Animated
-
ఓటీటీలో చిన్నారులను మెప్పించే 'సైన్స్ ఫిక్షన్' సినిమా
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. -
"బుజ్జి & భైరవ" మీ ఊహకి అందదు
-
అందులో అలా... ఇప్పుడు ఇలా
సముద్రగర్భంలో టైటానిక్ శిథిలాలను చూడడానికి ‘టైటాన్’ అనే జలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురు సాహసికుల ప్రయాణం విషాదాంతం అయిన నేపథ్యంలో యానిమేటెడ్ సిట్కాం ‘ది సింప్సన్’ లోని చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం... 2006లో వచ్చిన ‘ది సింప్సన్’ సీజన్ 17లోని పదో ఎపిసోడ్లో హీరో హోమర్ సింప్సన్ తన తండ్రి మాసన్తో కలిసి జలాంతర్గామిలో సముద్రగర్భంలోకి వెళతాడు. ఒకచోట నిధులతో కూడిన శిథిలమైన నావ కనిపిస్తుంది. ఆ తరువాత వీరి జలాంతర్గామి పగడపు దిబ్బల మధ్యలో చిక్కుకు పోతుంది. మరోవైపు జలాంతర్గామిలో ‘లో ఆక్సిజన్’ సైన్ ఫ్లాష్ అవుతుంటుంది. ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తండ్రీకొడుకులు బయటపడతారు. ‘ది సింప్సన్స్’లోని తండ్రీకొడుకులు మాసన్, హోమర్ సింప్సన్లను, టైటాన్లో ప్రయాణించిన తండ్రీకొడుకులు షెహ్జాదా దావూద్, సులేమాన్ దావూద్లతో పోల్చి నెటిజనులు పోస్ట్లు పెడుతున్నారు. ‘ది సింప్సన్’ రచయిత మైక్ రీస్ టైటానిక్ శిథిలాలను చూడడానికి గత సంవత్సరం భార్యతో కలిసి సముద్ర గర్భంలోకి వెళ్లివచ్చాడు. వారు ప్రయాణించిన జలాంతర్గామిలో కొద్ది సమయం పాటు కమ్యూనికేషన్ సమస్యలు వచ్చినా ఆ తరువాత సర్దుకుంది. -
కళ్ల ముందు... కదలాడుతూ..
సాక్షి, సిద్దిపేట: చదివిన దాని కన్నా చూసింది ఎక్కువగా గుర్తుంటుంది. అంతకుమించి బాగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో 2డీ, 3డీ యానిమేషన్ దృశ్యరూప విద్యాబోధన ప్రాచుర్యంలోకి వచ్చింది. 3డీ యానిమేషన్లో కళ్ల ముందు కదలాడుతున్నట్లుగా పదో తరగతి పాఠ్యాంశాలను అందిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో మంత్రి హరీశ్రావు సొంత ఖర్చులతో సిద్దిపేట జిల్లా సర్కారు బడుల్లోని టెన్త్ విద్యార్థులకు అందిస్తున్నారు. మళ్లీ మొదటిస్థానం కోసం.. 2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో మొదటి స్థానాన్ని తిరిగి సాధించేందుకు మరింత కృషి అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పేరుతో హైదరాబాద్కు చెందిన మంత్ర లెర్నింగ్ అకాడమీ... 3డీ యానిమేటెడ్ పాఠాలు, స్టడీ మెటీరియల్ రూపొందించింది. మంత్రి హరీశ్రావు రూ.20లక్షలకు పైగా వెచ్చించి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించారు. జనవరి 24న సిద్దిపేటలో ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ స్టడీ మెటీరియల్ను హరీశ్రావు అందించి ప్రారంభించారు. కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పుస్తకాలను అందజేస్తున్న మంత్రి హరీశ్ రావు(ఫైల్) నాలుగు సబ్జెక్ట్లు.. గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం నాలుగు సబ్జెక్టుల్లో ఉన్న అన్ని పాఠ్యాంశాలు 3డీ యానిమేషన్లో అందిస్తున్నారు. ఒక్కో పాఠ్యాంశానికి ఒక్కో క్యూఆర్ కోడ్ పొందుపరిచారు. 30 సెకన్ల నుంచి 5 నిమిషాలపాటు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ ఉంటుంది. తరగతి గదుల్లో గంటల వ్యవధిలో బోధించే పాఠాన్ని ఐదు నిమిషాల్లో అర్థం చేసుకునేలా రూపొందించారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి మొబైల్ ఫోన్ల ద్వారా దృశ్య రూపంలో పాఠాలను సులువుగా అభ్యసించే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు హరీశ్ లేఖ.. ‘మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైంది. వారి భవిష్యత్కు పునాదులు వేసే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. టీవీలకు, వినోదాలకు దూరంగా ఉంచండి. పిల్లలు ఇంటి దగ్గర చదువుకునేలా ప్రోత్సహించండి’ .. అంటూ తల్లిదండ్రులకు మంత్రి హరీశ్రావు లేఖలు రాశారు. దృశ్యాలతో కళ్ల ముందు మా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్ట్ల సిలబస్ పూర్తయింది. ప్రస్తుతం రివిజన్ క్లాస్లు జరుగుతున్నాయి. స్టడీ మెటీరియల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్తో 3డీ యానిమేషన్ ద్వారా పాఠ్యాంశాలు వస్తున్నాయి. వాటితో ఇంకా బాగా అర్థమవుతున్నాయి. బట్టీ పట్టకుండా నేర్చుకుంటున్నాం. – అక్షయ, టెన్త్ విద్యార్థి, ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ సిద్దిపేటకు పేరు తేవాలి.. 2021–22లో పదోతరగతిలో రాష్ట్రంలో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. ఆ çస్థానాన్ని నిలబెట్టుకునేందుకు, విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ఉచితంగా డిజిటల్ పాఠాలను అందిస్తున్నాం. తల్లిదండ్రుల ఫోన్లో ఉదయం, రాత్రి వేళల్లో డిజిటల్ పాఠాలు వింటూ మెళకువలు నేర్చుకోవాలి. బాగా చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలి. – హరీశ్ రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి -
ఈ రోజు ఫేస్ మార్చుకుందామా!
నా ఫేస్ చూసీ చూసీ నాకే బోర్ కొడుతుంది... అనుకుంటాం చాలాసార్లు. మీ ఫేస్ కొత్తగా, తమాషాగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే. జపాన్ యానిమేషన్ చిత్రాలలో కనిపించే ఫేస్లతో కనిపించడానికి యానిమి స్టైల్ లెన్స్, అమెరికన్ కంప్యూటర్ యానిమేషన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ ‘ది గ్రించ్’లో మాదిరిగా పచ్చగా కనిపించడానికి గ్రించ్ లెన్స్, పిల్లి ముఖంతో గర్జించడానికి క్యాట్ వుమెన్ లెన్స్, ప్రిన్సెస్ జాస్మీన్లా అందంగా మెరవడానికి స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే...ఇంకా మీరు ప్రయత్నించడానికి చాలా ఫేస్ ఫిల్టర్లు ఉన్నాయి. జస్ట్ ట్రై చేసి చూడండి.(చదవండి: వన్ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్) -
యానిమేషన్లో స్పైడర్మ్యాన్!
స్పైడర్మ్యాన్ అంటే పిల్లలకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తెరపై ఇతగాడు చేసే సాహసాలు చూసి, తమని తాము ఓ స్పైడర్మ్యాన్లా ఊహించేసుకుంటారు. ఇప్పటివరకు ఎన్నో స్పైడర్మ్యాన్ చిత్రాలు చూశాం. కానీ, మరో మూడేళ్లల్లో యానిమేటెడ్ స్పైడర్మ్యాన్ని చూడనున్నాం. సోనీ పిక్చర్స్ అధినేత టామ్ రాథ్మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో యానిమేటెడ్ స్పైడర్మ్యాన్ చిత్రాన్ని విడుదల చేస్తామనీ, ఇప్పటివరకూ వచ్చిన స్పైడర్మ్యాన్ కథలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.