Top Stories
ప్రధాన వార్తలు

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్ పండుగ సందర్బంగా వైఎస్ జగన్..‘ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్’ అని అన్నారు.భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. నిరుద్యోగులకు శుభవార్తలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.విదియ ప.12.20 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: అశ్విని సా.5.04 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.10.21 నుండి 11.51 వరకు, తదుపరి రా.2.00 నుండి 3.29 వరకు,దుర్ముహూర్తం: ప.12.28 నుండి 1.17 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ఉ.10.20 నుండి 11.52 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.00, సూర్యాస్తమయం: 6.09. మేషం.... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.వృషభం.... బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.మిథునం.... సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కర్కాటకం.... పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.సింహం..... అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.తుల.... పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు.. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కీలక నిర్ణయాలు.వృశ్చికం... వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చర్చలు సఫలం.ధనుస్సు... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మకరం..... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.కుంభం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. గతం గుర్తుకు వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మీనం..... మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులకు కొంత ఆదరణ..

బీసీల ఆలోచన ఆ పూటకే!
సాక్షి, అమరావతి: ‘‘ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు... ఇప్పుడొచ్చారు.. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్ అయింది.. మా పని అయిపోయింది..! అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా.. మిమ్మల్ని కాదు.. అదే ఇక్కడున్న వాళ్లంతా ఉన్నారు.. వీళ్లకి ఓపిక ఉంది. బంగారు కుటుంబాలకు ఓపిక లేదు.. మార్గదర్శకులకు ఓపిక ఉంది. అంటే వాళ్లు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితాల్లో వెలుగులు తెస్తా..!’’ ఈ వ్యాఖ్యలు చూశారా..! 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి ఆదివారం నిర్వహించిన పీ 4 సభలో మాట్లాడిన దారుణమైన మాటలివీ!! దళితులు, బడుగు, బలహీనవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చెప్పినా కూడా ఆలోచించరని నిందించారు. వచ్చాం.. మీటింగ్ అయిపోయింది.. మా పని అయిపోయిందని అనుకుంటూ ఉంటారని.. వాళ్ల ఆలోచనా విధానమే తప్పని వ్యాఖ్యానించారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని ఆయన బయటపెట్టారు. గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ, బీసీ వర్గాలను నేరుగా దూషించి వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. దీనిపై ఎస్సీ, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబుకు దళితులు, బీసీలంటే ఎప్పుడూ చులకన భావమేనని, తమను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేçస్తున్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని గతంలో వారి పుట్టుకనే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబుదని మండిపడుతున్నారు. నాడు తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను.. ‘మీ తోకలు కత్తిరిస్తా..! తమాషాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించిన నిర్వాకం ఆయనదే. నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు... నాకెందుకు ఓటు వేయరు... అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్మెయిల్ తరహాలో పేదలను చంద్రబాబు బెదిరించారు. అందుకు అనుగుణంగానే టీడీపీ నేతలు దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దారుణంగా మాట్లాడారు. తాజాగా చంద్రబాబు వారి పట్ల తనకున్న చులకన భావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అసలు ఆలోచనలే ఉండవని, డబ్బులు ఇస్తే మీటింగ్కు వస్తారనే రీతిలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ తన ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు.చరిత్రలో ఎవరూ చేయలేదు..పేదరికం లేని సమాజం కోసం పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇది వినూత్న కార్యక్రమమని, కొత్త ప్రయోగమని, ఇంతవరకూ చరిత్రలో ఎవరూ అమలు చేయలేదని తెలిపారు. వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించిన సభలో జీరో పావర్టీ పీ–4 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. పథకం లోగో, పోర్టల్ను ఆవిష్కరించి మాట్లాడారు. శాయోజీరావు సహాయం వల్లే అంబేడ్కర్ ఎదిగారని, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వల్ల అబ్దుల్ కలాం ముందుకెళ్లారన్నారు. కలాంను రాష్ట్రపతిని చేయడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఎన్టీఆర్ లేకపోతే తాను కూడా అందరిలా మామూలుగానే ఉండేవాడినన్నారు. హైదరాబాద్ దశ, దిశ మారడానికి తాను చేసిన ఆలోచనలే కారణమన్నారు. పీ–4 గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20 శాతం ఉన్నాయని, మార్గదర్శులుగా ఉండేవారు బంగారు కుటుంబాలతో కలసి పని చేయాలన్నారు. తలసరి ఆదాయం 2028–29 నాటికి రూ.5.42 లక్షలు, 2047కి రూ.55 లక్షలు చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. టాప్ టెన్లో ఉన్న పది శాతం శ్రీమంతులు అట్టడుగున్న ఉన్న 20 శాతం మందిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పవన్ దొరకడం నా అదృష్టం..2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ 2.0 సాధించడమే తన లక్ష్యమని, పీ–4 అందుకు మార్గదర్శి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకొచ్చి మళ్లీ ఉగాది నాటికి ప్రగతిని ప్రజలకు వెల్లడిస్తామన్నారు. 2029కి రాష్ట్రం జీరో పావర్టీలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచమే ఆచరించే పరిస్థితికి వస్తుందన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా 20 లక్షల బంగారు కుటుంబాలను పైకి తెచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన విధాన పత్రంలో తెలిపింది. సంపన్న కుటుంబాలు పీ 4 ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శి కుటుంబంగా నిలవాలని కోరింది. ⇒ మంగళగిరికి చెందిన గొర్రెల పెంపకందారు కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా పీ 4 పథకం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. నరసింహ తన పిల్లల్ని చదివించాలని కోరగా గ్రీన్కో ఎనర్జీ అధినేత చలమలశెట్టి అనిల్కుమార్ మార్గదర్శిగా ముందుకొచ్చారు. ఇమ్మాన్యుయేల్ తన కూతుర్ని ఎంబీబీఎస్ చదివించాలని కోరగా మెయిల్ సంస్థల అధినేత మేఘా కృష్ణారెడ్డి వారికి మార్గదర్శిగా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని తన సొంత మండలం గుడ్లవల్లేరు బాధ్యత మొత్తం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఇంత హీనంగా మాట్లాడతారా? పేదల విషయంలో మొదటి నుంచి చంద్రబాబుది ఫ్యూడలిస్టు భావజాలమే. ఎస్సీలు, బీసీల పట్ల ఆయన మాటలు, చేతలు ఎప్పుడూ లోకువగానే ఉంటాయి. బడుగు, బలహీనవర్గాల గురించి అంత హీనంగా మాట్లాడడం సరికాదు. వారికి ఆలోచనలు లేవని చెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడే కాదు.. అనేక సందర్భాల్లో ఎస్సీలు, బీసీల గురించి తక్కువగా మాట్లాడారు. ఆయనకిది తగదు. వెంటనే దళితులు, బడుగు వర్గాలకు క్షమాపణ చెప్పాలి. – చింతపల్లి గురుప్రసాద్, బహుజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడుబాబులో రెండో వ్యక్తి బయటకొచ్చాడు చంద్రబాబు చేతలకి, మాటలకి పొంతన ఉండదు. పేదలను ఎప్పుడూ అవమానిస్తారు. ఇప్పుడు మరోసారి అవమానించారు. ఎస్సీలు, దళితులంటేనే ఆయనకు పడదు. పేదల కోసమని నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతున్నారని సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమిటి? చంద్రబాబులో రెండో వ్యక్తి బయటపడ్డాడు. ఆయన్ను దళిత, బీసీలు నమ్మకూడదు. ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలి. – నత్తా యోనారాజు మాల మహానాడు నాయకుడుగుణపాఠం తప్పదు పేదలకు మేలు చేయకపోగా వారి గురించి తరచూ అవమానకరంగా మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది. పీ–4 మీటింగ్ అని పిలిచి ఒక్కరికి మేలు చేయకపోగా తిట్లు బహుమతిగా ఇస్తారా? బీసీ, ఎస్సీలను తిట్టడానికి బహిరంగ సభ పెడతారా? పేదల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు లేరు. వారికి ఆలోచనలే లేవని అనడం అహంకారం. త్వరలోనే బీసీలు, ఎస్సీలు ఆయనకు గుణపాఠం చెబుతారు. – ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రిపేదలు తన బానిసలుగా ఉండాలనే ఆలోచన బాబుది పేదలు ఎప్పుడూ తమ బానిసలుగా ఉండాలనే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. జీరో పావర్టీ పీ–4 సభలో దాన్ని బయటపెట్టారు. ఎస్సీ, బీసీల గురించి అంత నీచంగా మాట్లాడడం దారుణం. గతంలోనూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నీచంగా మాట్లాడారు. పేదలు ఎప్పుడూ తమ కాళ్ల దగ్గరే ఉండాలనే ఆలోచన చంద్రబాబుది. – కైలే అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యేఅసలు మనిషి బయటపడ్డాడు.. చంద్రబాబులోని అసలు మనిషి పీ–4 మీటింగ్లో బయటపడ్డాడు. వారి కోసమని మీటింగ్ పెట్టి తిట్టడం ఏమిటి? సభకు వచ్చిన జనం వెళ్లిపోతుంటే ఇష్టం వచ్చినట్లు తిడతారా? పేదలు కూడా సంపన్నుల్లా అలోచించాలని చెప్పి వారిని తిట్టడం అన్యాయం. బీసీలు, ఎస్సీలను చంద్రబాబు ఎప్పుడూ గౌరవించలేదు. అనేకసార్లు అవమానించారు. ఇప్పుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. – జోగి రమేష్, మాజీ మంత్రి

ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
దుబాయ్: అణు కార్యక్రమంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం నేత ఖొమైనీకి రాసిన లేఖపై ఈ మేరకు అధికారికంగా స్పందించింది. అమెరికాతో చర్చల నుంచి తప్పించుకోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అలాగే, ట్రంప్ బాంబు దాడులు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మసూద్..‘ఎన్నో వాగ్దానాలను అమెరికా కాలరాసింది. దీనిపైనే మాకు భేదాభిప్రాయాలున్నాయి. ముందుగా ఆ దేశం మాకు నమ్మకం కలిగించాలి’ అని పేర్కొన్నారు. దీనిద్వారా పరోక్ష చర్చలు మాత్రమే సాధ్యమని చెప్పారు. పెజెష్కియాన్ స్పందనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. ముందుగా ఆయన చర్చలకు దారి తెరిచారు. కాదన్న పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమమే లక్ష్యంగా సైనిక చర్య చేపట్టే ప్రమాదం ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.మరోవైపు.. ఇరాన్ను అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో.. ఆ దేశంపై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ స్పష్టం చేశారు.ఇక, ట్రంప్ మొదటి హయాంలో ఇరాన్తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘ఇరాన్తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తా. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అలా చేయడమే వారికి ప్రయోజనకరం’ అని తెలిపారు.

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.భారత్తో సిరీస్లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్ను హోస్ట్ చేసింది. డార్విన్లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్ల తర్వాత ఆసీస్ భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్తో సిరీస్ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్లతో టీ20 సిరీస్లను ప్లాన్ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్బోర్న్నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్

మామా.. ఆర్డర్ చేస్తున్నా..!
ఏడాది కిందట పెళ్లైన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్పుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు.కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్గా ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్ ఫుడ్ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాణిపాకం(చిత్తూరు): ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు. చదువులపైనే దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడుతున్నారు. బాగా చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగం, డాక్టర్ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాలకు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు. వంట చేయడం రాదు పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్ రూమ్కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు.బయట ఫుడ్ డేంజర్..? అధికంగా బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, రక్తనాళాల్లో కొలె్రస్టాల్ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్కు జై కొడుతున్నారు దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయట ఫుడ్ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూట్యూబ్ చూసి వండిన ఆ టేస్ట్ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్ ఫుడ్పై పడిపోతున్నారు. మూడు పూటల ఫాస్ట్ఫుడ్ను ఆరగిస్తున్నారు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నాయి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి. అనారోగ్యం పాలుకావద్దు ఫాస్ట్ ఫుడ్ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి. – వెంకట ప్రసాద్, వైద్య నిపుణుడు, చిత్తూరు

'ఆదిత్య 369' రీరిలీజ్.. 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ట్రైలర్
టాలీవుడ్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్లో 'ఆదిత్య 369' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని దక్కించుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. బాలకృష్ణ ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్గా రెండు పాత్రల్లో మెప్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీరిలీజ్తో మరోసారి టైమ్మిషన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. ఆదిత్య 369 సినిమా సీక్వెల్కి కథ సిద్ధమైందని ఇప్పటికే బాలకృష్ణ ప్రకటించారు.

Myanmar earthquake: కుళ్లుతున్న మృతదేహాలు
మాండలే: భూకంపం తాలూకు విధ్వంసం నుంచి మయన్మార్ ఇంకా తేరుకోలేదు. మౌలిక వనరుల లేమికి భూ ప్రకంపనలు తోడై సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుబడ్డవారి సంఖ్య అపారంగా ఉన్నట్టు సైనిక ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నానాయి. ఇప్పటికే రెండు రోజులు దాటిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. దాంతో రాజధాని నేపిడా మొదలుకుని ఏ నగరంలో చూసినా మృత్యుఘోషే విన్పిస్తోంది. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మాండలేలో శిథిలాల కింద కుళ్లిపోతున్న మృతదేహాలతో వీధులన్నీ కంపు కొడుతున్న పరిస్థితి! అంతర్జాతీయంగా అందుతున్న సాయం ఏ మూలకూ చాలడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. చాలా నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని నేపిడా సమీపంలో శనివారం రెండుసార్లు 4.7, 4.3 తీవ్రతతో భూమి కంపించడం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో జనం భయాందోళనలతో ఇళ్లను వీడి వీధుల్లోకి పరుగులు తీశారు. స్వల్ప స్థాయి ప్రకంపనలు రోజంతా కొనసాగాయి. రోడ్డు, రైలు మార్గాలు, బ్రిడ్జిల వంటివన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థలన్నీ పడకేశాయి. దాంతో సహాయక బృందాలను బాధిత ప్రాంతాలకు తరలించడమే సవాలుగా మారింది. సమాచార వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. వీటికి తోడు 41 డిగ్రీల పై చిలుకు ఎండ ఠారెత్తిస్తోంది. చాలాచోట్ల శిథిలాలను పారలు, చేతులతోనే తొలగించేందుకు స్థానికులు ప్రయతి్నస్తున్నారు! ఇన్ని ప్రతికూలతల మధ్యే ఇప్పటిదాకా 1,700కు పైగా మృతదేహాలను వెలికితీశారు. అయితే సహాయక బృందాలు ఇంకా దేశంలో చాలా ప్రాంతాలకు చేరుకోనే లేదు. తిరుగుబాటుదారుల అ«దీనంలో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల ఊసే లేదు. దాంతో అక్కడి మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారమూ లేదు. ఈ నేపథ్యంలో మరణాలు 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. భారత్ ఆపద్బాంధవ పాత్ర కల్లోల మయన్మార్ను ఆదుకోవడంతో భారత్ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మ పేరిట ఇప్పటికే ఐదు సైనిక విమానాల్లో 60 టన్నుల మేరకు సహాయక సామగ్రిని చేరవేసింది. మరో 40 టన్నుల సహాయక సామగ్రి సముద్ర మార్గాన చేరుకుంటోంది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేక సైనిక పారా బ్రిగేడ్ బృందం కూడా తోడైంది. 120 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో వాయు మార్గాన తరలించిన తాత్కాలిక ఆస్పత్రి రెండుగా విడిపోయి మాండలే, నేపిడాల్లో రోగులను పెద్ద ఎత్తున ఆదుకుంటోంది.మాండలేలో ఆకలి కేకలు 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో విధ్వంసం మాటలకందని రీతిలో ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ నిర్మణాలన్నీ కుప్పకూలడమో, భారీగా పగుళ్లివ్వడమో జరిగింది. దాంతో నగరవాసులు వీధుల్లోనే గడుపుతున్నారు. శిథిలాల కింద చిక్కిన తమవారిని ఎలాగోలా కాపాడుకోవాలని తపిస్తున్నారు. పారలు, పలుగులతో వాటిని తవ్వి తీసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే తిండికి, తాగునీటికి కూడా వాళ్లు అల్లాడిపోతున్న పరిస్థితి! శిథిలాల తొలగింపుకే నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని కేథలిక్ రిలీఫ్ సరీ్వసెస్ మేనేజర్ కారా బ్రాగ్ అభిప్రాయపడ్డారు. ‘‘క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు చాలినన్ని సదుపాయాల్లేవు. ఔషధాలు తదితరాలకు తీవ్ర కొరత ఉంది. తిండికి, తాగునీటికి కొరత తీవ్రతరమవుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నేపిడా, మాండలే విమానాశ్రయాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ నగరాలకు వాయుమార్గాన సహాయక సామగ్రి, సిబ్బంది తరలింపు అసాధ్యంగా మారింది. నేపిడాలో ప్రభుత్వ కార్యాలయాల పునరుద్ధరణకే సైనిక సర్కారు ప్రాధాన్యమిస్తోంది. దాంతో సాధారణ ప్రజల దైన్యాన్ని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.థాయ్లాండ్లో 18కి మృతులు శుక్రవారం నాటి భూకంపంతో తీవ్రంగా దెబ్బ తిన్న థాయ్లాండ్లో మృతుల సంఖ్య 18కి పెరిగింది. బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతçస్తులు నిర్మాణంలోని భవనం శిథిలాల్లో నుంచి ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికితీశారు.

‘పీ4’.. అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్!
సాక్షి, అమరావతి: నాటి ఉగాది హామీ.. వలంటీర్లను కొనసాగించి వేతనం రూ.పది వేలు చేస్తాం! నేటి ఉగాది హామీ.. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా రూపుమాపుతా..!! సాధారణంగా అందరూ ఏప్రిల్ 1న ఫూల్స్ డే చేసుకుంటుంటారు..! సీఎం చంద్రబాబు మాత్రం అడ్వాన్స్గా తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఫూల్స్ చేశారు! సరిగ్గా ఏడాది క్రితం 2.66 లక్షల మంది వలంటీర్లను వంచించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజలందరినీ మభ్యపుచ్చేందుకు సిద్ధమయ్యారు! రాజకీయాల్లో తన డైవర్షన్ పాలిటిక్స్ను సంక్షేమ కార్యక్రమాలకూ వర్తింపజేస్తున్నారు.నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే తాను హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు అమలు చేయాలి. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించాలి. కానీ అవేమీ చేయకుండా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ గత ఐదేళ్లూ వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, విప్లవాత్మక విధానాలను కక్షపూరితంగా నిలిపివేశారు. మరోపక్క విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి మౌలిక రంగాలను నిర్విర్యం చేశారు. పేదలకు కూడు, గూడు, దుస్తులు సమకూర్చడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత.దీన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు హామీల అమలు బాధ్యత నుంచి తప్పుకుని పీ 4 పథకం పేరుతో మరో కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఎన్నడూ మాటపై నిలబడిన దాఖలాలు లేవని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం ఉన్న ఆయన్ను ఎలా నమ్మాలనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారని.. హామీల అమలుకు మొదటి రోజు నుంచే ఆరాట పడ్డారని.. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. బాధ్యతల నుంచి పరార్... ఎన్నికల ముందు జనసేన–బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని నమ్మబలికారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు అంటూ మహిళలను, అన్నదాతా సుఖీభవ పేరిట రైతులను, నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మోసపూరిత వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పీ–4 పేరుతో మరో నాటకానికి తెరతీశారు. అన్నీ తెలిసే మోసపూరిత వాగ్దానాలు గతంలో మూడుసార్లు సీఎంగా, ఉమ్మడి రాష్ట్రంలో ఆరి్థక మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు. తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తానిచ్చిన హామీలను చూస్తుంటే భయం వేస్తోందని, సంపద సృష్టికి మార్గాలుంటే తన చెవిలో చెప్పాలంటూ నిజ స్వరూపాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం.. గెలిచాక తిలోదకాలు ఇవ్వడం చంద్రబాబుకు మొదటినుంచి వెన్నతో పెట్టిన విద్య. గతంలో రైతు రుణ మాఫీ వ్యవహారమే దీనికి మచ్చు తునక. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి కొత్త కార్యక్రమాలు తేవడం ఆయనకు ఆలవాటే. ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చిన జగన్.. చంద్రబాబు ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ సర్కారుకు మరో నాలుగేళ్ల సమయమే మిగిలి ఉంది. అలాంటప్పుడు పీ–4తో 2029 నాటికి పేదరిక నిర్మూలన చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చంద్రబాబు తాను ఇస్తానని చెప్పినవి ఇవ్వకపోగా.. గతంలో వైఎస్ జగన్ ఇచ్చినవీ ఎగ్గొడుతున్నారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి హామీల అమలుకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నడుం బిగించారని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి సొంత ఉపగ్రహం.. అమరావతిలో ఒలింపిక్స్.. రాజధానికి హైపర్ లూప్.. ఎండలు 2 డిగ్రీలు తగ్గింపు‘‘సాధ్యాసాధ్యాలతో పనిలేదు..! నమ్మశక్యం కాని విషయాలను నమ్మించేలా చెప్పడం..! వినేవాడుంటే చాలు.. చెప్పేవాడు చంద్రబాబు...!’’ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదీ!! పీ–4 అంటూ ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చిన కార్యక్రమం నేపథ్యంలో ఇలా ఎద్దేవా చేస్తున్నారు. ఏపీకి సొంతంగా ఉపగ్రహం..! అవసరమైతే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు ఉపగ్రహాలు..! అని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ప్రకటించడాన్ని గుర్తు చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరాన్ని నిమిషాల వ్యవధిలో ప్రయాణించే హైపర్ లూప్ను అమరావతికి తెస్తానంటూ గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దాదాపు 10,500 మందికిపైగా క్రీడాకారులు, రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే ఒలింపిక్స్ను అమరావతిలో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం.. అమరావతిలో ఎండలు రెండు డిగ్రీలు తగ్గించాలి.. నోబెల్ బహుమతి సాధించేందుకు సులభమైన మార్గం చెప్పాలనడం.. ఎవరైనా దాన్ని సాధిస్తే రూ.వంద కోట్లు ఇస్తానని జపాన్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత సమక్షంలోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేయటంపై చర్చ జరుగుతోంది.హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దింది తానేనని, సత్య నాదెళ్ల తనవల్లే మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని చంద్రబాబు తరచూ గొప్పలకు పోవడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ట్రాఫిక్ నుంచి శాంతి భద్రతల పరిరక్షణ వరకు నిరంతరం ప్రజలతో గడిపే పోలీస్లు ఇంటి నుంచి విధులు నిర్వహించేలా (వర్క్ ఫ్రం హోం) చర్యలు తీసుకుంటానని చెప్పటాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.నిబద్ధతతో నవరత్నాలు.. సంక్షోభంలోనూ సజావుగా పథకాలు.. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేసింది. తొలి కేబినెట్ (10–6–2019) సమావేశంలోనే వైఎస్ జగన్ నవరత్నాలకు ఆమోదం తెలిపి నిబద్ధత చాటుకున్నారు. ఏటా సంక్షేమ క్యాలెండర్ను ముందుగానే ప్రకటించడమే కాకుండా కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అని తేడా చూపకుండా ప్రతి ఇంటికీ వలంటీర్లను పంపి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్ జగన్దే. క్యాలెండర్లో ప్రకటించిన తేదీల ప్రకారం నేరుగా నగదును బదిలీ చేశారు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉన్నాయని, నవరత్నాలు ఎలా అమలు చేస్తారంటూ నాడు ఎల్లో మీడియా కథనాలను అచ్చు వేసింది. అయితే కోవిడ్ సంక్షోభంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను ఆపలేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కాలక్షేప సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో రూ.6 వేల కోట్లు ఉన్నాయి. అయినప్పటికీ హామీలను నెరవేర్చకుండా పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యం కింద పీ–4 పేరుతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేస్తానంటూ సంక్షేమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకుంటున్నారు.

రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్డెస్క్
బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
బ్యాంక్టెక్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు
సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా.. గ్రూప్–1లో విజయం
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
హైదరాబాద్-విజయవాడ హైవే.. తగ్గిన టోల్ ఛార్జీలు
మామా.. ఆర్డర్ చేస్తున్నా..!
'ఆదిత్య 369' రీరిలీజ్.. 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ట్రైలర్
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య
ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
అన్న వస్తున్నాడు .. కోడిగుడ్డు కూర వండు !
బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
బ్యాంక్టెక్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు
సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా.. గ్రూప్–1లో విజయం
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
హైదరాబాద్-విజయవాడ హైవే.. తగ్గిన టోల్ ఛార్జీలు
మామా.. ఆర్డర్ చేస్తున్నా..!
'ఆదిత్య 369' రీరిలీజ్.. 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ట్రైలర్
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య
ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
అన్న వస్తున్నాడు .. కోడిగుడ్డు కూర వండు !
సినిమా

మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ ఇటీవల మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరైంది. అయితే తాను మూడు గంటలకు ఈవెంట్కు వెళ్లడంతో నిర్వాహకులు తమను పట్టించుకోలేదని విమర్శలు చేసింది. అంతేకాకుండా నా టీమ్తో పాటు తనకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించింది. నా టీమ్కు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.అయితే తాజాగా సింగర్ నేహా కక్కర్ ఆరోపణలపై మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. నేహా కక్కర్ షోతో తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈవెంట్కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె బృందానికి నిర్వాహకులు పెట్టిన ఖర్చులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ఈవెంట్ వల్ల తామే అప్పుల్లో చిక్కుకున్నామని రాసుకొచ్చారు. ఆమెనే తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau)

Vaishnavi Chaitanya: ఒక్క హిట్...తెలుగమ్మాయికి భారీ రెమ్యునరేషన్
తారల తలరాతలు మార్చడానికి ఒకే ఒక్క సినిమా చాలు. హిట్ పడ్డాక ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ హిట్ కోసం తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) చాలా కాలమే ఎదురు చూసింది. కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్వేర్ డెవలపర్' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి... అటు తర్వాత 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమాల్లో చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ వాటితో కూడా యూత్ ను మెప్పించారు.అందువల్ల 'బేబీ' సినిమాలో వైష్ణవికి మెయిన్ హీరోయిన్ ఛాన్స్ వరించింది.ఆ ఒక్క చిత్రమే ఈ తెలుగమ్మాయి జీవితాన్ని మార్చేసింది.ఆ చిత్రంలో యూత్ లోనే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు వైష్ణవి. ఇప్పుడు ఆమె నటిస్తున్న 'జాక్' సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్ పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనున్నారు వైష్ణవి. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు, డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు. మొన్నటి వరకు ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఫామ్లో లేరు. ఇలాంటి టైంలో దర్సకనిర్మాతలకి వైష్ణవి చైతన్య వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది ఆమెకి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో వైష్ణవి పారితోషికం కూడా పెరిగినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట ఓ యువ నిర్మాత, దర్శకుడు. వైష్ణవికి యూత్లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శకనిర్మాతలు సిద్దమైనట్టు సమాచారం.ఇలా తన అప్ కమింగ్ సినిమాకి గాను వైష్ణవి పారితోషికం కోటి రూపాయల మార్క్ టచ్ అయినట్టు స్పష్టమవుతోంది.

సమంత నిర్మాతగా తొలి మూవీ.. టీజర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల్లో నటించి చాలా రోజులైపోయింది. చివరగా 'ఖుషి'లో కనిపించింది. తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసిందంతే. మరోవైపు నిర్మాణ సంస్థ స్థాపించింది. ఇప్పుడు అందులో నిర్మించిన సినిమాని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేసింది కూడా.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమాకు శుభం టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం దీని గురించి బయటపెట్టగా.. ఇప్పుడు ఉగాది సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ)

జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్వాక్తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
న్యూస్ పాడ్కాస్ట్

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్లాండ్, మయన్మార్లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య
క్రీడలు

రాజస్తాన్ ఖాతా తెరిచింది
గువాహాటి: ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల నుంచి రాజస్తాన్ రాయల్స్ కోలుకుంది. తమ మూడో మ్యాచ్లో విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో రాజస్తాన్ 6 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. చెన్నైకిది వరుసగా రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. రాణా మెరుపులు... తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) వెనుదిరగ్గా... సంజు సామ్సన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), రాణా కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా రాణా ఏ బౌలర్నూ వదలకుండా చెలరేగిపోయాడు. ఒవర్టన్ వరుస రెండు ఓవర్లలో కలిపి 3 ఫోర్లు, సిక్స్ కొట్టాక అశ్విన్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ తర్వాత ఖలీల్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాణా 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సామ్సన్ అవుటయ్యాక కొద్దిసేపు రాణాకు పరాగ్ అండగా నిలిచాడు. అశ్విన్ ఓవర్లో మళ్లీ వరుసగా 6, 4 కొట్టాక తర్వాతి బంతికి స్టంపౌట్ కావడంతో రాణా మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. అయితే అతను అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో రాయల్స్ ఆశించిన స్కోరుకు చాలా దూరంలో ఆగిపోయింది. రాణా వెనుదిరిగాక 51 బంతుల్లో 58 పరుగులు మాత్రమే చేయగలిగిన జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. పవర్ప్లేలో 79 పరుగులు చేసిన రాజస్తాన్ మిగిలిన 14 ఓవర్లలో కలిపి 103 పరుగులు మాత్రమే సాధించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీ... ఛేదనలో చెన్నై మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర (0) వికెట్ కోల్పోగా, ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్ కొట్టి ధాటిని ప్రదర్శంచిన రాహుల్ త్రిపాఠి (19 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. సందీప్ ఓవర్లో అతను 3 ఫోర్లు కొట్టాడు. పరాగ్ అద్భుత క్యాచ్కు శివమ్ దూబే (18) వెనుదిరగ్గా, విజయ్శంకర్ (9) విఫలమయ్యాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రుతురాజ్ను కీలక సమయంలో హసరంగ అవుట్ చేశాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని (11 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజ్లోకి వచ్చాడు. అయితే అతనూ ప్రభావం చూపలేకపోగా, మరో ఎండ్లో జడేజా కూడా జట్టును గెలిపించడంలో సఫలం కాలేకపోయాడు. ఆఖరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరం కాగా, చెన్నై 32 పరుగులు రాబట్టగలిగింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 4; సామ్సన్ (సి) రచిన్ (బి) నూర్ 20; నితీశ్ రాణా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 81; పరాగ్ (బి) పతిరణ 37; జురేల్ (సి) పతిరణ (బి) నూర్ 3; హసరంగ (సి) శంకర్ (బి) జడేజా 4; హెట్మైర్ (సి) అశ్విన్ (బి) పతిరణ 19; ఆర్చర్ (సి) గైక్వాడ్ (బి) అహ్మద్ 0; కార్తికేయ (రనౌట్) 1; తీక్షణ (నాటౌట్) 2; దేశ్పాండే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–124, 4–134, 5–140, 6–166, 7–174, 8–175, 9–176. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–2, ఒవర్టన్ 2–0–30–0, అశ్విన్ 4–0–46–1, నూర్ అహ్మద్ 4–0–28–2, పతిరణ 4–0–28–2, జడేజా 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; త్రిపాఠి (సి) హెట్మైర్ (బి) హసరంగ 23; రుతురాజ్ (సి) జైస్వాల్ (బి) హసరంగ 63; శివమ్ దూబే (సి) పరాగ్ (బి) హసరంగ 18; విజయ్శంకర్ (బి) హసరంగ 9; జడేజా (నాటౌట్) 32; ధోని (సి) హెట్మైర్ (బి) సందీప్ 16; ఒవర్టన్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–0, 2–46, 3–72, 4–92, 5–129, 6–164. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 3–1–13–1, తుషార్ దేశ్పాండే 4–0–45–0, సందీప్ శర్మ 4–0–42–1, మహీశ్ తీక్షణ 4–0–30–0, హసరంగ 4–0–35–4, కార్తికేయ 1–0–10–0.

IPL 2025: ‘సన్’కు స్టార్క్ స్ట్రోక్
సన్రైజర్స్ ‘విధ్వంసక’ బ్యాటింగ్ బృందం మరోసారి నిరాశపర్చింది. సొంతగడ్డపై ఓటమి తర్వాత వైజాగ్ చేరిన రైజర్స్ ఆట మాత్రం మారలేదు. బ్యాటింగ్ వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనికేత్ వర్మ సిక్సర్లతో జోరు ప్రదర్శించినా అది సరిపోలేదు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా విజయతీరం చేరింది. తొలి వికెట్కు 55 బంతుల్లోనే 81 పరుగులు వచ్చాక లక్ష్యం సునాయాసమైపోయింది. ఫలితంగా ఢిల్లీ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా, హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. అనికేత్ వర్మ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ (5/35) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫాఫ్ డుప్లెసిస్ (27 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేయగా... జేక్ ఫ్రేజర్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అభిషేక్ పొరేల్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ లెగ్స్పిన్నర్ జీషాన్ అన్సారీకే మూడు వికెట్లు దక్కాయి. కీలక భాగస్వామ్యం... స్టార్క్ వేసిన తొలి ఓవర్లో ట్రవిస్ హెడ్ (12 బంతుల్లో 22; 4 ఫోర్లు) రెండు ఫోర్లు కొట్టి జోరుగా మొదలుపెట్టినా, దురదృష్టవశాత్తూ అదే ఓవర్లో అభిషేక్ శర్మ (1) రనౌటయ్యాడు. హెడ్ బంతిని ఆడి సింగిల్ కోసం ప్రయత్నించగా నెమ్మదిగా స్పందించిన అభిషేక్ క్రీజ్కు చేరుకునేలోగా నిగమ్ విసిరిన త్రో వికెట్లను పడగొట్టింది. ఇషాన్ కిషన్ (2) ఈ మ్యాచ్లోనూ విఫలం కాగా, ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య గ్రౌండ్లోకి వచ్చిన ‘లోకల్ బాయ్’ నితీశ్ కుమార్ రెడ్డి (0) తీవ్రంగా నిరాశపర్చాడు. స్టార్క్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న రెండో బంతినే భారీ షాట్ ఆడబోయి గాల్లోకి లేపగా అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. స్టార్క్ తర్వాతి హెడ్ కూడా అవుట్ కావడంతో రైజర్స్ స్కోరు 4.1 ఓవర్లలో 37/4 వద్ద నిలిచింది. ఈ దశలో అనికేత్, క్లాసెన్ కలిసి జట్టును ఆదుకున్నారు. అప్పటికీ నాలుగు వికెట్లు కోల్పోయినా... వీరిద్దరు దూకుడు మాత్రం తగ్గించకుండా ఓవర్కు 11 రన్రేట్తో పరుగులు రాబట్టారు. 6 పరుగుల వద్ద పొరేల్ క్యాచ్ వదిలేయడంతో అనికేత్కు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4 కొట్టగా, నిగమ్ ఓవర్లో అనికేత్ వరుసగా 4, 6 బాదాడు. ఆ తర్వాత అక్షర్ ఓవర్లో అనికేత్ వరుసగా రెండు భారీ సిక్స్లు బాదాడు. ఈ జోడీ 42 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, నిగమ్ అద్భుత క్యాచ్తో క్లాసెన్ వెనుదిరిగాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనికేత్ మరింత చెలరేగిపోతూ అక్షర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదడం విశేషం. అయితే ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆరంభం నుంచే దూకుడు... ఛేదనలో ఢిల్లీకి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్ ధాటిగా ఇన్నింగ్స్ను మొదలు పెట్టారు. దాంతో పవర్ప్లే ముగిసేసరికి ఢిల్లీ 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేసింది. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్ తనకు వచ్చిన రెండు ‘లైఫ్’లను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్... 40 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్లో హాఫ్ సెంచరీ అరుదైన ఆటగాళ్లు గిల్క్రిస్ట్, గేల్, ద్రవిడ్ సరసన నిలిచాడు. అన్సారీ వేసిన 10వ ఓవర్ ఆసక్తికరంగా సాగింది. తొలి బంతికి అతను డుప్లెసిస్ను అవుట్ చేయగా, రెండో బంతికి పొరేల్ సింగిల్ తీశాడు. తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 4, 6 బాదిన జేక్ ఫ్రేజర్ చివరి బంతికి అవుటయ్యాడు. షమీ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన కేఎల్ రాహుల్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా అన్సారీనే వెనక్కి పంపించాడు. 52 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో పొరేల్, స్టబ్స్ (14 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) ఇక ఆలస్యం చేయలేదు. ఫటాఫట్గా 28 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జత చేసి మ్యాచ్ను ముగించారు. ఆకట్టుకున్న అన్సారీ సన్రైజర్స్ జట్టు తరఫున ఈ మ్యాచ్లో 25 ఏళ్ల లెగ్స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని లక్నో స్వస్థలం. 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో బరిలోకి దిగిన అతను ఐపీఎల్కు ముందు యూపీ తరఫున ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. 2016 అండర్–19 వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టులో రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్లతో పాటు అన్సారీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. గత ఏడాది యూపీ టి20 లీగ్లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడి అత్యధిక వికెట్లు (24) తీయడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ‘గూగ్లీ’ అతని ప్రధాన బలం. వేలంలో సన్రైజర్స్ జట్టు విప్రాజ్ నిగమ్తో పాటు అన్సారీ కోసం పోటీ పడింది. నిగమ్ను ఢిల్లీ సొంతం చేసుకోగానే అన్సారీని రైజర్స్ ఎంచుకుంది.స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (రనౌట్) 1; హెడ్ (సి) కేఎల్ రాహుల్ (బి) స్టార్క్ 22; ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) స్టార్క్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 0; అనికేత్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 74; క్లాసెన్ (సి) నిగమ్ (బి) మోహిత్ 32; మనోహర్ (సి) డుప్లెసిస్ (బి) కుల్దీప్ 4; కమిన్స్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 2; ముల్డర్ (సి) డుప్లెసిస్ (బి) స్టార్క్ 9; హర్షల్ పటేల్ (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 5; షమీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–25, 4–37, 5–114, 6–119, 7–123, 8–148, 9–162, 10–163. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 3.4–0–35–5, ముకేశ్ కుమార్ 2–0–17–0, అక్షర్ పటేల్ 4–0–43–0, విప్రాజ్ నిగమ్ 2–0–21–0, మోహిత్ శర్మ 3–0–25–1, కుల్దీప్ యాదవ్ 4–0–22–3. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి అండ్ బి) అన్సారి 38; డుప్లెసిస్ (సి) ముల్డర్ (బి) అన్సారి 50; పొరేల్ (నాటౌట్) 34; కేఎల్ రాహుల్ (బి) అన్సారి 15; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 8; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–81, 2–96, 3–115. బౌలింగ్: మొహమ్మద్ షమీ 3–0–31–0, అభిషేక్ శర్మ 3–0–27–0, ప్యాట్ కమిన్స్ 2–0–27–0, హర్షల్ పటేల్ 3–0–17–0, జీషాన్ అన్సారి 4–0–42–3, వియాన్ ముల్డర్ 1–0–16–0.

చరిత్ర సృష్టించిన స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా
ఐపీఎల్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 5 వికెట్లతో స్టార్క్ చెలరేగాడు. తన సంచలన పేస్ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల దూకుడును కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే స్టార్క్ నిప్పులు చేరిగాడు. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్.. 35 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.స్టార్క్కు ఇది తొలి ఐపీఎల్ ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. అదేవిధంగా అంతకుముందు 2023లో ఇదే విశాఖపట్నంలో భారత్తో జరిగిన వన్డే మ్యాచ్లో స్టార్క్ 5 వికెట్లతో మెరిశాడు. ఈ క్రమంలో స్టార్క్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే మైదానంలో వన్డే, ఐపీఎల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా స్టార్క్ నిలిచాడు. ప్రంపచంలో ఏ బౌలర్ ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించలేకపోయాడు. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి విదేశీ బౌలర్గా మిచెల్ స్టార్క్ నిలిచాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్ఆర్హెచ్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్తో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు.

అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్పై విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత వరుసగా రెండు ఓటములను చవిచూసింది. తాజాగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం బౌలింగ్లోనూ సన్రైజర్స్ తేలిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫలమ్యే తమ ఓటమికి కారణమని కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు."మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. తొలుత స్కోర్ బోర్డులో తగనన్ని పరుగులు ఉంచలేకపోయాము. కొన్ని తప్పు షాట్లు ఆడి మా వికెట్లను కోల్పోయాము. డీప్లో క్యాచ్లు అందుకోవడం ఈ ఫార్మాట్లో సర్వ సాధారణమే. ఇదే మా ఓటమికి కారణమని నేను అనుకోను. గత రెండు మ్యాచ్ల్లో మాకు ఏదీ కలిసి రాలేదు. కచ్చితంగా ఈ ఓటములపై సమీక్ష చేస్తాము. మాకు అందుబాటులో ఉన్న అప్షన్స్ను పరిశీలిస్తాము. అనికేత్ వర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నమెంట్కు కూడా డొమాస్టిక్ క్రికెట్లో అతడు తన ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఫామ్ను ఇక్కడ కొనసాగిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో కూడా అతడు తన బ్యాటింగ్తో మైమరిపించాడు. ఈ రెండు ఓటములపై మేము పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఈ టోర్నీలో మాకు ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో తిరిగి పుంజుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: సన్రైజర్స్ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..
బిజినెస్

రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్డెస్క్

రక్షణ శాఖలోకి 2978 ఫోర్స్ గూర్ఖా కార్లు!
ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ భారత రక్షణ దళాల నుంచి ఏకంగా 2,978 ఫోర్స్ గూర్ఖా వాహనాల కోసం ఆర్డర్ పొందింది. త్వరలోనే ఈ వాహనాలు రక్షణ శాఖలోకి చేరనున్నాయి. కంపెనీ ఈ కార్లను సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా తయారు చేయనుంది.ఫోర్స్ గూర్ఖా కార్లు.. ఇండియన్ ఆర్మీ, వైమానిక దళాలలో చేరనున్నాయి. ఈ కార్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగల సత్తా, మంచి ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉండటం వల్లనే సైనిక దళాలకు ఉపయోగకరంగా ఉంటాయి. కంపెనీ లైట్ స్ట్రైక్ వెహికల్ (LSV) వేరియంట్ రక్షణ శాఖకు డెలివరీ చేయనున్నట్లు సమాచారం.భారతదేశంలో ఫోర్స్ మోటార్స్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం ఫోర్స్ గూర్ఖా (3-డోర్, 5-డోర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది), ఫోర్స్ ట్రావెలర్, ఫోర్స్ ట్రాక్స్, ఫోర్స్ అర్బానియా, ఫోర్స్ సిటీలైన్, ఫోర్స్ మోనోబస్ మొదలైనవి ఉన్నాయి. గూర్ఖా 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్తో 138bhp, 320Nm ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వరంగ బీమా సంస్థ టైఅప్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కింద బ్యాంక్ ఇఫ్ ఇండియా కస్టమర్లకు న్యూ ఇండియా అష్యూరెన్స్ బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది.న్యూ ఇండియాకు చెందిన హెల్త్ ఇన్సూరెన్స్, మోటారు, వ్యక్తిగత ప్రమాద, హోమ్, వాణిజ్య ఇన్సూరెన్స్ ఉత్పత్తులను బీవోఐ కస్టమర్లు సులభంగా పొందొచ్చు. సమగ్రమైన బీమా ఉత్పత్తులను అందించేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని బ్యాంక్ ఇఫ్ ఇండియా ఎండీ, సీఈవో రజనీష్ కర్ణాటక్ తెలిపారు.ఈ ఒప్పందంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బీమా ఉత్పత్తులు చేరువ అవుతాయని, నాణ్యమైన సేవలు, రక్షణ అందుతాయని న్యూ ఇండియా అష్యూరెన్స్ చైర్మన్, ఎండీ గిరిజా సుబ్రమణ్యం పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 5,200 శాఖలున్నాయి.

ఇండిగోకు రూ.944 కోట్ల జరిమానా
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు ఆదాయపు పన్ను శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో శనివారం ఈ ఆర్డర్ను అందుకుంది. పెనాల్టీ ఆర్డర్ను సంస్థ ఖండిస్తూ.. చట్టపరమైన చర్యలతోనే ముందుకు వెళ్తామని సవాలు చేసింది.ఆదివారం జరిగిన రెగ్యులేటరీ ఫైలింగ్లో.. ఆదాయపు పన్ను అథారిటీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ జరిమానా విధించబడిందని ఇండిగో స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు ఇండిగో చేసిన అప్పీల్ కొట్టివేయబడిందని అథారిటీ తప్పుగా భావించింది. అయితే అప్పీల్ ఇప్పటికీ క్రియాశీలంగా ఉంది. తీర్పు కూడా పెండింగ్లో ఉంది. ఈ ఆర్డర్ చట్ట పరిధిలోకి రాలేదని కంపెనీ వెల్లడిస్తూ.. ఈ జరిమానాను ఎదుర్కోవడానికి చట్టపరమైన పరిష్కారాలను అనుసరిస్తామని ఇండిగో స్పష్టం చేసింది.ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ఆర్డర్ వల్ల.. కంపెనీ ఆర్థిక, కార్యకలాపాలు లేదా మొత్తం వ్యాపార కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ఇండిగో స్పష్టం చేసింది. ఇప్పటికే పలు ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ఇండిగో ఇప్పుడు తాజాగా జరిమానాకు సంబంధించిన పెనాల్టీ ఆర్డర్ను అందుకుంది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడువిమానయాన సంస్థ ఇటీవల FY25 మూడవ త్రైమాసికంలో దాని నికర లాభంలో 18.6 శాతం క్షీణతను నమోదు చేసింది. ఆదాయాలు కూడా రూ.2,998.1 కోట్ల నుంచి రూ.2,448.8 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా ఆదాయం తగ్గడానికి కారణమైందని కంపెనీ వెల్లడించింది.
ఫ్యామిలీ

పిల్లలు స్కూల్ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు?
పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే.. వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి. బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. వాటిని నేర్పిస్తే పిల్లలు పెద్దయ్యాక కూడా మంచి విలువలతో బతుకుతారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి బ్యాగుల్ని, వస్తువుల్ని చక్కగా సర్దుకునే అలవాటు నేర్పించాలి. చక్కగా సర్దుకోవడం నేర్చుకుంటే వారి వస్తువుల్ని ఎక్కడ పెట్టారో అన్న క్లారిటీ వారికి ఉంటుంది. మార్నింగ్ స్కూల్ వెళ్లే టైమ్లో హడావిడి పడుకుండా తమ వస్తువుల్ని సులభంగా కనుగొంటారు. అంతేకాకుండా వారి పనుల్ని స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. రేపు భవిష్యత్తులో దూర్రప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండాల్సినప్పుడు ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు, వారి వస్తువులను సరైన స్థలంలో పెట్టేలా వారికి నేర్పండి.కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడం...పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేతులు, ముఖం కడుక్కోవడం గురించి చెప్పండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యాధులను దూరంగా ఉంచుతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి యూనిఫామ్ తీసివేయమని చెప్పండి. ఆ తర్వాత చేతులు, ముఖం వాష్ చేసుకోమని వారికి చెప్పండి. ఈ అలవాటు నేర్చుకోవడం వల్ల పరిశుభ్రత ఎంతో కీలకమని తెలుసుకుంటారు. ఈ అలవాటు వారిని భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది.సమయాన్ని తెలివిగా ఉపయోగించడం...పిల్లలకు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే అలవాటును నేర్పించండి. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్ వారికి ఎంతగానో సాయపడుతుంది. సకాలంలో వారి పనులు చేసుకోవడం, ఆటలు ఆడుకోవడం, చదువు, హోం వర్క్ వంటి పనులు చేయడం నేర్పించండి. దానికి తగ్గ టైమ్ టేబుల్ వేసి దాని ఫాలో అయ్యేలా ప్లాన్ చేయండి. దీంతో.. వారు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు.చదువు, హోం వర్క్...స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఆటల తర్వాత స్నానం చేసేలా ప్రోత్సహించండి. ఆ తర్వాత హోం వర్క్, చదువుకు టైం కేటాయించేలా వారికి అలవాటు చేయండి. ఆటలతోపాటు చదువు ప్రాముఖ్యత వారికి తెలపండి. సబ్జెక్ట్ల్లో ఏమైనా డౌట్లు ఉంటే దగ్గరుండి హెల్ప్ చేయండి. హోం వర్క్ పెండింగ్ పెట్టకుండా పూర్తిగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేయండి. ఈ అలవాటు వల్ల వారు చదువుల్లో మెరుగ్గా రాణిస్తారు. (చదవండి: వృథాని జీరో చేద్దాం..వేస్ట్ని రీయూజ్ చేసేద్దాం..! ది బెస్ట్గా..)

వృథాని జీరో చేసేలా..ది బెస్ట్గా రీయూజ్ చేద్దాం ఇలా.!
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ... మార్చి నెల 30వ తేదీని జీరో వేస్ట్ డే గా గుర్తిస్తూ 2022, డిసెంబర్ 14వ తేదీన ఒక తీర్మానాన్ని చేసింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అప్పటి నుంచి మార్చి నెల 30వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా గుర్తిస్తూ ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఈ ఏడాది ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ రంగాల వృథా మీద దృష్టి పెట్టింది. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వాయు, నీటి కాలుష్యాలతోపాటు వస్త్రాల అవశేషాలు కూడా ప్రధానమైనవి. క్లాత్తో డ్రస్ కుట్టిన తర్వాత వచ్చే మిగులు నదులు, కాలువల్లోకి చేరి నీటిలో, నీటి అడుగుల మట్టిలో నిలిచి΄ోతోంది. కొంతకాలానికి ఆ వస్త్రానికి అద్దిన రసాయన రంగులు నేలలో, నీటలో ఇంకుతాయి. ఇలా వేస్ట్ క్లాత్ కారణంగా కెమికల్ పొల్యూషన్ నీటిని, మట్టిని కూడా కలుషితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దుస్తుల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో ఉత్పత్పి 2015నాటికి రెండింతలైంది. ఏడాదికి 92 మిలియన్ టన్నుల టెక్స్టైల్ వేస్ట్ లెక్క తేలుతోంది. ఇది కాలువలు, నదుల్లోకి వెళ్తోంది. దీనిని అరికట్టడం కోసమే యూఎన్ఓ (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఈ ఏడాది ఫ్యాషన్ ఇండస్ట్రీ వేస్ట్ మీద దృష్టి పెట్టింది. ఫ్యాషన్, టెక్స్టైల్ రంగాలను జీరో వేస్ట్ దిశగా నడిపించడానికి మార్గాలను అన్వేషించాలంటోంది యూఎన్ఓ. హైదరాబాద్లో ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న సుదీప కందుల ట్రిపుల్ ఆర్ (రీ యూజ్, రీ సైకిల్, రీ పెయిర్) అనే యూఎన్ఓ థీమ్ను రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది!సుదీప కందుల... ఆలన బొటీక్ పేరుతో చిన్న పిల్లల దుస్తుల డిజైనింగ ప్రారంభించి మూడు దశాబ్దాలవుతోంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో బొటీక్ కల్చర్ మొదలైన తొలినాళ్ల నుంచి బొటీక్ నడుపుతున్నారామె. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భావించే సుదీప, ఆమె ఉద్యోగులు పాలిథిన్ కవర్ల వినియోగాన్ని తగ్గించడానికి మార్కెట్కెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్ను వెంట తీసుకువెళ్తారు. బొటీక్లో ఉత్పన్నమయ్యే వేస్ట్ క్లాత్ను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి అనేక మార్గాలనెంచుకున్నారు సుదీప. చిన్న ముక్కలతో నవజాత శిశువులకు, ఏడాది లోపు పిల్లలు ధరించడానికి వీలుగా కుట్టించి ఆర్ఫనేజ్కు ఇచ్చారు. అలా కుదరని వాటిని నగరంలోని ఒక ఎన్జీవోకి ఇస్తుంటారు. ఆ ఎన్జీవోలో అల్పాదాయ వర్గాల మహిళలకు ఆ క్లాత్తో చిన్న చిన్న పోట్లీ బ్యాగ్లు, పర్సులు తయారు చేసుకుంటారు. అలా కూడా పనికి రాని సన్నగా పొడవుగా రిబ్బన్ ముక్కల్లాంటి క్లాత్ని ఒక స్కూల్కి ఇస్తే వాళ్లు పిల్లల చేత డోర్మ్యాట్ మేకింగ్ వంటి క్రాఫ్ట్ ప్రాక్టీస్కి ఉపయోగిస్తున్నారు. ఇక ఎందుకూ పనికిరావనిపించే ముక్కలను ఒక కవర్లో జమ చేసి ఆ బొటీక్లో పని చేసే వాళ్లు దిండులో స్టఫింగ్గా నింపుకుంటారు. వ్యర్థాన్ని అర్థవంతంగా మారుస్తున్న సుదీప తన బొటీక్లో చిన్న ముక్క కూడా నేలపాలు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు.ఉత్పత్తి– కొనుగోలు పెరిగాయిమనం కొంతకాలం వాడి ఇక పనికిరావని పారేస్తున్న వస్తువులు నిజానికి పనికిరానివి కాదు, వాటిని మరొక రకంగా మలుచుకుని ఉపయోగించుకోవడం మనకు చేతకాక΄ోవడమే. రీ యూజ్ చేయడం నేర్చుకోవాలి. నాచురల్ ఫైబర్తో వస్త్రాలు తయారుచేసినన్ని రోజులు వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల వ్యర్థాల గురించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. మ్యాన్మేడ్ ఫైబర్ ప్రవేశించిన తర్వాత ఎదురవుతున్న సమస్యలివన్నీ. నిజానికి వ్యర్థాల ఉత్పత్తి మనదేశంలోకంటే యూఎస్, యూరప్దేశాల్లో చాలా ఎక్కువ. అవసరానికి మించి ఉత్పత్తి చేయడం, అవసరానికి మించి కొనడం రెండూ పెరిగాయి.షాపింగ్ వ్యసనంఈ తరానికి షాపింగ్ ఒక వ్యసనంగా మారింది. యూఎస్, యూరప్ల నుంచి వాడిన దుస్తులు మూడవ ప్రపంచదేశాలకు డంప్ అవుతున్నాయి. అరేబియా షిప్పుల్లో గుజరాత్ తీరం నుంచి దేశంలోకి వస్తుంటాయవి. మన దగ్గర తయారయ్యే పాలియెస్టర్ వస్త్రాలకు తోడు ఆయాఖండాల నుంచి వచ్చిపడుతున్న దుస్తులు కూడా కలిసి డంప్ పెరిగిపోతోంది. పాలియెస్టర్ వస్త్రాలను ఫైబర్గా మార్చి కొత్త దుస్తులు తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వ్యర్థాలు సముద్రాల్లోకి చేరి మైక్రోప్లాస్టిక్గా మారి తిరిగి మన మీదనే దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే పారేస్తున్న దుస్తులతో కాలువలు నిండిపోతున్నాయి.– డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణ నిపుణులు జీరో వేస్ట్తో ద బెస్ట్ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్తో ఏటా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల టన్నుల చెత్త జమవుతోంది. ఇది పెరుగుతూ భూగ్రహాన్ని ముంచేసినా ఆశ్చర్యం లేదు. ఈ ప్రమాదాన్ని మన దేశంలో ముందుగా గ్రహించి అప్రమత్తమైన పప్రాంతం ఢిల్లీ, మాల్వీయ నగర్లోని నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ. రీయూజ్, రీసైకిల్ను ఫాలో అవుతూ జీరో వేస్ట్తో పర్యావరణప్రియమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.దాదాపు ఏడేళ్ల కిందట... ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాల్వీయనగర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక వర్క్షాప్ నిర్వహించింది. అందులో పాల్గొన్న నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ సభ్యులు ఆ వర్క్షాప్లో చెప్పినవి, చూపించినవి తమ కాలనీలో అమలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ 250 ఇళ్లున్నాయి. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేయాలో వివరించి, కొన్నాళ్లపాటు పర్యవేక్షించారు సొసైటీ సెక్రటరీ, కంటివైద్యులు డాక్టర్ రూబీ మఖీజా. తతిమా సభ్యుల సహాయసహకారాలతో తడిచెత్తతో కాలనీలోనే కంపోస్ట్ తయారుచేయడం మొదలుపెట్టారు. ఆ ఎరువుతో కిచెన్, బాల్కనీ, రూఫ్ గార్డెన్స్ను ప్రోత్సహించారు. ఒక షెడ్డు లాంటిదీ ఏర్పాటు చేశారు.. ఇళ్లల్లో పాతపుస్తకాలు, దుస్తులు, ఆటబొమ్మలు, ఉపయోగంలో లేని వస్తువుల కోసం. ఆ కాలనీలో ఎవరికైనా ఏ వస్తువైనా అవసరం ఉంటే ముందు ఈ షెడ్డుకొచ్చి చూసి, అందులో తమకు కావలసింది లేకపోతేనే కొత్తది కొనుక్కోవాలి. అలా కాలనీ వాసులు తీసుకున్నవి పోనూ మిగిలినవి స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు అవసరమైన వాళ్లకు పంచేందుకు! ఈ కాలనీలో ప్లాస్టిక్ బ్యాన్. గుడ్డ సంచులనే వాడుతారు. నీటి వృథా, ఆదానూ సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి వారానికోసారి క్యాంప్ పెడతారు. అందులో పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ వాళ్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలు కాకుండా జాగ్రత్తపడుతున్నారు. వీళ్లో బ్రాడ్కాస్ట్ సిస్టమ్నూ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ కాలనీలో జరిగే పర్యావరణపరిరక్షణ కార్యక్రమాలను వీడియోలుగా తీసి వాటిని సాయంకాలం ప్రసారం చేస్తారు. ఈ ప్రయత్నాలతో జీరో వేస్ట్లో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది నవజీవన్ విహార్. (చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..)

ఎండ నుంచి చర్మానికి రక్షణగా...
అందంగా కనబడాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం భానుడు భగభగలతో చర్మానికి రక్షణ లేకుండా పోతోంది. గడప దాటిన వెంటనే వేడి, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు. వివిధ పనులపై బయటకు వెళ్లే వారు ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంపై తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా ముఖం, చేతులు సూర్య కిరణాలు నేరుగా తగిలే ఇతర ప్రదేశాల్లో చర్మం నిర్జీవంగా మారిపోతోంది. దీంతో చర్మ కాంతి తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు. వేసవిలో చర్మానికి చెమటలు పట్టడం, జిడ్డుగా మారడం, పొడిబారిపోవడం, నల్లని మచ్చలు రావడం, ముఖంపై మొటిమలు, ఇలా ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో ఉత్పన్నమవుతాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది వారికి తెలిసిన వివిధ రకాల చిట్కాలు పాటిస్తున్నారు. అయితే చర్మ సౌందర్యం దెబ్బతినడానికి మృత కణాలు కూడా ఒక కారణం. అయితే వీటి వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది. చెమట గ్రంథుల్ని మూసివేడయం వల్ల మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. వీటి నుంచి అధిగమించాలంటే ఈ చిక్కాలు పాటించాల్సిందే.. సన్ స్క్రీన్తో మేలు.. సూర్యకిరణాల నుంచి విడుదలయ్యే అధిక యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సూర్యకిరణాలు తాకే ప్రదేశాల్లో సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రస్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలు, మచ్చలను నియంత్రించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముఖం మృదువుగా చేస్తుంది.పళ్లు , పళ్ల రసాలు తీసుకోవడం మంచిది.. వేసవి తాపానికి శరీరం తేమ కోల్పోతుంది. ఫలితంగా చర్మం ఎరగ్రా కందిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పళ్లు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్లతో పాటు, శరీరానికి అవసరమైన నీటి స్థాయిలను పునరుద్ధరిస్తాయి. చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. నిమ్మ, జామ, స్ట్రాబెర్రీ, దానిమ్మ, వాటర్ మెలాన్, బ్లూబెర్రీ, కివీ, యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.మేకప్ తక్కువగా వేసుకోవాలి.. సూర్య కిరణాల నుంచి వెలువడే యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హానికలిగిస్తుంది. దీనిని నుంచి రక్షణ కోసం ఎస్పీఎఫ్ 50 ఉన్న యూవీ స్పెక్ట్రమ్ సన్ బ్లాక్, సన్ స్క్రీన్ ఉపయోగించాలి. కాలంతో సంబంధం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సన్్రస్కీన్ లోషన్ రాసుకోవాలి. వేసవిలో ఇది మరింత అవసరం. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడగడం, స్నానం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రతకు చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండటానికి నిపుణుల సూచనల మేరకు మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలో తిరగకుండా ఉండేందుకు ప్రయతి్నంచాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తే ఎండ నుంచి ఉపశమనం కోసం బ్లాక్ గాగుల్స్, ఎండ తగలకుండా స్కార్్ఫ్స, గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. వేసుకునే దుస్తులు కాటన్ మెటీరియల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. లూజుగా ఉన్న కాటన్ బట్టలు ధరించాలి. – ఆలపాటి శిరీష, కాస్మటాలజిస్టు, సికారా క్లినిక్స్, బంజారాహిల్స్

6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు
ఉగాది పచ్చడిని సేవించే ఆచారం శాలివాహన శకారంభం నుంచి మొదలైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని కొత్త మట్టికుండలోతయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో వేపపూత, మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, అరటిపండు ముక్కలు ఉపయోగిస్తారు. వీటి వల్ల ఉగాది పచ్చడి ఆరురుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....బెల్లం, అరటి పండ్లు– తీపిబెల్లం తీపిగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల కలిగే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బెల్లాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవడం శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను అరటిపండు నిరోధిస్తుంది.చింతపండు– పులుపుఉగాది పచ్చడి తయారీకి పాత చింతపండు ఉపయోగించడం మంచిది. పాత చింతపండు ఉష్ణాన్ని, వాత దోషాలను తగ్గిస్తుంది. బడలికను పోగొడుతుంది. జఠరశక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. వేసవిలో చింతపండు రసం తీసుకోవడం వల్ల ఉష్ణదోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.ఉప్పురుచులకు రారాజులాంటిది ఉప్పు. ఉప్పులేని పప్పులు, కూరలు, పచ్చళ్లు రుచించవు. ఆహారంలో అనునిత్యం ఉపయోగించే ఉప్పు త్రిదోషాలను– అంటే, వాత పిత్త కఫ దోషాలు మూడింటినీ పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఉప్పును మోతాదులోనే వాడాలి.మామిడి పిందెలు– వగరుమామిడి కాయలు ముదిరితే పులుపుగా ఉంటాయి గాని, పిందెలు వగరుగా ఉంటాయి. మామిడి పిందెల వగరుదనం లేకుంటే, ఉగాది పచ్చడికి పరిపూర్ణత రాదు. మామిడి పిందెలలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. మామిడి పిందెలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని త్రిదోషాలను హరించి, శక్తిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.వేపపూలు– చేదువసంతారంభంలో వేపపూలను తినే ఆచారం దాదాపు అన్నిప్రాంతాల్లోనూ ఉంది. దీనిని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో వేపపూలను ఉపయోగించడం మన తెలుగువాళ్లకే చెల్లింది. వేపపూలు కఫదోషాన్ని, క్రిమిదోషాలను పోగొడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.మిరియాల పొడి–కారంమిరియాలను నేరుగాను, పొడిగాను వంటకాల్లో తరచుగా వినియోగిస్తూనే ఉంటాం. మిరియాలు రుచికి కారంగా ఉన్నా, శరీరానికి చాలా మేలు చేస్తాయి. మిరియాలు కఫదోషాన్ని, విష దోషాలను హరిస్తాయి. చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని, శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి. అందుకే సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు.
ఫొటోలు


బాలకృష్ణ 'ఆదిత్య 369' రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


హైదరాబాద్ : రంజాన్ వేళ చార్మినార్ వద్ద షాపింగ్ సందడి (ఫొటోలు)


మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటున్న నటి ‘అనన్య నాగళ్ల’ (ఫొటోలు)


ఉగాది స్పెషల్ లుక్లో మహేశ్బాబు గారాలపట్టి సితార (ఫోటోలు)


తిరుమలలో ఉగాది వేడుకలు (ఫొటోలు)


#MEGA157 చిరంజీవి,అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)


శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు..భక్తజనసంద్రం (ఫొటోలు)


లక్మీ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


చిరంజీవిని కలిసిన 'కోర్ట్' మూవీ టీమ్ (ఫొటోలు)


తిరుపతి : గుడి సంబరం..అంగరంగ వైభవంగా (ఫొటోలు)
International

Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.ఇదేవిధంగా మయన్మార్లోని ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది. ఈ నేపధ్యంలో భారత్.. మయన్మార్కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం

బంగ్లా షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే.

వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమరి్థంచే వాళ్లెవరూ ఇక్కడ ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలంటూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దుచేసింది. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్, అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యాప్ లో నమోదుచేసుకుని స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలంటూ ఆయా వి ద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్ సందేశాలను పంపించింది. ఇలా బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. గాజా యుద్ధంలో హమాస్కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్ మీడియా పోస్ట్లను సోషల్ మీడియా ఖాతాల్లో లైక్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దుచేశామని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(డీఓఎస్) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్–1 వీసాను రద్దుచేస్తూ సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్ పంపించింది. ఈ సందర్బంగా ‘‘అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్–1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితతంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్లో మీ పాస్పోర్ట్ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్ సాయంతో స్వీయబహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మీమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేం పంపితే మీ స్వదేశానికే పంపకపోవచ్చు. మా వీలును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది’’ అని ఈ–మెయిల్ సందేశంలో ప్రభుత్వం పేర్కొంది. 2023–24 ఏడాదికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్ డోర్స్’నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే.

నిర్బంధాలు.. బహిష్కరణలు!
న్యూయార్క్: అమెరికా యూనివర్సిటీల్లో చదువుకొనసాగిస్తూ పాలస్తీనా అనుకూల నిరసనలకు మద్దతు పలుకుతున్న వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వీరు పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్తోపాటు అధికారులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, గాజాలో ని హమాస్పై ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే తాము మాట్లాడుతున్నామన్నది నిరసనల్లో పాల్గొంటున్న వారి వాదనగా ఉంది. ఇటీవలి కాలంలో యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏడెనిమిది మంది పాలస్తీనా అనుకూల విద్యార్థి నేతలను నిర్బంధంలోకి తీసుకోవడమో లేదా బలవంతంగా సొంతదేశాలకు పంపించడమో చేశారు. వీరిలో కొందరిని గురించి పరిశీలిద్దాం.. రుమేసా ఒజ్టుర్క్ తుర్కియేకు చెందిన 30 ఏళ్ల రుమేసా ఒజ్టుర్క్ మంగళవారం బోస్టన్లోని ఓ వీధిలో నడిచి వెళ్తుండగా ఫెడరల్ అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. టఫ్టŠస్ వర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న ఈమె హమాస్కు మద్దతుగా జరిగే కార్యకలాపాల్లో పాల్గొంటోందని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. ఆధారాలను మాత్రం చూపలేదు. అయితే, ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసే వర్సిటీ వార్తాపత్రికకు రమేసా వ్యాసాలు రాస్తుంటారని స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం లూసియానాలో డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. రుమేసా నిర్బంధానికి తగు కారణాలు తెలపాలని జిల్లా జడ్జి ఒకరు అధికారులను ఆదేశించారు. మహ్మూద్ ఖలీల్ అమెరికాలో నివాసానికి అర్హత పొందిన పాలస్తీనా అనుకూల ఉద్యమకారుడు మహ్మూద్ ఖలీల్ను మార్చిలో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి, నిర్బంధంలో ఉంచారు. కొలంబియా వర్సిటీలో గతేడాది జరిగిన ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలను నడిపిన వారిలో ఇతడూ ఉన్నాడు. అనంతరం వర్సిటీ అధికారులు, ఆందోళనకారులకు మధ్యవర్తిగా ఉండి ఆందోళనలను విరమింపజేశాడు. అయితే, ఇతడు హమాస్కు మద్దతు తెలుపుతున్నాడనే ఆరోపణలపై ఖలీల్కున్న గ్రీన్కార్డును యంత్రాంగం రద్దు చేసింది. బలవంతంగా సొంతదేశం సిరియాకు పంపించేందుకు జరిగే ప్రయత్నాలను ఇతడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇతడు అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు. యున్సియో చుంగ్ దక్షిణ కొరియా నుంచి చిన్నతనంలోనే అమెరికాకు వచ్చిన యున్సియో చుంగ్ నివాసార్హత పొందింది. ఈమె కొలంబియా వర్సిటీ విద్యార్థి. పాలస్తీనా అనుకూల విద్యార్థులపై ప్రభుత్వం బహిష్కరాస్త్రాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఇటీవల బర్నార్డ్ కాలేజీలో జరిగిన నిరసనల్లో పాల్గొనడమే ఈమె చేసిన నేరం. ఈమెను సొంతదేశం కొరియాకు పంపించాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ఈమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు యున్సియోను నిర్బంధించవద్దని జడ్జి ఒకరు ఆదేశించారు. బాదర్ ఖాన్ సురి భారత్కు చెందిన బాదర్ ఖాన్ సురి జార్జిటౌన్ వర్సిటీ విద్యార్థి. వర్జీనియాలోని తన నివాసం వద్ద ముసుగు ధరించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. హ మాస్ సిద్ధాంతాలను ఇతడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. సురి సోషల్ మీడియా పోస్టులు, ఇతడి భార్య పాలస్తీనా వాసి కావడమే ఇందుకు కారణమని ఇతడి లాయర్ కోర్టుకు తెలిపారు. విజిటింగ్ స్కాలర్గా అమెరికాలో ఉండేందుకు సురికి అనుమతి ఉందని, ఇత డి భార్య అమెరికా పౌరు రాలని అ న్నారు. లూసియానాలోని డి టెన్షన్ సెంటర్లో సురిని ఉంచారు. సురి ని వెంటనే విడుదల చేయాలని, భారత్కు బలవంతంగా పంపించరాదని వాదిస్తున్నారు. లెకా కొర్డియా వెస్ట్ బ్యాంకుకు చెందిన పాలస్తీనా వాసి లెకా కొర్డియా. ప్రస్తుతం న్యూయార్క్లోని నెవార్క్లో ఉంటోంది. విద్యార్థి వీసా పరిమితి ముగిసిన తర్వాత కూడా అమెరికాను వీడి వెళ్లలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. కొర్డియా తమ విద్యార్థి కానేకాదని కొలంబియా యూనివర్సిటీ అంటోంది. టెక్సాస్లోని అల్వరాడో డిటెన్షన్ సెంటర్లో ఈమెను ఉంచారు. రంజనీ శ్రీనివాసన్ భారత పౌరురాలైన రంజనీ శ్రీనివాసన్ కొలంబియా వర్సిటీలో డాక్టరేట్ చేస్తోంది. యూనివర్సిటీ హాస్టల్లో ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు ఈమెను సోదా చేయడంతో ఈమె భారత్కు తిరిగి వచ్చింది. హింసను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఈమె వీసాను రద్దు చేసినట్లు యంత్రాంగం తెలిపింది. ఇందుకు గల ఆధారాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఆరోపణలను ఈమె ఖండించింది. నిరసనల్లో తనకెలాంటి పాత్ర లేదని తెలిపింది. ‘సెల్ఫ్ డిపోర్ట్’ఆప్షన్ను ఎన్నుకుని, స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. అలిరెజా డొరౌడి అలబామా యూనివర్సిటీ డాక్టొరల్ విద్యార్థి అలిరెజా డొరౌడి సొంత దేశం ఇరాన్. మంగళవారం ఇతడిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకుని, లూసియానాలోని జెనా ఇమిగ్రేషన్ ఫెసిలిటీకి తరలించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఇతడి వీసాను అధికారులు 2023లోనే రద్దు చేశారని లాయర్ డేవిడ్ రొజాస్ తెలిపారు. అయితే, విద్యార్థి హోదాలో ఉన్నంత కాలం ఇతడు అమెరికాలో ఉండేందుకు అర్హత ఉంటుందన్నారు. జాతీయ భద్రతకు ప్రమాదమనే ఆరోపణలపై ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు. అయితే, ఇతడికి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలతో సంబంధం లేదని లాయర్ డేవిడ్ తెలిపారు. డాక్టర్ రషా అలావీహ్ లెబనాన్కు చెందిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రషా అలావీహ్(34). రోడ్ ఐల్యాండ్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉన్న ఈమెను ఇటీవలే సొంత దేశానికి బలవంతంగా పంపించివేశారు. ఈమె పిటిషన్పై తీర్పు వెలువడే వరకు నిర్బంధించరాదన్న జడ్జి ఆదేశాలను సైతం ఇమిగ్రేషన్ అధికారులు పక్కనబెట్టడం గమనార్హం. లెబనాన్లోని హెజ్బొల్లా సాయుధ సంస్థకు ఈమె బహిరంగంగా మద్దతు పలికారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, హెజ్»ొల్లా నేత హసన్ నస్రుల్లా మత, ఆధ్యాతి్మక బోధనలకే తప్ప రాజకీయ సిద్ధాంతాలకు మద్దతు తెలపలేదని రషా అంటున్నారు.మొమొడౌ తాల్ కార్నెల్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న మొ మొడౌ తాల్(31) వీసాను ఇటీవలే అధికారులు రద్దు చేశారు. క్యాంపస్లో జరిగిన పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొనడమే ఇతడి తప్పు. యూకే, గాంబియా పౌరసత్వాలున్న మొమొడౌ తనను అక్రమంగా నిర్బంధించారంటూ కోర్టులో సవాల్ చేశాడు. ప్రభుత్వ చర్యలు చట్టబద్ధమేనని కోర్టు ప్రకటిస్తే ఇమిగ్రేషన్ అధికారుల ఎదుట లొంగిపోతానని ఇతడు అంటున్నాడు.
National

నాగ్పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన
నాగ్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మహారాష్ట్రలోని నాగ్పూర్లో గల సంఘ్ ప్రధాన కార్యాలయానికి ఈరోజు (ఆదివారం) చేరుకున్నారు. ఆయన 11 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఇక్కడి స్మృతి మందిర్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఈ సమయంలో ఆయన వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు.ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులలో ఒకరైన గోల్వాల్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ‘మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్’(Madhav Eye Clinic Premium Center)కు శంకుస్థాపన చేయనున్నారు. నాగ్పూర్ చేరుకున్న ప్రధాని మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి, నాగ్పూర్ ఎంపీ నితిన్ గడ్కరీ స్వాగతం పలికారు. వీరు ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఆయనతో పాటు ఉన్నారు.ప్రధాని తన నాగ్పూర్ పర్యటనలో దీక్షాభూమిని కూడా సందర్శించనున్నారు. 1956లో బాబా సాహెబ్ అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని ఇక్కడే స్వీకరించారు. ఇక్కడ ప్రధాని మోదీ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కు నివాళులర్పించనున్నారు. ప్రధాని పర్యటనను ఆర్ఎస్ఎస్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది.ఇది కూడా చదవండి: Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు

వ్యభిచార రాకెట్ దందా గుట్టురట్టు.. భార్యభర్తలే ఏకంగా..
ఢిల్లీ: నోయిడాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వ్యభిచార రాకెట్ దందాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బట్టబయలైంది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, వీరికి అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ జంట నోయిడా ఇంటిపై దాడి చేసి రూ. 15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. నోయిడాలో ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ గత ఐదేళ్లుగా వ్యభిచార రాకెట్ దందా నడుపుతున్నారు. ఈ జంట సైప్రస్కి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ సంస్థ ఎక్స్ హామ్స్టర్, స్ట్రిప్చాట్ వంటి ప్రసిద్ధ శృంగార వెబ్సైట్లను నిర్వహిస్తోంది. వీరిద్దరు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్, ప్రధానంగా ఫేస్బుక్ ఉపయగించి మోడల్లను నియమించుకుంటారు. మంచి జీతాలు ఇస్తామనే హామీలతో మోడలింగ్ అవకాశాలు అందిస్తామని ‘‘ఎచాటో డాట్ కామ్’’ అనే పేజీని క్రియేట్ చేశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా వీరి వలలో చిక్కారు. ఆడిషన్ల కోసం నోయిడాలోని ఆ జంట ప్లాట్కు వచ్చిన తర్వాత, వీరికి రాకెట్లో పాల్గొనే అవకాశం కల్పించారు. నెలకు రూ. 1 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు జీతాన్ని ఇచ్చారు.అధికారులు దాడి చేసిన సమయంలో, ఈ జంట ఉంటున్న ఫ్లాట్లో ఒక ప్రొఫెషనల్ వెబ్ క్యామ్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అడాల్ట్ కంటెంట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్లను చేసేవారు. హాఫ్-ఫేస్ షోలు, ఫుల్-ఫేస్ షోలు, వివిధ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఆదాయంలో 75 శాతం దంపతులు ఉంచుకోగా, 25 శాతం మాత్రమే మోడల్స్కు ఇచ్చేవారు.కాగా, ప్రారంభంలో వినియోగదారుల నుండి క్రిప్టోకరెన్సీల ద్వారా చెల్లింపులు స్వీకరించేవారు. టెక్నియస్ లిమిటెడ్ ద్వారా రూ.7 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన నెదర్లాండ్ లోని ఒక బ్యాంక్ అకౌంట్ని ఈడీ కనుగొంది. ఈ నిధులను భారతదేశంలో ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు ఉపయోగించి విత్ డ్రా చేసుకున్నారు. ఈ రాకెట్లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.#BreakingNews: Noida Porn Film Racket Exposed!1. ED raids a porn studio operating in Sector 105, Noida.2. The illegal business was running under the name Subdigi Ventures Pvt. Ltd.3. Directors Ujjwal Kishore and Neelu Srivastava were running the live porn studio from their… pic.twitter.com/p7vuaPjfsm— Vishal Kanojia Journalist (@Vishal0700) March 29, 2025

చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం
న్యూఢిల్లీ: ఈరోజు(ఆదివారం) నుండి చైత్ర నవరాత్రులు(Chaitra Navratri) ప్రారంభమయ్యాయి. వివిధ ఆలయాల్లో నేటి నుంచి ఏప్రిల్ ఆరు వరకు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. చైత్ర నవరాత్రి మొదటి రోజున దుర్గాదేవిని శైలపుత్రి రూపంలో కొలుస్తారు. దేశంలోని పలు అమ్మవారి దేవాలయాల్లో ఉదయం నుంచే సందడి నెలకొంది. భక్తులు అమ్మవారి తొలి హారతిని తిలకించేందుకు ఆలయాలకు తరలివచ్చారు. #WATCH | Varanasi, UP: Devotees offer prayers at Ashtabhuji Mata Mandir on the first day of Chaitra Navratri pic.twitter.com/VeGFHqa0cu— ANI (@ANI) March 30, 2025ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని వారణాసిలో చైత్ర నవరాత్రుల మొదటి రోజున భక్తులు అష్టభుజ మాత ఆలయానికి వస్తున్నారు. మొదటి చైత్ర నవరాత్రి మంగళ హారతి సందర్భంగా కాశీలోని విశాలాక్షి శక్తిపీఠం నుంచి పంపిన గంగా జలంతో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకించారు.#WATCH | दिल्ली: चैत्र नवरात्रि के पहले दिन छतरपुर के श्री आद्या कात्यायनी शक्तिपीठ मंदिर में पूजा-अर्चना की जा रही है।नवरात्रि के पहले दिन देवी दुर्गा की पूजा माता शैलपुत्री के रूप में की जाती है। pic.twitter.com/HR7L9hJrjG— ANI_HindiNews (@AHindinews) March 29, 2025ఢిల్లీలో చైత్ర నవరాత్రి మొదటి రోజున ఛత్తర్పూర్లో కొలువైన ఆద్య కాత్యాయనీ శక్తిపీఠ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి నుంచే భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఢిల్లీలోని ఝండేవాలన్ ఆలయంలో చైత్ర నవరాత్రుల తొలి హారతి సందర్భంగా భారీగా భక్తుల రద్దీ కనిపించింది.#WATCH | Delhi: "We came here to attend the morning aarti at 4 am. We had a very good 'Darshan'. May Goddes bless all," says Neetu, a devotee who attended morning aarti at Jhandewalan Temple pic.twitter.com/PG2OlRrVUp— ANI (@ANI) March 30, 2025ఢిల్లీలోని ఝండేవాలన్(Jhandewalan) ఆలయ పూజారి అంబికా ప్రసాద్ పంత్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ రోజు చైత్ర నవరాత్రుల మొదటి రోజు. ఈరోజు దుర్గాదేవిని శైలపుత్రి రూపంలో పూజిస్తారు. అమ్మవారిని హిమాలయ పుత్రిగా భావిస్తారు. అందుకే శైలపుత్రి అని పిలుస్తారు’ అని తెలిపారు.మహారాష్ట్రలోని ముంబైలో ముంబాదేవి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ ఆలయం ముంబైలోని భూలేశ్వర్ ప్రాంతంలో ఉంది. ముంబా దేవి ముంబైని రక్షిస్తారని చెబుతారు. ఆమెను పూజించడం ద్వారా శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు.#WATCH | Mumbai, Maharashtra: Aarti is being offered at Shri Mumbadevi Temple as the nine-day-long festival of Chaitra Navratri begins today. Goddess Durga is worshipped in the form of Mata Shailputri on the first day of Navratri. pic.twitter.com/y7h7mQgxOU— ANI (@ANI) March 30, 2025చైత్ర నవరాత్రులలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజించే సంప్రదాయం వస్తోంది. ఈ పవిత్ర రోజులలో ఉపవాసం ఉండి, పూజలు చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని అంటారు. చైత్ర నవరాత్రుల తొలిరోజునే హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.ఇది కూడా చదవండి: Encounter: ముక్తార్ గ్యాంగ్ షూటర్ అనుజ్ హతం

Encounter: ముక్తార్ గ్యాంగ్ షూటర్ అనుజ్ హతం
లక్నో: ముక్తార్ అన్సారీ ముఠాకు చెందిన షూటర్ అనుజ్ కనౌజియా(Anuj Kanaujia) పోలీసులు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇతనిపై 2.5 లక్షల రివార్డు ఉంది. జంషెడ్పూర్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో జార్ఖండ్ పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తొలుత ఎస్టీఎఫ్తో పాటు జార్ఖండ్ పోలీసులు అనుజ్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.అయితే అనుజ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాల్పులు ప్రారంభించాడు. ఆ దరిమిలా ఇరు వైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో అనుజ్ మృతి చెందాడు. అనుజ్పై పలు నేరపూరిత కేసులు నమోదయ్యాయి. ముక్తార్ గ్యాంగ్(Mukhtar Gang)లో షూటర్గా అనుజ్ కీలకంగా వ్యవహరించాడు. యూపీలోని వివిధ జిల్లాల్లో పలు సెక్షన్ల కింద అనుజ్పై మొత్తం 23 కేసులు నమోదయ్యాయి.అనుజ్ కనౌజియా గత కొన్నేళ్లుగా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో అనుజ్ హతమయ్యాడు. ఈ ఎన్కౌంటర్కు యూపీ ఎస్టీఎఫ్ డిప్యూటీ ఎస్పీ డీకే షాహి నాయకత్వం వహించారు. ఈయన ఎన్కౌంటర్(Encounter)లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డీకే షాహి యూపీ ఎస్టీఎఫ్లో కీలక అధికారిగా పేరొందారు. కాగా ఉత్తరప్రదేశ్లోని బండా జైలులో శిక్ష అనుభవిస్తున్న మాఫియా ముక్తార్ అన్సారీ 2024, మార్చి 28న మృతి చెందాడు. ఈ నేపధ్యంలో జైలు అధికారులు అన్సారీకి స్లో పాయిజన్ ఇచ్చారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోస్ట్మార్టం నివేదికలో అన్సారీ గుండెపోటుతో మరణించినట్లు వెల్లడయ్యింది.ఇది కూడా చదవండి: Myanmar: భూ ప్రకంపనల వైరల్ వీడియోలు
NRI

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్లో "లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్పర్సన్గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
క్రైమ్

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురి అరెస్ట్
నకిరేకల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్కుమార్, పళ్ల మనోహర్ను శనివారం రిమాండ్కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు.

‘హమ్మయ్యా!’ ఆ ఆరుగురు దొరికారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి: ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐదురోజుల తర్వాత.. శనివారం ఆ పిల్లల ఆచూకీ శనివారం లభ్యమైంది. తల్లిదండ్రులు మందలించారనే వాళ్లు అలా వెళ్లిపోయినట్లు సమాచారం.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీన స్కూల్కు వెళ్లి తిరిగి రాలేదు. బడి, ఇల్లు తప్ప ఏం తెలియని చిన్నారులు అలా కనిపించకుండా పోయేసరికి అంతా ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించి.. బంధువులను ఆరా తీసి చివరకు స్థానిక పోలీసులను అశ్రయించారు.ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వాళ్లంతా బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలోనే చదువుతున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. వాళ్ల ఫొటోలను మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. డ్రోన్ సాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషించారు. నాలుగు రోజులైనా ఆచూకీ తెలియరాకపోవడంతో అంతా కంగారుపడ్డారు.చివరకు పి.గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్లు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో బాలబాలికను గుర్తించిన పోలీసులు చివరకు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు. ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జావిద్ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు.

ప్రియురాలికి పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు..!
జంగారెడ్డిగూడెం(ఏలూరు): మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతదేహంతో ధర్నాకొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు.
వీడియోలు


ఏపీ పోలీసులకు హైకోర్టు మొట్టికాయలు


మా ఎంపీటీసీలను కాపాడుకోవటం మా బాధ్యత: గోపిరెడ్డి


Ugadi Special: క్యూట్ కపుల్.. క్యూటెస్ట్ ఇంటర్వ్యూ


ఎర్రపుస్తకం తెల్లమొహం వేసింది..!


శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర్ స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన ముస్లింలు


ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు ఉండాలి


Ding Dong 2.O: మామూలుగా ఉండదు


Magazine Story: చంద్రబాబు కొట్టేసిన టిడిపికి 30 ఏళ్లు


తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు


విదేశీ విద్యార్ధులపై అమెరికా మరో బాంబు