఆలియా భట్. నిజానికి ఈ చిత్రోత్సవాల తొలి రోజు (మే 13)నే ఆలియా ఈ వేడుకలకు హాజరు కావాల్సింది. అయితే వెళ్లలేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా –పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలియా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కాలేదనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లోని ‘లవ్ అండ్ వార్’ (రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉండటం వల్లే ఆలియా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున వెళ్లలేదట.ఫైనల్గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో ఆమె రెడ్ కార్పెట్పై మెరిశారు. అయితే ఆలియా భట్ ధరించిన కాస్ట్యూమ్స్పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2017లో 70వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి మల్లికా షెరావత్ ధరించిన కాస్ట్యూమ్ డిజైన్నే ఆలియా అనుకరించారని కొందరు నెటిజన్లు, ఫ్యాషన్ లవర్స్పోలికలు పెట్టారు. అయితే ఆలియా ఎంట్రీ అదిరిందని, చాలా క్యూట్గా కనిపించారనే ప్రశంసలూ ఆమెకు దక్కాయి.ఇక కెల్లీ రిచర్డ్స్ డైరెక్షన్లోని ‘ది మాస్టర్ మైండ్’ సినిమాను ప్రదర్శించగా, ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఫ్రాన్స్లో పవర్ కట్స్ కారణంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజు వేడుకల నిర్వహణకు ఇబ్బందులు ఎదరయ్యాయని, అయినా నిర్వాహకులు అనుకున్నప్లాన్ పరంగానే ఉత్సవాలు పూర్తయ్యేలా సన్నాహాలు చేశారనే వార్తలు వస్తున్నాయి.

మా ముగ్గురిపాత్రలు ఫ్రెష్గా అనిపిస్తాయి: బెల్లంకొండ సాయి శ్రీనివాస్
‘‘నేను, మనోజ్, రోహిత్గార్లు సినిమాలకి కొంతకాలం బ్రేక్ ఇచ్చాం. తెలుగులో నా సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లవుతోంది. ‘భైరవం’ చిత్రంలో మాపాత్రలు చూస్తున్నప్పుడు అందరూ ఫ్రెష్గా ఫీల్ అవుతారు’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘భైరవం’. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ తమిళ హిట్ మూవీ ‘గరుడన్’ని తెలుగులో ‘భైరవం’గా రీమేక్ చేశాం. అయితే రీమేక్లా కాకుండా స్ట్రైట్ తెలుగు చిత్రంలా మన ప్రేక్షకులకు తగ్గట్టు మార్పులు చేసి, అద్భుతంగా తీర్చిదిద్దారు విజయ్. ఈ కథ,పాత్ర నచ్చడంతో రోహిత్గారు వెంటనే అంగీకరించారు. ‘మిరాయ్’ సినిమా పోస్టర్లో మనోజ్గారిని చూసి, ‘భైరవం’పాత్రకి సంప్రదించగా, కథ నచ్చడంతో ఒప్పుకున్నారు.⇒ నన్ను ఇష్టపడిన ప్రతి ప్రేక్షకుడి కోసం ‘భైరవం’ చేశాను. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. శ్రీ చరణ్పాకాల అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం ఇచ్చారు. హరి కె. వేదాంతంగారి విజువల్స్ కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ సినిమా కోసం అద్భుతమైన ఆలయ సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలిగారికి థ్యాంక్స్. ఈ సినిమా ట్రైలర్లో పూనకం షాట్ ఉంటుంది. అందరూ చూసే ఉంటారు. ‘భైరవం’లో నాకు బాగా నచ్చినపార్ట్ అది. ఆపార్ట్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.⇒ రాధామోహన్గారు నాకిష్టమైన నిర్మాత. ఆయనతో రెండు మూడు ప్రాజెక్టులు అనుకున్నా కుదరలేదు. ‘భైరవం’తో సెట్ అయింది. చాలా ఫ్యాషన్తో సినిమా నిర్మిస్తారాయన.⇒ పూరి జగన్నాథ్గారిని ఒకటి రెండు సార్లు కలిశాను. మా కాంబోలో కచ్చితంగా సినిమా ప్లాన్ చేస్తాం. నా ప్రతి సినిమాలో కొత్తదనం ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. విడుదలవుతున్న ‘భైరవం’, ప్రస్తుతం చేస్తున్న ‘టైసన్ నాయుడు, హైందవ, కిష్కిందపురి’ చిత్రాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి.

'థగ్ లైఫ్' సాంగ్స్.. దుమ్మురేపిన టాప్ సింగర్స్
నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న 'థగ్ లైఫ్'.. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా తెలుగు వర్షన్ సాంగ్స్ అన్ని ఒకే వీడియోతో షేర్ చేశారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. కమల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా థగ్ లైఫ్ నిలుస్తుందని దర్శకుడు మణిరత్నం అన్నారు. ప్రస్తుతం విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే, టాప్ సింగర్ చిన్మయి ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్ను పాడారు. ట్రాక్ మూడో వరుసలో ఉన్న 'ముద్దు వాన' సాంగ్ను ఆమె పాడారు. సింగర్ మంగ్లీ కూడా ఈ చిత్రంలో సూపర్ హిట్ పాటను ఆలపించారు. థగ్ లైఫ్ పాటల ప్రారంభంలోనే 'జింగుచ్చా' అంటూ ఆమె దుమ్మురేపారు. ఈ సినిమా కోసం ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాస్ కుమారుడు విజయ్ ఒక పాట, ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ ఒక పాటతో మెప్పించారు.

'షష్టి పూర్తి' ట్రైలర్.. మంచి ప్రయత్నం
'షష్టి పూర్తి' సినిమా ట్రైలర్ తాజాగా వచ్చేసింది. మంచి కంటెంట్తోనే ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి 'షష్టి పూర్తి' మూవీలో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. మంచి లవ్ ట్రాక్తో పాటు కుటుంబ విలువలకు పెద్ద పీఠ వేసినట్లు ట్రైలర్లో చూస్తే అర్థం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటతో పాటు రూపేష్, ఆకాంక్షా సింగ్ యంగ్ జంటగా మెప్పించనున్నారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

నోరిస్కు పోల్ పొజిషన్
మొనాకో: ఫార్ములా వన్ సీజన్ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్ ట్రాక్ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ 1 నిమిషం 9.954 సెకన్లలో ల్యాప్ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లూయిస్ హామిల్టన్ టైమింగ్ను తాజాగా నోరిస్ అధిగమించాడు. ఈ సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రి తర్వాత నోరిస్కు ఇదే తొలి పోల్ పొజిషన్. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.గతేడాది ఈ రేసులో విజేతగా నిలిచిన స్థానిక డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిషం 10.063 సెకన్లు; ఫెరారీ) రెండో స్థానం దక్కించుకోగా... మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (1 నిమిషం 10.063 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 10.382 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్, రెడ్బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 10.669 సెకన్లు) ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతుండగా... ఎనిమిది రేసులు ముగిసేసరికి డ్రైవర్స్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పియాస్ట్రి 146 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లాండోనోరిస్ 133 పాయింట్లతో రెండో ప్లేస్లో కొనసాగుతుండగా... నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (124 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్ ఘన విజయం
నాటింగ్హామ్: టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో 22 ఏళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా... జింబాబ్వే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓవర్నైట్ స్కోరు 30/2తో శనివారం మూడో రోజు ఫాలోఆన్లో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే చివరకు 59 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (82 బంతుల్లో 88; 16 ఫోర్లు), సికందర్ రజా (68 బంతుల్లో 60; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో పోరాడారు. ఈ జంట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెరుగ్గా కనిపించిన జింబాబ్వే... ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకునేలా అనిపించినా... ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఈ ఇద్దరినీ పెవిలియన్కు పంపి జింబాబ్వే ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ జంట మూడో వికెట్కు 122 పరుగులు జోడించింది. బెన్ కరన్ (37), వెస్లీ మధెవెరె (31) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ ఇర్విన్ (2), బెనెట్ (1), తఫద్జా (4), బ్లెస్సింగ్ ముజర్బానీ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 6 వికెట్లతో సత్తా చాటాడు. అంతకు ముందు ఇంగ్లండ్ 565/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 265 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్లో పడింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు తీసిన బషీర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

శ్రీకాంత్ ఎట్టకేలకు ఫైనల్కు...
కౌలాలంపూర్: భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నాలుగేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21–18, 24–22తో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)పై తుదికంటా పోరాడి గెలిచాడు. ప్రతీ గేమ్లోనూ జపనీస్ ప్రత్యర్థి నుంచి కఠినమైన సవాళ్లు ఎదురైనా... ఏ దశలోనూ పట్టుసడలించని భారత స్టార్ వరుస గేముల్లోనే మ్యాచ్ను ముగించాడు. ‘చాలా అనందంగా ఉంది. గతేడాది ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. ఈ ఫలితం కోసం ఎంతగానో శ్రమించాను’ అని శ్రీకాంత్ అన్నాడు. 32 ఏళ్ల ఈ షట్లర్ చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరి రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీల విషయానికొస్తే అతను ఆరేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించినట్లయింది. 2019లో జరిగిన ఇండియా ఓపెన్లో ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ రన్నరప్గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ చైనాకు చెందిన రెండో సీడ్ లీ షి ఫెంగ్తో తలపడతాడు.

‘శుబ్’ సమయం మొదలు
భారత టెస్టు క్రికెట్కు కొత్త నాయకుడు వచ్చాడు...నాలుగున్నరేళ్ల కెరీర్ అనుభవం ఉన్న శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు... 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో 37వ సారథిగా గిల్ బాధ్యతలు చేపడుతున్నాడు...గత కొంత కాలంగా చర్చ సాగినట్లుగా ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండా సెలక్టర్లు 25 ఏళ్ల గిల్కే మద్దతు పలికారు... ఇంగ్లండ్ పర్యటనలో అతను తొలిసారి టెస్టు జట్టును నడిపించనున్నాడు. టెస్టు జట్టులో సాయిసుదర్శన్, అర్ష్ దీప్ లకు తొలి అవకాశం లభించగా...ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమ్లోకి రావడం విశేషం. ముంబై: ఇంగ్లండ్తో గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందానికి శుబ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆసీస్తో సిరీస్లో బుమ్రా కెప్టెన్గా వ్యవహరించినా...అతని ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ కోసం బుమ్రా పేరును పరిశీలించలేదు. కోహ్లి, రోహిత్, అశ్విన్ల శకం ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం టీమ్ను సిద్ధం చేసే కోణంలో జట్టు ఎంపిక జరిగింది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్ పాల్గొనే తొలి సిరీస్ ఇదే కానుంది. భారత జట్టు చివరిసారిగా ఆ్రస్టేలియాలో ఆడిన టెస్టు సిరీస్తో పోలిస్తే జట్టులో ఐదు మార్పులు జరిగాయి. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ కాగా...రెండు టెస్టులు ఆడిన పేసర్ హర్షిత్ రాణా, ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానం కోల్పోయారు. వీరి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయిసుదర్శన్, అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత... 33 ఏళ్ల కరుణ్ నాయర్ తన కెరీర్లో 6 టెస్టులు ఆడాడు. తన మూడో టెస్టులో ఇంగ్లండ్పై 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను...సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మరో 3 టెస్టులు మాత్రమే ఆడి జట్టులో 2017లో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్లలో 863 పరుగులు సాధించి రేసులోకి వచ్చాడు. కోహ్లి రిటైర్మెంట్తో మిడిలార్డర్లో ఖాళీ ఏర్పడి మరో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్లో, భారత్ ‘ఎ’ తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేసి అభిమన్యు ఈశ్వరన్కు మరోసారి పిలుపు లభించింది. ఇక ఇప్పటికీ వన్డేలు, టి20లు ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్, సాయి సుదర్శన్కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. షమీ అవుట్... సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించినట్లుగానే చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టి20లు ఆడినా...టెస్టు మ్యాచ్లకు తగిన స్థాయిలో అతని ఫిట్నెస్ లేదని సెలక్టర్లు తేల్చారు. కివీస్తో సిరీస్లో చివరి రెండు టెస్టుల్లో విఫలమై మళ్లీ మ్యాచ్ అవకాశం దక్కని సర్ఫరాజ్ ఖాన్ను కూడా పక్కన పెట్టారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేయలేదు. ‘కోహ్లి, రోహిత్, అశ్విన్లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టం. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా అన్నీ టెస్టులూ ఆడతాడనే నమ్మకం లేదు. అందుకే కెప్టెన్సీ భారం లేకుండా అతను బౌలర్గా మాకు అందుబాటులో ఉంటే చాలు. ఈ విషయాన్ని బుమ్రా కూడా అర్థం చేసుకున్నాడు. గిల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని గమనించాం. చాలా మంది అభిప్రాయాలు కూడా విన్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కెప్టెన్, జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుత స్థితిలో సర్ఫరాజ్తో పోలిస్తే అనుభవజ్ఞుడైన కరుణ్ సరైనవాడు అనిపించింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు. భారత జట్టు వివరాలు గిల్ (కెప్టెన్ ), పంత్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, జురేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిధ్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సుందర్, శార్దుల్, అర్ష్ దీప్ భారత జట్టు విజేతగా నిలిచిన 2020–21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శుబ్మన్ గిల్ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. 91 పరుగులతో చారిత్రాత్మక గాబా టెస్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్టు టీమ్లో గిల్ రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భారత జట్టు ఆడిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్లలో గిల్ ఆడాడు. 32 టెస్టుల కెరీర్లో గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.స్వదేశంలో ప్రదర్శనతో పోలిస్తే విదేశీ గడ్డపై అతని రికార్డు పేలవంగా ఉన్నా...మంచి ప్రతిభావంతుడైన బ్యాటర్గా మున్ముందు సత్తా చాటగలడని సెలక్టర్లు నమ్ముతున్నారు. భారత అండర్–19 జట్టు తరఫున ఆడినా అతను కెపె్టన్గా ఎప్పుడు వ్యవహరించలేదు. రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్కు ఒకే ఒక మ్యాచ్లో సారథ్యం వహించాడు. అయితే భారత్కు 5 టి20 మ్యాచ్లలో కెప్టెన్ గా పని చేసిన అనుభవం గిల్కు ఉంది. రెండు సీజన్లుగా ఐపీఎల్లో గుజరాత్ జట్టును నడిపిస్తున్నాడు.
బిజినెస్

కారు కొనడానికి హెలికాఫ్టర్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియో
గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో ధనవంతులైన వ్యాపారవేత్తల సంఖ్య పెరిగింది. వారిలో చాలామంది భారతదేశంలో స్థిరపడ్డారు, మరికొందరు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లారు. వ్యాపారవేత్తల జీవన విధానం చాలా విలాసవంతంగా ఉంటుంది. కాబట్టి వీరు రోజువారీ వినియోగానికి సైతం ఖరీదైన కార్లు ఉపయోగిస్తుంటారు. ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ కారు కొనుగోలు చేయడానికి ఏకంగా హెలికాఫ్టర్లో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.కేరళలోని మలప్పురంలో ఉన్న ఫ్రాగ్రెన్స్ వరల్డ్ కంపెనీ ఓనర్.. 'మూసా హాజీ' హెలికాప్టర్లో వచ్చి.. బెంట్లీ బెంటాయెగా డెలివరీ తీసుకున్నారు. కారును మూసా హాజీ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. కాన్వాయ్లో రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లు కదిలాయి.ఇక్కడ కనిపించే బెంట్లీ కారు ఈడబ్ల్యుబీ వెర్షన్ అని తెలుస్తోంది. రోజ్ గోల్డ్ షేడ్లో పూర్తయిన ఈ కారు ధర రూ.6 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..బెంట్లీ బెంటయెగా ఈడబ్ల్యుబీ వెర్షన్ వీ8 పెట్రోల్ ఇంజిన్తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్.. గరిష్టంగా 550 పీఎస్ పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు అంబానీ ఫ్యామిలీ దగ్గర కూడా ఉంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india)

శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతదేశం స్టార్లింక్ సేవలను ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇతర సంస్థలు కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్టార్ట్ చేయడానికి సన్నద్ధమవుతాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలు ప్రారంభంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి నెలకు 10 డాలర్లు లేదా రూ.840 కంటే తక్కువ ధరలోనే అపరిమిత డేటా అందించాలని యోచిస్తున్నాయి.తొలి దశలో కంపెనీలన్నీ యూజర్లను పెంచుకోవడంపై ద్రుష్టి సారించనున్నాయి. సుమారు 10 మిలియన్స్ కస్టమర్లను చేరుకోవడం ద్వారా స్పెక్ట్రమ్ కాస్ట్ను భర్తీ చేసుకోవడం సాధ్యమవుతుందని సంస్థలు భావిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పట్టణ ప్రాంతాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు నెలకు రూ. 500 ఛార్జ్ చేయాలని ప్రతిపాదించింది. ఈ ధర సాధారణ సర్వీసులతో పోలిస్తే చాలా ఎక్కువ.ట్రాయ్ సిఫార్సులలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంలో 4 శాతం లెవీ, MHz స్పెక్ట్రానికి సంవత్సరానికి రూ.3500 ఫీజు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా శాటిలైట్ ఉపగ్రహ కమ్యూనికేషన్ ప్రొవైడర్లు వాణిజ్య సేవలను అందించడానికి 8 శాతం లైసెన్స్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలను అమలు చేయడానికి ముందు.. ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.లైసెన్స్ ఫీజులు.. స్పెక్ట్రమ్ ఛార్జీలు ఉన్నప్పటికీ యూజర్లను పెంచుకునేందుకు తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా దేశంలో స్టార్లింక్ సేవలను ప్రారంభించడానికి టెలికాం విభాగం నుంచి అనుమతులు లభించాయి. అయితే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఆమోదం లభించాల్సి ఉంది.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకిస్టార్లింక్ మాత్రమే కాకుండా.. యూటెల్సాట్ వన్వెబ్ (Eutelsat OneWeb), జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ (Jio Satellite Communications) కూడా వరుసగా 2021, 2022లో టెలికాం విభాగం నుంచి అనుమతులు పొందాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ఈ ఆమోదం లభించిన తరువాత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి.

ఇకపై ఆలా కుదరదు: శాంసంగ్కు ట్రంప్ వార్నింగ్
అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రూల్ శాంసంగ్ సహా ఇతర అన్ని స్మార్ట్ఫోన్ సంస్థలకు వర్తిస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.అమెరికా విధించే సుంకాల ప్రభావం ఉండకూడదు అనుకుంటే.. స్మార్ట్ఫోన్ తయారీదారులు ఇక్కడే (అమెరికాలో) ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా భారతదేశంలో లేదా ఇతర ఏ దేశంలోనో తయారు చేసిన ఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటే.. 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.సౌత్ కొరియా దిగ్గజమైన 'శాంసంగ్' అమెరికా మార్కెట్లో అత్యధిక అమ్మకాలు చేపడుతున్న రెండో మొబైల్ కంపెనీగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ సంస్థ ప్రతి సంవత్సరం 220 మిలియన్ ఫోన్స్ విక్రయిస్తోంది. ఇందులో సుమారు 60 శాతం ఫోన్స్.. వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచే ప్రపంచంలోనే చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇకపై ఈ విధానంతో అమెరికాకు శాంసంగ్ ఫోన్స్ తీసుకుని వస్తే.. సుంకాలు చెల్లించక తప్పదు.

ఎల్ఐసీ గిన్నిస్ రికార్డ్: 24 గంటల్లో..
ప్రభుత్వరంగ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC).. కేవలం 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ను సొంతం చేసుకుంది. జనవరి 20న భారతదేశం అంతటా 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను విజయవంతంగా పూర్తి చేశారు. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే మొదటిసారి.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు అమ్ముడయ్యాయని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ అనేది.. మా ఏజెంట్ల అవిశ్రాంత అంకితభావం, నైపుణ్యం, అవిశ్రాంత పనికి నిదర్శనం. కస్టమర్లు, వారి కుటుంబాలకు కీలకమైన ఆర్థిక రక్షణను అందించాలనే మా లక్ష్యం పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఎల్ఐసీ పేర్కొంది. జనవరి 20న 'మ్యాడ్ మిలియన్ డే' నాడు ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ఎల్ఐసీ ఎండీ & సీఈఓ సిద్ధార్థ మొహంతి చేపట్టిన చొరవకు నిదర్శనమే ఈ రికార్డు అని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా సీఈఓ సిద్ధార్థ మొహంతి మాట్లాడుతూ.. 'మ్యాడ్ మిలియన్ డే'ని చారిత్రాత్మకంగా మార్చినందుకు కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.Life Insurance Corporation of India Achieves GUINNESS WORLD RECORDS™️. Most Life Insurance Policies Sold In 24 Hours.#LIC #LICInsurancePolicy #GuinnessWorldRecord pic.twitter.com/WRTwZ7UtLt— LIC India Forever (@LICIndiaForever) May 24, 2025
ఫ్యామిలీ

ట్రంప్ గారి మనవరాలు... మస్తు హుషార్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. తన గోల్ఫ్ ఆటకు సంబంధించిన ఫోటోలు, వైట్హౌజ్లో తాతతో గడిపిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. ‘17... నువ్వు నాకు జీవితం గురించి ఎంతో చె΄్పావు. 18... నువ్వు కూడా అలాగే చేస్తావని ఆశిస్తున్నాను’ అని తన పోస్ట్లో రాసింది కై ట్రంప్.‘లాస్ట్ డే బీయింగ్ 17’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియోలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది కై. తాత కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ఉపన్యాసాలు ఇచ్చింది. రాజకీయ ఉపన్యాసాల సంగతి ఎలా ఉన్నా గోల్ఫ్ ఆటలో చక్కని ప్రతిభ చూపుతోంది. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే ‘సోషల్ మీడియా సెన్సేషన్’ అయింది.

దీప మనోబలం
‘మాది ఘిసడి సంచార తెగ’ అని చెప్పుకోవడానికి కొద్దిమంది సంశయిస్తారు. దీనికి కారణం బ్రిటిష్ కాలంలో ఆ తెగకు ‘క్రిమినల్ ట్రైబ్’గా ముద్ర వేయడం. కానీ దీపా పవార్... ‘నేను ఘిసడి తెగకు చెందిన మహిళను’ అని సగర్వంగా చెప్పుకోవడమే కాదు తన జాతిజనుల కోసం సామాజిక కార్యకర్తగా ఎంతో శ్రమిస్తోంది. తాజాగా... అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, పరిష్కార మార్గాలపై ‘మన్ బోలి’ అనే పుస్తకం రాసింది దీపా పవార్...ఒక వర్క్షాప్లో...‘బాధగా ఉందని తెలియకుండానే రోజూ మనం మోసే బరువు పేరు ఏమిటి?’ అని అడిగింది ఒక గిరిజన యువతి.ఆ ప్రశ్నే దీపా పవర్ను ‘మన్ బోలి’ పుస్తకం రాసేలా చేసింది.ఆ బరువు పేరు... మానసిక సమస్య. పేరు పెట్టని ఆ బరువు వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. వ్యవస్థ తాలూకు నిశ్శబ్దం. నిర్లక్ష్యం. ‘మెంటల్ హెల్త్ అనేది కులం, పేదరికం, భాష, అధికారంతో ముడిపడి ఉంది. మన దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ అనేది చాలా వరకు పట్టణప్రాంతాలు, ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కేర్ గ్రామర్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాం’ అంటుంది దీప. తమ తెగలోని సామెతల నుంచి కథల వరకు రకరకాల అంశాలను ఉపయోగించి మానసిక ఆరోగ్యానికి, అట్టడుగు ప్రజల మధ్య ఉన్న అంతరాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేసింది దీప. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహన ఉన్న దీపా పవార్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్తో కలిసి పనిచేసింది. ఆ అనుభవం పుస్తకానికి బలం అయింది. ఘిసడి సంచార తెగకు చెందిన దీపా పవార్ పద్నాలుగు సంవత్సరాల వయసులో సామాజిక కార్యకర్తగా మారింది. సోషల్ వర్క్లో మాస్టర్స్ చేసింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ నుంచి శానిటేషన్ వరకు జెండర్ నుంచి హెల్త్ వరకు ఎన్నో అంశాలపై పనిచేసింది. ‘ఘిసడి సంచార తెగకు చెందిన మహిళను’ అని గర్వంగా చెప్పుకునే దీప ఆ తెగలోని మూఢనమ్మకాలపై కూడా పోరాడింది. ‘ఆడపిల్లలకు చదువు అవసరం’ లేదు’ అనుకునే వారి దృష్టిని మార్చడానికి కృషి చేసింది. ‘అనుభూతి’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తన సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేసింది. మహారాష్ట్రలోని ఎన్నో జిల్లాలలో మెంటల్ హెల్త్, కమ్యూనిటీ డెవలప్మెంట్పై పనిచేస్తోంది. రాజ్యాంగం, మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

టెక్నో బ్రదర్స్ ‘169పై. ఏఐ’ స్టార్టప్! తొలి యూజర్..
ఈ అన్నదమ్ములు... సినిమాల గురించి మాట్లాడుకున్నంత ఇష్టంగా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటారు. అవి కాలక్షేప కబుర్లు కావు. ఈ కాలానికి అవసరమైన కబుర్లు. ‘ఏఐ టెక్నాలజీలో మనం ఎక్కడ ఉన్నాం? మనం చేయాల్సింది ఏమిటి?’ అనేది వారి మాటల సారాంశం. కేవలం మాటలకే పరిమితం కాకుండా ‘169పై. ఏఐ’ స్టార్టప్తో ఏఐ స్టార్స్గా పేరు తెచ్చుకున్నారు రజత్, చిరాగ్... మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన రజత్ ఆర్య, అతని తమ్ముడు చిరాగ్ ఆర్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఆ రంగంలో వస్తున్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఆ ఆసక్తే వారిని ఏఐ స్టార్టప్ కంపెనీ ‘169పై. ఏఐ’ స్థాపించేలా చేసింది. అమెరికాలో కస్టమర్ల కోసం కొన్ని బ్లాక్చైన్ సొల్యూషన్స్ను డెవలప్ చేసి, చిన్నపాటి సాఫ్ట్వేర్ బిజినెస్ నిర్మించడంలో ఈ సోదరులకు కొంత అనుభవం ఉంది. రెండు సంవత్సరాల క్రితం ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ సీయివో సామ్ ఆల్ట్మాన్ మన దేశానికి వచ్చినప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేయడం గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ‘మనం కొత్తగా ఏంచేయవచ్చు’ అని ఆలోచించారు ఆర్య బ్రదర్స్. ఇంటర్నెట్లో వెస్ట్–ఒరియెంటెడ్ సమాచారానికి బదులుగా మరింత దేశీయంగా ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉందని గ్రహించారు. అలా....‘169పై. ఏఐ’ స్టార్టప్ మొదలైంది. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.ఈ స్టారప్కు తొలి యూజర్....ఇస్రో!‘169పై. ఏఐ’ క్రియేట్ చేసిన పీడీఎఫ్ ఏజెంట్ను ‘ఇస్రో’ పరీక్షించి పచ్చ జెండా ఊపింది. టన్నుల కొద్దీ డేటా ఉన్న ‘ఇస్రో’కి ఉపయోగపడేలా పీడీఎఫ్ ఏజెంట్ను క్రియేట్ చేశారు. తాము సృష్టించిన ప్రోగ్రామ్ టేబుల్స్, డాక్యుమెంట్లు, చార్ట్లు జనరేట్ చేయడానికి ఇది యూజర్లకు ఉపయోగపడుతుంది. పదకొండు మందితో కూడిన ‘169పై. ఏఐ’ బృందం ఎడ్యుకేషనల్ సోల్యూషన్లను డెవలప్ చేస్తోంది. బిహార్లోని ప్రభుత్వ బడుల కోసం ఎడ్యుకేషనల్ మెటీరియల్ను క్రియేట్ చేయడానికి ఎన్సీఈఆర్టీ టెక్ట్స్బుక్స్ డేటాను ఉపయోగిస్తున్నారు. ‘ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఖరీదు అనే భావన ఉంది. ఈ సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలి. రైతు నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఏఐ వారి పనిని సులభతరం చేస్తుంది. మా ఏఐ మోడల్ విదేశీ ఏఐ మోడల్స్లాగా డబ్బు తీసుకునేది కాదు. ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇక స్టార్టప్ పేరు విషయానికి వస్తే 13 సంఖ్య స్క్వేర్, పై కన్స్టంట్ నుంచి స్ఫూర్తి పొందాం’ అంటున్నాడు కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ చిరాగ్ ఆర్య. పాతదారిలో నడవడం విశేషమేమీ కాదు. అయితే పాత దారిలో నడుస్తూనే కొత్త దారి గురించి ఆలోచించడం, అన్వేషించడమే విశేషం. అప్పుడే ‘169పై. ఏఐ’ రూపంలో కొత్త ఆవిష్కరణలు ప్రజలకు పరిచయం అవుతాయి.మన దేశానికి తనదైన ఏఐ మోడల్ లేకపోవడం నన్ను ఎప్పుడూ నిరాశకు గురి చేసేది. మనం విదేశీ ఏఐ మోడల్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఏఐ సాంకేతికతకు సంబంధించి విదేశాలపై ఎక్కువగా ఆధారపడకూడదు అనే ఆలోచన నుంచే స్టార్టప్ ఆలోచన వచ్చింది. మన ఫోన్లో ఉన్న అత్యధిక యాప్స్ విదేశాల నుంచి వచ్చినవే. మనకంటూ స్వంతమైన ΄్లాట్ఫామ్ లేదు. భవిష్యత్తులో మనం ఏ దేశం మీద ఆధారపడకుండా ఉండడానికి మా స్టార్టప్ ఒక ప్రయత్నం.– రజత్ ఆర్య, 169పై. ఏఐ ఫౌండర్, సీయివో(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..)

ప్రకృతి దాచిన అందమైన క్రికెట్ స్టేడియం
కొన్నింటిని ప్రకృతి సహజసిద్ధంగా చక్కటి ఆకృతిని ఏర్పరస్తుంది. చూస్తే.. కళ్లుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. అలాంటి సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా దీన్ని నెటిజన్లు ప్రకృతి దాచిన క్రికెట్ మైదానంగా అభివర్ణిస్తున్నారు. అదెక్కడ ఉందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వరందరప్పల్లిలో ఉంది. దీన్ని పాలప్పిల్లి క్రికెట్ మైదానం అంటారు. సాధారణంగా స్టేడియంలు పచ్చిక బయళ్లకు దూరంగా ఉంటాయి. కానీ ఇది ప్రకృతితో అల్లుకుపోయినట్లుగా రహస్యంగా ఉంది. ప్రకృతి అందాలకు నెలవైనా కేరళను తరుచుగా 'దేవుని స్వంత దేశం'గా వర్ణిస్తారు కవులు. అందుకు తగ్గట్టు పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రికెట్ మైదానం ఆ వర్ణనకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఈ మైదానం దశాబ్దాల కాలం నాటిదట. దీనిని మొదట హారిసన్ మలయాళం కంపెనీ తన తోటల కార్మికులకు వినోద స్థలాన్ని అందించడానికి సృష్టించింది. అప్పటి నుంచి ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్థానికులకు ఆటవిడుపు స్థలంగా మారింది. అయితే దట్టమైన చెట్లతో కప్పబడి మారుమూల ప్రాంతంలో ఉండటంతోనే బయటి ప్రపంచానికి అంతగా తెలియదని అంటున్నారు స్థానికులు. అయితే అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీజిత్ ఎస్ "ఇది అమెజాన్ రెయిన్ఫారెస్ట్ కాదు" అనే క్యాప్షన్తో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Sreejith S (@notonthemap) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్
న్యూఢిల్లీ: గడచిన నాలుగు దశాబ్ధాలలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులకు 20 వేల మందికిపైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి(United Nations)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన దరిమిలా పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఐక్యరాజ్య సమితిలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూయార్క్లోగల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నదని, అది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించే వరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో ఈ ఒప్పంద అంశాన్ని లేవనెత్తిన తర్వాత భారత్ ఘాటుగా స్పందించింది. #IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 202565 ఏళ్ల క్రితం భారత్ సింధు జలాల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని, అయితే పాకిస్తాన్ భారత్పై మూడు యుద్ధాలు జరిపి, లెక్కకుమించిన ఉగ్రవాద దాడులను చేయడం ద్వారా ఆ ఒప్పందపు స్ఫూర్తిని ఉల్లంఘించిందని హరీష్ పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలలో 20 వేల మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ పాకిస్తాన్ విషయంలో అసాధారణ సహనం, ఉదారతను ప్రదర్శించిందని హరీష్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం

Brothers Day: నాన్న తరువాత..
ప్రేమికుల దినోత్సవం, స్నేహితులు దినోత్సవం మాదిరిగానే అన్నదమ్ముల దినోత్సవం(Brother's Day) ఉందనే సంగతి మీకు తెలుసా? అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ములే ఇంటిని చక్కదిద్దేవారుగా నిలుస్తుంటారు. వీరి అనుబంధం చక్కగా ఉన్నప్పుడే వారి కుటుంబానికి సమాజంలో మంచిపేరు వస్తుంది. ఈ రోజు మే 24.. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజుకున్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.భారతదేశంలో అనుబంధాలకు ఎంతో ప్రాముఖ్యత కనిపిస్తుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అన్న, తమ్ముడు ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తుంటారు. అన్నదమ్ముల దినోత్సవాన్ని తొలుత తొలుత అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, సి డేనియల్ రోడ్స్ జరుపుకున్నారని చెబుతారు. 2005 నుంచి ప్రతి సంవత్సరం మే 24న ఈ బ్రదర్స్ డేని చేసుకుంటున్నారు. మొదట్లో దీనిని అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. తర్వాత ప్రపంచమంతటా జరుపుకోవడం ప్రారంభించారు. కొన్ని దేశాలలో అయితే ఈ రోజున అధికారిక సెలవుదినం(Holiday)గానూ ప్రకటించారు.అన్న అంటే ఓ బాధ్యత. నాన్న తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది ఆయనే. అదే విధంగా తమ్ముడు కూడా బాధ్యతగానే మెలుగుతాడు. ఇక అమ్మాయిలైతే తమ బ్రదర్స్ను తమకు సెక్యూరిటీ కల్పించేవారిగా భావిస్తుంటారు. రక్త సంబంధం లేకపోయినా ఆత్మీయంగా ఇతరులను సోదర భావంతో చూసుకునే ప్రత్యేకమైన రోజు ఇది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తమ ప్రియమైన సోదరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈరోజున తమ అన్నదమ్ములకు నచ్చిన వంటకాలను చేయడంతో పాటు వారికి నచ్చిన వస్తువులను కానుకలుగా అందజేస్తుంటారు. కొన్ని దేశాల్లో అన్నదమ్ముల దినోత్సవం నాడు సోదరులతో రోజంతా సరదాగా గడపడం, వారితో కలిసి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్లడంలాంటివి చేస్తుంటారు.ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం

ట్రంప్ సర్కార్కు బిగ్ షాక్..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక తగిలింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల చేరిక అంశంపై ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. దీంతో, ట్రంప్కు ఝలక్ ఇచ్చినట్టు అయ్యింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని టార్గెట్ చేశారు. వర్సిటీకి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేసిన ట్రంప్ సర్కార్.. తాజాగా ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని గురువారం రద్దు చేసింది. దీంతో, ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టులో యూనివర్సిటీ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్ బరోస్.. ట్రంప్ సర్కార్పై మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు.తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ఎస్ఈవీపీ వ్యవస్థ నుంచి విశ్వవిద్యాలయాన్ని తొలగించడం అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవతుందని హార్వర్డ్ తన తాజా పిటిషన్లో పేర్కొంది.BREAKING: A federal judge has BLOCKED the Trump Administration’s illegal move to bar Harvard University from enrolling international students.— Trump Lie Tracker (Commentary) (@MAGALieTracker) May 23, 2025‘ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో పావువంతు వారిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని’ హార్వర్డ్ పేర్కొంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. ఈ మొత్తం సంఖ్య యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 27 శాతానికి సమానం. తమకు వెంటనే ప్రభుత్వ చర్యల నుంచి ఉపశమనం కలిగించాలని హార్వర్డ్ తాజా పిటిషన్లో కోరింది. వర్సిటీ మారాల్సిందే ట్రంప్ సర్కారు నిర్ణయం హార్వర్డ్లో చదువుతున్న 10,158 మంది విదేశీ విద్యార్థులు, స్కాలర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. వీరిలో 788 మంది భారతీయులున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులేమీ ఉండవు. కోర్సుల మధ్యలో ఉన్నవారు మాత్రం ఇతర వర్సిటీల్లోకి మారాల్సిందే. లేదంటే అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన హోదా కోల్పోయి దేశ బహిష్కరణకు గురవుతారని నోయెమ్ స్పష్టం చేశారు.విమర్శల వెల్లువ హార్వర్డ్పై తాజా ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘం (ఎస్ఏఏ)తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు గమ్యంగా కొనసాగాలన్న ఆకాంక్ష అమెరికాకు బహుశా లేనట్టుగా ఉందని చైనా దుయ్యబట్టింది. హార్వర్డ్లో 1,203 మంది చైనా విద్యార్థులున్నారు. భారత విద్యార్థులపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టు మన దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రభావిత విద్యార్థులను చేర్చుకునేందుకు హాంకాంగ్లోని అత్యున్నత వర్సిటీలు ముందుకొచ్చాయి. వారికి అన్నివిధాలా సాయమందిస్తామని ఎస్ఏఏ ప్రకటించింది.

Hamburg: రైల్వేస్టేషన్లో కత్తితో దాడి.. 12 మందికి గాయాలు
హాంబర్గ్: జర్మనీలోని హాంబర్గ్(Hamburg)లో ఘోరం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ఒక దుండగుడు కత్తితో జరిపిన దాడిలో 12 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం హాంబర్గ్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కనీసం 12 మంది వరకూ గాయపడ్డారని జర్మనీకి చెందిన బిల్డ్ వార్తాపత్రిక పేర్కొంది. ఈ ఘటనలో అనుమానిత దుండగుడిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. #hh2305 #Hamburg Nach ersten Erkenntnissen soll eine Person im #Hauptbahnhof mehrere Menschen mit einem Messer verletzt haben. Die tatverdächtige Person wurde von den Einsatzkräften festgenommen.— Polizei Hamburg (@PolizeiHamburg) May 23, 2025ఈ దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. దాడికి గల కారణం ఏమిటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదని బిల్డ్ తెలిపింది. రైల్వే స్టేషన్(Railway station)లోకి అకస్మాత్తుగా చొరబడిన ఒక వ్యక్తి పలువురిని గాయపరిచినట్లు బిల్డ్ పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు హాంబర్గ్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు.ఇది కూడా చదవండి: కొంకణ్ రైల్వే విలీనం.. ఇప్పుడేం జరగనుంది?
జాతీయం

అర్ధరాత్రి నడిరోడ్డుపై డర్టీ పిక్చర్
అర్ధరాత్రి.. అదీ బిజీ రహదారిపై సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరించాడో ఒక్కడో రాజకీయ నేత. ఓ మహిళతో అభ్యంతకర రీతిలో కనిపించి చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం అతగాడి డర్టీ పిక్చర్(Dirty Picture) వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భోపాల్: మధ్యప్రదేశ్ మంద్సౌర్ జిల్లా బని గ్రామానికి బీజేపీ నేత మనోహర్లాల్ ధాకడ్(Manoharlal Dhakad) తీరుపై ఇటు రాజకీయ వర్గాలు, అటు సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఆదమరిచి ఓ మహిళతో శృంగారం చేశాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో అందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా, ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. అందులోని దృశ్యాల ప్రకారం.. తొలుత ఓ వైట్ కలర్ కార్ ఎక్స్ప్రెస్వే పక్కన వచ్చి ఆగింది. అందులోంచి నగ్నంగా ఉన్న ఓ మహిళ కిందకు దిగింది. ఆపై కిందకు దిగిన మనోహర్లాల్ ఆమెతో అభ్యంతరకర భంగిమలో రెచ్చిపోయాడు. మే 13వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో మనోహర్పై విమర్శలు వెల్లువెత్తాయి. మనోహర్ బీజేపీ లోకల్ లీడర్ కాగా, ఆయన భార్య మంద్సౌర్ జిల్లా పంచాయితీ సభ్యురాలు.ఈ గలీజు వీడియోపై ఆయన స్పందన కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై జిల్లా బీజేపీ చీఫ్ రాజేష్ దీక్షిత్ స్పందించారు. మనోహర్లాల్కు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదని, ఆయన కేవలం ఆన్లైన్ సభ్యుడు మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయి బీజేపీ నేత ఒకరు స్పందించారు. ఇలాంటి వాళ్లకు పార్టీలో ఎట్టిపరిస్థితుల్లో చోటు ఉండబోదని స్పష్టం చేశారు.

రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్ను హ్యాక్ చేసి ఆమె డీప్ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!.

Covid-19: శరవేగంగా కోవిడ్ వ్యాప్తి.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఈసారి కొత్త ఉపరకాల(Variants) రూపంలో కలకలం సృష్టిస్తోంది. దాదాపు.. ఏడాదిన్నర తర్వాత పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణేతర ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది.జేఎన్.1 వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన మరో కొత్త వేరియెంట్లు ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8.1 భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కొత్త కేసులు వెలుగు చూశాయి. ఏడాదిన్నర తర్వాత ఒడిషాలో కొత్త కేసు నమోదుకాగా, రాజధాని రీజియన్లో మూడేళ్ల తర్వాత కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. కేరళలో గరిష్టంగా 273 కోవిడ్ కేసులు, కర్ణాటకలో 35, మహారాష్ట్ర ముంబైలో 95.. థానేలో 10, ఢిల్లీలో 23 కేసులు రికార్డయ్యాయి. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో వైరస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో బాధితులు చేరుతున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. అదే సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాల కోసం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జేఎన్.1 వేరియంట్ను దాని వేగవంతమైన వ్యాప్తి కారణంగా ‘వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‘గా వర్గీకరించింది. కానీ, ప్రస్తుతానికి ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్‘గా ప్రకటించలేదు.మరోవైపు.. శరవేగంగా కొత్త వేరియెంట్లు వ్యాప్తిస్తున్నప్పటికీ.. లక్షణాలు మాత్రం స్వలంగానే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కొత్త ఉపరకాల లక్షణాలు సాధారణంగా గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉంటున్నాయి. గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు, అలసట, జ్వరం వంటివి ప్రధాన లక్షణాలుగా కన్పిస్తున్నాయి. అయితే, డెల్టా వంటి పాత వేరియంట్లలో కనిపించిన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడినవారిలో అంతగా కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో హైఅలర్ట్కోవిడ్(Covid-19) బారినవారు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని ఇండియా కరోనా ట్రాకర్ ఆధారంగా.. ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. హైదరాబాద్(తెలంగాణ)లో పేషెంట్ల కోసం ముందస్తుగా పరీక్ష చేసుకున్న ఓ వైద్యుడికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వైరస్ వ్యాప్తితో లక్షణాలు స్వలంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తగా పలు రాష్ట్రాలు కోవిడ్-19 మార్గదర్శకాలను జారీ చేశాయి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శుభ్రత.. వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరుతున్నాయి. ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్, మందులతో ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నాయి. అయితే అధిక ప్రమాదం ఉన్నవారు (వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు) బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గుజరాత్లో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్
కచ్: సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF)కు సంబంధించిన కీలక రహస్య సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని గుజరాత్లోని కచ్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్న సహ్దేవ్ సింగ్ గోహిల్ అనే వ్యక్తి,.. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకోగా.. ఆమె పాకిస్థాన్ ఏజెంట్ అని అతనికి ఆ తర్వాత తెలిసింది.కొత్తగా నిర్మిస్తున్న బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సైట్ల ఫోటోలు వీడియోలు ఆమె అడగటంతో వాట్సాప్ ద్వారా వాటిని పంపించాడని గుజరాత్ ఏటీఎస్ సీనియర్ అధికారి కే సిద్ధార్థ్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో గోహిల్ తన ఆధార్ వివరాల ద్వారా ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశాడని.. పాక్ మహిళా ఏజెంట్తో సంప్రదింపుల కోసం వాట్సాప్ను యాక్టివేట్ చేశాడు.ఆ తర్వాత పాకిస్థాన్ ఏజెంట్ ఉపయోగిస్తున్న ఆ నంబర్ నుంచి బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సదుపాయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. గూఢచార చర్యకు పాల్పడిన గోహిల్కు గుర్తు తెలియని వ్యక్తి రూ.40,000 చెల్లించినట్లు నిర్ధారించిట్లు ఏటీఎస్ అధికారి తెలిపారు.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా మరో నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఈ నెల 14 రాత్రి రాజస్థాన్లోని జైపూర్లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో రూ.6 కోట్ల సొత్తు దొంగతనానికీ ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు.. కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదను చూసుకుని అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. గత నెల్లో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి తమ పని కానిచ్చారు.వైశాలీ నగర్లోనూ .. జైపూర్లోని వైశాలీనగర్లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పం«థాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పని చేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదను కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్లో లేని విషయం గమనించి మరో ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తు మందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ ఇద్దరితో పాటు మరొకరినీ రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలతో సహా రూ.6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం భరత్ బిస్త్, హరి బహదూర్ దామిలను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల విచారణలో సరైన వివరాలు రాకపోవడంతో ఈ పంథాలో జరిగిన నేరాల వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కాచిగూడ చోరీ వారి దృష్టికి వెళ్లింది. ఇక్కడా, అక్కడా ఒకేలా నేరం జరగడంతో జైపూర్ చోరీ వెనుకా లోకేంద్ర బహదూర్ షాహి పాత్రను అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం వివరాలు కోరుతూ నగర పోలీసులను సంప్రదిస్తున్నారు.

లారీ–కారు ఢీ: ఆరుగురు దుర్మరణం
కొమరోలు/సాక్షి, అమరావతి/బాపట్ల టౌన్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు గ్రామం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మహానంది పుణ్యక్షేత్రం దర్శనం అనంతరం తిరుగుముఖంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలివీ.. బాపట్ల జిల్లా స్టూవర్టుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తమ కుటుంబ సమస్యలపై చర్చించుకునేందుకు నంద్యాల జిల్లా డోన్ వెళ్లారు. అక్కడ నుంచి మహానంది వెళ్లి దైవదర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై తాటిచెర్లమోటు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులను గజ్జెల అంకాలు (40), గజ్జెల భవాని (25), గజ్జెల నరసింహులు (20), గజ్జెల జనార్ధన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30)లుగా గుర్తించారు. గాయపడిన చిన్నారుల్లో జీతన్, శిరీష ఉన్నారు. వీరిలో జీతన్ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ దివాకర్ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. ప్రమాద స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలన్నింటిని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బాధాకరం: వైఎస్ జగన్ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

గ్యాంగ్రేప్ నిందితులకు బెయిల్.. కార్లు, బైకులతో విజయోత్సవ ర్యాలీ
సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్ రావడంతో బైక్, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల,గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్, మదర్ సాబ్, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్, తౌసీఫ్, రియాజ్, షోయిబ్లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. SHOCKING 🚨 7 Gang rape accused take out road show after securing BAIL in Karnataka's Haveri. Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/pNMF21YXJy— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. 2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్కు చెందిన ఓ హోటల్ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్ గదిలోకి చొరబడి ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్లు, కార్లు, డీజే మ్యూజిక్తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్కు చెందిన ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. అయితే జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్పై విడుదల చేశారు. కానీ, ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్లు,కార్లలో ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు.ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు.

Be alert! మెట్రో రైళ్లలో అమ్మాయిల్ని క్లిక్మనిపించి..
క్రైమ్: మనకు తెలియకుండానే మన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. వాళ్లలో కొందరు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తుండడంతో నిందితులను సైతం పట్టుకోగలుగుతున్నారు. ఆ మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలను అసభ్యకరరీతిలో ఫొటోలు తీసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నడిపి ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంగళూరు మెట్రో రైళ్లలో అమ్మాయిలను ఫొటోలు తీసి.. వాటిని ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో బుధవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ఆ పోకిరీపై నజర్ వేశారు. చివరకు.. అతన్ని పట్టుకున్నట్లు బెంగళూరు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. Bangalore Metro Clicks (@metro_chicks) పేరిట నడిపిన ఆ అకౌంట్లో వందల కొద్దీ అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి. ఆ అకౌంట్కు ఐదు వేళ మంది ఫాలోవర్స్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మొత్తం ఫొటోలను తొలగించి.. అకౌంట్ను సైతం తొలగించారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించాల్సి ఉంది. తస్మాత్ జాగ్రత్త.. మీ చుట్టుపక్కలా ఇలాంటి కామాంధులు ఉండొచ్చు! జర జాగ్రత్త!!.