anti-corruption crusader
-
'నోటీసులు అందాక చూస్తా..'
ముంబయి: తనకు నోటీసులు అందిన తర్వాత న్యాయసలహా తీసుకొని ముందుకు వెళతానని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. పుణెలో ఆయన స్థాపించిన స్వచ్ఛంద సంస్థ 'భ్రష్టాచార్ విరోధి జన్ ఆందోళన్-మహారాష్ట్ర' అనే పేరులో భ్రష్టాచార్ అనే పదాన్ని పుణెకు చెందిన స్వచ్ఛంద సంస్థల కమిషనర్ తొలగించారు. దీనిపై మీరు ఏమైనా స్పందిస్తారా.. చట్టపరంగా ముందుకు వెళతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తనకు మాత్రమే కాకుండా మొత్తం 16 స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు పంపిచారని, అయితే తనకు నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని అన్నా హజారే చెప్పారు. -
లంచం అడితే 011-27357169కు ఫోన్ చేయండి
న్యూఢిల్లీ: అవినీతిని అంతమొందిస్తానని హస్తిన పీఠమెక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ తన హామీని నిలబెట్టుకుంటున్నారు. లంచగొండుల భరతం పట్టేందుకు ఆయన హెల్ప్లైన్ ప్రకటించారు. మూమూళ్లు మరిగిన ప్రభుత్వ అధికారులకు కళ్లెం వేసేందుకు 011-27357169 హెల్ప్లైన్ నంబర్ ప్రారంభించారు. అయితే దీని ద్వారా ఫిర్యాదు చేసే వీలులేదని, కేవలం హెల్ప్లైన్ నంబర్ మాత్రమేనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవినీతి అధికారులను సాక్ష్యాధారాలతో ఎలా పట్టివ్వాలనే దానిపై హెల్ప్లైన్ ద్వారా సూచిస్తామని తెలిపారు. ఇందుకు ఢిల్లీ అవినీతి వ్యతిరేక విభాగం సహాయపడుతుందని చెప్పారు. హెల్ప్లైన్తో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమన్నారు. లంచం తీసుకునేందుకు అధికారులు భయపడతారన్నారు. ప్రతి పౌరుడు అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు కావాలని కేజ్రీవాల్ ఆకాంక్షించారు.