bandhavi
-
బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)
-
నల్ల చీరలో మతిపోగొడుతోన్న బాంధవి శ్రీధర్ అందాలు.. అదరహో అంటున్న కుర్రాళ్లు
-
'మసూద'లో భయపెట్టిన అమ్మాయి ఎంత అందంగా మారిందో చూశారా (ఫొటోలు)
-
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఆ హిట్ సినిమాలో దెయ్యంగా
చాలామంది బ్యూటీస్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవుతుంటారు. అలా హారర్ సినిమాలో దెయ్యంగా భయపెట్టిన ఈ బ్యూటీ.. చాన్నాళ్ల తర్వాత పార్టీలో కనిపించింది. టాలీవుడ్ సెలబ్రిటీలతోనూ తెగ ఫొటోలు దిగింది. మరి ఈమెని కనిపెట్టారా? ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?2019లో మిస్ ఇండియా రన్నరప్ అయిన బాంధవి, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019గా కూడా నిలిచింది. అలాగే మిస్ ఆంధ్రపదేశ్2019గా కూడా బాంధవి గెలిచింది. మొదట్లో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో నటించిన బాంధవికి మసూద సినిమా వరకు సరైన ఫేమ్ రాలేదు. మసూద తర్వాతే బాంధవి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయింది.(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా)అక్కినేని హీరో నాగచైతన్యకు చాలారోజుల నుంచి సరైన హిట్ పడలేదు. రీసెంట్ గా వచ్చిన 'తండేల్'.. ఆ లోటు తీర్చింది. రూ.100 కోట్ల వసూళ్లు కూడా వచ్చాయి. ఈ ఆనందంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్ టీమ్ అందరికీ పార్టీ ఇచ్చాడు. ఈ సెలబ్రేషన్స్ కి వచ్చిన ఈ బ్యూటీ.. చైతూతో ఫొటో దిగింది.ఈమె ఎవరా అనుకుంటున్నారా? 'మసూద' సినిమాలో దెయ్యంగా నటించిన అమ్మాయే ఈమె. పేరు బాంధవి శ్రీధర్. మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో రన్నరప్. కానీ మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ పోటీలో విజేతగా నిలిచింది.కెరీర్ ప్రారంభంలో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. మసూద చిత్రంలో దెయ్యంగా చేసిన తర్వాత కాస్త ఫేమ్ వచ్చింది. ఇప్పుడు తండేల్ సక్సెస్ పార్టీలో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయింది.(ఇదీ చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ) -
మహిళ హత్యకేసులో కూతురు సహా అల్లుడి అరెస్టు
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు నగరంలో ఏడాదిన్నర క్రితం సంచలనం రేకెత్తించిన విజయలక్ష్మి హత్యకు సంబంధించి ఆమె పెద్ద కుమార్తె బాంధవి (26), అల్లుడు రవిప్రసాద్ను సోమవారం చిత్తూరు టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సూర్యమోహనరావు కథనం మేరకు... చిత్తూరులోని దుర్గానగర్ కాలనీకి చెందిన విజయలక్ష్మి, రామమూర్తి దంపతులకు నగరంలోనే పలు చోట్ల ఆస్తులు ఉన్నాయి. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఆస్తిలో వాటా ఇవ్వాలని పెద్ద కుమార్తె బాంధవి పలుమార్లు తల్లిదండ్రులతో గొడవలకు దిగింది. మిగిలిన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసిన తరువాత ఆస్తి ఇస్తామని తల్లి చెప్పినా వినిపించుకునేది కాదు. ఈ నేపథ్యంలో తల్లి, అడ్డుగా ఉన్న ఇద్దరు కుమార్తెలను చంపేస్తే ఆస్తంతా తనకే దక్కుతుందని ఆమె భావించింది. పథకం ప్రకారం 2013 ఆగస్టు 23న రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె, భర్త రవిప్రసాద్తో కలిసి మత్తుమందును చేతి రుమాలులో ఉంచుకుని విజయలక్ష్మి ముహంపై పెట్టింది. కానీ అది పనిచేయలేదు. కేకలు వేయడానికి ప్రయత్నించిన ఆమె నోరును గట్టిగా నొక్కి పట్టుకుంది. రవిప్రసాద్ కత్తి తీసుకుని విజయలక్ష్మి మెడపై పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని మంచం కింద దాచేశాడు. కొద్దిసేపటి తరువాత బాంధవి చెల్లెల్లు ఇంటికి వెళ్లారు. ఒకరిని ఇంటి బయటపెట్టి మాటల్లోకి దింపింది. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె మరో చెల్లెలు నందినిని సైతం రవిప్రసాద్ కత్తితో పొడిచి గాయపరిచాడు. నందిని, ఇంటి బయటున్న మరో చెల్లెలు పెద్దగా కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. నందిని చికిత్సలు పొందిన తరువాత కోలుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు.బాంధవి, ఆమె భర్త ఉపయోగిస్తున్న సెల్ఫోన్లు, ల్యాప్టాప్ ఆధారంగా పలు ప్రాంతాల్లో మారుపేర్లతో వీరు తిరుగుతన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం హైదరాబాద్లో వీరిని పట్టుకున్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన ఎస్ఐ లక్ష్మణ్రెడ్డి, సిబ్బందిని సీఐ అభినందించారు.