Band Melam Movie
-
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. వాళా-2 తెలుగు డబ్బింగ్ వర్షన్తో పాటు గేదేల రాజు లాంటి సినిమాలపై అంతగా బజ్ లేదు. వాళా-2 మలయాళ హిట్ మూవీ కావడంతో కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే సినిమాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు మూవీ బ్యాండ్మేళంపై ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవీ ప్రకాశ్ హ్యాపీ రాజ్ డబ్బింగ్ సినిమా, మలయాళ మూవీ ప్రతిఛాయ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే అన్ని కలిపి దాదాపు 20 చిత్రాలు ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24 నుక్కడ్ నాటక్(హిందీ సినిమా)- ఏప్రిల్ 24 ఇఫ్ విషెస్ కుడ్ కిల్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 నీ ఫరెవర్(హిందీ మూవీ)- ఏప్రిల్ 24 సోనిక్3 ది హెడ్జ్హాగ్(హాలీవుడ్)- ఏప్రిల్ 24 అన్కామన్ వాలర్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 మై డ్రెస్అప్ డార్లింగ్(జపనీస్ మూవీ)- ఏప్రిల్ 2528యర్స్ లేటర్- ది బోన్ టెంపుల్(హాలీవుడ్)- ఏప్రిల్ 26జియో హాట్స్టార్ ప్రతి ఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 24 24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్జేసీ ది యూనివర్సిటీ(కన్నడ మూవీ)- ఏప్రిల్ 24జీ5 బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24 జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24 నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24 మార్టీ సుప్రీమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 న్యూ బండిట్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 24 ఇమ్మార్షల్ కాంబాట్(హాలీవుడ్)- ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లే గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్ మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24హులు..నో అదర్ ఛాయిస్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24ముబీ..సౌండ్ ఆఫ్ ఫాలింగ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 -
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. 'గేదెల రాజు' అనే తెలుగు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది కానీ దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. మరోవైపు పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్', అలానే లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ 'వాలా 2' కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు)మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం దాదాపు 19కి పైగా మూవీస్, వెబ్ సిరీస్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతిఛాయ, బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం అనే తెలుగు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. హ్యాపీరాజ్ మూవీ కూడా ఇదే వీకెండ్ వచ్చే అవకాశముంది. ఇంతకీ ఏ సినిమా ఏ రోజు ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు)హాట్స్టార్బ్రూక్లిన్ నైన్ నైన్ (ఇంగ్లీష్ కామెడీ సిరీస్) - ఏప్రిల్ 20ప్రతిఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 2424 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24 నెట్ఫ్లిక్స్రెజల్ మేనియా (స్పోర్ట్స్ సిరీస్) - ఏప్రిల్ 19అన్ చూజన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 21హల్క్ హోగన్: రియల్ అమెరిన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 22స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 23అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్లేచింది మహిళా లోకం (తెలుగు సినిమా) - ఏప్రిల్ 22జీ5బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ఫ్రమ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20కెవిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20కిల్లింగ్ గ్రౌండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లేగ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా) -
ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
'కోర్ట్' సినిమాతో గతేడాది అద్భుతమైన హిట్ కొట్టిన రోషన్-శ్రీదేవి జంట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరిని పెట్టి తీసిన మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పుడిది నెలలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా)రోషన్-శ్రీదేవి నటించిన టీనేజీ ప్రేమకథా సినిమా 'బ్యాండుమేళం'. తెలంగాణలోని పల్లెటూరి బ్యాక్డ్రాప్లో బావామరదళ్ల మధ్య జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ప్రమోషన్లతో చాలా హడావుడి చేశారు గానీ థియేటర్లలో తేలిపోయింది. ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.'బ్యాండు మేళం' విషయానికొస్తే.. గిరి(హర్ష్ రోషన్) స్కూల్లో పెద్దగా చదవడు. దీంతో ఫెయిల్ అవుతాడు. ఇతడి మరదలు రాజి(శ్రీదేవి) మాత్రం టాప్ ర్యాంకర్. గిరికి ఈమెంటే ప్రాణం. అలానే పాటలు కంపోజ్ చేయడం, పాడటం అన్నాసరే ఇష్టం. ఓ సొంత బ్యాండ్ ట్రూప్తో ఊరిలో జరిగే పెళ్లిళ్లల్లో పాటలు అవీ పాడుతుంటాడు. ఎప్పటికైనా రహమాన్ అంత పెద్ద సంగీత దర్శకుడు కావాలనేది ఇతడి కల. ఇదలా ఉంటే ఇతడి మరదలు రాజి.. ఇంజనీరింగ్ కాలేజీమేట్తో లేచిపోతుంది. అతడు మోసం చేశాడని తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఆమెని గిరి ఒప్పుకొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
‘బ్యాండ్ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్ ఈవెంట్ (ఫొటోలు)
-
మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2'
సాధారణంగా మార్చి నెల అనగానే పరీక్షల సీజన్, సినిమాలు పెద్దగా చూడరు అనే అపవాదు ఉంటుంది. కానీ ఇదే నెలలో గతంలో 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా మూవీ వచ్చి బ్లాక్బస్టర్ అయింది. బలగం, కోర్ట్, జాతిరత్నాలు తదితర చిన్న చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఆదుకుంటాడనుకున్న 'ఉస్తాద్'.. బయ్యర్లని నిండా ముంచాడు. ఇంతకీ ఈ నెల బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మార్చి తొలివారం ఏకంగా 10 వరకు చిన్న సినిమాలు వచ్చాయి. వీటిలో శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' ఉన్నంతలో ఆసక్తి కలిగించింది. కానీ ఉసూరుమనిపించింది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. తొలిసారి దర్శకురాలు, నిర్మాతగా తీసిన 'ఎస్.సరస్వతి' ఇదే వారం వచ్చింది. ఫ్లాప్ అయింది. శివాజీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. 'మెన్షన్ హౌస్ మల్లేష్' కూడా నిలబడలేదు.మూడోవారం ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలు ఉన్నాయని.. రెండోవారం వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. హెబ్బా పటేల్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' చిత్రం 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అసలు ఇదొకటి రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది.మూడోవారం ఉగాది కానుకగా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. రిలీజ్ నాడు పండగ సెలవు కావడంతో ఉన్నంతలో థియేటర్లు నిండాయి కానీ టాక్ నెగిటివ్ వచ్చింది. రెండోరోజుకల్లా ఆ ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం పవన్ కెరీర్లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ చాలాచెప్పాడు. అభిమానులని కూడా సరిగా ఆకట్టుకోలేకపోయిందీ చిత్రం. ఇదే తేదీన వచ్చిన డబ్బింగ్ బొమ్మ 'ధురంధర్ 2'.. తెలుగు రాష్ట్రాల్లోని బాక్సాఫీస్ని ఆదుకుంది. రెండు రోజుల ఆలస్యంగా తెలుగు వెర్షన్ వచ్చినప్పటికీ మన ప్రేక్షకులు దీన్ని ఆదరించారు. 'ఉస్తాద్..'ని లైట్ తీసుకున్నారు.చివరిదైన నాలుగోవారంలో బ్యాండుమేళం, లేచింది మహిళా లోకం, సుయోధన తదితర స్ట్రెయిట్ మూవీస్తో పాటు యూత్, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఈ నెలలో ఏ తెలుగు మూవీ కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. 'ధురంధర్ 2' మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ అంతో ఇంతో కళకళలాడేలా చేసింది. ఇది కూడా లేకపోయింటే అంతే సంగతులు.(ఇదీ చదవండి: అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్) -
‘బ్యాండు మేళం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
‘కోర్ట్’ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండు మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 13నే విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషం వాయిదా వేసి.. నేడు(మార్చి 26)న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రమోషన్స్లో పాల్గొనడంతో ‘బ్యాండు మేళం’పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది? కోర్ట్ మాదిరే హర్ష్ రోషన్, శ్రీదేవిలకు మరో హిట్ దక్కిందా? లేదా? రివ్యూ(Band Melam Review)లో చూద్దాం.కథేంటంటే.. తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యాదగిరి అలియాస్ గిరి(హర్ష్ రోషన్), రాజీ(శ్రీదేవి) బావమరదళ్లు. చిన్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లు కూడా పెద్దయ్యాక ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. కానీ వీరిద్దరు పెద్దయ్యే సరికి పరిస్థితులు తారుమారు అవుతాయి. గిరి వాళ్ల నాన్న సుందరయ్య(గోపరాజు విజయ్) దానధర్మాలు చేసి అప్పుల పాలవుతాడు. గిరి ఏమో పదోతరగతి ఫెయిల్ అయి స్నేహితులతో బ్యాండు మేళం నడుపుతుంటాడు. మరోవైపు రాజీ వాళ్ల నాన్న సాయన్న(సాయి కుమార్) బావ సుందరయ్య చేసే సాయంతో కోటీశ్వరుడు అవుతాడు. రాజీ టెన్త్ టాపర్గా నిలిచి..ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతుంది. ప్రేమ, పెళ్లి అంటూ బావ గిరి వెంటపడుతున్నా పట్టించుకోదు. సాయన్న కూడా తన కూతురుని గిరికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడు. ఓ గొప్పింటి అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పెళ్లి రోజు రాత్రే రాజీ.. తన క్లాస్మేట్ రాజేశ్తో కలిసి లేచిపోతుంది. ప్రాణంగా ప్రేమించిన మరదలు.. వేరే వ్యక్తితో లేచిపోయిన విషయం తెలిసిన తర్వాత గిరి ఏం చేశాడు? లేచిపోయిన రాజీ తిరిగి గిరి ఇంటికి ఎందుకు వచ్చింది? గిరి మ్యూజిక్ లో సక్సెస్ అయ్యాడా? ఈ బావమరదళ్లు మళ్లీ ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ రచయితల్లో కోన వెంకటేశ్కు ఉన్న క్రేజీ గురించి తెలిసిందే. కామెడీ ఫ్యామిలీ డ్రామా కథలను రాయడంతో ఆయన సిద్ధహస్తుడు. అయితే ఈ మధ్య ఆయన కథలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తనకు బలమైన కామెడీ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే ‘బ్యాండు మేళం’ కథను రాసుకొని.. సొంతంగా నిర్మించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ ఈవెంట్లలో ఆయన మాటలు విని .. ఈ సారి కొత్త కామెడీతో నవ్విస్తాడని అంతా భావించారు. కానీ కోన మాత్రం మళ్లీ పాత కథతోనే నవ్వించే ప్రయత్నం చేశాడు. కథ మాత్రమే కాదు కథనం కూడా పాతగానే ఉంటుంది. కొత్తదనం అనేది మచ్చుకైనా కనిపించదు. రొటీన్ కామెడీ స్టోరీకి తెలంగాణ బ్యాక్డ్రాప్ యాడ్ చేశారంతే. హీరో జులాయి.. హీరోయిన్ రిచ్ కిడ్.. వారి ప్రేమకు ఆస్తిపాస్తులు అడ్డురావడం.. చివరకు ఒక్కటవ్వడం.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ కథలను చూస్తూ వస్తున్నాం. అలాంటి కథతో సతీష్ జవ్వాజీ తెరకెక్కిన చిత్రమే ఈ బ్యాండు మేళం. బావమరదళ్ల లవ్స్టోరీలో అయినా కొత్తదనం ఉంటుందా అంటే అదీ ఉండడు. ఇక కథకు కీలకమైన ట్విస్టులు కూడా ఊహకందేలా ఉండడంతో కథనం ఎక్కడ రక్తి కట్టించదు. కోన గారి రెగ్యులర్ కథల్లానే ఈ సినిమా కథ కూడా చైల్డ్వుడ్ ఎపిసోడ్తో మొదలవుతుంది. హీరోహీరోయిన్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని చూపించి.. అసలు కథను ప్రారంభించారు. ఫస్టాఫ్లో బ్యాండు మేళం బ్యాచ్తో హీరో చేసే అల్లరి కొంతమేర నవ్విస్తుంది. స్టూడియో కట్టేందుకు హీరో గ్యాంగ్ చేసే పని సిల్లీగా అనిపించినా.. ఎంటర్టైన్ అవుతారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఎంతకూ ముందుకు కదలదు. ఒకే పాయింట్ చుట్టూ కథను తిప్పారు. క్లైమాక్స్లో రాజీ పాత్ర ఇచ్చే ట్విస్టు కూడా ఊహించేలా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. గిరి పాత్రలో హర్ష్ ఒదిగిపోయాడు. తెరపై చాలా ఎనర్జిటిక్గా కనిపించాడు. డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. రాజీగా శ్రీదేవి కూడా బాగా నటించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఇక హీరోయిన్ తండ్రి సాయన్నగా సాయికుమార్ రెగ్యులర్ పాత్రలో కనిపించి, మెప్పించాడు. హీరోగ్యాంగ్గా కనిపించినవారంతా కొత్తవాళ్లే అయినా.. చక్కగా నటించారు. ముఖ్యంగా ఆ గ్యాంగ్లోని అమ్మాయి పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ బుల్గానిక్ నేపథ్య సంగీతం బాగుంది. ‘తిప్పుకుంటున్నవావే..’ అంటూ సాగే ఫోక్ సాంగ్ తెరపై మరింత ఆకట్టుకునేలా ఉంది. మిగతా పాటలు ఒకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో కోన వెంకట్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
కోర్ట్ తర్వాత సినిమాలు వద్దని చెప్పా.. నా మాట వినలేదు!
కోర్ట్ సినిమాతో హర్ష్ రోషన్, శ్రీదేవి వెండితెరపై హీరోహీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమాకే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిలో పడ్డారు. గతేడాది కోర్ట్ మూవీతో పలకరించిన ఈ జంట ఈ ఏడాది బ్యాండ్మేళంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్లో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలు మర్చిపోండిఆయన మాట్లాడుతూ.. చందు-జాబిలి(కోర్ట్ మూవీలో ప్రధాన పాత్రల పేర్లు).. వీళ్లనెప్పటికీ ఇదే పేర్లతో పిలుస్తుంటాను. కోర్ట్ తర్వాత వీళ్లు ఏం చేస్తారు? ఏమైపోతారనుకున్నాను. నేనైతే.. కోర్ట్ అయిపోగానే మీరు కనపడొద్దని చెప్పాను. సినిమాలు మర్చిపోండి, మూడునాలుగేళ్లు కనిపించకూడదు. మంచి కాలేజీలో చేరి చదువుకోమని చెప్పాను. పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు కానీ కాలేజీకి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. కాలేజీ డేస్ మిస్ మీరు ఫస్ట్ కాలేజీకి వెళ్లండి, కళాశాల జీవితాన్ని మిస్ అవొద్దని చెప్పాను. ఈ వయసులో యాక్టింగ్లో బిజీ అయితే జీవితంలో ముఖ్యమైన కాలేజీ డేస్ మిస్ అవుతారన్నాను. కానీ నా మాట వినలేదు. వినుంటే బ్యాండ్ మేళం వచ్చేది కాదు.. విననందుకు థాంక్స్ అన్నాడు. బ్యాండ్మేళం విషయానికి వస్తే.. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీని కోన వెంకట్ నిర్మించారు.చదవండి: ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్ -
రామ్చరణ్, మహేశ్కు అలా జరిగింది.. కానీ!: బండ్ల గణేశ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి సందడి చేసేందుకు వచ్చేస్తున్నారు. ఈసారి బ్యాండ్మేళం మూవీలో వీరు బావామరదళ్లుగా నటించారు. సతీశ్ జవ్వాజి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం (మార్చి 24న) ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్కు నిర్మాత బండ్ల గణేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.అరడజను మంచి డైరెక్టర్లకు ఛాన్స్ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కోన వెంకట్గారికోసమే ఈ ఈవెంట్కు వచ్చాను. ఇండస్ట్రీ మొత్తం ఒక పక్కనుంటే, కోన ఒక్కడే నీ పక్కనుంటే నువ్వు గెలిచేయొచ్చని వినాయక్ అన్నాడు. అది ఆయనకున్న పవర్.. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలను ఒప్పించి అరడజను మంది దర్శకులకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించడం అంటే జోక్ కాదు. హీరోలు 100 ప్రశ్నలు వేస్తారు, 200 డౌట్లు పడతారు. చస్తే ఆ పని చేయనుఎందుకంటే వాళ్లకు హిట్టు కావాలి! అలాంటి వాళ్లను ఎలాగోలా మాయ చేసి ఒప్పిస్తున్నారు. బాబీ, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్ శివ నిర్వాణ.. ఇలా ఎంతోమందిని డైరెక్టర్ల ముందడుగు కారణమై సక్సెస్ను ముందుకు తీసుకెళ్లడంలో కోన వెంకట్ ముందుంటాడు. బ్యాండ్మేళం కోసం ఆయన రెండు, మూడు ప్రాపర్టీలు అమ్మేశాడు. నేనయితే ప్రాణం పోయినా ఆ పని చేయను. ఆస్తి తాకట్టు పెట్టి సినిమా తీశారంటే మీకు సినిమా అంటే అంత ప్రేమ.సక్సెస్ మన చేతుల్లో లేదుహీరో హర్ష్ రోషన్ విషయానికి వస్తే.. టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఎవరైనా ఇండస్ట్రీకి రావొచ్చు. ఇండస్ట్రీలో స్టార్ కొడుకు స్టార్ అవడం చాలా అరుదు. మహేశ్బాబు, రామ్చరణ్లాంటివారికి జరిగింది. స్టార్ డైరెక్టర్స్.. తమ కుమారులకు వారసత్వంగా ఆస్తినిచ్చారు, కానీ సక్సెస్ ఇవ్వలేదు. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. నిజంగా రోషన్ను చూస్తే నా కొడుకుగా పుట్టుంటే బాగుండేదనుకున్నాను. ఈ అబ్బాయి సూపర్స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ కోన వెంకట్గారికోసమైనా సూపర్ హిట్ అవుతుంది అని బండ్ల గణేశ్ జోస్యం చెప్పాడు.చదవండి: నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి -
ఘనంగా 'బ్యాండ్ మేళం' ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నిన్ను మస్తు లవ్ చేశిన.. బ్యాండ్మేళం ట్రైలర్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను శనివారం (మార్చి 21న) విడుదల చేశారు. చిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే నా అన్నని మా అమ్మ లెక్క చూసుకున్న.. నేనడిగితే పాణం కూడా ఇస్తడు అన్న డైలాగ్తో వీడియో మొదలయింది. ఎమోషనల్గా ట్రైలర్నేను నిన్ను మస్తు లవ్ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు. మొత్తానికి ట్రైలర్ ఎమోషనల్గా సాగింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు కలెక్షన్స్ -
బ్యాండ్ మేళం: ఏంటో ఏమో.. సాంగ్ విన్నారా?
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమతాజాగా ఈ మూవీ నుంచి మరో పాట వదిలారు. ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ.. ఎపుడో సాయం రానే రాదే.. అంటూ పాట మొదలవుతుంది. ఈ లిరికల్ వీడియోలో శ్రీదేవితో పాటు నటుడు సాయి కుమార్ను చూపించారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశాడు. సింగర్ సునీత అద్భుతంగా ఆలపించింది. -
బ్యాండ్ మేళం: రామ్ మిరియాల పాడిన బ్రేకప్ సాంగ్ రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.బ్రేకప్ సాంగ్'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్ సాంగ్ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ చేకూర్చగా రామ్ మిరియాల ఆలపించాడు.సినిమాబ్యాండ్ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
శ్రీరామ నవమికి...
శ్రీరామ నవమికి ప్రేక్షకులకు బ్యాండ్ మేళం వినిపించ నుంది. ‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే... శ్రీరామ నవమి సందర్భంగా 26కి విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు మేకర్స్. ‘‘బ్యాండ్ మేళం’ నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అలాగే ‘తిప్పూ కుంటున్నావ్...’ అనే మాస్ పెప్పీ సాంగ్, ‘పల్లెలోని సందల్లన్ని మీవే...’ అనే మెలోడీ సాంగ్ కూడా సినిమా పట్ల అంచనాల్ని పెంచాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్. -
శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్లయిమాక్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది : కోన వెంకట్
‘‘గుండెలో నుంచి వచ్చే ప్రేమకథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందని ‘నిన్ను కోరి’ సినిమాతో తెలిసింది. నాని ఫిల్మోగ్రఫీలో ‘నిన్ను కోరి’ మరచిపోలేని చిత్రంగా నిలిచింది. శివ నిర్వాణ ఈ కథను గుండెతో చెప్పాడు. సతీష్ ‘బ్యాండ్ మేళం’ కథను చెప్పినప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది. ఈ మూవీ క్లయిమాక్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది’’ అని రచయిత, నిర్మాత కోన వెంకట్ తెలిపారు. ‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. మార్చి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి సంగీత దర్శకుడు తమన్, దర్శకులు నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వేణు ఊడుగుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమన్ మాట్లాడుతూ– ‘‘కోనగారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ‘దూకుడు’తో నా కెరీర్ ఇంకా కొనసాగుతూనే వెళ్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘కోనగారి వల్ల ఎంతో మంది దర్శకులు, రచయితలు ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన నాకు గాడ్ ఫాదర్’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా ఇది’’ అన్నారు వేణు ఊడుగుల. ‘‘మా సినిమాని అందరూ చూసి, ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని సతీష్ జవ్వాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి చెప్పారు. -
ప్రకృతి నాకేదో సిగ్నల్స్ ఇస్తోంది.. ఫన్నీగా 'బ్యాండ్ మేళం' టీజర్
గతేడాది రిలీజైన 'కోర్ట్' సినిమాతో ఆకట్టుకున్న రోషన్-శ్రీదేవి.. మరోసారి జంటగా నటించిన మూవీ 'బ్యాండ్ మేళం'. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో దీన్ని తెరకెక్కించారు. సతీష్ జవ్వాజీ దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. మార్చి 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఎంటర్టైనింగ్గా ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)'బ్యాండ్ మేళం' సినిమా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ. బావమరదలు అయిన హీరోహీరోయిన్ మధ్య గిల్లికజ్జాలు, ప్రేమ, బ్రేకప్ లాంటివి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రధారులైన రోషన్, శ్రీదేవి చూడటానికి బాగానే ఉన్నారు. మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) -
మగవాడికి తాళి కట్టి కాపురం? కోన వెంకట్ రియాక్షన్ ఇదే!
కోర్ట్ జంట శ్రీదేవి -రోషన్ మరోసారి జతగా కలిసి నటించిన చిత్రం బ్యాండ్ మేళం. ఈసారి వీళ్లిద్దరూ బావమరదళ్లుగా నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఈ మూవీ నుంచి ఊహించని గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో ప్రేమ కబుర్లు ఉంటాయనుకుంటే హీరో బ్రేకప్ బాధలో మునిగి తేలుతుంటాడు.ఫ్రెండ్ మెడలో తాళి కట్టిన హీరో'తాళి కట్టుడు కలిసుండటం కోసమే అయితే.. మధ్యలో విడిచిపెట్టి పోయిన దానికి కాదురా, చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా' అంటూ స్నేహితుడి మెడలో మూడు ముళ్లు వేస్తాడు హీరో. ఈ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సీన్ చూసిన ఓ వ్యక్తి హీరోను లెస్బియన్ అనుకున్నాడట! ఈ విషయాన్ని బ్యాండ్ మేళం నిర్మాత కోన వెంకట్ తాజాగా వెల్లడించాడు.గే లవ్ స్టోరీయా?శనివారం నాడు బ్యాండ్ మేళం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా కోన వెంకట్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. వాలంటైన్స్ గ్లింప్స్ చూశాక నాకో ఫన్నీ మెసేజ్ వచ్చింది. గే లవ్స్టోరీని తెరపై తీసుకొస్తున్నందుకు థాంక్యూ సర్ అని ఓ అబ్బాయి మెసేజ్ పెట్టాడు. అది చూసి షాకైపోయాను. ఎమోషనల్గా ఫీలయ్యా..ఓహో.. మగవాడు మగవాడికి తాళి కట్టాడు కాబట్టి, వాళ్లిద్దరూ కాపురం చేసుకుంటారు, బెడ్రూమ్లో పాల గ్లాసు పట్టుకెళ్తాడు అనుకున్నట్లున్నాడు! చాలా ఎమోషనల్గా ఫీలయ్యాడు. బాబూ, ఇది గే లవ్స్టోరీ కాదు. మనసును తాకే లవ్ స్టోరీ. ఫన్తో పాటు ఎమోషన్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన బ్యాండ్ మేళం మార్చి 13న విడుదల కానుంది.చదవండి: మీ వల్లే ఇలా బతుకుతున్నా.. ఏడ్చేసిన వరలక్ష్మి -
బ్యాండ్ మేళం: తిప్పుకుంటాన్నవ్ పాట రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. ఈసారి వీరు బావామరదళ్లుగా నటిస్తున్నారు. ఇటీవలే వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో హీరో హీరోయిన్కు బ్రేకప్ అయినట్లు చూపించారు.సాంగ్ రిలీజ్తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వదిలారు. 'బెల్లం చుట్టూ ఈగలెక్క.. మంచం చుట్టూ దోమ లెక్క.. గుడి సుట్టూ భక్తుని లెక్క.. బారు సుట్టూ తాగుబోతు లెక్క.. తిప్పుకుంటాన్నవ్' అంటూ ఈ పాట కొనసాగుతుంది. హుషారుగా సాగే ఈ సాంగ్లో శ్రీదేవి- రోషన్ ఎనర్జిటిక్ స్టెప్పులేశారు.సినిమాబిగ్బాస్ ఫేమ్ రాము రాథోడ్ ఈ పాట పాడటంతో పాటు రోషన్తో కలిసి డ్యాన్స్ చేశాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు వెంకటేశ్ కాపు కొరియోగ్రఫీ అందించాడు. చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చాడు. రాము రాథోడ్, అదితి భావరాజు ఆలపించారు. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ బ్యాండ్మేళం మూవీ మార్చి 13న విడుదల కానుంది. చదవండి: ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: ఆర్.మాధవన్ -
చిన్నప్పటి నుంచి తను నా పెళ్లాం అనుకున్నారా!
'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన జంట శ్రీదేవి-రోషన్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 13వ తేదీన థియేటర్లలోకి రానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. బ్రేకప్ అయినప్పుడు హీరో బాధపడుతున్నట్లు ఇందులో చూపించారు.'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్డ్రాప్లో ఇది తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. సతీష్ జవ్వాజి దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించాడు. మరి రోషన్-శ్రీదేవి ఈసారి ఏం చేస్తారో చూడాలి? గ్లింప్స్లో ఎమోషన్ చూపించినప్పటికీ.. హీరో, తన ఫ్రెండ్కి తాళి కట్టడం ఫన్నీగా అనిపించింది. -
కోర్ట్ జంట రిపీట్.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)
-
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
'కోర్ట్' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్మేళం (Band Melam Movie). సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రోషన్.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్ వినిపించాడు. మాస్ డైలాగ్స్అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్ గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా రోషన్కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. సినిమాఅరవింద సమేత, వెంకీ మామ, సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్, సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్ మీడియాలో ఆమె రీల్స్ చూసి తనను కోర్ట్ మూవీకి సెలక్ట్ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది. చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు


