Belagavi village
-
పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
యశవంతపుర (కర్ణాటక): రాష్ట్రంలో బాలింతల మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. బెళగావి తాలూకా కరడిగుద్ది గ్రామానికి చెందిన గంగవ్వ గోడకుంద్రి (31) అనే బాలింత మరణించింది. జనవరి 28న గంగవ్వ ప్రసవం కోసం బెళగావి బిమ్స్ ఆస్పత్రిలో చేరారు. జనవరి 30న రాత్రి కొడుకు పుట్టాడు. జనవరి 31న బీపీ పడిపోయి ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు కుటుంబసభ్యుకు తెలిపారు. చికిత్స పొందుతూ గంగవ్వ కన్నుమూశారు. వైద్యులు నిర్లక్ష్యంగా ప్రసవం చేయడం వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రసవానికి ముందు ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని వైద్యులు తమ వద్ద తెల్ల పేపర్పై సంతకం చేయించుకొన్నారని, చివరకు మృతదేహాన్ని అప్పగించారని విలపించారు. ఆరోగ్యం క్షీణించిన సమయంలో సరైన చికిత్సలు చేసి ఉంటే మా అక్క బతికేదని మృతురాలి సోదరుడు శంకరప్ప ఆరోపించారు. బెళగావి ఎపిఎంసి పోలీసుస్టేషన్లో వైద్యులపై ఫిర్యాదు చేశారు. పుట్టిన గంటలకే తల్లికి దూరమైన శిశువును చూసి అందరూ అయ్యో అన్నారు.అదే మాదిరిగా అంజలి పాటిల్..బెళగావి తాలూకా నిలాజి కి చెందిన అంజలి పాటిల్ (30) అనే బాలింత 4 రోజుల కిందట బిమ్స్లోనే ఇదే మాదిరి చనిపోయింది. ఆమెకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవ వేదన ఆరంభం కాగా, వైద్యులు వేచి చూద్దామని చెప్పారు. చివరకు కుటుంబీకుల ఒత్తిడితో సిజేరియన్ కాన్పు చేశారు. కొంతసేపటికి తీవ్ర రక్తస్రావమై ఆమెకు మూర్ఛ వచ్చి మరణించింది. వైద్యుల అలసత్వమే కారణమని బంధువులు ధర్నా చేశారు.హైరిస్క్ కేసులే: వైద్యులుఆస్పత్రి వైద్యాధికారులు స్పందిస్తూ, ఈ వైద్యశాలలో ఏడాదికి 10 వేలకు పైగా కాన్పులు చేస్తామని, అందులో సగం హైరిస్క్ కేసులని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే తాము శ్రమిస్తామని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు, తాలూకా ఆస్పత్రుల నుంచి సీరియస్ అంటూ చివరి నిమిషంలో తమ వద్దకు పంపిస్తారని తెలిపారు. -
నగ్నంగా ఊరేగింపు.. యాసిడ్ విసిరారు
సాక్షి, బెంగళూరు: మహిళా భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పూజారిని చితకబాది, నగ్నంగా ఊరేగించారు స్థానికులు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బెలగావిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... షంబాజీ రోడ్లోని కపిలేశ్వర ఆలయ పూజారి గోపాలయ్య(రామ పూజారి) గత కొంత కాలంగా గుడికొచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంలో కొందరు గోపాలయ్యను హెచ్చరించినప్పటికీ లాభం లేకుండా పోయింది. సోమవారం సాయంత్రం గుడికొచ్చిన ఓ భక్తురాలిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని చితకబాది ప్యాంట్ ఊడదీయించి ఊరేగించారు. ఆ వీడియోలు స్థానికంగా పలు ఛానెళ్లలో ప్రసారం అయినట్లు టౌమ్స్ నౌ ప్రచురించింది. అయితే ఈ క్రమంలో గోపాలయ్య అనుచరులు కొందరు యాసిడ్ దాడికి దిగినట్లు ఆ కథనం పేర్కొంది. ఊరేగింపు కొనసాగుతుండగానే గోపాలయ్యపై దాడికి పాల్పడ్డ కొందరు యువకులపై యాసిడ్ బాటిళ్లను విసిరారు. ఈ ఘటనలో పలువురుకి తీవ్ర గాయాలు కాగా, ఆ దృశ్యాలు కూడా వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొట్టాయి. స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటికే పలువురురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
రక్షణ కోసం కర్రలతో స్కూల్కి విద్యార్థినులు..
బెల్గావి: దేశంలో ఎక్కడో ఒకచోటా నిత్యం మహిళలు, బాలికలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మరోవైపు ఆకతాయిల వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యే తమకు శరణ్యమని బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి అకతాయిల వేధింపులతో బయటకు రావాలంటేనే మహిళలు, చిన్నారులు భయపడిపోతున్నారు. ఇదే తరహా లైంగిక వేధింపులు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి గ్రామంలో కొనసాగుతున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడే ఆకతాయిల ఆగడాలు ఈ ప్రాంతంలో శృతిమించిపోతున్నాయి. దాంతో అక్కడి గ్రామ వాసులకు రోజు ఒంటరిగా బయటకు రావాలంటేనే ప్రాణసంకటంగా మారింది. తమను తాము రక్షించుకునేందుకు అక్కడి మహిళలు, బాలికలు గుంపుగుంపులుగా బయటకు వస్తున్నారు. అయితే ఈ వేధింపుల సమస్య కేవలం చిన్నారులు, మహిళలకే కాదూ.. వృద్ధ మహిళలనూ సైతం వేధిస్తోంది. బెల్గావి సిటీకి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న వాగ్వాడే గ్రామం నుంచి విద్యార్థినులు ప్రతిరోజూ సమీప గ్రామమైన మార్కెండేలోని స్కూల్కు వెళ్తుంటారు. ఇదే మార్గంలో ఆకతాయిలు బైక్లపై వచ్చి విద్యార్థినులను వేధించడం సర్వసాధారణమై పోయింది. ఆకతాయిల ఆగడాలకు అరికట్టేందుకు తమను తాము కాపాడుకునేందుకు తమవెంట కర్రలను తీసుకవెళ్లాలని విద్యార్థినులు సూచించినట్టు ప్యాస్ పౌండేషన్ డైరెక్టర్ కిరణ్ నిప్పాణికార్ స్థానిక మీడియాకు వెల్లడించారు. ప్రతివారం వేధింపుల కేసులు నాలుగు నుంచి ఐదు వరకూ నమోదు అవుతుంటాయని ఆయన చెప్పారు. మరోవైపు బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నట్టు అక్కడి స్థానికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆకతాయిలు ఆగడాలకు అడ్డుకట్టవేయాల్సి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అందుకోసమే పాఠశాలకు వెళ్లే విద్యార్థినులను తమ వెంట కర్రలను తీసుకెళ్లాలని తాము సూచించినట్టు తెలిపారు. దీనికోసం ఒక టీమ్ను ఏర్పాటు చేసామనీ, వారితో సంప్రదించేందుకు వీలుగా మహిళలకు, విద్యార్థినీలకు పోలీసుల ఫోన్ నెంబర్లు ఇచ్చి.. ఏ సహాయం అవసరమైన వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించినట్టు చెప్పారు. అయితే నాలుగు ఐదు నెలలుగా లైంగిక వేధింపులు కేసులపై పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఆకతాయిల లైంగిక వేధింపుల విషయంలో ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని కిరణ్ నిప్పాణికార్ తెలిపారు.