ASP sasikumar
-
ఒత్తిడితోనే ఏఎస్పీ ఆత్మహత్య
దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. సత్యమంగళంలో కన్నీటి వీడ్కోలు సాక్షి, విశాఖపట్నం/ సేలం(తమిళనాడు): ‘విధి నిర్వహణలో మూడు నెలలుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాను.. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు..’ అని గురువారం తుపాకీ పేలి మృతి చెందిన విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ తన చివరి లేఖలో పేర్కొన్నారు. లేఖతో పాటు అక్కడ లభించిన ఆధారాలను బట్టి కూడా ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని కేసు విచారణ చేపట్టిన సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు తెలిపారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ ఏఎస్పీ శశికుమార్ తన రివాల్వర్తోనే కాల్చుకున్నారని, బయట నుంచి ఎవరో వచ్చి హత్య చేశారనేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ‘మూడు నెలలుగా ఫెయిల్యూర్స్తో తీవ్ర డిప్రెషన్లో ఉన్నాను.. నేను ఈ డిపార్ట్మెంట్కు పనికిరాను.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఐయామ్ సారీ’ అని శశికుమార్ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని డీఎస్పీ వెల్లడించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యాకే కచ్చితమైన నిర్ధారణకు రాగలమన్నారు. అయితే ఇది ముమ్మాటికీ హత్య అంటూ శశికుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు.పథకం ప్రకారం శశికుమార్ను హత్య చేశారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగాను, అధికారికంగాను కక్ష కట్టిన కొందరు హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, సీబీఐ విచారణకు చర్యలు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా తమిళనాడులోని స్వగ్రామం ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో శుక్రవారం శశికుమార్కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
వైఫల్యాలే ఉసురు తీశాయా?!
వెలుగులో వచ్చిన ఏఎస్పీ శశికుమార్ సూసైడ్ నోట్ మూడు నెలలుగా వైఫల్యాలు, ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు దానిలో వెల్లడి అవి ప్రాణం తీసుకునేంత తీవ్రమైనవా? ఏఎస్పీది ఆత్మహత్యేనని ప్రాథమికంగా తేల్చిన సీఐడీ పాడేరు/ సాక్షి, విశాఖపట్నం: మృతి చెందిన పాడేరు ఏఎస్పీ టేబుల్పై లభించిన చివరి లేఖలో పచ్చ ఇంకుతో రాసిన ఈ వాఖ్యాలు.. ఆయనది ఆత్మహత్యేనని చెబుతున్నాయి. అయితే విధి నిర్వహణలో ఆయనకు ఎదురైన వైఫల్యాలు ఏమిటి?.. అవి డిప్రెషన్కు, చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించేంత తీవ్రమైనవా??.. అన్నది విచారణలో తేలాల్సిన అంశాలు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించడంతో ఆ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విచారణాధికారిగా నియమితులైన సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు తన బృందంతో గురువారం రాత్రే విశాఖ నుంచి పాడేరుకు వెళ్లారు. ఉదయం దుర్ఘటన జరిగిన పాడేరులోని ఏఎస్పీ కార్యాలయాన్ని ఆయన మరో నలుగురు సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. పాడేరు మండలానికి చెందిన ఇద్దరు వీఆర్వోలు గణపతమ్మ, విజయ్ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. అలాగే క్లూస్ టీం చెందిన నలుగురు అధికారులు ఏఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి సంఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించారు. అనంతరం సీఐడీ బృందం సంఘటన స్థలాన్ని సుమారు రెండు గంటల సేపు అణువణువూ పరిశీలించింది. సంఘటన స్థలంలో పడి ఉన్న రివాల్వర్, ఏఎస్పీ డైరీ, సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చింతపల్లి డీఎస్పీ విచారణ మరోవైపు చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్ర కూడా వచ్చి ఏఎస్పీ కార్యాలయ సిబ్బందిని విచారించారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించే హోంగార్డ్స్, గన్మెన్లు, స్వీపర్లు, సంఘటన జరిగినప్పుడు ఉన్న సిబ్బందిని ఆయన విడివిడిగా పిలిపించి వివరాలు సేకరించారు. కాగా ఏఎస్పీ శశికుమార్ బంధువర్గానికి చెందిన ఇద్దరు గురువారం రాత్రి ఆయన నివాస గృహానికి వచ్చి వెళ్ళినట్లు తెలిసింది. ఏఎస్పీ రాసిన సూసైడ్ నోట్ను గుర్తించామని, దానిలో కుటుంబానికి సంబంధించిన పలు సున్నితమైన అంశాలు ఉన్నందున అతని తల్లిదండ్రుల అనుమతితోనే తెరుస్తామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సంఘటన జరిగిన రోజు రాత్రి ప్రకటించారు. కాగా ఆ లేఖను సీఐడీ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోల సమక్షంలో దాన్ని తెరిపించి చదివించ గా.. శశికుమార్ది ఆత్మహత్యేనని అందులోని అంశాలు దాదాపుగా స్పష్టం చేశాయి. తీవ్ర డిప్రెషన్కు గురికావడం వల్లే శశికుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు లభించిన ప్రాథమిక ఆధారాల(సీన్ ఆఫ్ అఫెన్స్)ను బట్టి తెలుస్తోందని సీఐడీ డీఎస్పీ నాయుడు కూడా సాక్షికి వెల్లడించారు. కాగా కేజీహెచ్లో ఉన్న శశికుమార్ మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ వెంటనేనర్శీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ దగ్గరుండి విమానంలో శశికుమార్ మృతదేహాన్ని, ఆయన తల్లిదండ్రులను స్వస్థలానికి పంపించారు. -
‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’: ఏఎస్పీ
సాక్షి, విశాఖపట్నం: విధి నిర్వహణలో మూడు నెలలుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాను.. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు.. అని మృతి చెందిన విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ తన చివరి లేఖలో పేర్కొన్నారు. దీనికితోడు సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు తెలిపారు. శశికుమార్ చనిపోయిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన ఏఎస్పీ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. దానిలో కుటుంబానికి సంబంధించిన పలు సున్నితమైన అంశాలు ఉన్నందున అతని తల్లిదండ్రుల అనుమతితో తెరుస్తామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం రాత్రి ప్రకటించారు. ఆ మేరకు సీఐడీ అధికారులు శుక్రవారం లేఖను స్వాధీనం చేసుకొని వీఆర్వోల సమక్షంలో తెరిపించి, వారి చేతే చదివించారు. సంఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వారితో పాటు అక్కడి సిబ్బందిని చింతపల్లి ఏఎస్పీ రాఘవేంద్ర విచారించారు. ముగ్గురు హోంగార్డులు, ఎస్సై సూర్యప్రకాష్తో పాటు గన్మెన్లు, స్వీపర్లతో సహా అందరినీ వేర్వేరుగా ప్రశ్నించారు. కాగా కేజీహెచ్లో ఉన్న శశికుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం తెల్లవారుజామున నర్సీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ దగ్గరుండి విమానంలో శశికుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు. డిపార్ట్మెంట్కు సూట్ కానని నోట్: సీఐడీ డీఎస్పీ వెల్లడి ఏఎస్పీ శశికుమార్ తన రివాల్వర్తోనే కాల్చుకున్నారని, బయట నుంచి ఎవరో వచ్చి హత్య చేశారనేందుకు ఇప్పటి వరకూ తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని విచారణాధికారి అయిన సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు చెప్పారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ సంఘటన స్థలం నుంచి రివాల్వర్, బుల్లెట్, సూసైడ్ నోట్, డైరీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘మూడు నెలలుగా ఫెయిల్యూర్స్తో తీవ్ర డిప్రెషన్లో ఉన్నాను. నేను ఈ డిపార్ట్మెంట్కు పనికిరాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఐయామ్ సారీ’ అని శశికుమార్ పేరుతో ఉన్న లేఖలో రాసి ఉందని డీఎస్పీ వెల్లడించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యాకే ఖచ్చితమైన నిర్ధారణకు రాగలమన్నారు.