attack on house
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా: ఎంపీ డీకే అరుణ
-
ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ అధికారిక నివాసంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని గురించి అసదుద్దీన్ శుక్రవారం లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తూ.. లేఖ రాశారు. తనను చంపేందుకు కుట్ర చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. ఎంపీల ఇళ్లపై దాడిని సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ లేఖలో కోరారు. చదవండి: ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి -
పోలీసులపై ముఖ్యమంత్రి అసహనం
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై గురువారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. 20 నుంచి 25 మంది దుండగులు తుపాకులతో తన ఇంటిపై దాడి చేశారని కౌన్సిలర్ (దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) జితేందర్ కుమార్ మీడియాకు తెలిపారు. ఇంటి బయటనున్న కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారనీ, ఇంట్లోకి దూరేందుకు యత్నించారని వెల్లడించారు. కొంత సేపటి తర్వాత ‘నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. (ఆయనకు మాత్రమే ఫ్రెష్ ఎయిర్ కావాలా..!!) ‘వ్యక్తిగతంగా నాకు ఎవరితో విభేదాలు లేవు. ఇది రాజకీయ ప్రత్యర్థులు నాపై చేసిన కుట్ర’ అని జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ‘అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది’ అని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో.. అదీ పట్టపగలు సాయుధుల గుంపు ఓ ప్రజా ప్రతినిధిని హత్య చేసేందుకు పూనుకోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. What is going on in Delhi? https://t.co/rTjUsyggKP — Arvind Kejriwal (@ArvindKejriwal) November 16, 2018 (చదవండి : 16 మందితో ఆప్ మూడో జాబితా) -
కూకట్పల్లిలో వంద మందితో ఇంట్లోకి దూరి దౌర్జన్యం
-
వివాదం చేయాలనుకోవడం లేదు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: తన ఇంటిపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి ఘటనపై వివాదం చేయాలనుకోవడం లేదని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చెప్పారు. ఈ ఘటనలో తమవారికి ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. తనపై నిందారోపణలు చేసిన తృణమూల్ నాయకులు సౌగతా రాయ్, తపస్ పాల్, నందిని పాల్ పై పరువునష్టం వేయనున్నట్టు చెప్పారు. దీనికోసం ఇప్పటికే న్యాయవాదులను సంప్రదించినట్టు తెలిపారు. కోల్కతా కైలాశ్ బోస్ ప్రాంతంలోని బాబుల్ సుప్రియో ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. రోజ్వ్యాలీ చిట్ఫండ్ స్కాంలో ఇద్దరు టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.