అసోచామ్ అవార్డును అందుకున్న చంద్రవదన్
సాక్షి, న్యూఢిల్లీ: ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన ప్రతిష్టాత్మక అసోచామ్ అవార్డును రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి ఆర్.వి.చంద్రవదన్ అందుకున్నారు. ఇక్కడి లీమెరీడియన్ హోటల్లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఈ అవార్డును ప్రదానం చేశారు.