రైతు రుణాలపై ఢిల్లీలో జేసీ ప్రజెంటేషన్
అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో రైతులకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నారు.. అందుకు ఏయే విధానాలను అనుసరిస్తున్నారు అనే విషయాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డు 2016-17 ఎంపికల్లో భాగంగా ‘లోన్ చార్జ్ క్రియేషన్స్ మాడ్యూల్ ప్రాజెక్టు’పై వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది.