Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Counter Chandrababu Year Governance With Debt Statistics1
బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది?

గుంటూరు, సాక్షి: చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని ఎక్స్‌ ఖాతాలో లెక్కలతో సహా సోమవారం ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ఏడాది పాలనలో ఏపీ ఆర్థిక స్థితి.. చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చటంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్‌, మోస్పి (CAG & MOSPI) గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ ఒక పోస్ట్‌ చేశారాయన. . @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025

YSRCP President YS Jagan Praises CHess Player Gukesh2
భారత చెస్‌ యువ కెరటం గుకేష్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు

తాడేపల్లి: నార్వే చెస్ ఛాంపియన్‌షిప్‌లో వరల్డ్‌ చాంపియన్‌, భారత చెస్‌ సంచలనం డి గుకేష్.. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్ల్‌సన్‌ను ఓడించడంపై గుకేష్‌కు అభినందనలు తెలిపారు వైఎస్‌ జగన్‌. కేవలం 62 మూవ్‌లతోనే కార్లసన్‌ను మట్టికరిపించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన వైఎస్‌ జగన్‌.. గుకేష్‌ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గుకేష్‌ గెలిచిన ఆనంద క్షణాల్ని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 👉ఇదీ చదవండి: ప్రపంచ నంబర్ వన్‌ను ఓడించిన గుకేష్ప్రపంచ చాంపియన్‌ కార్లసన్‌తో జరిగిన ఆరో రౌండ్‌ పోరులో భారత చెస్‌ యువ కెరటం అనూహ్య విజయాన్ని సాధించాడు. క్లాసికల్ గేమ్‌లో గుకేష్ కార్ల్‌సెన్‌ను ఓడించడం ఇదే మొదటిసారి. దీంతో గుకేష్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోతే, కార్ల్‌సన్‌కు మాత్రం అసహనం కట్టలు తెంచుకుంది. కార్ల్‌సెన్ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ బల్లపై బలంగా కొట్టాడు. It was enthralling to watch World Champion @DGukesh defeating the Norwegian chess grandmaster, Magnus Carlsen, in 62 moves in Round 6 of the 2025 Norway Chess. Hearty congratulations to this hero! May his prowess reign supreme and bring many more laurels to India.#NorwayChess… pic.twitter.com/TaBZkE97Ew— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025

BJP MLA Raja Singh Sensational Comments3
నోటీస్‌ కాదు.. నన్ను సస్పెండ్‌ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రధానంగా నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్‌ షాపుకు రాజాసింగ్‌ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్‌ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్‌ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ్‌.. ‘ మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్‌కు నోటీస్‌ ఇవ్వడానికి పార్టీ ప్లాన్‌ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్‌ కాదు.. ఏకంగా నన్ను సస్పెండ్‌ చేయండి’ అంటూ రాజాసింగ్‌ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్‌. ఒకవేళ నన్ను సస్పెండ్‌ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా’ అని రాజాసింగ్‌ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్‌ గుర్రుగా ఉన్నారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తన్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌.. రాజాసింగ్‌ వద్దకు వెళ్లి రాజీ చేసే యత్నం చేశారు. పార్టీ అభివృద్ధి కలిసి నడవాలని రాజాసింగ్‌కు సూచించారు. ఆ సమయంలో బండి సంజయ్‌తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా తాజా ఎపిసోడ్‌తో రాజాసింగ్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కిషన్‌రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?‘టైమ్ పాస్ మీటింగ్‌లతో అలసిపోయాం’

RBI may implement 50 basis point repo rate cut4
ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలో జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును మరోసారి తగ్గించేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి ఆర్‌బీఐ వ్యవస్థలో లిక్విడిటీని పెంచింది. ఈసారి జూన్ 6న జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు కట్‌ చేసే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదికలో తెలిపింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యూహాత్మక ప్రయత్నంగా ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంటుందని భావిస్తోంది.నివేదికలో ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం మిగులు లిక్విడిటీ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంస్థలు సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 30-70 బేసిస్ పాయింట్లు తగ్గాయి. దాంతో బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెరుగుతోంది. దీన్ని అప్పులు ఇచ్చేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఇకపై మినిమం బ్యాలెన్స్‌ లేకపోయినా ఓకేజూన్ పాలసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల రేట్‌ కోత ఉంటుందని భావిస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు 100 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్‌బీఐ నిబంధనలమేరకే ఉన్నాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాలు ఉంటాయని అంచనా వేయడంతో పంటల దిగుబడి, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలను ఉటంకిస్తూ ఎస్‌బీఐ 2026 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ అంచనాను 3.5 శాతానికి తగ్గించింది. ఆర్థిక పనితీరు పరంగా చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ 7.4%కు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8.4% నుంచి తగ్గింది.

Who Saved Accused AIADMK To DMK5
‘సర్’ ని ఎవరు కాపాడే యత్నం చేశారు?

చెన్నై: అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ యువతిపై గతేడాది జరిగిన అత్యాచార కేసులో ​39 ఏళ్ల జ్ఞానశేఖరన్‌ అనే వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ చెన్నై మహిళా కోర్టు ఈరోజు(సోమవారం, జూన్‌ 2) తీర్పునిచ్చింది. జ్ఞానశేఖరన్‌ను దోషిగా తేల్చిన మహిళా కోర్టు.. కనీసం 30 ఏళ్ల జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. 2024లో అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన అత్యాచార కేసుకు సంబంధించి గత కొన్నాళ్లుగా అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నా డీఎంకేల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ తీర్పులో ఇప్పటివరకూ నిందితుడిగా ఉన్న జ్ణానశేఖర్‌ను ఎట్టకేలకు దోషిగా తేల్చింది మహిళా కోర్టు. ఆధారాలు నిరూపణ కావడంతో జీవితఖైదు విధించింది. ఈ తీర్పు తర్వాత ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే.. డీఎంకే పార్టీని టార్గెట్‌ చేసింది. డీఎంకే మద్దతుదారుడైన జ్ఞానశేఖరన్‌ను కాపాడటానికి అధికార పార్టీ తన వంతు కృషి చేసిందంటూ సెటైర్లు వేసింది. ఎఫ్‌ఐఆర్‌లో ‘సర్‌’ అని పేర్కొనడాన్ని ఇక్కడ ఉదహరిస్తూ అన్నాడీఎంకే నేత పళనిస్వామి.. డీఎంకే ప్రెసిడెంట్‌, సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. ‘ ఇంతకాలం ‘సర్‌’ని ఎవరు కాపాడారు?, ఈ కేసులో జ్ఞానశేఖరన్‌ తప్ప ఎవరు నిందితులు కాదు. మరి ఇంతకాలం పాటు విచారణ జరపడానికి డీఎంకే ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసింది?, కాపాడే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలన్నీ బలంగా ఉండటంతో ఇంకేమీ చేయలేకపోయారు’ అంటూ పళనిస్వామి విమర్శించారు. తమ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తే అన్నింటికీ సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.దీనికి సీఎం స్టాలిన్‌ బదులిస్తూ.. ‘ మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టే.. తొందరగా తీర్పు వచ్చింది. కోర్టు కూడా ఈ కేసులో పోలీసుల సాధించిన పురోగతిని కొనియాడింది. మహిళల రక్షణ అనేది మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం అనే విషయం గుర్తించుకోండి’ అని ట్వీట్‌ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏంటంటే..గతేడాది డిసెంబర్‌ 23వ తేదీన జ్ఞానశేఖరన్‌ అన్నామలై క్యాంపస్‌లోకి ప్రవేశించాడు. ముందుగా ఆ బాధిత విద్యార్థిని స్నేహితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై తాను టార్గెట్‌ చేసిన యువతిపై లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా, యూర్శివర్శిటీ సాక్షిగా అత్యాచార యత్నం చేశాడు. దీన్ని వీడియోగా చిత్రీకరించి ఆ యువతిని అక్కడే బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. దీనిపై యువతి ఫిర్యాదు చేయగా, డిసెండర్‌ 24వ తేదీన కేసు నమోదైంది. ఆరు నెలల తర్వాత వచ్చిన తీర్పులో అతనికి 30 ఏళ్ల పాటు జీవితఖైదుతో పాటు రూ, 90 వేల జరిమానా విధించింది మహిళా కోర్టు. రోడ్డు పక్కన బిర్యానీలు అమ్ముకునే జ్ఞానశేఖరన్‌పై సుదీర్ఘమైన క్రిమినల్‌ రికార్డు కూడా ఉన్నట్లు పోలీస్‌ దర్యాప్తులో తేలింది.

Vallabhaneni Vamsi Discharge From Ayush Hospital6
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే

సాక్షి,విజయవాడ: పలు అనారోగ్య సమస్యలతో గత మూడు రోజులగా ఆయుష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్‌2న) డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. గత మూడు రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్‌ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్దారించారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వంశీ ఐసీయూలో లేనందున ఆరోగ్యం కుదుటపడేందుకు స్లీప్ మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్‌ చేశారు. ఆయుష్ ఆసుపత్రిలో వైద్యులు వంశీకి అందించిన చికిత్స తాలూకూ మెడికల్ రిపోర్టులు, డిశార్జ్‌ సమ్మరీతో సహా సీల్డ్ కవర్‌లో ఈనెల 5వ తేదీన జైలు అధికారులు హై కోర్టుకు సమర్పించనున్నారు.గత గరువారం ..వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం (జూన్‌ 5) నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ లక్ష్మణరావు విచారణ జరిపారు.

Rajinikanth And Mohammad Yaseen Behind Photo Story7
రజనీకాంత్‌ ఒడిలో బాలుడు.. ఏడేళ్ల నాటి స్టోరీ ఇప్పుడు వైరల్‌

సోషల్‌మీడియాలో కొద్దిరోజులుగా ఒక ఫోటో వైరల్‌ అవుతుంది. రజనీకాంత్‌ ఒడిలో ఒక బాలుడు కూర్చొని ఉన్న ఫోటో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే, అది ఎంతవరకు నిజం అని చాలామంది తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.ఈ ఫోటో 2018 నాటిది. రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఆ బాలుడి పేరు మహమ్మద్ యాసిన్. ఏడేళ్ల వయసులో ఆ బాలుడు చేసిన పనితో తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. ఈరోడ్‌లో ఉన్న తన పాఠశాల సమీపంలో యాసిన్‌కు రూ. 50 వేలు దొరికింది. ఇంటి నుంచి తన పాఠశాలకు వెళ్తున్నప్పుడు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక పర్సును చూశాడు. ఆ పర్సులో రూ.100, రూ.500 నోట్లు మొత్తం రూ.50,000 ఉన్నాయి. అప్పుడు ఆ బాలుడు నేరుగా తన స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) 'శక్తి'కి ఇచ్చాడు. అప్పుడు ఆ పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదు, మీ ప్రిన్సిపాల్‌కు చెప్పకుండా నువ్వే తీసుకోవచ్చు కదా అని అడిగారు. దానికి యాసిన్ తిరిగి ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించి ఉంటారు. ఈ డబ్బు నాది కాదు. అలాంటప్పుడు దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలను. ఈ డబ్బు ఎవరిదో వారికే ఇవ్వండి' అంటూ తిరిగి బదులిచ్చాడు. బాలుడి నిజాయితీని మెచ్చిన ఏస్పీ నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు వెంటనే ఆ బాలుడు నాకు సూపర్ స్టార్ రజనీకాంత్‌( Rajinikanth) అంటే చాలా ఇష్టం. ఆయన్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు జరిగిన విషయాన్ని రజనీకాంత్‌కు తెలిపారు. అందుకు స్పందించిన రజనీ.. యాసిన్‌తో పాటు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకు రమ్మని తెలిపారు. రజనీకాంత్ ఆ పిల్లవాడి నిజాయితీని ప్రశంసించి, అతని చదువుకు స్పాన్సర్ చేస్తానని ప్రకటించారు. ఆపై యాసిన్, అతని కుటుంబాన్ని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసానికి ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. బాలుడికి సరైన దుస్తులు, కావాల్సిన బుక్స్‌ వంటివి తీసుకోవాలని అతని తల్లిదండ్రులకు రూ. 50వేలు రజనీ ఇచ్చారు. ఆపై యూసిన్‌ చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని రజనీ మాట ఇచ్చారు. 'రూ.100 నోటు కోసం కూడా మోసం, దొంగతనం, హత్య చేసే ఈ కాలంలో, అతను (యాసిన్) ఇది నా డబ్బు కాదని చెప్పి దానిని అప్పగించాడు. నిజంగా ఎంత నిజాయితీ. ఇది గొప్ప గుణం' అంటూ యాసిన్‌ను రజనీకాంత్ మెచ్చుకున్నారు. ఆ బాలుడు ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్నాడు.This child sitting on the lap of superstar Rajnikanth became an example of honesty in Tamil Nadu. Mohammad Yasin found 50 thousand rupees on the road. He went straight to the police station and gave the money to the police officer and said "I found this money on the road.… pic.twitter.com/Vy4wrozbzO— Gabbar (@Gabbar0099) June 1, 2025

Road Accident in West Godavari8
తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

తూర్పు గోదావరిజిల్లా,సాక్షి: తూర్పు గోదావరిజిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులు కాకినాడ బీచ్‌ చూసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో సరిగ్గా రంగంపేట మండలం వడిశలేరు గ్రామం వద్ద కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నకారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాజమహేంద్రవరం కవలగొయ్యికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల వివరాలు :-1.రేలంగి శివన్నారాయణ ( 40 )2. రేలంగి దేవి లలిత ( 34 )3. రేలింగి వర్షిత ( 13 )4. తీగిరెడ్డి శివ ( 30 )5. తీగ రెడ్డి సాన్వి ( 4 )క్షతగాత్రుల వివరాలు :-1. తీగి రెడ్డి భవాని ( 26 )2. రేలంగి హర్షిత ( 13 )

ICC Women’s ODI World Cup 2025 Schedule Released9
వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. పాకిస్తాన్‌ మ్యాచ్‌లన్నీ అక్కడే..!

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్‌ 2) విడుదల చేసింది. ఈ టోర్నీకి సంబంధించిన వేదికలు, తేదీలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 5-నవంబర్‌ 2 మధ్యలో భారత్‌, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది.భారత్‌లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్‌లు జరుగుతాయి. 2025 ICC Women's Cricket World Cup schedule 𝐑𝐄𝐕𝐄𝐀𝐋𝐄𝐃!Read more ➡ https://t.co/myj2Gfamkv pic.twitter.com/zl3IYWC2e6— ICC (@ICC) June 2, 2025ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు ప్రేమదాస​ స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు. భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు హైబ్రిడ్‌ పద్దతి ప్రకారం దుబాయ్‌లో జరిగాయి. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్‌ కూడా భారత్‌లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు. భారత్‌, పాక్‌ మధ్య తాజా పరిస్థితుల (ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత) నేపథ్యంలో పాక్‌ జట్టు మన దేశంలో మ్యాచ్‌లు ఆడతామన్న భారత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు.కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30న బెంగళూరులో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత ప్రత్యర్థి క్వాలిఫయర్‌ పోటీల ద్వారా నిర్ణయించబడుతుంది. అక్టోబర్‌ 29న తొలి సెమీఫైనల్‌ (గౌహతి లేదా కొలొంబో (పాక్‌ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్‌ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్‌ 2న ఫైనల్‌ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతుంది.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే.

IndiGo Flight Suffers Bird Hit At 4,000 Feet10
ఆకాశంలో అల్లకల్లోలం.. 170మందితో వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో..

రాంచీ: ఓ పక్షి ఆకాశంలో అల్లకల్లోలం సృష్టించింది. 170 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానాన్ని,అందులోని ప్యాసింజర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అ‍యితే, పైలెట్‌ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా భయపడ్డారు. వారిలో పలువురు ప్రయాణికులకు గాయలైనట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1.14 గంటల సమయంలో ఇండిగో ఎయిర్‌బస్ 320 (Airbus 320) విమానం పాట్నా నుండి రాంచీ(ranchi)కి రావాల్సి ఉంది. ఆ సమయంలో ఎయిర్‌బస్‌ 320ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదంతో అప్రమత్తమైన పైలెట్‌ చాకచక్యంగా ల్యాండింగ్‌ చేయాల్సిన ఎయిర్‌ పోర్టుకు కాకుండా సమీపంలో ఉన్న రాంచీ బిర్సా ముండా విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాంచీ సమీపంలో ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఫ్లైట్‌ 3,000 నుండి 4,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇండిగో విమానం పాట్నా నుండి రాంచీకి వస్తుండగా, పైలట్ ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది’ అని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య తెలిపారు.ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, పక్షి ఢీకొట్టడం వల్ల విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంజనీర్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారు’ అని అన్నారు. కాగా, ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. Ranchi-bound IndiGo flight suffers bird hit, makes emergency landing, all 175 passengers safe: Official pic.twitter.com/KtzhnVH9KL— Press Trust of India (@PTI_News) June 2, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement