Bankers strike
-
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం (19న) తలపెట్టిన సమ్మెను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) వాయిదా వేసుకుంది. తమ డిమాండ్లలో ఎక్కువ శాతం పరిష్కారానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించినట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయని తెలిపింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్టు, దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టు వివరించింది. -
ఆలిండియా బ్యాంకర్ల సమ్మె సైరన్
చెన్నై: బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగం, ఇతర అంశాలపై ఇటీవలి సంస్కరణలను నిరసిస్తూ ఆగస్టు 22 న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నామని బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రయివేటైజేషన్, ప్రభుత్వ రంగబ్యాంకుల విలీనం తదితర చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి. ఈనెల 22వ తేదీన ఆలిండియా బ్యాంకర్ల సమ్మె తలపెట్టినట్లు ద యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బీయు), ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ప్రకటించాయి. ఆగస్టు 22 న మొత్తం బ్యాంకింగ్ రంగంపై సమ్మె జరుగుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబీఇఎ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు చెప్పారు. వేతనాలు పెంపుతోపాటు బ్యాంకింగ్ రంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఈ సమ్మెకు దిగనున్నామని చెప్పారు. దీనిపై రెండు రోజుల క్రితమే నోటీసులు అందజేశా మన్నారు. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యుఎఫ్బీయు ఈ సమ్మెలో పాల్గొంటోందని అలాగే వేతనం సమీక్షలాంటి , ఇతర సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ను కూడాకోరినట్టు వెంకటాచలం తెలిపారు. -
సమ్మెతో అందని బ్యాంకు సేవలు
యాలాల: ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా చేపట్టిన బ్యాంకుల సమ్మె కారణంగా మండలంలో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలోని ఎస్బీహెచ్తోపాటు జుంటుపల్లి ఆంధ్రా బ్యాంకు, లక్ష్మీనారాయణపూర్లోని దేనాబ్యాంకు తదితర బ్యాంకులు మూసేశారు. ఈ విషయం తెలియని వినియోగదారులు, అకౌంట్ హోల్డర్లు బ్యాంకు లావాదేవీల కోసం మండల కేంద్రానికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. -
రేపటి బ్యాంకుల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకర్లు బుధవారం తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నారు. 12.5 శాతం వేతన సవరణకు జాతీయ బ్యాంకింగ్ అసోసియేషన్ అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతన సవరణకు సంబంధించి మరోసారి అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం చర్చలు జరపనుంది. బ్యాంకు ఉద్యోగులు 23 శాతం మేరకు వేతన సవరణ కోరుతున్నట్టు అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు సంఘం ప్రధాన కార్యదర్శి రాంబాబు చెప్పారు. -
మాఫియర్
- బ్యాంకర్లు, రెవెన్యూ మధ్య కొరవడిన సమన్వయం - రైతన్నలకు శాపం ... వీడని ఉత్కంఠ - 7న బ్యాంకర్ల సమ్మె, 8వ తేదీనే ఆఖరు గడువు - రెండో దశపై ఆశలు లేనట్టేనా..? ఒంగోలు: తొలి సంతకంతోనే రైతుల బతుకుల్లో వెలుగులు నింపుతానని సీఎం చంద్రబాబు ప్రకటించి ఆరు నెలలు దాటినా రైతుల గుండెల్లో గుబులు ఇంకా రెట్టింపవుతూనే ఉంది. సమాచారం అసమగ్రంగా ఉందంటూ 2,27,398 మంది రైతుల ఖాతాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్నా ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. రెండోదశలో ఉన్న వారి పేర్లను రుణమాఫీ వెబ్సైట్లో పెట్టే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన భరోసా రైతుల్లో సాంత్వన చేకూర్చలేకపోతోంది. సమగ్ర సమాచారాన్ని సేకరించి వెబ్సైట్లో పొందుపరచాలని ఓ వైపు చెబుతూ మరో వైపు జన్మభూమి కమిటీలతో సర్టిఫై చేయించి అప్లోడ్ చేయాలంటూ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి అవలంబించడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి బ్యాంకర్లలో నెలకొంది. జన్మభూమి కమిటీల్లో ఎవరో ఒకరు సంతకం చేస్తే చాలు ఆ వివరాలను అప్లోడ్ చేస్తామంటూ బ్యాంకర్లు చెబుతున్నా రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకర్ల మధ్య సమన్వయ లోపం దాదాపు రెండు లక్షల మంది రైతులకు శాపంగా పరిణమించనుంది. సోమవారం నాటికి అప్లోడ్ అయిన ఖాతాల సంఖ్య కేవలం 25,072 మాత్రమే. అంటే ఇంకా అప్లోడ్ కావాల్సిన ఖాతాల సంఖ్య 2,02,326 మిగిలి ఉన్నాయి. ఈనెల 7వ తేదీన బ్యాంకర్లు సమ్మెలోకి వెళుతుండడం, 8వ తేదీన వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు చివరిరోజు కావడంతో రైతులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. ఉలవపాడు, హనుమంతునిపాడు మండలాల రైతులకు సంబంధించి ఇంతవరకు ఒక్క రుణఖాతా కూడా అప్లోడ్ కాకపోగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 520 బ్రాంచీలకుగాను 240 బ్రాంచీలలో సోమవారం నాటికి కనీసం ఒక్క ఖాతా కూడా అప్లోడ్ కాకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. -
బ్యాంక్ బంద్..!