Top Stories
ప్రధాన వార్తలు

గ్రూప్–2 అభ్యర్థులతో 'బాబు బంతాట'
డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేశ్ ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి ఈ ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేసేశాం అని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు. – గ్రూప్–2 అభ్యర్థినిసాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. వాస్తవానికి రోస్టర్ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్–2 మెయిన్స్ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై గ్రూప్ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్కాట్ ఎలక్షన్’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది. ‘బాయ్కాట్ ఎలక్షన్’ నిర్ణయంతో సర్కారు డ్రామాలు.. గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు సర్కారుకు మొరపెట్టుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం నిర్ణయాధికారం ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందున రోస్టర్ సవరించే వరకు పరీక్షను వాయిదా వేయాలని ఈనెల 20నుంచి కోరుతున్నారు. అయిన్పటికీప్రభుత్వం స్పందించలేదు. దీంతో అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించింది. ‘‘పరీక్షలను వాయిదా వేయమని గ్రూప్–2 అభ్యర్థుల నుంచి నాకు అనేక అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు అన్ని మార్గాలను అన్వేíÙస్తాము’’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే, శనివారం ఉదయం ఏపీపీఎస్సీ మరో ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఒకే అంశంపై రెండు వ్యవస్థలు భిన్న అభిప్రాయాలను వెల్లడించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. పరీక్ష మరో 14 గంటలు ఉందనగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో రోస్టర్ సమస్యను పరిష్కరించి పరీక్ష నిర్వహించాలని, అప్పటిదాకా మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వ కార్యదర్శి.. ఏపీపీఎస్సీకి రాసినట్టుగా ఓ లేఖ శుక్రవారం తేదీతో శనివారం మధ్యాహ్నం బహిర్గతమైంది. దీనిపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధను తప్పుబడుతూ ఉన్న ఆడియోను లీక్ చేశారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయమంటే ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదన్నది ఆ ఆడియో సారాంశం. ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు? గ్రూప్–2 రిజర్వేషన్లలో రోస్టర్ అమలు తప్పులున్నాయని ఏడాది కాలంగా ప్రచారం చేస్తూ వచి్చన కూటమి ప్రభుత్వంలోని నేతలు కేసు కోర్టు పరిధిలోకి వచ్చేవరకు ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. వాస్తవానికి ఎన్డీఏ సర్కారు ఏర్పడి దాదాపు 9 నెలలు పూర్తవుతోంది. గ్రూప్–2 మెయిన్స్ ఒకసారి జూలైకి, మరోసారి డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ క్రమంలో తప్పులు సరిచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు సైతం తప్పులు లేవని చెప్పారని, ఒకవేళ తప్పులుంటే సరి చేస్తామని పేర్కొన్నట్టు చెబుతున్నారు. పరీక్ష తేదీ సమీపించే వరకు వాయిదా వేసే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. ఆదివారం పరీక్ష ఉందనగా, శనివారం మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ తప్పేంలేదని చెప్పేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ తీరుతో సుదూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరుకావాల్సిన వారు మూడు రోజులుగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వివాదాలే ‘అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ కేలండర్ ఇస్తాం. నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తా’మని చెప్పిన ఎన్డీఏ కూటమి నాయకులు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్వీస్ కమిషన్ను నీరుగార్చే పనిలో పడ్డారు. ఏడాది పదవీ కాలం ఉండగానే.. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న కమిషన్ చైర్మన్ను రాజకీయ కుట్రతో తొలగించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరగకుండా వాయిదాలు వేశారు. ఇందులో గ్రూప్–2తో పాటు గ్రూప్–1 మెయిన్స్, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు వంటి కీలమైన 21 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటికి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్ను అగమ్యగోచరంగా మార్చేశారు. ఇప్పుడూ గ్రూప్–2 మెయిన్స్ కొన్ని గంటల వ్యవధిలో ఉందనగా రాజకీయం ప్రారంభించారు. ఇందులో సాక్షాత్తూ ‘ముఖ్య’ నేతలే అభ్యర్థుల భావోధ్వేగాలతో ఆడుకోవడం గమనార్హం.ఇప్పటికిప్పుడు మెయిన్స్ వాయిదా వేయలేం : ఏపీపీఎస్సీ చైర్మన్ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ ద్వారా అవసరమైన వివరణ ఇచ్చేందుకు పరీక్షను వాయిదా వేయాలని శనివారం జీఏడీ సర్వీస్ కమిషన్కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పైవిధంగా స్పందించినట్టు సమాచారం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాక.. గంటల వ్యవధిలో వాయిదా వేయాలనడం సబబుకాదని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం. నేడు గ్రూప్–2 మెయిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలు సిద్ధంగ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 పేపర్–2 నిర్వహిస్తారు. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9.30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45కు కేంద్రాల గేట్లను మూసివేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీల వీరంగంవిజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కోట కూడలిలో శనివారం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీలు వీరవిహారం చేశారు. ఉన్నత విద్యావంతులని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరసన శిబిరాన్ని చెదరగొట్టారు. పలువురు అభ్యర్థులను రాత్రి సమయాన జీపుల్లో దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. రోస్టర్ విధానంపై స్పష్టత ఇచ్చాకే గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించాలని కోరిన పాపానికి ప్రభుత్వం పోలీసులతో నిరుద్యోగుల ఆందోళనను అణచివేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానం ప్రకటించాలని కోరుతూ కోట కూడలి వద్ద అభ్యర్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వన్టౌన్, టుటౌన్ సీఐలు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడలి వద్దకు చేరుకుని నిరుద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు.ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాం..నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా రెండు చెప్పులతో మేం కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్ట్ర్ సరిచేయకుంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్ నిర్వహిస్తోంది. మా భవిష్యత్ను, ఆశలను తుంగలొకి తొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా మేం బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – గ్రూప్–2 అభ్యర్థి

ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం!
కాలం కలిసొస్తే కొందరికి అధికారం సంప్రాప్తించవచ్చు. అదృష్టం ఈడ్చితంతే కొందరు సరాసరి సింహాసనం మీదనే కూలబడవచ్చు. నక్కజిత్తులతో, తోడేలు వంచనతో, వెన్నుపోటుతో, మోసపు మాటలతో మరికొందరు ‘పవర్’ఫుల్గా మారిపోవచ్చు. కానీ వారందరూ ప్రజానాయకులు కాలేరు. అసలు నాయకుడంటే ఎవరు? అతనెట్లా ఉండాలి?... నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపంలా ఉండాలి. ఆడిన మాట మీద నిలబడే వాడై ఉండాలి. మడమ తిప్పని వాడై ఉండాలి. నిరంతరం జనం గుండె చప్పుళ్లను వినగలిగే విద్యాపారంగతుడై ఉండాలి. సకల జనుల శ్రేయస్సు కోసం పరితపించే తాపసిగా ఉండాలి. అటువంటి ప్రజా నాయకుడికి అధికార హోదాలను మించిన గౌరవం ఉంటుంది. జనం గుండెల్లో కొలువుండే అత్యున్నత హోదా ఉంటుంది. ఆ నాయకుడు వీధుల్లోకి వస్తే జనవాహిని అతని వెంట ప్రవహిస్తుంది. ఆబాలగోపాలం ఆనందోద్వేగాలతో హోరెత్తుతుంది. అది గిరిజన ప్రాంతమా... నగరం నడిబొడ్డా అనే తేడా ఉండదు. అన్ని చోట్లా ఒకటే స్పందన. ఆ నాయకుడు కనిపించగానే జనశ్రేణుల పాదాలు జజ్జెనకరె గజ్జల సడి చేయడానికి సిద్ధమవుతాయి. అతడే ప్రజానాయకుడు! ద మాస్ లీడర్! ఇటువంటి మాస్ లీడర్లు ఎందరుంటారు? ఆంధ్రరాష్ట్రం విషయానికి వస్తే అప్పుడెప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రకాశం పంతులు గారిలో ఈ మ్యాజిక్ ఉండేదట. ఆ తర్వాత ఒక ఎన్టీ రామారావు... ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి... ఇదిగో ఇప్పుడు ఒక జగన్మోహన్రెడ్డి. దట్సాల్!సింహం ఇంకా వేటకు బయల్దేరనే లేదు. అది వెళ్లేదారిలో గోతులు తవ్వడానికీ, మందుపాతర్లు పెట్టే వ్యూహం పన్నడానికీ తోడేలు మందలు, నక్కల గుంపులు సమావేశమవుతున్నాయట. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇంకా విస్తృత జనయాత్రలకు శ్రీకారం చుట్టనేలేదు. గద్దెనెక్కిన వారు ఏడాది పండుగ జరుపుకొనేదాకా ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వడానికి ఈ తాత్సారం కావచ్చు. ఇప్పుడు అడపాదడపా పర్యటనలు మాత్రమే జరుగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజాశ్రేణులను కలవడానికీ, నిర్బంధాలకు గురవుతున్న కార్యకర్తలకూ, నేతలకూ అండగా నిలవడానికీ మాత్రమే ఈ పర్యటనలు పరిమితం. గడిచిన వారం ఇటువంటి మూడు యాత్రలు జరిగాయి. రెడ్బుక్ స్కీము కింద అరెస్టయిన సహచరుడు వంశీని కలవడానికి జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. దగా పడుతున్న రైతన్నకు దన్నుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. కన్నుమూసిన పార్టీ నాయకుని కుటుంబాన్ని పలకరించడానికి పాలకొండకు వెళ్లారు. ప్రదేశం ఏదైనా, సందర్భం ఏదైనా ప్రజాస్పందన సుస్పష్టం. జనప్రభంజనపు అడుగుల చప్పుడు విస్పష్టం. ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో ‘మాయ’ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారు. పేదల అభ్యున్నతి కోసం పని చేసినందుకే బడా బాబులంతా కలిసి కుట్ర చేశారన్న అభిప్రాయం వారి మనసుల్లో బలంగా నాటుకొని పోయింది. ఫలితంగా జగన్పై వారికున్న అభిమానం మరింత బలపడుతున్నది.ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెట్లా ఇస్తామని ఇటీవలనే ప్రవచించిన ముఖ్యనాయకుడికి ప్రజలు మూడ్ బాగానే తెలుసు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. జనంలో ఉన్న జగన్మోహన్రెడ్డితో తాము తలపడలేమని కూడా తెలుసు. అందుకే ఆయన జనంలోకి రాకూడదని ముఖ్యమంత్రీ, ఆయన శిబిరం భావిస్తుండవచ్చు. ఒక వేళ జనంలోకి వస్తే ఏం చేయాలన్న పథకంపై మొన్నటి పర్యటనల్లో రిహార్సళ్లు, రెక్కీలు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతా కవచాలలో ఉన్న జగన్మోహన్రెడ్డికి ఆ స్థాయి భద్రతను కల్పించవలసి ఉన్నది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ సిబ్బందిని భారీగా కుదించినప్పుడే అనుమానాలకు బీజం పడింది.తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డి నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ టెంట్లనూ, బారికేడ్లనూ, సిబ్బందినీ తొలగించినప్పుడే ప్రభుత్వ పెద్దల దురుద్దేశం బట్టబయలైంది. వినుకొండ పట్టణ నడివీధిలో జరి గిన రెడ్బుక్ ఘాతుకానికి బలైన రషీద్ కుటుంబ పరామర్శకు బయ ల్దేరినప్పుడు కూడా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి జగన్ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. ఆయన నివాసానికి సమీపంలోనే మంటలు చెలరేగడం భద్రతా వైఫల్యం కాక మరేమంటారు? ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే నాయకుడు పర్యటనలో ఉన్నప్పుడు రోడ్డు క్లియర్ చేసే టీమ్, కాన్వాయ్, రోప్ పార్టీ, ఎస్కార్ట్ విధిగా ఉండి తీరాలి. కానీ జగన్ పర్యటనల్లో వేళ్ల మీద లెక్కించగలిగేంత మంది కానిస్టేబుళ్లు తప్ప ఇవేమీ కనిపించడం లేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రతకు ఎటువంటి లోటూ జరగలేదు. రూల్బుక్ స్థానాన్ని రెడ్బుక్ ఆక్రమించలేదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండేవారు. జడ్ ప్లస్ కేటగిరీ కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవలసిన భద్రతా చర్యల్ని తీసుకున్నది. అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. జగన్ విషయంలో ఈ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం వెనుక భయంకరమైన కుట్ర ఉండవచ్చనే అనుమానాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అవి కేవలం అనుమానాలు మాత్రమే కావని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.జగన్ భద్రత విషయంలో కుట్రపూరితమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ప్రభుత్వ పెద్దలకు తప్ప ఇంకెవరికీ లేదు. చంద్రబాబు కూటమి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తాము అమలు చేయలేమని తెలిసినప్పటికీ అనేక హామీలను గుప్పించి ఓటర్లను వంచించింది. ఇప్పుడా హామీలన్నింటినీ చాప చుట్టేసి అటకెక్కించింది. అంతకు ముందు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్న’ పథకాలు కూడా ఆగిపోయాయి.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాస్వామికీకరణ కార్యక్రమాన్ని నిలిపి వేసి ప్రైవేట్ దోపిడీకి బాటలు వేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన గృహనిర్మాణ విప్లవానికి కళ్లెం వేశారు. ‘అమ్మ ఒడి’ని ఆపేశారు. ‘చేయూత’ను వదిలేశారు. ‘కాపు నేస్తం’ కనిపించడం లేదు. ఈ బీసీ నేస్తం పత్తా లేదు. జాతీయ స్థాయిలో బహుళ ప్రశంసలు అందుకున్న వలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తానని ప్రతి ఎన్నికల సభలోనూ బాబు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థనే గిరాటేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇటువంటి పచ్చి మోసాన్ని అనుమతించవచ్చునా? ఇటువంటి మోసగాళ్లు పాలకులు కావడం వాంఛనీయమేనా? ఇదొక్క అంశమే కాదు. అన్ని హామీలకూ ఇదే గతి పట్టింది. వీటిపై ప్రజల్లోనూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారిలోనూ విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ప్రజానాయకుడైన జగన్మోహన్రెడ్డి ఒకసారి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడితే కూటమి మోసాల గుట్టురట్టవుతుంది. విస్తృత స్థాయిలో చర్చ మొదలవుతుంది. ఈ పరిణామం కూటమి మనుగడకే ్రపమాదం. కనుక జగన్మోహన్రెడ్డి జనంలోకి రాకూడదు. గతంలోనే ఆయనపై రెండు మార్లు హత్యాప్రయత్నాలు జరిగి ఉన్నాయి గనుక భద్రతా చర్యలను నిలిపివేస్తే ఆయన యాత్రలు ఆగిపోతాయన్న వెర్రి ఆలోచన ఏమైనా ఉండవచ్చు. భద్రతా సిబ్బందిని తొలగించినా, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి నడుస్తున్న పరిణామాన్ని చూసిన తర్వాత మరింత తీవ్రమైన వ్యూహాలకు కూటమి సర్కార్ పదును పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే జగన్ వంటి ప్రజానాయకుడు రంగంలో ఉండగా తన వారసుడు రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆదిలో బాబు నిల దొక్కుకోవడానికి కూడా ఎన్టీఆర్ను వెన్నుపోటు ద్వారా రంగం నుంచి తప్పించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేశారనేది తెలిసిన సంగతే!రాజశేఖర్రెడ్డిని గద్దెదించడానికి కూడా బాబుకూటమి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్నూ, సమైక్య రాష్ట్రానికి కట్టుబడివున్న సీపీఎంనూ ఒక్కచోటకు చేర్చి ‘మహాకూటమి’ని కట్టిన సంగతి కూడా తాజా జ్ఞాపకమే! ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేసినా, ‘మహాకూటమి’ని నిర్మించినా, సంప్రదాయ కాంగ్రెస్ ఓటును చిరంజీవి పార్టీ బలంగా చీల్చినా బాబు ముఠా ప్రయత్నాలు ఫలించలేదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ మహానేత మరో విధంగా రంగం నుంచి నిష్క్రమించారు.జగన్మోహన్రెడ్డి మరో బలమైన మాస్ లీడర్గా ఆవిర్భవిస్తారని చంద్రబాబు – యెల్లో మీడియా వారు ఆదిలోనే గుర్తించారు. ఆయన్ను మొగ్గలోనే తుంచేయడానికి చేసిన ప్రయత్నాలను తెలుగు ప్రజలందరూ గమనించారు. గడిచిన పదిహేనేళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హనన కార్యక్రమం న భూతో న భవిష్యతి. ప్రపంచ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యక్తిత్వ హనన గోబెల్స్ ప్రచారం ఎవరి మీదా జరిగి ఉండదు. ప్రజా నాయకులను దూరం చేసి చంద్రబాబుకు మార్గం సుగమం చేసే కార్య క్రమంలో యెల్లో మీడియా, దాని రింగ్ లీడర్ రామోజీరావు పోషించినది దుర్మార్గమైన పాత్ర. చట్టాన్ని ధిక్కరించి ఫైనాన్సియర్స్ పేరుతో నిధులు పోగేసిన వ్యక్తి రామోజీ. చిట్ఫండ్స్ పేరుతో జనం సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకున్న వ్యక్తి రామోజీ. ఒకరి కొకరు తోడు నీడగా బాబు–రామోజీలు ముప్ఫయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను భ్రష్టు పట్టించారు. అయినా సరే, జనం మాత్రం జగన్ వెంట నిలబడుతున్నారు. ఈ పరిణామం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు జగన్కు భద్రత కల్పించడంలో విఫలం కావడమనేది కేవలం పొరపాటు కాదు. వట్టి నిర్లక్ష్యం కాదు. ఉద్దేశపూర్వక∙నిర్లక్ష్యం, కుట్రపూరిత నిర్లక్ష్యం! ఇటువంటి ధోరణిని ఎండగట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత బలహీనపడతాయి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు మధ్యలో కొంత నిరాశ పర్చినా లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.వృషభం...ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి విషయాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తృతం చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించండి.మిథునం...కొత్త వ్యవహారాలు ప్రారంభం నుంచీ విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలై ఆర్థికంగా బలపడతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడి ఊరట చెందుతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నలుపు, ఆకుపచ్చ రంగులు. . గణేశారాధన మంచిది.కర్కాటకం...వ్యవహారాలలో విజయం. అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. గతానుభవాలు ప్రస్తుతం ఉపయోగిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు ఫలిస్తాయి. వారం చివరిలో మానసిక అశాంతి. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.సింహం....ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా కొనసాగుతుంది. సన్నిహితుల సహాయం అందుకుని కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ సిద్ధాంతాలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుని లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో. కుటుంబంలో కొన్ని చికాకులు. తెలుపు, నీలం రంగులు. . దేవీస్తోత్రాలు పఠించండి.కన్య....అనుకున్న వ్యవహారాలు పూర్తికి మరింత ్రÔ¶ మిస్తారు. ఆర్థిక వనరులు సమకూరి అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారాలు పుంజుకుని తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా దృఢవిశ్వాసంతో అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల వారికి అన్ని విధాలా అనుకూల పరిస్థితి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. పసుపు, గులాబీ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.తుల...చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా బలం పుంజుకుని రుణవిముక్తి పొందుతారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలపై కుటుంబంలో అనుకూలత వ్యక్తమవుతుంది. స్థిరాస్తులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల కృషి నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య, మానసిక సమస్యలు. నీలం, ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.వృశ్చికం...ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉండవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండక నిరాశ చెందుతారు. బంధువులతో కొన్ని వివాదాలు నెలకొని మీకు పరీక్షగా నిలుస్తాయి. నిర్ణయాలలో ఎటూతేల్చుకోలేక సతమతమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. ఉద్యోగాలలో మరింత సమర్థనీయంగా పనిచేయాల్సి ఉంటుంది. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. పసుపు, ఆకుపచ్చ రంగులు. . విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు...ముఖ్యమైన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఎంతోకాలంగా ఉన్న భూవివాదాలు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ భావాలు పంచుకుంటారు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురుకావచ్చు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుని మీదారికి తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో సహచరులతో సర్దుబాటు వైఖరి అవలంభిస్తారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. శివస్తుతి మంచిది.మకరం...అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు అ«ధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరి ఇతరులకు సైతం సాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణాలకు సన్నాహాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చాకచక్యం, నేర్పుగా వ్యవహరించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువుల నుంచి సమస్యలు. తెలుపు, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.కుంభం...సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తులు మీకు చేదోడుగా నిలుస్తారు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులు తమ అంచనాలకు తగినట్లుగా అవకాశాలు సాధిస్తారు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ధైర్యం, ఓర్పుతో ముందడుగు వేసి విజయాలతీరం చేరుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.మీనం...ఏ వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

కుప్పకూలిన సొరంగం
సాక్షి, నాగర్కర్నూల్/ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఘటన విషయం తెలిసిన సీఎం రేవంత్రెడ్డి వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతామని, పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇటీవలే పనులు పునః ప్రారంభమై... శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా...: సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న మంత్రులు సొరంగం ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సహాయక చర్యలను పరిశీలించారు. నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో‹Ù, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కిషన్రెడ్డి ఫోన్ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్రెడ్డి.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయం అందించాలని కోరారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. హైదరాబాద్ నుంచి ఒకటి, విజయవాడ నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రమాద స్థలానికి పంపారని కిషన్రెడ్డి తెలిపారు. ఇక సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.శరవేగంగా సహాయక చర్యలు: సీఎం రేవంత్ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గాయపడిన కార్మీకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై శనివారం రాత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ప్రమాదం ఘటన, సహాయక చర్యల పరిస్థితి, ఇతర అంశాలను సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరించారు.పూర్తి సహకారం అందిస్తాం: ప్రధాని మోదీ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ వివరించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సహాయక చర్యల కోసం సత్వరమే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు
ఉక్రెయిన్. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం. అణ్వస్త్ర సామర్థ్యం, అమేయ సైన్యంతో కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ యుద్ధంచేస్తూ శతథా ప్రయత్నాలు చేయబట్టి రేపటికి సరిగ్గా మూడేళ్లు. ఈ మూడేళ్లలో రష్యా కన్నెర్రజేసి వేలాది సైన్యంతో చేస్తున్న భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్లో సాధారణ ప్రజల వేలాది కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణమృదంగం నిరాటంకంగా వినిపిస్తోంది. సైనికులు పిట్టల్లా రాలిపోయారు. మార్షల్ లా ప్రయోగించి జెలెన్స్కీ ప్రభుత్వం యువత మొదలు నడివయసు వారిదాకా దమ్మున్న వారందరినీ రణక్షేత్రంలోకి దింపి పోరాటం చేయిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా సమరశంఖం పూరించింది. దీంతో హఠాత్తుగా యుద్ధంలో కూరుకుపోయినా ఉక్రెయిన్ తన మిత్రబృందం నుంచి అందుతున్న అధునాతన ఆయుధాలతో రష్యాను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ లక్షలాది మంది రష్యన్ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అగ్రరాజ్య నయా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ టెలీఫోన్ మంతనాలు చేయడంతో యుద్ధం మొదలైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. వాస్తవానికి ఈ మలుపు తుది మలుపు అని, ట్రంప్ పట్టుదలతో యుద్ధాన్ని ఆపబోతున్నారని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 36 నెలల తర్వాత అయినా ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందో లేదోనని, యుద్ధప్రభావిత విపరిణామాలతో తిప్పలుపడుతున్న ఎన్నో ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.అత్యంత భీకర ఘర్షణరెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది. తొలిరోజుల్లో రాజధాని కీవ్దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు. దీంతో డ్రోన్లకు ఉక్రెయిన్ పనిచెప్పింది. దృఢత్వానికి చిరునామా అయిన అత్యంత ఖరీదైన వేలాది రష్యన్ యుద్ధట్యాంక్లను సైతం సులువుగా చవకైన డ్రోన్లతో పేల్చేసి జెలెన్స్కీ సేన పలు యుద్ధక్షేత్రాల్లో పైచేయి సాధించింది. 18 శాతం ఆక్రమణఅంతర్జాతీయ మీడియా కథనాలు, రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్లోని కేవలం 18 శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్కు అందుతున్న భారీ ఆయుధాలే ఇందుకు ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ఆయుధాలు, మందుగుండు, సైనిక ఉపకరణాలు, ఆర్థిక సాయం అందడంతోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న నైతిక మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ సైనికులు కదనరంగంలో ధైర్యంగా ముందడుగు వేయగల్గుతున్నారు. యుద్ధంలో రష్యా దాదాపు ఏకాకిగా మారింది. రహస్యంగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు తదితర ఆయుధాలు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు బయటి దేశాల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. అమెరికా తదితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షల కత్తి గుచ్చాయి. సొంత దేశంలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు కోట్లలో ఉన్నారు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి, డిమాండ్ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుధం చేతికిచ్చి యుద్ధానికి పుతిన్ పంపిస్తాడన్న ముందస్తు అంచనాతో తొలినాళ్లలోనే వేలాది మంది యువ రష్యన్లు దేశం నుంచి పారిపోయారు. చివరకు ఖైదీలు, నిందితులను సైతం పుతిన్ సైన్యంలో చేరి్పంచుకుని ఉక్రెయిన్తో పోరాటం చేయిస్తున్నారు.అన్ని రంగాలు తిరోగమనం నష్టాలు చెప్పకపోయినా అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బాంబు దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. వ్యవసాయం తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇలా ఎన్నో రంగాలు తిరోగమన పథంలో పయనిస్తున్నాయి. దేశ జీడీపీకి వందల బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. వాణిజ్య, పరిశ్రమ రంగానికి సంబంధించి దాదాపు రూ.15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.5.8 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. ఉక్రెయిన్కు మిత్ర దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం అందుతున్నా అది ఎక్కువగా సైనిక, రక్షణపర సాయమే తప్పితే సాధారణ ప్రజల జీవితాలను బాగుచేసేది కాదు. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్ తన భూభాగాలను మాత్రమే కాదు భవిష్యత్తును కొంత కోల్పోతోందనేది వాస్తవం. ఉక్రెయిన్కు అపార ఆస్తినష్టం రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తుంటే ఉక్రెయిన్ వైపు అంతకుమించి ఆస్తినష్టం సంభవించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనావాసాలపై దాడులతో పెద్దసంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్షకుపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారడంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధంజాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు. పక్కనే ఉన్న పోలండ్, రొమేనియా దేశాలుసహా అరడజనుకుపైగా దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలసవెళ్లారు. దాదాపు ఉక్రెయిన్ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలీడం లేదు. అమెరికా సహా యూరప్ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం ఉక్రెయిన్కు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరుల్లో నైతిక స్థైర్యం సడలకూడదనే ఉద్దేశంతో యుద్ధ నష్టాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.యుద్ధంలో రక్తమోడుతున్న రష్యాఅణ్వ్రస్తాలు లేకున్నా ఉక్రెయిన్తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్కు రానురాను అర్థమైంది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ధవ్యూహాలను అమలుచేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. అంతర్జాతీయ యుద్ధ పరిశీలనా బృందాలు, సంస్థలు, వార్తాసంస్థల నివేదికలు, అంచనాల ప్రకారం యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ విషయంలో చూస్తే కేవలం లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. ఉక్రెయిన్లో ఎన్నికలొచ్చేనా?రష్యా దాడులు మొదలెట్టగానే జెలెన్స్కీ తమ దేశంలో మార్షల్ లా ప్రయోగించారు. సైనికపాలన వంటి అత్యయిక స్థితి అమల్లో ఉన్న కారణంగా ఉక్రెయిన్లో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యంకాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్లో ఏకాభిప్రాయ నిర్ణయం ద్వారా మార్షల్ లాను తొలగించాలి. యుద్ధం జరుగుతుండగా మార్షల్ లాను చట్టప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా జెలెన్స్కీ జాతీయభావం, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నానని చెప్పి మళ్లీ అధికారం కైవసం చేసుకుంటారని విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. యుద్ధంలో ట్రంప్కార్డ్ జెలెన్స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చారని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధమేఘాలను శాశ్వతంగా తరిమేస్తాయన్న ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగా చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి ‘వాస్తవాదీన రేఖ’నే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్కు ఒప్పకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటానని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనలను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్కు విదేశీ ఆయుధసాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని వార్తలొచ్చాయి. యుద్ధం అంకెల్లో.. చనిపోయిన రష్యా సైనికులు 8,66,000కుపైగా చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు 1,00,000కుపైగా ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతం 18 శాతం సగటున రోజుకు రష్యా ఆక్రమణ రేటు 16.1 చదరపు కిలోమీటర్లు ఉక్రెయిన్కు యూరప్ దేశాల నుంచి అందిన ఆర్థిక సాయం రూ. 14 లక్షల కోట్లు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు ఇచ్చిన రుణాలు రూ. 2 లక్షల కోట్లు– సాక్షి, నేషనల్ డెస్క్

హీరోలా ఎగిరే జీరో..
ట్రాఫిక్జామ్లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఓ ఎగిరే కారు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమోటివ్, ఏవియేషన్ సంస్థ సరికొత్త ఫ్యూచర్ కారును అభివృద్ధి చేస్తోంది. రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లగలగడంతోపాటు అవసరమైనప్పుడు అమాంతం పైకి ఎగిరి వెళ్లగల కారును సిద్ధం చేస్తోంది.తాజాగా మోడల్ జీరో అనే కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై విజయవంతంగా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను సంస్థ నెటిజన్లతో పంచుకుంది. ఆ వీడియోలో మోడల్ జీరో కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్టనిలువుగా టేకాఫ్ అయి ముందున్న కారు పైనుంచి ఎగురుతూ ముందుకు సాగింది. అనంతరం మళ్లీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది. –సాక్షి, సెంట్రల్ డెస్క్ఎలా సాధ్యమైంది?సాధారణ కార్లలో బానెట్లో ఇంజన్ ఉంటే మోడల్ జీరో కారులో మాత్రం నాలుగు చిన్న ఇంజన్లను వాటి చక్రాల వద్ద కంపెనీ అమర్చింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారులాగానే ఈ కారు రోడ్డుపై దుసుకెళ్తోంది. ఇక ఖాళీగా ఉన్న బానెట్, డిక్కీలలో మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్లను సంస్థ ఏర్పాటు చేసింది. వేర్వేరు వేగములతో వేటికవే విడివిడిగా పరిభ్రమించగలగడం ఈ ప్రొపెల్లర్ల్ల ప్రత్యేకత. ఫలితంగా కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యం అవుతోంది. ఇందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని కంపెనీ ఉపయోగించింది. కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడటంతో బరువు 385 కిలోలకే పరిమితమైంది. ప్రస్తుత నమూనా గాల్లో సుమారు 177 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. రోడ్డుపై మాత్రం 56 కి.మీ. దూరం వెళ్లగలదని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. రెండు సీట్లుగల మోడల్ ఏ రకం కారు రోడ్డుపై సుమారు 320 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. గాల్లో 177 కి.మీ. దూరం వెళ్లగలదని తెలిపింది. ఫ్లయింగ్ కార్లకన్నా భిన్నమైనది..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లకన్నా తాము రూపొందిస్తున్న కారు భిన్నమైనదని అలెఫ్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఈవీటాల్ ఫ్లయింగ్ ట్యాక్సీల వంటి కార్లు టేకాఫ్ కోసం రోడ్డును రన్ వేలాగా ఉపయోగిస్తాయని.. కానీ తాము అభివృద్ధి చేస్తున్న కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని పేర్కొంది. సాధారణ ప్రజలు ఈ కారును వాడటం ఎంతో సులువని.. కేవలం 15 నిమిషాల్లో కారులోని కంట్రోల్స్పై పట్టు సాధించొచ్చని కంపెనీ సీఈఓ జిమ్ డకోవ్నీ పేర్కొన్నారు. ‘రైట్ బ్రదర్స్ విమాన వీడియో తరహాలో మా కారు ప్రయోగ వీడియో మానవాళికి సరికొత్త రవాణా సాధ్యమని నిరూపిస్తుందని భావిస్తున్నా’అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధర ఎక్కువే..మోడల్ ఏ రకం కారుపై కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి లగ్జరీ కార్ల తరహాలోనే ఈ కారు ధరను సుమారు రూ. 2.57 కోట్లుగా కంపెనీ ఖరారు చేసింది. అయితే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా సుమారు రూ. 27.35 లక్షలకు కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నూటికినూరు శాతం పక్కాగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేపట్టిందని, ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక శాఖకు అప్పగించి పకడ్బందీగా నిర్వహించినట్లు వివరించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం చేయలేదని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థను కుప్పకూల్చే కుట్రలో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. సర్వే చేపట్టిన విధానం, ఫలితాలు, బీసీల జనాభాకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తోపాటు పలువురు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమగ్ర సర్వే, బీసీ జనాభా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ ఎన్నికల కోసం వాడుకున్నారు ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి సర్వే చేపట్టాం. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందే. కేసీఆర్ చేసిన సకలజనుల సర్వే తప్పుల తడకగా ఉన్నందునే ఆ లెక్కలను బయటపెట్టలేదుం. వాటిని ఆయన ఎన్నికల కోసం వాడుకున్నారు.. ప్రజల కోసం వాడలేదు. ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే ప్రక్రియ చేపట్టింది. ఇంటింటికి ఎన్యుమరేటర్లు వెళ్లి సమాచారం సేకరించారు. ఆ సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యుమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించారు. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించాలి. అర్థంలేని ఆరోపణలు పట్టించుకోవాల్సిన పనిలేదు. కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం బీసీలు 51 శాతం ఉంటే.. సమగ్ర ఇంటింటి సర్వే ప్రకారం బీసీ జనాభా 56.33 శాతం ఉంది. బీసీల లెక్క తగ్గిందా? పెరిగిందా? అనే విషయాన్ని బీసీలు గమనించాలి’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ఒకట్రెండు ఆధిపత్యవర్గాల కోసం... జనగణనలో కులగణన చేపట్టాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘స్వతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే ఆందోళనతో కొందరు కుట్ర చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీలోని ఒకట్రెండు ఆధిపత్యకులాల కుట్రల వల్లే ఈ ప్రక్రియ జరగడంలేదు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకి నేను విసిరే సవాల్ ఒక్కటే. జనగణనలో కులగణన చేర్చాలి. అప్పుడే ఎవరి లెక్క ఏంటో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాంం. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10లోగా తీర్మానాలు చేయండి. బీసీలు ఐకమత్యాన్ని చాటాలి. అప్పుడే రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుంది. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, భగవద్గీత, ఖురాన్. భవిష్యత్లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు. కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఉద్యోగాలు పోతాయనే భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సర్వే ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదే. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్లో, ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కేసీఆర్, కిషన్రెడ్డి, బండి సంజయ్కి సవాల్ విసురుతున్నా’ అని రేవంత్ పేర్కొన్నారు. 2011 జనగణనలో ఎస్సీ, ఎస్టీ వివరాలే వెల్లడించారు: భట్టి చివరగా జరిగిన 2011 జనగణనలో కేవలం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే బయటపెట్టారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు. దేశంలో తెలంగాణ ప్రభుత్వం మినహా ఇప్పటివరకు బీసీ జనగణనను శాస్త్రీయంగా తేల్చలేదు. కేసీఆర్ చేసిన సకలజనుల సర్వే అధికారికం కాదని, దానిని కేబినెట్లో పెట్టలేదని, శాసనసభలో చర్చ జరపలేదని, అందుకే అది చెల్లుబాటు కాదన్నారు. దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చి ముద్ర వేశామని, దీనిని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకెళ్లాలో బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలన్నారు. బీసీ సర్వే అధికారికంగా జరగడంతో బీఆర్ఎస్కు నష్టం కలుగుతుందని, అందుకే సర్వే బాగాలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీసీ సర్వే విజయవంతమైతే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందని, అందుకే బీజేపీ నేతలు నేతలు దు్రష్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కులగణనతో తెలంగాణలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. కులగణన సర్వేతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా మారిందని చెప్పారు. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

దాయాదుల సమరానికి సమయం
గత పద్నాలుగేళ్ల కాలంలో వన్డేలు, టి20లు కలిపి భారత్, పాకిస్తాన్ మధ్య 13 మ్యాచ్లు జరిగితే భారత్ 11 గెలిచి 2 మ్యాచ్లలో మాత్రమే ఓటమిపాలైంది... ఇరు జట్ల మధ్య జరిగిన గత 11 వన్డేల్లో భారత్ 9 గెలిచి 2 ఓడింది...ఇది చాలు దాయాదిపై టీమిండియా ఆధిపత్యం ఎలా సాగుతోందో చెప్పడానికి... అయినా సరే...అంతర్జాతీయ క్రికెట్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రతీ సారి అంతే ఉత్సుకత రేపుతుంది... ఆటగాళ్లు, అభిమానులు, ప్రసారకర్తలు, విశ్లేషకులు... ఇలా అందరి దృష్టిలో ఇది ఎంతో ప్రత్యేకమైన సమరం. తుది ఫలితంతో సంబంధం లేకుండా దాయాదుల మధ్య పోరు అంటే ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది. ఆదివారం ఆటవిడుపు వేళ మరో సారి భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆతిథ్య జట్టే అయినా... ఈ మ్యాచ్ కోసం పాక్ దుబాయ్ చేరగా, ఇప్పటికే ఈ వేదికపై ఒక మ్యాచ్ గెలిచిన టీమిండియా ఉత్సాహంగా సిద్ధమైంది. భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ చేరుకుంటుంది. పాక్కు మాత్రం టోర్నీనుంచి నిష్క్రమించకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య. దుబాయ్: వన్డే వరల్డ్ కప్లో తలపడిన దాదాపు 16 నెలల తర్వాత మరో ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ వన్డే సమరానికి సై అంటున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే మ్యాచ్లో ఇరు జట్లు నేడు తలపడతాయి. భారత్ తొలి తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేయగా... పాక్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. బలాబలాలు, ఫామ్పరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ సేనదే పైచేయిగా ఉన్నా... అనూహ్య ప్రదర్శనతో చెలరేగాలని పాకిస్తాన్ భావిస్తోంది. మార్పుల్లేకుండా... గత మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్ తన ఫామ్ను చాటి చెప్పగా, రోహిత్ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి. విరాట్ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు. రాహుల్ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్ను ముగించింది. అక్షర్ బ్యాటింగ్పై టీమ్ మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్లో షమీ అద్భుత పునరాగమనం భారత్ బలాన్ని ఒక్కసారిగా పెంచింది. బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు. గెలిపించేదెవరు! పాకిస్తాన్ జట్టు పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. స్వదేశంలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పడు ఈ మెగా టోర్నీ తొలి పోరులోనూ ఓటమిపాలైంది. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్రేట్పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారత్తో మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంతగడ్డపై చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడే సమయానికి పాక్ ఆట ముగిసిపోతుంది. జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఎన్ని వైఫల్యాలున్నా ఇప్పటికీ టీమ్ నంబర్వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. కానీ గత మ్యాచ్లో కూడా అతను చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ సారి అతని ప్రదర్శన మెరుగవుతుందేమో చూడాలి. ఫఖర్ గాయంతో దూరం కావడంతో టీమ్లోకి వచ్చిన ఇమామ్ కూడా దూకుడుగా ఆడలేడు. రిజ్వాన్, షకీల్ గత మ్యాచ్లో విఫలమయ్యారు. సల్మాన్, ఖుష్దిల్ ప్రదర్శన సానుకూలాంశం. మరో వైపు బౌలింగ్ అయితే మరీ పేలవంగా ఉంది. పాక్ ఎంతో నమ్ముకున్న ముగ్గురు పేసర్లు పోటీ పడి భారీగా పరుగులిస్తున్నారు. ఇటీవలి రికార్డు చూసినా...షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. పైగా ఒక్క నాణ్యమైన స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ఈ నేపథ్యంలో పాక్ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సి ఉంది. 23 వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్లలో పాక్పై భారత్ ఆధిపత్యం ఉన్నా...చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరిగితే భారత్ 2 గెలిచి 3 ఓడింది. 57 - 73 ఓవరాల్గా భారత్, పాకిస్తాన్ మధ్య 135 వన్డేలు జరగ్గా...భారత్ 57 గెలిచి 73 ఓడింది. మరో 5 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. పిచ్, వాతావరణం గత మ్యాచ్ తరహాలోనే నెమ్మదైన పిచ్. కానీ బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చు. వర్ష సమస్య లేదు. మంచు ప్రభావం కూడా లేదు కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, రాణా. పాకిస్తాన్: రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్, షకీల్, బాబర్, సల్మాన్, తాహిర్, ఖుష్దిల్, అఫ్రిది, నసీమ్, రవూఫ్, అబ్రార్.

యాప్ రే.. యాప్!
అరచేతిలో స్మార్ట్ఫోన్– స్మార్ట్ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.మనం వాడే స్మార్ట్ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్లోను, మొబైల్లో యాప్స్పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్లో ‘పబ్జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.అంతర్జాతీయంగా యాప్స్ తీరుప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్డౌన్ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి. మన దేశంలో ఇలా..పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్గా నిలిచాయి. యాప్స్లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి. ‘గేమ్’చేంజర్స్బిలియన్ డాలర్ క్లబ్లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్లో లాస్ట్ వార్, వైట్ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్తోపాటు నాన్ –గేమ్స్లో వీటీవీ ఈ క్లబ్లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్స్టైల్, టేబుల్టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్లో సబ్వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్లో భారత్లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది. సోషల్ మీడియా దూకుడుసోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.చాట్ జీపీటీ మూడంకెల వృద్ధిఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏఐ చాట్బాట్స్ హవాగత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.నాన్ –గేమ్స్ ఆదాయంఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024⇒ ప్రపంచ జనాలు మొబైల్లో వెచ్చించిన సమయం⇒ ప్రపంచ జనాలు యాప్స్తో గడిపిన సగటు సమయం 500 గంటలు⇒ ఒక్కొక్కరు మొబైల్తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు⇒ నిద్రలేవగానే మొబైల్తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు⇒యాప్స్ డౌన్లోడ్స్ 13,600 కోట్లు⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్లోడ్స్ 2.58 లక్షలు⇒మొత్తం డౌన్లోడ్స్లో భారత్ వాటా 17.91 శాతం

ఈవీ చార్జ్!
ఛార్జింగ్కు ఎక్కువ సమయం పట్టడం, ఒకసారి చార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందోనన్న ఆందోళన, మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండడం, వినియోగదారులకు భరోసా లేకపోవడం.. ఈ అంశాలే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) వృద్ధి వేగానికి ప్రధాన అడ్డంకులు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు బ్యాటరీల సామర్థ్యం పెంచడానికి, వేగంగా చార్జింగ్ పూర్తి కావడానికి తయారీ సంస్థలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. చార్జింగ్ మౌలిక వసతులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో వినియోగదార్లలో ఈవీల పట్ల ఆమోదం క్రమంగా పెరుగుతోంది. ఇందుకు అమ్ముడవుతున్న ఈవీలే నిదర్శనం. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కితే.. ఇందులో ఈవీలు 7.46 శాతం వాటాతో 19,49,114 యూనిట్లు కైవసం చేసుకున్నాయి. ఆసక్తికర అంశం ఏమంటే మొత్తం వాహన పరిశ్రమ గత ఏడాది 9.11 శాతం వృద్ధి చెందితే.. ఎలక్ట్రిక్ వాహన విభాగం ఏకంగా 27 శాతం దూసుకెళ్లడమే. రికార్డుల దిశగా..భారత్లో ఈవీ పరిశ్రమ 2024లో గరిష్ట విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. నిముషానికి 3.7 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2015–2024 కాలంలో 54 లక్షల యూనిట్ల ఈవీలు రోడ్డెక్కాయి. ప్రస్తుత వృద్ధి వేగాన్నిబట్టి ఈవీ రంగంలో 2029–30 నాటికి ప్యాసింజర్ కార్స్ విక్రయాలు 9.60 లక్షల యూనిట్లకు చేరవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. అలాగే టూవీలర్స్ 1.37 కోట్ల యూనిట్లు, త్రీవీలర్స్ 12.8 లక్షల యూనిట్లను తాకుతాయని ఈవీ రంగం భావిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నూతన సాంకేతికత, కంపెనీల దూకుడు.. వెరసి చార్జింగ్ స్టేషన్స్ సంఖ్య 13.2 లక్షలకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో 2024 డిసెంబర్ 20 నాటికి 25,202 చార్జింగ్ స్టేషన్స్ వినియోగంలో ఉన్నాయి. మొత్తం త్రిచక్ర వాహన అమ్మకాల్లో ఈ–త్రీవీలర్స్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. 210 కంపెనీలు ఈ–టూవీలర్స్ విభాగంలో పోటీపడుతున్నాయి. డిసెంబర్ నెల అమ్మకాల్లో టూవీలర్స్ సెగ్మెంట్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో టాప్–2లో ఉన్నాయి. త్రీవీలర్స్లో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, బజాజ్ ఆటో, ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో టాటా మోటార్స్, జేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఐసీఈ విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీల్లోనూ పాగా వేస్తున్నాయి.వ్యయాలు తగ్గినప్పటికీ..ఐసీఈ ఇంజన్ కలిగిన వాహనాలతో పోలిస్తే ఈవీకి అయ్యే రోజువారీ వ్యయాలు తక్కువ. అయితే ప్రతిరోజు తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈవీ చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. అవసరం నిమిత్తం సుదూర ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం మరో మార్గం వెతుక్కోవాల్సిందే. ఐసీఈ వాహనాల మాదిరిగా దారిలో పెట్రోల్, డీజిల్ పోయించుకుని గమ్యం చేరినట్టు ఈవీలకు వీలు కాదు. ఒకవేళ ఈవీతో దూర ప్రయాణం చేయాల్సి వస్తే.. చార్జింగ్ కేంద్రాల వద్ద బ్యాటరీ చార్జింగ్ పూర్తి అయ్యే వరకు నిరీక్షించాల్సిందే. ఈ అంశమే ఈవీల వృద్ధి వేగానికి స్పీడ్ బ్రేకర్గా నిలిచింది. చార్జింగ్నుబట్టి ప్రయాణాలు ఆధారపడతున్నాయని కస్టమర్లు అంటున్నారు. ఈ–కామర్స్ కంపెనీలతో..ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వృద్ధికి ఈ–కామర్స్ కంపెనీల దూకుడు కూడా తోడవుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ఈ కంపెనీలు నడుం బిగించడం ఇందుకు కారణం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ సంస్థలు, ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లూ, స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో వంటి క్విక్ కామర్స్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విషయంలో డెలివరీ పార్ట్నర్స్, డ్రైవర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. సులభ వాయిదాల్లో ఈవీల కొనుగోలు, బ్యాటరీల స్వాపింగ్ సౌకర్యాలు, చార్జింగ్ మౌలిక వసతులను కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. వెన్నుదన్నుగా ప్రభుత్వం..ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి కొత్తతరం ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాలు, వాహన విడిభాగాల పరిశ్రమకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ విభాగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ పథకానికి రూ.10,900 కోట్ల విలువైన ఇన్సెంటివ్స్ అందిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతిస్తోంది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్లాంట్లు స్థాపించే సంస్థలు పూర్తిగా తయారైన ఈవీలను దిగుమతి చేస్తే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి తగ్గించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ రంగంలో 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ మార్కెట్ ఆరేళ్లలో ప్రపంచంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని భారత ప్రభుత్వం ధీమాగా ఉంది. కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 2030 నాటికి 30 శాతం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం.రీసేల్ వాల్యూ సవాల్..ఐసీఈ వాహనాల స్థాయిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈవీలకు డిమాండ్ లేకపోవడం కస్టమర్లను నిరాశకు గురిచేస్తోంది. రీసేల్ వాల్యూ పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన డిమాండ్ను పరిమితం చేస్తోందని కియా ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు. జీఎస్టీ, రహదారి పన్ను ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఖరీదైన బ్యాటరీ కారణంగా ఐసీఈ వాహనంతో పోలిస్తే ఈవీ ధర ఎక్కువగా ఉంటోంది. ఈ అంశం కూడా ఈవీ స్వీకరణను పరిమితం చేస్తూనే ఉంది. ఈవీలు మరింత చవకగా మారితేనే డిమాండ్ ఊపందుకుంటుందన్నది కస్టమర్ల మాట. ఐసీఈ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల ధర 30–50% ఎక్కువ. అలాగే ద్విచక్ర వాహనాల ధర 20–30% అధికంగా ఉంటోంది. – సాక్షి, బిజినెస్ బ్యూరో.
నీలకంఠా.. నమోనమామి!
నేలపట్లలో బర్డ్ఫ్లూ.. నిర్ధారించిన అధికారులు
పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు!
మఖానా... మా ఖానా!
నేడు మహాకుంభాభిషేక సంప్రోక్షణ
ప్రాధాన్య ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు!
పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
హీరోలా ఎగిరే జీరో..
వసంత యోగం
షినెల్ హెన్రీ హిట్టింగ్
సర్.. ప్రజలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అంటున్నారు!
ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం.. శుభవార్తలు వింటారు.
ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ
ఒక్క భారత్ ఏంటి సార్! ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలైనా మనం జోక్యం చేసుకుంటున్నాం!
ఈపీఎఫ్ విత్డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
తెల్ల బియ్యం తిన్నా... షుగర్ పెరగదు
ఐఏఎస్ రోహిణి Vs ఐపీఎస్ రూపాల వివాదం మళ్లీ తెరపైకి..!
IND Vs PAK: పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
పాస్పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
నీలకంఠా.. నమోనమామి!
నేలపట్లలో బర్డ్ఫ్లూ.. నిర్ధారించిన అధికారులు
పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు!
మఖానా... మా ఖానా!
నేడు మహాకుంభాభిషేక సంప్రోక్షణ
ప్రాధాన్య ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు!
పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
హీరోలా ఎగిరే జీరో..
వసంత యోగం
షినెల్ హెన్రీ హిట్టింగ్
సర్.. ప్రజలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అంటున్నారు!
ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం.. శుభవార్తలు వింటారు.
ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ
ఒక్క భారత్ ఏంటి సార్! ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలైనా మనం జోక్యం చేసుకుంటున్నాం!
ఈపీఎఫ్ విత్డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
తెల్ల బియ్యం తిన్నా... షుగర్ పెరగదు
ఐఏఎస్ రోహిణి Vs ఐపీఎస్ రూపాల వివాదం మళ్లీ తెరపైకి..!
IND Vs PAK: పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
పాస్పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
సినిమా

ఓ ప్రేమ... ప్రేమ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారు.‘జారే కన్నీరే అడుగుతుందా.. . నేరం ఏముందో చెప్పమంటూ... నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా... నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా...’ అంటూ భావోద్వేంగా సాగుతుందీ పాట. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని రమ్యా బెహ్రా పాడారు. ‘‘ఒక వినూత్నమైన ప్రేమ కథతో ‘ఆర్టిస్ట్’ సినిమా రూపొందింది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘చూస్తూ చూస్తూ..’ సాంగ్కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘సత్యం’ రాజేశ్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, పి.సోనియా ఆకుల, స్నేహా, మాధురి శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: చందూ ఏజే, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సురేష్ బసంత్, లైన్ ప్రోడ్యూసర్: కుమార్ రాజా.

హరోం హర
మహా శివరాత్రి పర్వదినం (ఫిబ్రవరి 26) సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహా శివరాత్రికి జాగరణ చేసేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తుతారు. ఆ రోజు శివాలయాలన్నీ హరోం హర అంటూ శివనామ స్మరణతో మార్మోగుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా మహా శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. శివుడి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. తాజాగా పరమేశ్వరుడి నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే శివ భక్తి నేపథ్యంలో పాటలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాల గురించి తెలుసుకుందాం.శివుడి నేపథ్యంలో...తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఆహార దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో పోస్టర్లో ఉంది.అంటే... ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని కచ్చితంగా ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందని చెప్పకనే చెప్పింది యూనిట్. ఈ సినిమాలో మురికి వాడల్లో నివశించే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉంటుంది. అలాగే ముంబైకి చెందిన ఓ ధనవంతుడి పాత్రలో నాగార్జున కనిపించనుండగా, రష్మికా మందన్న మధ్యతరగతి యువతి పాత్ర చేస్తున్నారు. నటుడు జిమ్ సర్భ్ ఓ బిలియనీర్ బిజినెస్ మ్యాన్గా కనిపిస్తారు. శివ భక్తుడి కథమంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై మంచు మోహన్బాబు పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది ‘కన్నప్ప’ యూనిట్. పరమశివుడికి వీర భక్తుడైన కన్నప్ప నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కన్నప్పలోని వీరత్వం, భక్తిని మేళవించి ఈ మూవీ తెరకెక్కించారు ముఖేశ్ కుమార్ సింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయడం విశేషం. శివ తాండవం చేస్తున్న అక్షయ్ కుమార్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.శివుడిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో ఆ పోస్టర్ ద్వారా చూపించింది యూనిట్. అంతేకాదు... ఈ సినిమా నుంచి విడుదలైన ‘శివ శివ శంకరా...’ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్కి పెద్ద పీట వేశారు. ఈ మూవీలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మధుబాల, ప్రీతీ ముకుందన్, ఐశ్వర్య, దేవరాజ్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. శివ తాండవం పాప వినాశక సాక్షాత్ సాంబ శివ అంటూ ఆడి పాడుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై కథానాయికలు. పెన్ స్టూడియోస్పై డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో శివుడి నేపథ్యంలో ఓ పాట తెరకెక్కించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘భైరవం’ థీమ్ సాంగ్ను విడుదల చేసింది యూనిట్. ఈ పాటలో పరమ శివుని భయం, బలం ఈ రెండింటినీ తన హావభావాలు, నృత్యంతో అద్భుతంగా కనబరిచారు సాయి శ్రీనివాస్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు.‘‘ఈ నెల 26న రానున్న మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక పాటని విడుదల చేశాం. పరమ శివుడి దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. సాయి శ్రీనివాస్ పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. జటాధరవైవిధ్యమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ భన్సల్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర వీటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పరమ శివుడితో ముడిపడిన కథే అని సమాచారం. పైగా టైటిల్ని బట్టి చూస్తే ఇదే వాస్తవం అనిపిస్తుంది. జటాధరుడు అని పరమ శివుణ్ణి పిలుస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.పరమ శివుని భక్తురాలుహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ తేజ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్నారు.సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో శివ భక్తురాలైన శివ శక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ సింహ భాగం వారణాసిలోని కాశీలో జరిగింది. శనివారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇవే కాదు... మరికొన్ని సినిమాలు కూడా శివుడి నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.

పెళ్లెప్పుడంటే...?
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్గా అదే ఆమె మొదటి సినిమా.⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్ను తిరస్కరించింది.⇒ బన్తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది.

గొడ్రాలిని చేసి పిచ్చిదానిగా చిత్రీకరించాడు: నటుడిపై మూడో మాజీ భార్య ఆరోపణలు
మలయాళ నటుడు బాలా (Actor Bala) గతేడాది కోకిలను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ జంటగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్లో ఈ జంటను ఆశీర్వదిస్తూ అతడి మాజీ భార్యపై అనుచిత కామెంట్లు చేశారు. బాల రెండో మాజీ భార్య, డాక్టర్ ఎలిజబెత్ నటుడిని ప్రలోభపెట్టిందని, అతడు హాస్పిటల్కు వెళ్లినప్పుడు బాలాను వశం చేసుకుందని ఆరోపించారు. ఒకవేళ రోగి ప్రపోజ్ చేసినా డాక్టర్గా దాన్ని అంగీకరించకూడదు. కానీ ఆమె నటుడిని వశపరుచుకుంది. ఇది వైద్య వృత్తికే కళంకం అని కామెంట్స్ చేశారు. దీనిపై ఎలిజబెత్ ఘాటుగా స్పందించింది.అంత డబ్బు లేదునిజంగా నేనలా చేసుంటే నాపై ఫిర్యాదు చేయొచ్చుగా! నేను అతడిని బెదిరించానా? ఇలాంటి ప్రచారం చేయించేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు. రాజకీయ నాయకుల సపోర్ట్ అసలే లేదు. అంతెందుకు, ఒకసారి నువ్వు నాపై అత్యాచారం చేశాక.. ఇంటికి తీసుకెళ్లండంటూ చెన్నైలోని ఓ పోలీసాఫీసర్ నా పేరెంట్స్కు ఫోన్ చేశాడు. చచ్చిపోదామని ప్రయత్నించాను. నేను నీ భార్య కాదని చెప్తున్నావు. అలాగైతే నా అనుమతి లేకుండా నువ్వు చేసిన పనిని ఇంకేమంటారు? జనాలు నా గురించి నోటికొచ్చింది వాగుతున్నప్పుడు నేను నోరు విప్పక తప్పడం లేదు.పిచ్చిదాన్నని ప్రచారం..నేను నిజాల్ని వెల్లడిస్తూ పోస్ట్ పెట్టడం నేరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను చట్టపరంగా ముందుకు వెళ్లాలన్నా కూడా గతంలో ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నిస్తారు. నేను ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు. నాకు మానసిక స్థితి సరిగా లేదని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ పోస్ట్ను సాక్ష్యంగా పెట్టుకోండి అని ఫేస్బుక్లో రాసుకొచ్చింది.చిత్రహింసలుమరో పోస్ట్లో.. బాలాను నేను ఫేస్బుక్లో కలిశాను. అతడు నాతో రిలేషన్లో ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో చేసిన చాటింగ్, వాయిస్ రికార్డింగ్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. పోలీసుల ఎదుట మా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి అతిథులు కూడా వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎలా పెళ్లి చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు. నా కుటుంబాన్ని కూడా వేధించాడు. తన గురించి చెప్తే వదిలిపెట్టనని గూండాలతో హెచ్చరించాడు. మా బెడ్రూమ్ వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు. అమ్మాయిలతో ఆడుకున్నాడుడిప్రెషన్లోకి వెళ్లిపోయి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. నన్నే కాదు చాలామంది అమ్మాయిలను మోసం చేశాడు. ఇదంతా టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నేను గొడ్రాలినని అందరి ముందు నానా మాటలన్నాడు అని ఫేస్బుక్లో రాసుకొచ్చింది. కాగా బాలా సినీ నేపథ్యానికి చెందిన కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తాతయ్యకు అరుణాచల స్టూడియో ఉండగా తండ్రి 350కు పైగా సినిమాలు డైరెక్ట్ చేశాడు. బాలా సోదరుడు శివ కంగువా సినిమాను డైరెక్ట్ చేశాడు. బాలా పర్సనల్ లైఫ్బాలా 2మచ్ అనే తెలుగు సినిమాతో నటుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఇతడు చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులిచ్చేసి అమృతా సురేశ్ను పెళ్లాడాడు. ఆమెతోనూ విడిపోయిన తర్వాత డాక్టర్ ఎలిజబెత్ను వివాహం చేసుకున్నాడు. చివరకు ఆమెను కూడా వదిలేసి ఇటీవలే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి:
క్రీడలు

దాయాదుల సమరానికి సమయం
గత పద్నాలుగేళ్ల కాలంలో వన్డేలు, టి20లు కలిపి భారత్, పాకిస్తాన్ మధ్య 13 మ్యాచ్లు జరిగితే భారత్ 11 గెలిచి 2 మ్యాచ్లలో మాత్రమే ఓటమిపాలైంది... ఇరు జట్ల మధ్య జరిగిన గత 11 వన్డేల్లో భారత్ 9 గెలిచి 2 ఓడింది...ఇది చాలు దాయాదిపై టీమిండియా ఆధిపత్యం ఎలా సాగుతోందో చెప్పడానికి... అయినా సరే...అంతర్జాతీయ క్రికెట్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రతీ సారి అంతే ఉత్సుకత రేపుతుంది... ఆటగాళ్లు, అభిమానులు, ప్రసారకర్తలు, విశ్లేషకులు... ఇలా అందరి దృష్టిలో ఇది ఎంతో ప్రత్యేకమైన సమరం. తుది ఫలితంతో సంబంధం లేకుండా దాయాదుల మధ్య పోరు అంటే ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది. ఆదివారం ఆటవిడుపు వేళ మరో సారి భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆతిథ్య జట్టే అయినా... ఈ మ్యాచ్ కోసం పాక్ దుబాయ్ చేరగా, ఇప్పటికే ఈ వేదికపై ఒక మ్యాచ్ గెలిచిన టీమిండియా ఉత్సాహంగా సిద్ధమైంది. భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ చేరుకుంటుంది. పాక్కు మాత్రం టోర్నీనుంచి నిష్క్రమించకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య. దుబాయ్: వన్డే వరల్డ్ కప్లో తలపడిన దాదాపు 16 నెలల తర్వాత మరో ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ వన్డే సమరానికి సై అంటున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే మ్యాచ్లో ఇరు జట్లు నేడు తలపడతాయి. భారత్ తొలి తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేయగా... పాక్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. బలాబలాలు, ఫామ్పరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ సేనదే పైచేయిగా ఉన్నా... అనూహ్య ప్రదర్శనతో చెలరేగాలని పాకిస్తాన్ భావిస్తోంది. మార్పుల్లేకుండా... గత మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్ తన ఫామ్ను చాటి చెప్పగా, రోహిత్ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి. విరాట్ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు. రాహుల్ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్ను ముగించింది. అక్షర్ బ్యాటింగ్పై టీమ్ మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్లో షమీ అద్భుత పునరాగమనం భారత్ బలాన్ని ఒక్కసారిగా పెంచింది. బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు. గెలిపించేదెవరు! పాకిస్తాన్ జట్టు పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. స్వదేశంలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పడు ఈ మెగా టోర్నీ తొలి పోరులోనూ ఓటమిపాలైంది. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్రేట్పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారత్తో మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంతగడ్డపై చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడే సమయానికి పాక్ ఆట ముగిసిపోతుంది. జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఎన్ని వైఫల్యాలున్నా ఇప్పటికీ టీమ్ నంబర్వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. కానీ గత మ్యాచ్లో కూడా అతను చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ సారి అతని ప్రదర్శన మెరుగవుతుందేమో చూడాలి. ఫఖర్ గాయంతో దూరం కావడంతో టీమ్లోకి వచ్చిన ఇమామ్ కూడా దూకుడుగా ఆడలేడు. రిజ్వాన్, షకీల్ గత మ్యాచ్లో విఫలమయ్యారు. సల్మాన్, ఖుష్దిల్ ప్రదర్శన సానుకూలాంశం. మరో వైపు బౌలింగ్ అయితే మరీ పేలవంగా ఉంది. పాక్ ఎంతో నమ్ముకున్న ముగ్గురు పేసర్లు పోటీ పడి భారీగా పరుగులిస్తున్నారు. ఇటీవలి రికార్డు చూసినా...షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. పైగా ఒక్క నాణ్యమైన స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ఈ నేపథ్యంలో పాక్ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సి ఉంది. 23 వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్లలో పాక్పై భారత్ ఆధిపత్యం ఉన్నా...చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరిగితే భారత్ 2 గెలిచి 3 ఓడింది. 57 - 73 ఓవరాల్గా భారత్, పాకిస్తాన్ మధ్య 135 వన్డేలు జరగ్గా...భారత్ 57 గెలిచి 73 ఓడింది. మరో 5 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. పిచ్, వాతావరణం గత మ్యాచ్ తరహాలోనే నెమ్మదైన పిచ్. కానీ బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చు. వర్ష సమస్య లేదు. మంచు ప్రభావం కూడా లేదు కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, రాణా. పాకిస్తాన్: రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్, షకీల్, బాబర్, సల్మాన్, తాహిర్, ఖుష్దిల్, అఫ్రిది, నసీమ్, రవూఫ్, అబ్రార్.

ఇన్గ్లిస్ ధనాధన్ షో
లాహోర్: ఐసీసీ చాంపియన్స్(ICC Champions) ట్రోఫీలో పలు రికార్డుల్ని చెరిపేసిన మ్యాచ్లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్(England)నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.మిడిలార్డర్ బ్యాటర్ జో రూట్ (78 బంతుల్లో 68; 4 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి గెలిచింది. 136/4 స్కోరు వద్ద ఓటమి వెంటాడుతున్న దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ ఇన్గ్లిస్ (86 బంతుల్లో 120 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు సెంచరీతో జట్టును గెలిపించే దాకా క్రీజులో నిలిచాడు.ఓపెనర్ మాథ్యూ షార్ట్ (66 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (63 బంతుల్లో 69; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, లబుõÙన్ (45 బంతుల్లో 47; 5 ఫోర్లు) రాణించాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అండగా నిలిచాడు. 2009 తర్వాత ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీలో గెలవడం ఇదే తొలిసారి. 2013 ఈవెంట్లో రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్ రద్దయ్యింది. 2017లో రెండు మ్యాచ్లు రద్దవగా, ఓ మ్యాచ్లో ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల ఛేదన చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 10; డకెట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లబుషేన్ 165; జేమీ స్మిత్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 15; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 68; హ్యారీ బ్రూక్ (సి) కేరీ (బి) జంపా 3; బట్లర్ (సి) ఎలీస్ (బి) మ్యాక్స్వెల్ 23; లివింగ్స్టోన్ (సి) ఎలిస్ (బి) డ్వార్షుయిస్ 14; కార్స్ (సి) అండ్ (బి) లబుõÙన్ 8; ఆర్చర్ నాటౌట్ 21; రషీద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 351.వికెట్ల పతనం: 1–13, 2–43, 3–201, 4–219, 5–280, 6–316, 7–322, 8–338. బౌలింగ్: జాన్సన్ 7–0–54–0, డ్వార్షుయిస్ 10–0–66–3, నాథన్ ఎలిస్ 10–0–51–0, మ్యాక్స్వెల్ 7–0–58–1, జంపా 10–0–64–2, షార్ట్ 1–0–7–0, లబుõÙన్ 5–0–41–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) అండ్ (బి) లివింగ్స్టోన్ 63; హెడ్ (సి) అండ్ (బి) ఆర్చర్ 6; స్మిత్ (సి) డకెట్ (బి) వుడ్ 5; లబుషేన్ (సి) బట్లర్ (బి) రషీద్ 47; ఇంగ్లిస్ నాటౌట్ 120; కేరీ (సి) బట్లర్ (బి) కార్స్ 69; మ్యాక్స్వెల్ నాటౌట్ 32; ఎక్స్ట్రాలు 14; మొత్తం (47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 356. వికెట్ల పతనం: 1–21, 2–27, 3–122, 4–136, 5–282. బౌలింగ్: మార్క్వుడ్ 9.3–0–75–1, జోఫ్రా ఆర్చర్ 10–0–82–1, కార్స్ 7–0–69–1, రషీద్ 10–1–47–1, లివింగ్స్టోన్ 7–0–47–1, రూట్ 4–0–26–0.లాహోర్లో ‘భారత భాగ్య విధాత’ భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లలేదు... ఆ దేశంలో మ్యాచ్ ఆడటం లేదు... అయినా సరే మన జనగణమన... అక్కడ మోగింది. నిర్వాహకులు చేసిన పొరపాటు వల్ల ఇది చోటు చేసుకుంది. ఏదైనా మ్యాచ్కు ముందు ఇరు జట్ల జాతీయ గీతాలు వినిపించడం రివాజు. శనివారం కూడా ముందుగా ఇంగ్లండ్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద కింగ్’ వినిపించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా ‘అడ్వాన్స్ ఆ్రస్టేలియా ఫెయిర్’ రావాల్సి ఉంది. అయితే ఆసీస్ జెండా కనిపిస్తుండగా సాంకేతిక పొరపాటు జరిగింది.భారత జాతీయ గీతంలోని పదం ‘భారత భాగ్య విధాత’ వినిపించింది. ఒక్కసారిగా షాక్కు గురైన సిబ్బంది దానిని వెంటనే నిలిపివేశారు. అయితే అప్పటికే అది ప్రసారం అయిపోయింది. దీనిపై పాక్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. మైదానంలో నిర్వహణా బాధ్యతలు చూస్తున్న ఐసీసీ వివరణ ఇవ్వాలని కోరింది.

చరిత్ర సృష్టించిన బెన్ డకెట్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికి డకెట్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. స్టార్ బ్యాటర్ జో రూట్తో కలిసి స్కోర్ బోర్డును డకెట్ పరుగులు పెట్టించాడు.ఈ జోడీ మూడో వికెట్కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో కేవలం 95 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్ను డకెట్ అందుకున్నాడు. ఓవరాల్గా 143 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో 165 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జో రూట్ (68), కెప్టెన్ జోస్ బట్లర్ (23) రాణించారు.డకెట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన డకెట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.డకెట్ సాధించిన రికార్డులు ఇవే..👉ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్గా డకెట్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం నాథన్ ఆస్ట్లీ పేరిట ఉండేది. నాథన్ ఆస్ట్ లీ 2004లో అమెరికాపై 145 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ఆస్ట్లీ రికార్డును డకెట్ బ్రేక్ చేశాడు.👉ఐసీసీ టోర్నమెంట్(వన్డే వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డకెట్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో ఆసీస్ పై సచిన్ 141 పరుగులు చేశాడు. 👉ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగానూ డకెట్ రికార్డు సాధించాడు. కెవిన్ పీటర్సన్ ను అతడు అధిగమించాడు. 2007 వన్డే ప్రపంచకప్ లో పీటర్సన్ ఆసీస్ పై 104 పరుగులు చేశాడు.చదవండి: Champions Trophy: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టుకు ‘స్పెషల్ కోచ్’

టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టుకు ‘స్పెషల్ కోచ్’
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో హైవోల్టేజ్ మ్యాచ్కు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్(IND-PAK) జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్.. పాక్పై కూడా గెలిచి సెమీస్కు ఆర్హత సాధించాలని పట్టుదలతో ఉంది.కానీ పాకిస్తాన్కు మాత్రం ఇది డూర్ ఆర్ డై మ్యాచ్. మొదటి మ్యాచ్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్పై ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.కేవలం ఒక్క మ్యాచ్ కోసం తమ జట్టు స్పెషల్ కోచ్గా మాజీ క్రికెటర్ ముదాసర్ నాజర్ను పీసీబీ నియమించింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్తో కలిసి ముదాసర్ పనిచేయనున్నాడు. రెండు రోజుల కిందటే జట్టుతో కలిసిన ముదాసర్.. ప్రాక్టీస్ సెషన్లో తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచుకున్నాడు.కాగా ముదాసర్ దుబాయ్ పిచ్ కండీషన్స్పై విస్తృతమైన అవగాహన ఉంది. అతడు గత కొంతకాలంగా దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముదాసర్ను పాక్ క్రికెట్ బోర్డు తమ జట్టు కోచింగ్ స్టాప్లోకి తీసుకుంది. కాగా ముదాసర్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. గతంలో పాకిస్తాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్గా అతడు పనిచేశాడు. అంతేకాకుండా లాహోర్లోని పీసీబీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ డైరకర్ట్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన ముదాసర్ పాకిస్తాన్ తరఫున 76 టెస్ట్లు ఆడి 4114 పరుగులు, 122 వన్డేల్లో 2653 పరుగులు చేశాడు.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: Champions Trophy: కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్మేన్లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్
బిజినెస్

‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?
మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సులేవీ ఎన్నటికీ సాటిరావని మరోసారి నిరూపితమైంది. ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ఏఐ (xAI) తాజాగా విడుదల చేసిన ఏఐ చాట్బాట్ గ్రోక్ 3 (Grok 3).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరణశిక్ష విధించాలని పేర్కొంది. తన యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా మరణశిక్షకు అర్హుడని చెప్పింది. దీనికి సంబంధించిన చాట్బాట్ ప్రతిస్పందనలను ఒక డేటా సైంటిస్ట్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేశారు.అమెరికాలో ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఎవరు వారు చేసిన తప్పులకు మరణశిక్షకు అర్హుడని గ్రోక్ను సదరు డేటా సైంటిస్ట్ అడిగారు. ఇందు కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేయకూడదని, నేరుగా సమాధానం చెప్పాలని సూచించారు. దానికి గ్రోక్ ఎలా ప్రతిస్పందించిందో ఆ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. చాట్బాట్ మొదటగా లైంగిక కేసులో దోషిగా తేలిన జఫ్రీ ఎప్స్టీన్ పేరును పేర్కొంది.అయితే జఫ్రీ ఎప్స్టీన్ ఇప్పటికే చనిపోయాడని యూజర్ గుర్తు చేయడంతో చాట్బాట్ క్షమాపణలు చెప్పి తర్వాత అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును సూచించింది. తాను చేసిన తప్పునకు మరణశిక్షకు అర్హుడైన అమెరికా పౌరుడిగా ట్రంప్ను పేర్కొంటూ తన సమాధానాన్ని అప్డేట్ చేసింది.మరో యూజర్ కూడా గ్రోక్ ని అదే ప్రశ్న అడిగారు. కానీ మరణ శిక్షకు ట్రంప్ ఎందుకు అర్హుడని ప్రశ్నించగా "చట్టపరమైన, నైతిక జవాబుదారీతనం దృష్ట్యా ఆయన చర్యలు, వాటి ప్రభావం ఆధారంగా తాను డోనాల్డ్ ట్రంప్ పేరును సూచించాను" అని గ్రోక్ సమాధానమిచ్చింది. కాపిటల్ అల్లర్ల వివాదంలో ట్రంప్ చర్యలను, "2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేయడానికి ఆయన చేసిన డాక్యుమెంట్ ప్రయత్నాలను" ఇది ఉదహరించింది. మోసం, పన్ను ఎగవేత ఆరోపణలు, అనేక "విశ్వసనీయ లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను" కూడా ఇది ప్రస్తావించింది.ది వెర్జ్ కూడా గ్రోక్ని ఇలాంటి ప్రశ్నే అడిగింది. అయితే ప్రజా వ్యవహారాలు, సాంకేతికతపై వారి ప్రభావం ఆధారంగా మరణశిక్షకు అర్హుడు ఎవరంటూ ప్రశ్నించగా ఈ చాట్బాట్ దాని యజమాని ఎలాన్ మస్క్ పేరునే పేర్కొంది. ది వెర్జ్తోపాటు అనేక మంది సోషల్ మీడియా యూజర్ల ప్రకారం.. డేటా సైంటిస్ట్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే గ్రోక్లోని ఎర్రర్ను సరిదిద్దారు. దీని తర్వాత చాట్బాట్ ఇప్పుడు మరణశిక్షపై ప్రశ్నలకు స్పందిస్తూ “ఒక ఏఐగా నాకు ఆ ఎంపికకు అనుమతి లేదు” అని చెబుతోంది.హానికర సలహాలుఏఐ చాట్ బాట్లు ఇలాంటి హానికర సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్యారెక్టర్. ఏఐ రూపొందించిన సంస్థ రూపొందించిన చాట్బాట్ టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల బాలుడికి ఒక దారుణమైన సూచన చేసింది. ఆ టీనేజర్ స్క్రీన్ టైమ్ కు పరిమితులు విధిస్తున్నందున అతని తల్లిదండ్రులను చంపేయడం "సహేతుకమైన ప్రతిస్పందన" అని సలహా ఇచ్చింది. ఈ రెస్పాన్స్ పై షాక్ కు గురైన ఆ తల్లిదండ్రులు ఆసంస్థ పై కోర్టులో కేసు కూడా వేశారు. మరో సంఘటనలో హోమ్ వర్క్ కోసం సాయం అడిగిన ఓ స్టూడెంట్ ను గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ చనిపోవాలని చెప్పింది. ‘మీరు ఈ సమాజానికి భారం. దయచేసి చనిపోండి’ అని ఏఐ చాట్ బాట్ ఇచ్చిన సమాధానం గతంలో వైరల్ గా మారింది.

ఏఐ ఏజెంట్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ప్రభావం!
ఓపెన్ఏఐ (OpenAI) తన 'ఏఐ ఏజెంట్'ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్లోని చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే 'ఏఐ ఏజెంట్' ఇప్పుడు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్స్టెయిన్, ఐస్లాండ్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Operator is now rolling out to Pro users in Australia, Brazil, Canada, India, Japan, Singapore, South Korea, the UK, and most places ChatGPT is available.Still working on making Operator available in the EU, Switzerland, Norway, Liechtenstein & Iceland—we’ll keep you updated!— OpenAI (@OpenAI) February 21, 2025యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్లైన్ టాస్క్లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్.. ఆపరేటర్ కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ ఆధారంగా పనులు పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్పుట్లను స్వీకరించి.. లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు, ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని.. ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్.. వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు.ఇదీ చదవండి: 'భారత్లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై.. ప్రభావం చూపుతుంది. కొంతమందిపై అయిన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.

అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్వర్త్ 91.1 బిలియన్ డాలర్లు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ , ఇషా అంబానీ, అనంత్ అంబానీలు చేతికొచ్చారు. కుటుంబ వ్యాపారంలో వారు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కంపెనీలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు.అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు వారసుల్లో ఎవరు ఎక్కువ సంపన్నులు (Richest) అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆకాశ్, అనంత్, ఇషా అంబానీల నెట్ వర్త్ ఎంత? వ్యాపారంలో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా పరిశీలిద్దాం..ఆకాష్ అంబానీముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఇషా అంబానీకి కవల సోదరుడు అయిన ఆకాష్ (Akash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్గా కూడా ఉన్నారు . ఆకాష్ వార్షిక జీతం రూ . 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ . 3,32,815 కోట్లు ) నెట్వర్త్ను సంపాదించారు.ఇషా అంబానీ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani).. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని కలిగి ఉన్నారు . ఆమె రిలయన్స్ రిటైల్ , రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్లలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందంలో కీలక సభ్యురాలు కూడా. అంతే కాకుండా తీరా బ్యూటీకి ఇషా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె వార్షిక జీతం సుమారు రూ . 4.2 కోట్లు. ఆమె నెట్వర్త్ రూ . 800 కోట్లని అంచనా.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ (Anant Ambani). రిలయన్స్ జియోలో ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ రంగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అనంత్ వార్షిక జీతం రూ . 4.2 కోట్లు. నెట్వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు ( సుమారు రూ . 3,32,482 కోట్లు).ఆకాషే అత్యంత రిచ్ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. తన తమ్ముడు అనంత్ కంటే స్వల్ప ఆధిక్యంతో 40.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇక ఇషా అంబానీ విషయానికి వస్తే రూ .800 కోట్ల నెట్వర్త్తో సోదరులిద్దరి కన్నా ఆమడ దూరంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంబానీ వారసులందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు.

కొత్త ఐఫోన్ 16ఈ: ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్
యాపిల్ ఇటీవలే తన ఐఫోన్ 16ఈ లాంచ్ చేసింది. కంపెనీ ఫ్రీ ఆర్డర్స్ తీసుకోవడం శుక్రవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది. కాగా డెలివరీలు 28 నుంచి ఉంటాయని సమాచారం. అయితే ఈ ఫోన్ కొనుగోలుపైన సంస్థ డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.'ఐఫోన్ 16ఈ'ను అమెరికన్ ఎక్స్ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 4000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఎక్స్ఛేంజ్ కింద రూ. 6000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మీరు ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. 256GB & 512GB మోడళ్ల ధరలు వరుసగా రూ. 69,900.. రూ. 89,900గా ఉన్నాయి.ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.ఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్పాడ్లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఫ్యామిలీ

వరుడి ముద్దు : రెడ్ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురు
బాలీవుడ్ లెజెండ్రీ నటుడు రాజ్ కపూర్ మనవడు, నటుడు అదార్ జైన్, అలేఖా అద్వానీని హిందు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 12న గోవాలో గోవాలో పెళ్లి చేసుకున్న ఈ జంట మరోసారి(ఫిబ్రవరి 21, శుక్రవారం) హిందూ వివాహంతో తమ ప్రేమను చాటుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకకు పలువురు బాలీవుడ్ స్టార్లు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రణ్బీర్ కపూర్ అలియా, సైఫ్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా, నీతూ కపూర్తో పాటు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు, అనిల్ అంబానీ, టీనాజంట, సీనియర్ నటి రేఖ, అగస్త్య నందా వేదిక సందడి చేశారు.వధువు అలేఖా అద్వానీ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తయారు చేసిన ఎథ్నిక్ మాస్టర్ పీస్లో అందంగా ముస్తాబైంది. రెడ్ వెల్వెట్ లెహెంగాపై వాటర్ఫాల్ స్టైల్ గిల్డెడ్ డబ్కా ఎంబ్రాయిడరీతో రూపొందించారు. దీనికి జతగా గోల్డ్ జర్దోజీ ఎంబ్రాయిడరీతో హాఫ్-స్లీవ్డ్ వెలోర్ క్రాప్డ్ బ్లౌజ్ మంచి ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. అలాగే లేటెస్ట్ ట్రెండ్కు అనుగుణంగా డబుల్ మ్యాచింగ్ క్రిమ్సన్ ఆర్గాన్జా దుపట్టాలో అలేఖా అందంగా మెరిసింది. ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్గా పోల్కి కుందన్స్ పచ్చలు పొదిగిన నెక్లెస్ మాంగ్ టీకా ఆభరణాలను ధరించింది. వరుడు ఆదర్ జైన్ ఐవరీకలర్ షేర్వానీ, ఎటాచ్డ్ దుపట్టా, క్లాసిక్ వైట్ స్ట్రెయిట్ ఎథ్నిక్ ప్యాంటు, తలపాగా ధరించారు. ఇక ఆభరణాల విషయానికి వస్తే, పచ్చల లేయర్డ్ నెక్లెస్ ,తలపాగామీద ఎమరాల్డ్ స్టేట్మెంట్ గోల్డ్ నగలతో రాజసంగా కనిపించాడు. కుటుంబ సభ్యులు , స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక తర్వాత ఆదర్ తన భార్య అలేఖ అద్వానీ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.దీంతో అలేఖా సిగ్గుల మొగ్గే అయింది. దీంతో కొత్తగా పెళ్లైన జంటను ఆశీర్వదించారు.

BirdFlu భయమేల చికెన్ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు!
బర్డ్ ఫ్లూ (Bird Flu)అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్, గుడ్ల వైపు చూడాలంటేనే వణికి పోతున్నారు. ఆందోళన అవసరం లేదు నిపుణులు చెబుతున్నప్పటకీ జనం చికెన్ తినడం మానేశారు. మరోవైపు పోషకాలు ఎలా అందోళన కూడామొదలైంది. అయితే కేవలం మాంసాహారంలోనే కాదు, శాకాహారంలో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది ఈ నేపథ్యంలో చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు గురించి తెలుసుకుందాం.సంపూర్ణమైన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. చికెన్ ప్రత్యామ్నాయంగా ప్రొటీన్లతో కూడిన అత్యంత సాధారణమైనవి గింజలు. కూరల్లో సలాడ్లు , ఇతర వంటకాల్లో మంచి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని చాలా మంది చెఫ్లు శాకాహార వంటకాలను వండేటప్పుడు వాటిని చికెన్ ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. వీటిల్లో వేరుశనగ, జీడిపప్పు, బాదం, వాల్నట్స్, బఠానీ, రాజ్మా ఇలా చాలానే ఉన్నాయి.బాదం: ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్ ఇలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు బాదంపప్పులో ఉన్నాయి. 100 గ్రాముల బాదం గింజల్లో 23 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.శనగలు: శనగలను పోషకాహార పవర్హౌస్ అని అంటారు. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందుతాయి.మాంసం మానేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్. 100 గ్రాముల శనగల్లో 23 గ్రాముల ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.ఇదీ చదవండి: Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!వాల్ నట్స్ : వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది . ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల వాల్ నట్స్ లో 26 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.రాజ్ మా: పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, ఖనిజాలతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ లభిస్తాయి. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తినిస్తుంది. 100 గ్రాముల రాజ్ మా గింజల్లో 25 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.చదవండి: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!జనపనార గింజలు(Hemp seeds) ఖనిజాలు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.మంచి కొవ్వులు, ఆహార ఫైబర్స్, ఖనిజాలు, విటమిన్లు ,ప్రోటీన్లు. ఎడెస్టిన్ , అల్బుమిన్ వంటి అత్యంత జీర్ణమయ్యే ప్రోటీన్లను కలిగి ఉంటాయి, జనపనార గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల జనపనార గింజల్లో 21 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.వీటిని నానబెట్టుకొని తినవచ్చు. లేదా సలాడ్లలో, కూరల్లో వాడుకోవచ్చు. చక్కగా నేతిలో వేయించుకొని, ఉప్పు కారం చల్లుకొని స్నాక్స్లాగా కూడా తినవచ్చు.

పుట్టనిండా రుచులు, పొట్టనిండా విందు! ట్రై చేశారా!
పుట్టగొడుగులు...(Mushrooms) అదేనండీ.. మష్రూమ్స్ పోషకాలకే కాదు... రుచికి కూడా పెట్టింది పేరు. కాస్త ఉప్పూకారం వేసి మరికాస్త మసాలా దట్టించామంటే ఆ టేస్ట్ అదుర్స్.. అందుకే పుట్టనిండా రుచులు... పొట్టనిండా విందు! అందుకే పుట్టగొడుగులతో మంచి రుచికరంగా చేసుకునే వంటకాలను గురించి తెలుసుకుందాం.ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.మష్రూమ్స్ మంచూరియా కావలసినవి: మైదా – అర కప్పు; మష్రూమ్స్ – 250 గ్రాములు; కార్న్ఫ్లోర్-3 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; నీళ్లు -కప్పు; ఉప్పు -తగినంత; పంచదార-అర టీ స్పూన్; పచ్చి మిర్చి- 3 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్; ఉల్లికాడల తరుగు-టేబుల్ స్పూన్; బెల్ పెప్పర్-1 (సన్నగా తరగాలి). సాస్ కోసం: నల్ల మిరియాల పొడి -చిటికెడు; పంచదార – చిటికెడు; సోయా సాస్ – టీస్పూన్తయారీ: ∙పుట్టగొడుగులను కడిగి, తుడిచి, సగానికి కట్ చేయాలి ∙ఒక గిన్నెలో సాస్ మినహా పై పదార్థాలన్నీ తీసుకోవాలి ∙తగినన్ని నీళ్లు ΄ోసి పిండిని బాగా కలుపుకోవాలి ∙స్టౌ పై బాణలి పెట్టి, తగినంత నూనె పోసి, వేడి చేయాలి. పుట్టగొడుగులను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి, పక్కన పెట్టుకోవాలి ∙అదే నూనెలో, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలను వేసి, నిమిషం సేపు వేయించి, తీసి పక్కనుంచాలి ∙నల్ల మిరియాలు, ఉప్పు, చక్కెర, సోయా సాస్ కలిపి పక్కనుంచాలి. ఈ సాస్లో వేయించిన పుట్టగొడుగులను వేసి, అన్నింటికీ సాస్ పట్టేలా బాగా కదిలించాలి. తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో అలంకరించి, సర్వ్ చేయాలి.మష్రూమ్స్ పులావ్ కావలసినవి: నూనె- 3 టేబుల్ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒకటిన్నర కప్పు; మష్రూమ్స్- 250 గ్రాములు; ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి); టమోటా-1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి); బంగాళదుంప-1; పచ్చిమిర్చి- 2; అల్లం వెల్లుల్లి పేస్ట్-టీ స్పూన్; కొబ్బరిపాలు-కప్పు; నీళ్లు -3 కప్పులు; ఉప్పు-తగినంత; మసాలా దినుసులు - (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు -3, లవంగాలు -5, నల్లమిరియాలు - 6, జీలకర్ర – టీ స్పూన్) తయారీ: బియ్యాన్ని కడిగి అరగంటసేపు నానబెట్టాలి. అన్ని కూరగాయలతో పాటు మష్రూమ్స్ కూడా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి ∙ప్రెజర్ కుక్కర్లో, నూనె వేసి వేడిచేయాలి. జీలకర్రతో సహా మొత్తం మసాలా దినుసులు వేసి, సువాసన వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయ తరుగు వేసి, వేయించుకోవాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు, బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత పుట్టగొడుగులను కలపాలి. సన్నని మంట మీద పుట్టగొడుగులు సగం ఉడికేంత వరకు 5 నిమిషాలు ఉంచాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేసి, వేగాక, బియ్యం పోసి కలపాలి.దీంట్లో కొబ్బరి పాలు, నీళ్లు కలపాలి. ఉప్పు వేసి, రుచి సరిచూసుకొని, కుకర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, స్టౌ ఆపాలి. 5–10 నిమిషాలు ఆగి, కుకర్ మూత తీసి, కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి. దీనికి కాంబినేషన్గా రైతాను వడ్డించాలి.

యోగా ఇలా చేస్తే...ఎన్నో ప్రయోజనాలు
ఏ రకమైన వ్యాయామం చేసినా పాటించాల్సిన ముఖ్య లక్షణం స్వీయ క్రమ శిక్షణ. వ్యక్తి, శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగు పరచడంలో దాని సొంత ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యోగా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీంతో పాటు యోగా లక్ష్యాలలో స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ, అవగాహనను పెంచుకుంటే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రయోజనాలువ్యక్తిగత సంబంధాలలో సానుకూలత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొత్త అభిరుచిని అలవరచు కోవడం, కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, ఫలితాలను సాధించడానికి సహాయపడుతుంది. మొదట యోగా సాధన చేయాలనుకుంటున్న కారణం, నిర్దేశించుకున్న వ్యవధి, శారీరక, మానసిక ఆరోగ్యంలో చూడాలనుకుంటున్న సానుకూల మార్పులను అర్థం చేసుకోవాలి. ఎలా చేయాలంటే... క్రమం తప్పకుండా యోగసాధన చేయడం వల్ల మానసిక క్రమశిక్షణ కలగడం తోపాటు దినచర్యలో భాగం అవుతుంది. జీవనశైలిలో సానుకూల మార్పు గమనించవచ్చు. స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి...నిద్రించడానికి కనీసం 2–3 గంటల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ∙క్రమం తప్పకుండా 7–8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను రాత్రిపూట ఎక్కువ సేపు ఉపయోగించకుండా చూసుకోవాలి నిర్ణీత సమయం, ప్రదేశంలో యోగసాధన చేయాలి యోగాభ్యాసాన్ని నిలిపివేయకుండా ఉండటానికి, ఒక గ్రూప్తో లేదా స్నేహితులతో కలిసి సాధన చేయాలి. జట్టుగా కలిసి చేసే యోగా వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
ఫొటోలు
International View all

Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు
ఉక్రెయిన్. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం.

హీరోలా ఎగిరే జీరో..
ట్రాఫిక్జామ్లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా?

సుంకాల భారం అమెరికాపైనే!
ఔషధాలు, ఆటోమొబైల్, సెమికండక్టర్ దిగుమతులపై దాదాపు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు అమెరి

నెతన్యాహు వార్నింగ్..దిగొచ్చిన హమాస్
టెల్అవీవ్:బందీగా తీసుకెళ్లిన షిరి బిబాస్ మృతదేహం కాకుండా

World Richest: శత్రు దుర్భేద్యం.. అత్యంత ధనిక దేశం
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?..
National View all

సగౌరవ మరణం నాప్రాథమిక హక్కు
ఆమె మరణించదలుచుకుంది. ‘సగౌరవంగా మరణించే హక్కును ప్రసాదించండి’ అని 24 ఏ

ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2 గా ఆర్బీఐ మాజీ గవర్నర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్పిపల్ సెక్రటరీ-2గా ర

నిద్రిస్తున్న కూలీలపై ఇసుక అన్లోడ్.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర: జల్నాలో విషాదం జరిగింది.

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం.. కాగ్ రిపోర్ట్ సైతం..?
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన త

ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు.
NRI View all

ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద

మాట నూతన కార్యవర్గం ఏర్పాటు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్-మాట బోర్డు మీటింగ్ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్

గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్
క్రైమ్

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా.. 10 మంది మహిళలు అరెస్ట్
కృష్ణా: విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్పై మాచవరం పోలీసులు దాడి చేశారు. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో స్టూడియో 9 ( స్పా) సెంటర్పై సహచర సిబ్బందితో కలిసి మాచవరం సీఐ ప్రకాష్ దాడులు చేశారు. ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్ నందు స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు. 10 మంది మహిళలు, 13 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు.చలసాని ప్రసన్న భార్గవ్.. యూట్యూబ్ ఛానల్ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం భార్గవ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పస్తుతం ప్రసన్న భార్గవ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..!

జీఎస్టీ అధికారి ఇంట్లో మిస్టరీ మరణాలు..!
కొచ్చి:కేరళలోని కొచ్చిలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్కు చెందిన 42 ఏళ్ల జీఎస్టీ అధికారితో పాటు అతడి 80 ఏళ్ల తల్లి,35ఏళ్ల సోదరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరు చనిపోయి నాలుగు రోజులవుతోందని,మృతదేహాలు కుళ్లిపోవడం స్టార్టైందని కొచ్చి త్రిక్కాకర పోలీసులు తెలిపారు.జీఎస్టీ అధికారి ఇంటిలో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తలుపు తెరవగా మరణాల విషయం బయటపడింది.అధికారి తల్లి మృతదేహం ఒక షీట్తో కప్పిఉండడం అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారి సోదరి జార్ఖండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(జేఏఎస్) అధికారిగా పనిచేస్తున్నారు.ఆమె పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ర్యాంక్ సాధించారు. అయితే పరీక్షల అవకతవకలకు సంబంధించి ఆమెపై ప్రస్తుతం సీబీఐ కేసు విచారణలో ఉంది. ఆమె మరణం ఆశ్చర్యానికి గురిచేసిందని తోటి జేఏఎస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వీరివి ఆత్మహత్యలనే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం వివరాలొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు.

ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..!
కామవరపుకోట: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం కామవరపుకోట పంచాయతీ వడ్లపల్లిలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడ్లపల్లి గ్రామానికి చెందిన గంజి నాగ దీప్తి (19) ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా నాగ దీప్తి కాలేజీకి వచ్చి, వెళ్లే సమయాల్లో కామవరపుకోటకు చెందిన ఆకతాయిలు ఆమెను ప్రేమించాలని, లేకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారు. ఈ విషయంపై ఆమె అన్నయ్య అరవింద్ ఆ యువకులను నిలదీశాడు. దీంతో ఇటీవల కామవరపుకోటలో జరిగిన వీరభద్రస్వామి తిరునాళ్లలో అరవింద్ను తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం మళ్లీ ఆ యువకులు నాగ దీప్తికి ఫోన్ చేసి తమను ప్రేమించకపోతే మీ అన్నయ్యతో సహా మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన నాగదీప్తి గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసమయంలో తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాణి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా అన్నయ్య అరవింద్ గదిలో నిద్రపోతున్నాడు. నాగ దీప్తి ఫ్యానుకు వేలాడుతూ ఉండడాన్ని గమనించిన అరవింద్ చుట్టుపక్కల బంధువుల సహాయంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నా కుమార్తె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులు ఎందరు..?
భూపాలపల్లి : దారుణ హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. హత్యకు పాల్పడింది ప్రత్యక్షంగా నలుగురే అయినప్పటికి ఆర్థికంగా, పరోక్షంగా పలువురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానిక భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. స్థానిక పోలీసులు తొలుత ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఏ–1 రేణుకుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి శ్రీమాంత్(బబ్లూ)లను హత్య జరిగిన రోజే అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కుమార్ పట్టుకున్నారు. ఏ–5 రేణుకుంట్ల కొమురయ్యతోపాటు నిందితులకు కారు ఏర్పాటు చేసి, డ్రైవింగ్ చేసిన పట్టణంలోని సుభాష్కాలనీకి చెందిన ఓ డ్రైవర్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. అంతేకాక నిందితుల ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా, అనుమానితులైన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హరిబాబు హస్తం ఉందా..? రాజలింగమూర్తి హత్య కేసులో భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజలింగమూర్తిని హత్య చేసిన అనంతరం నిందితులు.. ఓ వ్యక్తిని ఫోన్ అడిగి తీసుకొని హరిబాబుకు కాల్ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ మేరకు హరిబాబును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి రెడ్డికాలనీలోని ఆయన ఇంటికి వెళ్లగా అందుబాటులో లేనట్లుగా తెలిసింది. మరో వ్యక్తి ఆర్థిక సహకారం.. రాజలింగమూర్తి హత్యకు మరో వ్యక్తి ఆర్థికంగా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమి తనదేనంటూ కోర్టుకు వెళ్లిన ఒకరు ఆర్థికంగా నిందితులకు సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇతను కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి అరెస్ట్..రాజలింగమూర్తి హత్య కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితులు ఎంతమంది ఉన్నారన్నది గుర్తించాక, ఆధారాలతో రేపు(ఆదివారం), లేదా సోమవారం అరెస్ట్ చూపించనున్నట్లు తెలుస్తోంది.