శ్రీగిరిలో శివచతుస్సప్తాహ భజనలు
శ్రీశైలం : శ్రావణ మాసం సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో బుధవారం నుంచి శివచతుస్సప్తాహ భజనలlు నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త మంగళవారం తెలిపారు. దేవస్థానం లోకకల్యాణార్థం ఏటా శ్రావణమాసంలో ఈ అఖండ శివనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. శ్రావణశుద్ధపాఢ్యమి నుంచి సెప్టెంబర్ 2 భాద్రపదశుద్ధపాఢ్యమి వరకు నిరంతరాయంగా కార్యక్రమం సాగుతుందన్నారు. కర్నూలుకు చెందిన 4 భజనబందాలతోపాటు కర్ణాటకలోని రాయచూర్ జిల్లా గోపానదేవహరళ్లి నుంచి ఒక బందానికి ఇందులో అవకాశం కల్పించినట్లు తెలిపారు. వీరు ఈ మాసమంతా రాత్రింబవళ్లు నిరంతరంగా ఓంనమఃశివాయ పంచాక్షరి ప్రణవభజనలు చేస్తారన్నారు. 456 వంవత్సరాలుగా దేవస్థానం ప్రతి శ్రావణమాసంలో ఈ అఖండభజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు.