AirAsia crash
-
వాతావరణం వల్లే ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం
జకర్తా: ఎయిర్ ఏషియా విమాన ప్రమాదానికి ప్రతికూల వాతావరణం ముఖ్య కారణమని ఇండోనేసియా వాతావరణ సంస్థ తెలియజేసింది. ప్రమాదం జరగడానికి ముందు పైలట్ నుంచి సమాచారాన్ని విశ్లేషించి నిర్ధారణకు వచ్చింది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారని భావిస్తున్నారు. కొన్ని మృతదేహాలను వెలికితీయగా, మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల విమానం ఇంజిన్ చెడిపోయిఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రమాదం జరగడానికి ఇదీ ఒక కారణమని, అయితే విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణమేంటన్నది తేలాల్సివుందని వెల్లడించింది. -
'సీటు బెల్టు కారణంగానే...'
జకార్తా: ఎయిర్ ఆసియా విమాన ప్రమాదంలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. శుక్రవారం 30 మృతదేహాలు వెలికి తీశారు. సీటు బెల్టు పెట్టుకుని కూర్చున్నవారు కూర్చున్నట్టుగా మృతి చెందిన వారి ఐదు మృతదేహాలు వెలికితీసిన వాటిలో ఉన్నాయి. ప్రతికూల వాతావరణంతో జావా సముద్రం నుంచి మృతదేహాలు వెలికితీయడం కష్టసాధ్యమవుతోంది. మరోవైపు సీటు బెల్టు కారణంగా మృతదేహాలు నీటిపైన తేలడం లేదని సహాయక సిబ్బంది తెలిపారు. సీటు బెల్టు పెట్టుకుని మృతిచెందిన వారిని వెలికి తీయడానికి కష్టపడాల్సివస్తోందని పేర్కొన్నారు. సహాయక సిబ్బంది ముందు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయి. ముందుగా విమాన ప్రధాన శకలాన్ని కనుగొనడం, బ్లాక్ బాక్స్ లేదా ఫ్లైట్ రికార్డర్ ను గుర్తించడం. ఇండోనేసియా సురయ నుంచి సింగపూర్ వెళుతూ ఎయిర్ విమానం ఆదివారం జావా సముద్రంలో కూలిన సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న 162 మంది జలసమాధి అయ్యారు.