baby found
-
అమ్మ ప్రేమ గెలిచింది
నర్సంపేట : కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతీ దేవత అమ్మే కదా... అనే సినీగీతాన్ని సార్థకం చేసింది ఓ పెంపుడు తల్లి ఉదంతం.. సరిగ్గా ఏడాది క్రితం నర్సంపేట బస్టాండ్ సమీపంలో ఓ మహిళకు పసిపాప దొరకగా అక్కున చేర్చుకుంది. చావుబతుకుల్లో ఉన్న పాపకు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించి పెంచుకుంది. అయితే తను కట్టుకున్న భర్త చైల్డ్లైన్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నాలుగు నెలల క్రితం వారు బిడ్డను స్వాధీనం చేసుకున్నా రు. చట్టం ఒప్పుకోదనే సాకుతో అమ్మ ప్రేమకు దూరం చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ పెంపుడు తల్లి అధికారులను ప్రతిఘటించి న్యా య పోరాటం చేసింది. ఆమె పోరాటం ఫలించి ఆ బిడ్డను తానే దక్కించుకుంది. మంగళవారం అధికారికంగా ఆ బిడ్డను అధికారుల నుంచి స్వాధీనం చేసుకుని తల్లిప్రేమను చాటుకుంది. నర్సంపేట పట్టణంలో నివాసముంటున్న దాసరి హైమావతిది చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామం.. 25 సంవత్సరాల క్రితం సాంబయ్య అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో భర్త సాంబయ్య హైమావతితో గొడవపడి చాలా కాలంగా వేరొక మహిళతో కలిసి ఉంటున్నాడు. న్యాయం చేయాలని పెద్దమనుషులను ఆశ్రయించడంతో నెలకు రూ.3000లు భర్త నుంచి ఇప్పించేందుకు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలోనే 2017 ఆగస్టులో పట్టణంలోని బస్టాండ్ వద్ద .. పాన్షాపుల మధ్యలో పసిగుడ్డు అరుపులు వినపడింది.. అటుగా వెళ్తున్న హైమావతి గమనించి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండగా అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది. స్థానికంగా ఉన్న వైద్యులు పాప పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వరంగల్లోని ఎంజీఎంకు తీసుకువెళ్లి బతికించుకుంది. నాటి నుంచి ఆ పాపను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటోంది. తనపేరుతో ఉన్న కొద్దిపాటి ఆస్తి.. హైమావతి పెంచుకుంటున్న పాపకు దక్కుతుందనే దురుద్దేశంతో భర్త సాంబయ్య బెదిరింపులకు దిగి 2018 ఏప్రిల్ 13న చైల్డ్లైన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అదేరోజు అధికారులు హైమావతి నివసిస్తున్న ఇంటికి వచ్చి పాప గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏప్రిల్ 16న బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచగా విచారణ చేస్తున్న క్రమంలోనే.. పాపను తన నుండి దూరం చేయవద్దని తన పేర ఉన్న ఆస్తిని పాప పేరిట రిజిస్టర్ చేయిస్తానని హైమావతి వేడుకుంది . ఈ క్రమంలోనే ఏప్రిల్ 30న జిల్లా కలెక్టర్ హరిత వద్దకు నర్సంపేటకు చెందిన కౌన్సిలర్ బండి ప్రవీణ్ , అంగన్వాడీ సంఘం బాధ్యురాలు నల్లా భారతితో కలిసి వెళ్లి విన్నవించింది. దీంతో కలెక్టర్ మే 5న సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ముందు హాజరుకావాలని సూచిం చారు. హైమావతి పోరాటానికి మహిళా సంఘాలు మద్దతుగా నిలుస్తూ సంఘీభావాన్ని తెలిపా యి. ఇటీవల చైల్డ్వెల్ఫేర్ కమిటీ నూతన చైర్మన్ మండల పరశురాములును కలిసి పాపను తనకు ఇవ్వాలని వేడుకుంది. ఎట్టకేలకు మంగళవారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధ్యులు పాపను పెంచుకునేందుకు అధికారికంగా అంగీకరించి హైమావతికి అప్పగించారు. దీంతో ఆమె పోరాటం విజయవంతమైంది. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం డివిజన్ అధ్యక్షుడు కామిశెట్టి రాజు, సీపీఐ ఎంఎల్ పార్టీ డివిజన్ కార్యదర్శి మోడెం మల్లేషం పాల్గొని పెంపుడు తల్లికి బిడ్డను ఇవ్వడంపై అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ముళ్లపొదల్లో ఆడ శిశువు
సాక్షి, శెట్టూరు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువు ముళ్లపొదల పాలైంది. మంగంపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన మహిళలకు ముళ్లపొదల్లో ఆడశిశువు కనిపించింది. వెంటనే ఆ పాపను అక్కున చేర్చుకుని సపర్యలు చేసి అనంతరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అంగన్వాడీ కార్యకర్త సుధారాణి, సూపర్ వైజర్ చంద్రమ్మ, ఏఎన్ఎం జయమ్మలు ఆ శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యాధికారి ముషీరాబేగం వైద్య పరీక్షలు నిర్వహించి ఆడ శిశువు ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఎవరైనా దంపతులు తమకు శిశువు కావాలని వస్తే నింబంధనల ప్రకారం అప్పగిస్తామని ఐసీడీఎస్ అధికారులు చెప్పారు. -
అయ్యయ్యో...!
అప్పుడే తెల్లారుతోంది.. తుప్పల్లోంచి పిల్లాడి ఏడుపు అటువైపుగా వెళ్లిన మహిళల చెవిన పడింది. కంగారుగా వెళ్లి చూశారు. తుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డను చూసి కలవరపడ్డారు. అయ్యయ్యో.. అంటూనే చేతుల్లోకి తీసుకుని రక్తపుచారలు తుడిచారు. సపర్యలు చేశారు. ఏ తల్లి కన్న బిడ్డో అంటూ నిట్టూర్చారు. చైల్డ్లైన్కు సమాచారం అందించి శిశువును అప్పగించారు. శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు విశాఖ–అరకు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గౌరీపురం మహిళలు జామి గణేశమ్మ, మంగాయమ్మ, ఆడారి హారిక, మంగమ్మలు వేకువజామున 5 గంటల సమయంలో రోడ్డువైపుగా వెళ్లారు. సమీపంలోని తుప్పల్లోంచి పిల్లాడికి సపర్యలు చేస్తున్న గౌరీపురం మహిళలు పిల్లాడి ఏడుపును గమనించారు. వెంటనే వెళ్లి చూసేసరికి రక్తపు చారలతో కొద్ది గంటలకు ముందు జన్మించిన మగపిల్లాడిని గుర్తించి అక్కున చేర్చుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి బొడ్డు కోసి..స్నానాదులు చేయిం చారు. బట్టలు వేసి, బొట్టు పెట్టి.. పాలుపెట్టి సపర్యలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ బిడ్డను చూసేందుకు తరలివచ్చారు. ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త కాండ్రేగుల చంద్రకళ, ఇన్చార్జి ఏఎస్ఓ కె.వెంకటరాములు అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలక్ష్మి, సీడీపీఓ శాంతకుమారికి ఫోన్లో తెలియజేశారు. అనంతరం పీడీ రాబర్ట్స్ ఆదేశాల మేరకు 1098కు సమాచారం చేరవేశారు. దీంతో చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ కోన బంగారుబాబు, సభ్యులు వి.మధుసూదనరావు, సీహెచ్ చంద్రశేఖర్, జీవీఎల్ లక్ష్మిలు గౌరీపురం చేరుకున్నారు. పిల్లాడు దొరికిన తీరును తెలుసుకున్నారు. వైద్య సేవల కోసం శిశువును విజయనగరం ఘోషాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం బిడ్డను జిల్లాలోని శుశుగృహకు అప్పగిస్తామని చైల్లైన్ కో ఆర్డినేటర్ తెలిపారు. శిశువు ఆరోగ్యంపై ఆరా శిశువు ఆరోగ్యంపై బీజేపీ జిల్లా నేత ఐ.రఘురాజు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఐ.రామరాజు (బుల్లిబాబు), కిల్తంపాలెం మాజీ సర్పంచ్ సుంకరి ఈశ్వరరావు తదితరులు చైల్డ్లైన్ సభ్యులతో మాట్లాడారు. అయితే, తుప్పల్లో దొరికిన మగ పిల్లాడిని పెంచుకుంటామంటూ పలు వురు పిల్లలు లేని దంపతులు ముందుకు వచ్చినా చట్టప్రకారం అప్పగిస్తామని చైల్డ్లైన్ సభ్యులు స్పష్టం చేశారు. ఏ తల్లికన్న బిడ్డో ఇలా తుప్పలపాలయ్యాడంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ప్లాస్టిక్ కవర్ లో శిశువు మృతదేహం
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రి గేటు పక్కన పడేసి వెళ్లిన సంఘటన జిల్లాలోని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది. గేటు పక్కన ఉన్న ప్లాస్టిక్ కవర్లోంచి రక్తం వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రి వర్గాలకు సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరిశీలించగా ప్లాస్టిక్ కవర్లో అప్పుడే పుట్టిన బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు. -
ఎవరు వదిలేశారో?ఎందుకు వద్దనుకున్నారో?