breaking news
Bollywood
-
రెండో భర్తతోనూ విడాకులు.. అందుకేనన్న బాలీవుడ్ నటి!
పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా. తన అందం, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలతో పాటు బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్లో చాహత్ నటించింది. అయితే 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడిన ముద్దుగుమ్మ.. నాలుగు నెలలకే విడాకులిచ్చింది. ఆ తర్వాత 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతనితో కూడా తెగదెంపులు చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది చాహత్ ఖన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రెండోసారి విడాకులు తీసుకోవడంపై మాట్లాడింది. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.రెండోసారి విడాకుల గురించి చాహత్ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ నాకు సరైనది అనిపించిన దాన్నే చేశా. దానికే కట్టుబడి ఉంటా. ఏదైనా తప్పని అనిపిస్తే అలాంటి పని చేయను. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా చెప్పే ధైర్యం నాకు ఉంది. ప్రపంచం ఏమి చెప్పినా నేను ఎప్పుడూ తప్పును సమర్ధించను. మీకు ఆ రకమైన నమ్మకం, ధైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. కేవలం ఒక మహిళగా మాత్రమే కాదు, ఒక మనిషిగా.. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే అందులో భాగం కాలేను. అలాంటి వాటికి నేను దూరంగా వెళ్తాను. అలాగే మనం పిల్లల కోసం ఆలోచిస్తూ మనకు సరిగాలేని వివాహ బంధంలో ఉండిపోకూడదు. ఎందుకంటే పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. అది కలిగించే నష్టం మీకు కూడా తెలియదు. వారు పెద్దయ్యాక వారి స్నేహితుల నుంచి విన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకే నా కుమార్తెల కోసం నేను దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని తెలిపింది. -
హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.చిన్న వయసులోనే..హైదరాబాద్లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.ఆవేశంస్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఫరా నాజ్కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.చెంప చెళ్లుమనిపించిందికసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్ను హీరోయిన్గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బ తీసింది.చెల్లితో అసభ్యంగా..జాకీ ష్రాఫ్తో కలిసి దిల్జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.రెండు పెళ్లిళ్లుఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ -
వధువు సోదరి, వరుడు సోదరుడు ‘చమ్మక్ చల్లో..’ వైరల్ వీడియో
పెళ్లిళ్లలోఅందమైన అమ్మాయిలు, టీనేజ్ కుర్రాళ్లదే సందడి అంతా.వధూవరులు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే, వీరుమాత్రం ‘కళ్లు కళ్లు కలిసేనే...’ ‘కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్ఫ్యాట్యుయేషన్’ అంటూ ఆనందం, ఆశ్చర్యంతో ఉత్సాహంగా స్టెప్లు లేస్తారు. అలాంటి డ్యాన్స్ ఒకటి నెట్టింట తెగ వైరలవుతోది.పెళ్లిళ్లలో సంగీత్ వేడుక అనేది పెళ్లికి ముందు జరిగే వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబాలు కలిసి ఆడిపాడతారు. అయితే ఒక పెళ్లి వరుడి సోదరుడు,వధువు సోదరి ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. బాలీవుడ్ హిట్ మూవీ రా.వన్లోని సూపర్సాంగ్ ‘ చమ్మక్ చల్లో’’ కి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అబ్బాయి సూట్లో, అమ్మాయి లెహంగాలో అందంగా మెరిసిపోతూ, చక్కటి డ్యాన్స్ వేసి అక్కడున్నవారినందర్నీ మెస్మరైజ్ చేశారు. View this post on Instagram A post shared by WeddingDreamCo | Wedding Content Creator Chennai (@weddingdreamco) ఈ వీడియోను @weddingdreamco ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, 8.6 మిలియన్ల వీక్షణలు , 902వేల లైక్స్తో తెగ వైరల్గా మారింది. నెటిజన్లు ప్రశంసలు, కామెంట్లతో సందడిచేశారు. ‘‘వార్నీ..వీళ్లిద్దరూ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్టున్నారు. అందుకే పేరెంట్స్ను ఒప్పించడానికి వారు వారి అన్నయ్యలను వివాహం కోసం ఏర్పాటు చేసుకున్నారు.” ‘‘అమ్మాయి డ్యాన్స్తో చంపేసింది’’, అని ఒకరంటే.. ‘హే.. వాళ్లిద్దరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు. అబ్బాయి అయితే ఒక్కసారి కూడా టచ్ చేయకుండా డ్యాన్స్చేశారు అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.వధూవరుల తోబుట్టువులు పెళ్లిలలో ఇలాంటి డ్యాన్సులతో అతిథుల మనసు దోచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు నెట్టింట సందడి చేశాయి. -
సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ
బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్లో.. తర్వాత సీరియల్స్లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్ కూడా నిర్మించారు. నా జీవితం అగ్నిపథ్ సినిమావంటిదిజై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. అమ్మకు అన్యాయంఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.కష్టాలతో సావాసంమరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
ముంబయి టూ గోవా.. పరుగులు తీసిన స్టార్ హీరో.. వామ్మో అన్ని కిలో మీటర్లా?
పార్టీలు చేసుకోవాలి క్యాసినోలు చూసుకోవాలి బీర్లు తాగాలి బీచ్లలో పడి దొర్లాలి... గోవా అనగానే లెట్స్ గో... అనేందుకు చాలా మందికి అవే కారణాలు కావచ్చు. కానీ ఆ అగ్రనటుడు మాత్రం గోవాకి పరుగులు తీసిన కారణం వీటికి పూర్తిగా భిన్నం కావడం విశేషం. ఫిట్గా ఉండండి హిట్ అనిపించుకోండి అని ప్రభోధించడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏకంగా 600 కి.మీ ప్రయాణం అది కూడా ఎలా? పరుగులు తీస్తూ కాసేపు సైక్లింగ్లో మరింత సేపు...ఇంతకీ ఎవరా నటుడు? ఏమా కధ? లెట్స్ గెట్ ఇన్ టూ దిస్ స్టోరీ...ఫ్యాషన్ రంగంలో మోడల్ సినిమా రంగంలో నటుడు, అనగానే చాలామంది గుర్తుకు రావచ్చు కానీ.. ఫిట్నెస్ ఐకాన్ అనేది కూడా వీటికి జతకలిస్తే మాత్రం దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చే ఏకైక పేరు మిలింద్ సోమన్. గత కొన్నేళ్లుగా అన అనూహ్యమైన ఫిట్నెస్ స్థాయిలతో అందర్నీ అబ్బుపరుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మిలింద్..మరోసారి తన శారీరక సామర్ధ్యాన్ని చాటుకున్నాడు. ‘ది ఫిట్ ఇండియా రన్’ పేరుతో ఏటా నిర్వహించే రన్నింగ్ ఈవెంట్ దీనికి వేదికగా నిలిచింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరం మోటారు వాహనం లేకుండా ప్రయాణించారు. ఈ ప్రయాణం 5 రోజుల్లో పూర్తి చేసిన ఘనత సాధించాడు.ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 90కిమీ సైక్లింగ్ 21కిమీ పరుగు ఇలా విభజించుకుంటూ ఆయన ప్రయాణించాడు. గత నెల అంటే జూన్ 26న ముంబైలోని శివాజీ పార్క్ నుంచి మిలింద్ సోమన్ ఫిట్ ప్రారంభమైంది. మహారాష్ట్ర భూభాగానికి ఆనుకుని ఉన్న కొంకణ్ బెల్ట్ను పూర్తిగా కవర్ చేస్తూ పెన్, కొలాడ్, చిప్లూన్, రత్నగిరి, కంకవళి ల మీదుగా ప్రయాణిస్తూ జూన్ 30న గోవాకు చేరుకున్నాడు. తన సాహస ప్రయాణాన్ని తాజాగా ఆయన ఇన్ షేర్ చేశాడు. దానితో పాటే ఓ సందేశాన్ని కూడా.'ఫిట్ ఇండియన్ రన్ 5రోజుల పాటు 600కిమీ పూర్తి చేశాను. ఇది ప్రతీ ఏటా తప్పనిసరిగా నేను ఎదుర్కునే ఛాలెంజ్, శరీరం, మనస్సు బాగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకునేందుకు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఉపకరిస్తుంది. అనేక మంది నాకు బెస్ట్ విషెస్ చెప్పడం మరెన్నో అఛీవ్ చేయాలని కోరుతుండడం నాకు మరింత ప్రేరణగా మారుతోంది. ప్రతి భారతీయుడు ఫిట్ ఇండియన్ అవ్వాలి. జైహింద్' అంటూ పంచుకున్నాడు.ప్రతీ ఒక్కరిలో ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెంచేందుకు గత 2020లో భారత ప్రభుత్వం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమంలో మిలింద్ పాల్గొంటున్నాడు. ఈ సారి 60ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో ఆయన సాధించిన ఈ ఫీట్... ఫిట్నెస్లో ఆసక్తి ఉన్న చాలామందికి ప్రేరణ అందిస్తోంది. -
కూతురిగా చేసిన నటితో రొమాన్స్.. డైరెక్టర్ వద్దని చెప్పారు: అమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ ఇటీవలే 'సితారే జమీన్ పర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. అయితే గతంలో అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ ఫాతిమా సనా షేక్ అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించింది.అయితే దంగల్లో అమిర్ ఖాన్ కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత 2018లో వచ్చి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ కలిసి రొమాన్స్ చేసింది. అయితే తన కూతురి పాత్రలో నటించిన ఆమెతో అమిర్ ఖాన్ రొమాన్స్ చేయడంపై తాజాగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సినిమా మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ ఉండదని థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య అన్నారని గుర్తు చేశారు. అయితే తనకు ప్రేమికుడిగా నటించడానికి ఫాతిమాకు ఎలాంటి అభ్యంతరం లేదని డైరెక్టర్తో చెప్పానని అమిర్ ఖాన్ వెల్లడించారు. ఎందుకంటే నేను ఆమె తండ్రిగా ఒక సినిమాలో మాత్రమే నటించా.. నిజ జీవితంలో కాదని డైరెక్టర్తో చెప్పినట్లు తెలిపారు. నేను నిజ జీవితంలో ఆమె ప్రియుడిని కాదు.. మేమిద్దరం కలిసి కేవలం సినిమా చేస్తున్నామని దర్శకుడితో చెప్పినట్లు వివరించారు. అంతే కాకుండా గత సినిమాల్లో తల్లి-కొడుకులుగా నటించిన అమితాబ్ బచ్చన్- వహీదా రెహ్మాన్లు.. ఆ తర్వాత ప్రేమికులుగా నటించారని అమిర్ గుర్తు చేశారు. దీపిక, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి తారలు ఈ మూవీని రిజెక్ట్ చేసినప్పటికీ ఫాతిమా ఈ చిత్రానికి సంతకం చేశారని అమిర్ ఖాన్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన సినిమా అని నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి కాల్ వచ్చిన తర్వాత తాను షాక్ అయినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. -
సైడ్ యాక్టర్గా అజిత్.. నాకు నచ్చలేదు: విష్ణు
మంచు విష్ణు (Vishnu Manchu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్తో తీశారు. టాలీవుడ్లో ఎవరూ దొరకలేదా? అంటే? వరుస ఫ్లాపులు అందుకున్న తనతో కన్నప్ప వంటి మైథాలజీ సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రారని అసలు విషయం చెప్పారు. అందుకే మహాభారత్ సీరియల్ తీసిన ముకేశ్తో కన్నప్ప సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు. బాలీవుడ్లో ఛాన్స్మరి హీరోగా బాలీవుడ్లో అడుగుపెట్టే ఆలోచనలేమైనా ఉన్నాయా? అంటే విష్ణు ఇలా స్పందించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం హిందీలో సినిమా చేయమని కొందరు నన్ను సంప్రదించారు. కానీ వారు ఆఫర్ చేసినవేవీ నాకు నచ్చకపోవడంతో అక్కడ సినిమాలు చేయలేదు. పైగా నటుడిగా నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అదే సమయంలో అభిమానుల ప్రేమను పొందాను. వారిని నేను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏవి పడితే అవి చేసి వారిని నేను బాధపెట్టలేను.చిన్న రోల్.. నచ్చలేదుఉదాహరణకు స్టార్ హీరో అజిత్ను తీసుకుందాం. ఆయన ఇండియాలోనే పెద్ద సూపర్స్టార్స్లో ఒకరు. షారూఖ్ ఖాన్ అశోక మూవీలో ఆయన సైడ్ రోల్ చేశారు. అది నాకు నచ్చలేదు. అజిత్ అన్నతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఇంత చిన్న పాత్ర చేసినందుకు నిరాశచెందాను అని చెప్పాను. అందుకాయన చిన్నగా నవ్వి సైలెంట్గా ఉండిపోయారు.సెల్ఫిష్గా ఆలోచించలేనుకాబట్టి ఏదో ఒక రోల్.. అని లైట్ తీసుకుని సినిమా చేయలేను. జనాలకు నచ్చినా, నచ్చకపోయినా నా ఇష్టమొచ్చిన సినిమాలు చేస్తా అని సెల్ఫిష్గా ఆలోచించలేను అని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, కాజల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
'నేను ఏం మాట్లాడిన అలానే తీసుకుంటారు'.. విడాకుల రూమర్స్పై అభిషేక్ బచ్చన్!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్-ఐశ్వర్య జంటపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే వినిపిస్తున్నాయి. వీరిద్దరు విడాకుల తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి చాలాసార్లు కనిపించడంతో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఐశ్వర్య బర్త్ డే ఆలస్యంగా విష్ చేయడం.. ఆమెతో అభిషేక్ బచ్చన్ ఎక్కువగా కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అభిషేక్ ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్ బచ్చన్.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న తప్పుడు సమాచారంపై తాను ఎందుకు స్పందించలేదనే విషయాన్ని వెల్లడించారు. నెగెటివ్ వార్తలు రాయడం అనేది ఈ రోజుల్లో కొత్త ట్రోలింగ్ ట్రెండ్ అని అభిషేక్ అన్నారు. తాను ఏం మాట్లాడిన ప్రజలు నెెగెటివ్గానే తీసుకుంటారని స్పష్టం చేశారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. "గతంలో నా గురించి వచ్చిన కథనాలేవీ నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఏదైనా మాట్లాడితే అది వారిని చాలా బాధ పెడుతుంది. నేను ఏం చెప్పినా ప్రజలు దాన్ని నెగెటివ్గానే తీసుకుంటారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి ప్రతికూలతను బయటపెట్టే వ్యక్తులు తమ మనస్సాక్షితో జీవించాలి. ఇక్కడ మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇది ఒక కొత్త ట్రోలింగ్ ఫ్యాషన్. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే బదులు.. డైరెక్ట్గా నాతో వచ్చి చెప్పడానికి మీకు అనుమతి ఇస్తా. కానీ నా ఎదురుగా వచ్చి చెప్పడానికి మీకు ధైర్యం ఉండదు. ఎవరైనా నా ఎదురుగా వచ్చి మాట్లాడితే వారిని స్వయంగా నేనే గౌరవిస్తా" అని అన్నారు. కాగా.. అభిషేక్ ప్రస్తుతం కాళిధర్ లపతా చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 13 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. -
'మీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావ్'.. చాలా బాధేసింది: డైరెక్టర్
సింగిల్ పేరెంటింగ్ అన్నది చాలా కష్టం. తల్లి/తండ్రి లేని లోటు తెలియకుండా పిల్లల్ని పెంచాలి. అమ్మానాన్న అన్నీ ఒక్కరై పిల్లల్ని చూసుకోవాలి. ఇద్దరి ప్రేమను ఒక్కరే పంచాలి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా అదే పని చేస్తున్నాడు. 2017లో సరోగసి ద్వారా కవలలకు తండ్రయ్యాడు. అప్పటినుంచి అన్నీ తానై పిల్లల్ని చూసుకుంటున్నాడు. కానీ కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. ఆ చిన్నారులకు తల్లి లేకుండా చేశావని నిర్మాతను విమర్శించారు. ఆ మాటలు తననెంతగానో బాధపెట్టాయంటున్నాడు కరణ్ జోహార్.నాపై నాకే అనుమానంతాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.. నీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావన్న విషయం నీకర్థమవుతోందా? అన్న కామెంట్లు చూసి భరించలేకపోయాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అని నామీద నాకే అనుమానమేసింది. అప్పుడు వెంటనే పిల్లల గదిలోకి వెళ్లాను. అప్పుడు వారి వయసు ఐదేళ్లుంటాయంతే! మీరు సంతోషంగానే ఉన్నారా? అని అడిగాను. నువ్వు మా నాన్నవి కాబట్టి హ్యాపీగా ఉన్నామన్నారు. నేను ఆ సమాధానం కోసమే ఎదురుచూశాను. సింగిల్ పేరెంట్గా..వారి రెస్పాన్స్ విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకనవసరం అనిపించింది. సింగిల్ పేరెంట్గా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యాను. మా అమ్మానాన్నకు నేను ఒక్కడినే సంతానం. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్గా ఉన్నాను. నాకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా నా కుటుంబం, స్నేహితులు.. వీళ్లెప్పుడూ నా వెన్నంటే ఉంటారు. అందుకు గర్విస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు -
'3 ఇడియట్స్'లో స్టూడెంట్.. ఇప్పుడు హీరోయిన్గా ఛాన్సులు (ఫోటోలు)
-
రూ. 25 కోట్ల ఎఫెక్ట్.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న 'పరేష్ రావల్'
బాలీవుడ్లో వినోదాలు పంచిన సిరీస్ల్లో ‘హెరాఫెరీ’ (Hera Pheri) ఒకటి. గత కొన్ని నెలలుగా ‘హెరాఫెరీ 3’ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత పార్ట్-3 ప్లాన్ చేశారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, టబు, ఓం పురి, గుల్షన్ గ్రోవర్ వంటి స్టార్స్ ఈ సిరీస్లలో నటించారు. అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ప్రస్తుత సీక్వెల్ను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సడెన్గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేం) కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. కామెడీ ప్రధాన కాన్సెప్ట్తో వచ్చిన గత రెండు సిరీస్లో ఆయన పాత్ర చాలా కీలకం. కానీ, పార్ట్-3 నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు చెప్పడంతో సినిమాపై అంచనాలు అన్నీ తారుమారు అయిపోయాయి. దీంతో అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారు చర్యలు ప్రారంభించారు. దీంతో పరేష్ రావల్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. హెరాఫెరీ-3లో తాను నటిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.'హేరా ఫేరి 3' సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నెల రోజుల తర్వాత తిరిగి అందులో భాగమవుతున్నానని నటుడు పరేష్ రావల్ తాజాగా స్పష్టం చేశారు. ఇటీవల పాడ్కాస్ట్లో కనిపించిన ఆయన, చిత్ర బృందంతో పరిస్థితులు చక్కబడ్డాయని, దర్శకుడు ప్రియదర్శన్తో మంచి స్నేహం ఉందని చెప్పారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో కలిసి ఈ ప్రాజెక్ట్లో చేరానని తెలిపారు. వారు ముగ్గురు మంచి స్నేహితులని పరేష్ రావల్ అన్నారు. ఆపై అక్షయ్ కుమార్ తనకు చిరకాల స్నేహితుడని ఆయన కితాబు ఇచ్చారు. రావల్ అకస్మాత్తుగా సినిమా నుండి నిష్క్రమించిన తర్వాత.., అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ అతనిపై రూ. 25 కోట్ల దావా వేసింది, అతని చర్యల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించాయని, నిర్మాణ షెడ్యూల్కు అంతరాయం కలిగిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే ఆయన తిరిగి ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పరేష్ రావల్ ఈ మూవీ కోసం రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. అందుకే న్యాయపరమైన చిక్కులు వస్తాయిని తన మనసు మార్చుకున్నారని టాక్. బాలీవుడ్లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కధానాయకుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. -
మొదటి భార్యతో విడాకులు.. మద్యానికి బానిసయ్యా: అమిర్ ఖాన్
ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆమిర్ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య రీనా దత్తాతో విడిపోయాక ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. ఆ టైమ్లో తీవ్రమైన ఒత్తిడి, బాధకు గురయ్యానని వెల్లడించారు. దీంతో మద్యానికి బానిసైనట్లు తెలిపారు. నా సినిమా లగాన్ విజయం సాధించినప్పటికీ.. జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించదన్నారు. అది తన జీవితంలో చీకటిదశ అని పేర్కొన్నారు.అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'రీనాతో నేను విడిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రంమే మద్యం ఫుల్ బాటిల్ తాగాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను. ఆ సమయంలో ఎప్పుడూ నిద్రపోలేదు. అధిక మద్యం సేవించడం వల్ల నేను స్పృహ కోల్పోయేవాడిని. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించా. ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. అదే ఏడాది నా సినిమా లగాన్ రిలీజైంది. అప్పట్లో నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచారు. అది నాకు చాలా వ్యంగ్యంగా అనిపించింది' అని పంచుకున్నారు.కాగా.. ఆమిర్, రీనా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు అమిర్ ఖాన్ తన రక్తంతో ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. రీనా మొదట అమిర్ ప్రేమను అంగీకరించలేదు.. కానీ తరువాత ఓకే చెప్పి.. ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రీనా దత్తా ఆమిర్ మొదటి చిత్రం 'ఖయామత్ సే ఖయామత్ తక్'లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది. వీరి వివాహమైన 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ జంటకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 16 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ప్రస్తుతం తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో రిలేషన్లో ఉన్నారు. -
దాదాసాహెబ్... అంత ఈజీ కాదు: ఆమిర్ ఖాన్
దివంగత ప్రముఖ దర్శక–నిర్మాత–స్క్రీన్ రైటర్ దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో ఈ దాదాసాహెబ్ బయోపిక్ రూపొందనుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడం అనేది పెద్ద చాలెంజ్. వాణిజ్యపరమైన అంశాలున్న సాధారణ సినిమా కాదు ఇది. ఆ రోజుల్లోనే ఎవరూ ఊహించలేని విధంగా అడ్వెంచర్ చేసిన వ్యక్తి కథ ఇది. అంత ఈజీ కాదుఆయన జీవితంలో ఎన్నో ఎగ్జైట్ చేసే అంశాలు, సంగతులు, సంఘటనలు ఉన్నాయి. అడ్వెంచర్ జర్నీలాంటి ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడాన్ని నేను, రాజు (దర్శకుడు రాజ్కుమార్ హిరాణి కావొచ్చు) పెద్ద గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన్ చేశాం’’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.చదవండి: '21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ -
షఫాలీ మరణానికి కారణం.. ఉపవాసం సమయంలో అలాంటి ఇంజెక్షనే!
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (42) (Shefali Jariwala) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్తో మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. జూన్ 27న కార్డియాక్ అరెస్ట్తో ఆమె మరణించినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ముంబై పోలీసులు ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే, తాజాగా ఆమె మరణం పట్ల పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది.నటి షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు విచారణ ప్రారంభించి, ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల కారణం గురించి వారు ఇంకా వెళ్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. షెఫాలి చాలా సంవత్సరాలుగా వృద్ధాప్య వ్యతిరేక (యాంటీ ఏజింగ్) ఇంజెక్షన్లు తీసుకుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె అందుకు సంబంధించిన మెడిసిన్స్తో పాటు ఇంజెక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన రోజున శుక్రవారం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో.. ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని సమాచారం. దీంతో ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడంతో కార్డియాక్ అరెస్టై ఉంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని సంఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్ట్మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం నిర్ధారించబడుతుందని పోలీసులు తెలిపారు. జూన్ 29న, షెఫాలి భౌతికకాయాన్ని ఓషివారా శ్మశానవాటికలో దహనం చేశారు. ఆమె భర్త పరాగ్ త్యాగి అంత్యక్రియలు చేస్తుండగా విలపిస్తూ కనిపించారు. తొలుత గాయకుడు హర్మీత్ సింగ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు. -
ఫ్యామిలీ మాన్ 3 లో ఎవరూ ఊహించని విలన్
-
తెలుగులో ఎప్పుడో నటించిన దీపికా.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా?
బ్యాడ్మింటన్ కోర్టు వదిలేసి, మోడలింగ్ ప్రపంచంలో నాజూకు అడుగులతో మొదలుపెట్టింది. నేడు వెండితెర మీద తనదైన సామ్రాజ్యం నిర్మించుకుంది నటి దీపికా పదుకొణే. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని త్వరలో రాబోతుండటంతో, ఎక్కడ చూసినా ఆమె పేరే ఒక హాట్ టాపిక్! అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందే సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం సినీ పరిశ్రమలో పెద్ద వార్తగా మారింది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం..బ్యాడ్మింటన్ ఆట నుంచి..దీపికా పదుకొణె (Deepika Padukone) కొంకణి అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తండ్రి ప్రభావంతో బ్యాడ్మింటన్ ఆడిన దీపికా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. కాని తనకు సినిమా, మోడలింగ్పై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో నటన వైపు మొగ్గుచూపింది. ఆమె సినీ ప్రయాణం తెలుగు సినిమా ‘మన్మథుడు’ ఆధారంగా రూపొందిన కన్నడ రీమేక్ ‘ఐశ్వర్య’ చిత్రంతో మొదలైంది. తెలుగులో ఎప్పుడో యాక్ట్ చేసిందితెలుగు దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, దీపికాకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చారు. ఓ యువ ప్రేమకథలో ప్రత్యేక పాటలో నాట్యం చేసింది. ఆ సినిమా పూర్తయింది. కానీ, ఇప్పటికీ విడుదల కాలేదు. లేకపోతే ఆమె టాలీవుడ్లో ఎప్పుడో అడుగుపెట్టేది. ‘కల్కి’ సినిమాలో సుమతి పాత్రతో ఆకట్టుకున్న దీపికా, ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గ్లామర్లో తగ్గేదేలే‘రామ్ లీలా’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్వీర్ సింగ్తో పరిచయం ప్రేమగా మారింది. అంతకు ముందు రణ్బీర్ కపూర్తో ప్రేమలో ఉన్న ఆమె, ఆ బ్రేకప్ తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టింది. పెళ్లి అయినా, తల్లి అయినా, దీపికా తన గ్లామర్ను తగ్గించుకోలేదు. తన పని పట్ల నిబద్ధతతో ప్రవర్తించేది. హిందీ సినీ ప్రపంచంలో ఆమె తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’, షారుఖ్ ఖాన్తో కలసి నటించింది. ఆ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘జవాన్’లాంటి హిట్ సినిమాల్లో నటించింది.రూ.500 కోట్లకు పైగా ఆస్తులుహాలీవుడ్లోనూ నటించే అవకాశం పొందిన దీపికా, ప్రపంచ సినీరంగంలో కూడా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం దీపికా ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంది. ముంబైలో ఆమెకు అంధేరి, బాంద్రా, ప్రభాదేవి ప్రాంతాల్లో మూడు ఇళ్లు ఉన్నాయి. 2022లో ఆమె సొంతంగా సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ను ప్రారంభించింది. ఇళ్లపై పెట్టుబడులు పెట్టడాన్ని ఆమె ఇష్టంగా భావిస్తుంది.రహస్యాన్ని అతడికే చెప్తాఓ ఇంటర్వ్యూలో తల్లి అయ్యాక, తన పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నానని, బిడ్డకు సమయాన్ని ఇచ్చేలా ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఓ కార్యక్రమంలో ‘ఒక రహస్యాన్ని చెవిలో చెప్పాలంటే ఏ హీరోకి చెబుతారు?’ అన్న ప్రశ్నకు వెంటనే షారుఖ్ ఖాన్ అని బదులిచ్చింది. 2007లో రణ్బీర్ కపూర్తో పరిచయం, ప్రేమగా మారింది. ఒకే మేకప్ ఆర్టిస్ట్ కారణంగా ఫోన్ నంబర్లు మార్చుకుని ప్రేమలో పడ్డారు. తన మెడ వెనక అతడి పేరు టాటూ వేయించుకుంది. కాని, ఏడాదిలోనే బ్రేకప్ జరిగింది.డిప్రెషన్రణ్బీర్ కపూర్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల విడిపోయినట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పింది. దీని వలన డిప్రెషన్కు లోనైనా, కెరీర్పై ప్రభావం రాకుండా చూసుకుంది. ‘ఏ జవానీ హై దివానీ’ సినిమా అదే సమయంలో పూర్తి చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దీపికా – రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. మరోవైపు రణ్బీర్ కపూర్ – ఆలియా భట్ను వివాహం చేసుకుని పాపకు తండ్రయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రొఫెషనల్గానే పలకరించుకుంటారు.చదవండి: స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా? -
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
కరాటేలో బ్లాక్బెల్ట్.. డ్యాన్సర్, మోడల్. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్ ఆనంద్ (Mahesh Anand).కెరీర్1982లో సనమ్ తేరీ కసం మూవీలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్ కాకపోవడంతో విలన్గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్లో కరడుగట్టిన విలన్గా పేరు గడించిన మహేశ్ ఆనంద్.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్ వన్, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.ఐదు పెళ్లిళ్లువెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవకాశాలు దూరంఅనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్ కెరీర్ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్.. 2015లో రష్యన్ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. పేదరికంలో మగ్గిన నటుడువందల సినిమాలు చేసిన మహేశ్.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్ బ్రదర్ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం2019 ఫిబ్రవరి 9న మహేశ్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.చదవండి: ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్ -
ఆ సీన్ తర్వాత గతం మర్చిపోయిన అమ్రిష్ పురి..
హీరోయిన్ కాజోల్కు మతిమరుపు ఉండేది. కుచ్కుచ్ హోతా హై సినిమా సెట్లో పదేపదే అన్నింటినీ మర్చిపోయేది. ఓసారి తనే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెజెండరీ నటుడు అమ్రిష్ పురి (Amrish Puri) ఒకానొక సందర్భంలో తనెవరన్నది కూడా మర్చిపోయాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. అజయ్ దేవ్గణ్, అమ్రిష్ పురి ఓ సినిమాలో కలిసి నటించారు. అంతా మర్చిపోయిన అమ్రీష్పురిఅందులో అమ్రీష్.. జలపాతం కింద నిల్చునే సీన్ ఉంది. అందుకోసం ఆయన వాటర్ఫాల్ కింద నిలబడ్డారు. పైనుంచి ఎంతో వేగంగా వస్తున్న నీళ్లు ఆయన తలను కొట్టుకుంటూ కిందపడేవి. తలకు రక్షణగా ఏదీ పెట్టలేదు. సన్నివేశం అయిపోగానే ఆయన వాటర్ఫాల్ నుంచి వచ్చేశారు. కానీ అన్నీ మర్చిపోయాడు. అసలేదీ గుర్తులేదు. నేనెవర్ని? నేనిక్కడేం చేస్తున్నాను? అని ప్రశ్నించాడు. సెట్లో ఉన్నవాళ్లందరికీ భయంతో చెమటలు పట్టాయి. తనకు జ్ఞాపకశక్తి రావడానికి మూడు గంటలు పట్టింది. కరడుగట్టిన విలన్గా..ఇప్పుడు తల్చుకుంటే సరదాగా అనిపిస్తుందేమోకానీ ఆ సమయంలో మాత్రం అందరూ చాలా భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అమ్రీష్ పురి, అజయ్ దేవ్గణ్.. టార్జాన్: ద వండర్ కార్, ఫూల్ ఔర్ కాంటే, హల్చల్, గెయిర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో వందలాది సినిమాలు చేసిన అమ్రిష్ పురి.. ఆదిత్య 369, బాబా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, నిప్పురవ్వ వంటి పలు చిత్రాల్లో నటించారు. కరడుగట్టిన విలన్గా ప్రేక్షకులను తన ఆహార్యంతోనే భయపెట్టేవారు. 2005లో బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్ -
రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్ చేసిన ఇలియానా
దేవదాసు, పోకిరి, జులాయి వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది ఇలియానా డీక్రూజ్ (Ileana D'Cruz). ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం యాక్టింగ్ పక్కన పెట్టి కుటుంబానికే పెద్ద పీట వేస్తోంది. ఇటీవలే ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ బుడ్డోడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అతడికి ఏం పేరు పెట్టిందో కూడా వెల్లడించింది. శుభాకాంక్షల వెల్లువజూన్ 19న జన్మించిన కెయాను రఫె డోలన్ను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి అని క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్కు హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు.. ఇలియానాకు అభినందనలు తెలియజేస్తున్నారు.పెళ్లి- పిల్లలుఇలియానా.. 2023లో విదేశీయుడు మైఖేల్ను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. అతడికి కోవా ఫోనిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఇప్పుడు మరోసారి కొడుకే జన్మించాడు. ఇకపోతే ఇలియానా చివరగా 'దో ఔర్ దో ప్యార్' సినిమాలో కనిపించింది. 'రైడ్ 2'లో నటించే ఆఫర్ వచ్చినప్పటికీ చిన్న పిల్లాడు ఉన్నందున ఆ సినిమాను వదిలేసుకుంది. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) చదవండి: 'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత
బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షెఫాలీ జరివాలా (42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెను అంధేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే నటి మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టమ్ కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నటి మృతికి ఇంకా కారణాలు తెలియలేదన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆమె నివాసంలో పలు ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు. షెఫాలి (Shefali Jariwala) మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.నటి ప్రయాణం సాగిందిలా..షెఫాలీ జరివాలా 2002లో వచ్చిన కాంటా లగా సాంగ్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి అభిమానులు ఆమెను కాంటా లగా గర్ల్ అనే పిలుచుకుంటున్నారు. ఈ గుర్తింపుతోనే ముజ్సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి నటించే ఛాన్స్ వచ్చింది. అలాగే కన్నడలో హుడుగరు మూవీలో యాక్ట్ చేశారు. బేబీ కమ్నా అనే వెబ్ సిరీస్లోనూ కనిపించారు. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లోనూ పాల్గొన్నారు. షెఫాలి.. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ను పెళ్లాడారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2009లో విడిపోయారు. అనంతరం 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్ -
రేఖా.. హుషారుగా! కల్ట్ క్లాసిక్ ఉమ్రావ్ జాన్ రీ-రిలీజ్ సందడి (చిత్రాలు)
-
ఆరేళ్లపాటు డేటింగ్.. మాజీ ప్రియుడిని మరవలేకపోతున్న బ్యూటీ!
బాలీవుడ్ భామ మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్సే గుర్తొస్తాయి. ఆ తర్వాత ఆమె డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్తో ప్రేమాయణం నడిపించింది. అయితే వీరి ప్రేమబంధం ఎక్కువ రోజులు నిలవలేదు. దాదాపు ఆరేళ్ల డేటింగ్ అనంతరం బ్రేకప్ చెప్పేసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే కొన్నినెలల క్రితం ఐపీఎల్ మ్యాచ్లో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన మలైకా కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా తన మాజీ భాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ బర్త్ డే కావడంతో విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్డే, అర్జున్ కపూర్' మాజీ ప్రియుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న మలైకా అరోరా మాజీ లవర్కు విషెస్ చెప్పడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అయితే గతేడాది బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మాత్రం సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా.. అర్జున్ కపూర్ ఇటీవలే తెరపైకి వచ్చిన 'మేరే హస్బెండ్ కి బివి' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం 'నో ఎంట్రీ 2' అనే మూవీలో నటించనున్నారు. -
ఐశ్వర్య రాయ్తో పెళ్లికి ముందు ఆ హీరోయిన్తో ఎంగేజ్మెంట్!
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారు అంటుంటారు. అందుకేనేమో.. పీకల్లోతు ప్రేమలో ఉన్న అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్.. ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయారు. మనసు నిండా ఒకరినొకరు నింపుకున్నారు కానీ, తలరాతల్లో మాత్రం లేకుండా పోయారు. జంటగా నడవాలనుకుంటే వేర్వేరుగా ప్రయాణించారు. అభిషేక్.. ఐశ్వర్యను, కరిష్మా.. సంజయ్ను పెళ్లాడారు. అసలు ఆనాడేం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం..అభిషేక్- కరిష్మా ప్రేమసినీరంగంలో సత్తా చాటుతున్న కపూర్ ఫ్యామిలీలో పుట్టింది కరిష్మా (Karisma Kapoor). 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో కొన్ని వైఫల్యాలు చూసిన కరిష్మా.. రాజా హిందుస్తానీ చిత్రంతో సక్సెస్ అందుకుంది. తర్వాత ఈ బ్యూటీ బిగ్బీ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)తో ప్రేమలో పడింది. అభిషేక్ సోదరి శ్వేత బచ్చన్ పెళ్లిలోనే వీరి చూపులు కలిశాయి. ఐదేళ్లపాటు ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. జయా బచ్చన్తో కరిష్మా కపూర్నా కోడలు: జయా బచ్చన్దీంతో 2002లో అమితాబ్ బచ్చన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో జయా బచ్చన్.. అభిషేక్, కరిష్మాల ఎంగేజ్మెంట్ను ప్రకటించింది. కరిష్మాను తన కోడలిగా చేసుకోనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్లో పెద్ద పండగే జరగబోతుందనుకున్నవారికి షాకిస్తూ వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అమితాబ్ తన సంపదలో కొంత భాగం అభిషేక్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాలని కరిష్మా తల్లి బబిత డిమాండ్ చేసిందట! ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లిఎంగేజ్మెంట్ ఆగిపోయిన కొద్ది నెలలకే బబిత.. తన కూతురికి మంచి వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసింది. 2003లో కరిష్మా, సంజయ్ కపూర్ల పెళ్లి జరిగింది. ఇతడికిది రెండో పెళ్లి కావడం గమనార్హం. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. పిల్లలు పుట్టిన కొంతకాలానికే కరిష్మా- సంజయ్ విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2016లో డివోర్స్ మంజూరయ్యాయి. కొద్దిరోజుల క్రితమే సంజయ్ కపూర్ కన్నుమూశాడు. ఇకపోతే అభిషేక్ బచ్చన్.. 2007లో ఐశ్వర్యరాయ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అభిషేక్- ఐశ్వర్య అయినా సంతోషంగా ఉన్నారా? అంటే.. అప్పుడే దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు. అంతలోనే జంటగా కనిపిస్తారు. వీరి మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి! #KarismaKapoor and #AbhishekBachchan's #wedding announcement in the early 2000s was a highly anticipated union between two of #Bollywood's most prominent families. However, the engagement was abruptly called off, and the wedding never took place.#bollywood #aishwaryarai pic.twitter.com/U1dRUrmnT2— The Cheshire Cat (@C90284166) November 5, 2024 చదవండి: కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు -
కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు
అడ్జస్ట్ అయితేనే అవకాశాలు ఇస్తామంటున్నారు అని ఎంతోమంది నటీమణులు మీడియా ముందు గోడు వెల్లబోసుకున్నారు. అయితే తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటున్నాడు బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాన్షు పాండే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నేను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఓ ప్రముఖ దర్శకనిర్మాత తను అడిగింది చేస్తే మంచి ఆఫర్ ఇస్తానన్నాడు.కాంప్రమైజ్ అయితేనే..ఇప్పుడాయన బతికి లేడు. గొప్ప ఫిలింమేకర్స్లో ఆయన ఒకరు. ఆయన అడిగినదానికి కాంప్రమైజ్ అయితేనే రోల్ ఇస్తానన్నాడు. ఆయనపై నాకెలాంటి కోపం, పగ లేదు. ఎందుకంటే వాళ్లు అడిగినదానికి ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆయన అడిగింది నా వల్ల కాదని సున్నితంగా తిరస్కరించాను. మర్యాదగా అడిగాడు కాబట్టి అంతే గౌరవంగా బదులిచ్చాను. బలవంతం చేస్తే నచ్చదుఅలా కాకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించుంటే లాగిపెట్టి కొట్టేవాడిని. ఎవరైనా నన్ను బలవంతం చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు నచ్చినపనే చేస్తాను. నచ్చినవాటివైపే నిలబడతాను. ఇష్టం లేకుండా ఏ పనీ చేయను అని చెప్పుకొచ్చాడు. సుధాన్షు పాండే.. ఖిలాడీ 420, ద మిత్, యాకీన్, మర్డర్ 2, రాజధాని ఎక్స్ప్రెస్ వంటి పలు చిత్రాలు చేశాడు. రోబో 2.0, మన్మథుడు 2 వంటి చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితుడే.. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్లో కనిపిస్తున్నాడు.చదవండి: లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! -
విమానంలో మూర్ఛ వచ్చింది.. ఎక్కువ డోస్ ఇవ్వడంతో..: హీరోయిన్
బాలీవుడ్ హీరో విజయ్ వర్మ.. తమన్నాకు బ్రేకప్ చెప్పాక మరో హీరోయిన్తో ప్రేమలో పడ్డాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షైఖ్ (Fatima Sana Shaikh)తో పలుమార్లు కనిపించడంతో వీళ్లు లవ్ బర్డ్స్ అయుండొచ్చని పలువురూ అభిప్రాయపడ్డారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదంటోంది ఫాతిమా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. సింగిల్ లైఫ్కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ అనుబంధాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఆ బంధం విజయవంతంగా కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు అంటూ తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని వెల్లడించింది. అలాగే తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. నాకు మూర్ఛ రోగం (Epilepsy) ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో ఉండగా మూర్ఛ వచ్చింది. దాంతో నన్ను ఎయిర్పోర్ట్ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఫిట్స్ వచ్చి పడిపోయాఅయినా మూర్ఛ తగ్గకపోవడంతో ఎక్కువ డోసు ఇచ్చారు. దానివల్ల నా శరీరం ఎఫెక్ట్ అయింది. బెడ్రెస్ట్ తీసుకోక తప్పలేదు. అప్పుడు నా చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటి షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. షూటింగ్కు రమ్మని పిలిచినప్పుడు బాధ తట్టుకోలేక ఏడ్చేశాను. నాకున్న మూర్ఛ వ్యాధి గురించి అందరికీ చెప్పాలని డిసైడయ్యాను. అప్పుడే నాకు ఫిట్స్ ఉన్నట్లు వెల్లడించాను అని చెప్పుకొచ్చింది. ఫాతిమా.. మాధవన్ సరసన ఆప్ జైసా కోయ్ మూవీలో నటించింది. ఈ చిత్రం జూలై 11న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఫాతిమా నటించిన మరో చిత్రం 'మెట్రో ఇన్ డినో' జూలై 4న థియేటర్లలో రిలీజవుతోంది.చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
కరీనా కపూర్ బాత్రూమ్లో నా పోస్టర్ అతికించుకుంది: సల్మాన్ ఖాన్
అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలు, పోస్టర్లు గది నిండా నింపుకుంటుంటారు చాలామంది. అయితే ఓ హీరోయిన్ తన బాత్రూమ్లో స్టార్ హీరో పోస్టర్లు అతికించిందుకుందట! ఈ విషయాన్ని భాయ్జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. కరీనా కపూర్! ఆమె అతికించిన పోస్టర్దో ఎవరికో కాదు సల్మాన్దే!సల్మాన్పై ఫన్నీ పోస్టర్లుసల్మాన్ ఖాన్.. ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్కు మొదటి గెస్టుగా విచ్చేశాడు. షోలో ప్రసారం చేయని అన్సీన్ ఫుటేజ్ను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. అందులో రోడ్డు పక్కన, కళ్లజోడు దుకాణంలో, మెన్స్ సెలూన్లో సల్మాన్ను ఎలా వాడేస్తున్నారనేది తెలియజేస్తూ ఆయా పోస్టర్లను చూపించాడు. అవి చూసి నవ్వేసిన హీరో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.కరీనా బాత్రూమ్లో నా పోస్టర్కరీనా కపూర్ బాత్రూమ్లో కూడా నా పోస్టర్ ఉందని విన్నాను. తర్వాత నేనోసారి ఆమె ఇంటికి వెళ్లినప్పుడు చూశాను. అప్పుడామె వయసు 8 ఏళ్లుంటాయనుకుంటాను. తనకు 15 ఏళ్లొచ్చాక నా పోస్టర్ తీసేసి రాహుల్ రాయ్ పోస్టర్ పెట్టుకుంది అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా, సల్మాన్ బాడీగార్డ్, క్యూంకీ, బజ్రంగీ భాయ్జాన్ వంటి చిత్రాల్లో నటించారు.ట్రిప్పుకెళ్తాంబాలీవుడ్ ట్రియో (ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ త్రయం) గురించి చెప్తూ.. ఆమిర్ ఖాన్, నేను, షారూఖ్.. ముగ్గురం కలిసి ఓ ట్రిప్కు వెళ్దామని ఆమిర్ అన్నాడు. ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాం అన్నాడు. ఇంతలో అర్చన పూరణ్ సింగ్ కలగజేసుకుంటూ ఎవరికీ తెలియని చోటంటూ భూమిపై ఏదీ లేదు. మీరు చందమామ పైకి వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. అందుకు హీరో నవ్వుతూ.. అవును, అది ట్రై చేయొచ్చు, కానీ ఎంతకాలం పడుతుందో చెప్పలేం అని సరదాగా అన్నాడు.చదవండి: ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా! -
ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా!
దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) సెట్లో తనను ఇబ్బంది పెట్టాడంటోంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా (Esha Gupta). సాజిద్ డైరెక్ట్ చేసిన హమ్షకల్ (2014) మూవీలో ఈషా హీరోయిన్గా నటించింది. ఆనాటి చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నన్నెవరైనా చులకనగా చూస్తే అస్సలు ఊరుకోను. అలాంటిది సాజిద్ నన్ను సెట్లోనే తిట్టేవాడు. నేనెందుకు ఊరుకుంటాను? తిరిగి ఇచ్చిపడేసేదాన్ని. కొంతమందికి ఆలోచన తక్కువ.. ఫ్రస్టేషన్ ఎక్కువుంటుంది. సారీ చెప్పడంతో వెళ్లా..ఈయన పదేపదే కోప్పడుతుండేవాడు. ఎంతవరకని భరిస్తాం? అప్పటికే సినిమాను కష్టపడి ప్రమోట్ చేశాం. అయినా కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. అందరిపైనా అరుస్తూ తన పరువు తనే తీసుకునేవాడు. ఓరోజు ఆయన వైఖరిపై కోపమొచ్చి నేరుగా కారెక్కి ఇంటికి వెళ్లిపోయాను. ఆ సినిమానే వదిలేయాలనుకున్నాను. కానీ నిర్మాత వాసు భగ్నానీ పిలిచి సారీ చెప్పడంతో వెళ్లాను. దర్శకుడు సాజిద్ కూడా క్షమాపణలు చెప్పాడు.. కానీ నా మనసులో మాత్రం ఆయన్ను క్షమించలేకపోయాను అని చెప్పుకొచ్చింది. సినీ జర్నీహమ్షకల్ మూవీలో సైఫ్ అలీ ఖాన్, రితేశ్ దేశ్ముఖ్, రామ్ కపూర్ హీరోలుగా నటించారు. తమన్నా భాటియా, బిపాషా బసు, ఈషా గుప్తా కథానాయికలుగా యాక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈషా గుప్తా సినీజర్నీ విషయానికి వస్తే.. 'జన్నత్ 2' (2012) చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వీడెవడు మూవీ చేసింది. వినయ విధేయ రామలో 'ఏక్ బార్ ఏక్ బార్..' అనే ఐటం సాంగ్లో యాక్ట్ చేసింది. చివరగా 'వన్ డే: జస్టిస్ డెలివర్డ్' మూవీలో డీసీపీ లక్ష్మీగా నటించింది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్లో కనిపిస్తోంది.చదవండి: హార్దిక్తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి -
హార్దిక్తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి
సినిమా, క్రికెట్ సెలబ్రిటీల బంధాల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అది నిజమైతే కొన్నిసార్లు అది పుకారుగానే మిగిలిపోతుంది. కొన్నిరోజుల క్రితం హార్దిక్ పాండ్య, నటి ఈషా గుప్తా డేటింగ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిపై సదరు నటి స్పందించింది. అసలేం జరిగిందో చెప్పి పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.'కొన్నినెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. మా మధ్య స్నేహం ఏర్పడింది. మేం డేటింగ్లో ఉన్నామని అనుకోవట్లేదు. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు.. డేటింగ్లోకి వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చని ముందే ఫిక్స్ అయ్యాం. కానీ రిలేషన్లోకి అడుగుపెట్టకుండానే విడిపోయాం. రెండు, మూడుసార్లు కలిసుంటాం. కానీ కొన్నినెలల పాటు మా రిలేషన్ కొనసాగింది. తర్వాత అది ముగిసిపోయింది' అని ఈషా గుప్తా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?)2012లో 'జన్నత్' అనే హిందీ సినిమాతో నటిగా ఈషా గుప్తా కెరీర్ ప్రారంభించింది. బేబీ, రుస్తుం, కమాండో 2 తదితర హిందీ చిత్రాల్లో నటించింది. వీడెవడు అనే తెలుగు మూవీలో హీరోయిన్గా చేసిన రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లో ఐటమ్ సాంగ్లోనూ ఈమె మెరిసింది. 2019 తర్వాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. అయితేనేం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది.హార్దిక్ పాండ్య విషయానికొస్తే.. టీమిండియా తరఫున ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే నటాషా స్టాంకోవిచ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అగస్త్య అని కొడుకు కూడా పుట్టాడు. కానీ కొన్నాళ్లకే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే హార్దిక్ సింగిల్గానే ఉంటున్నాడు.(ఇదీ చదవండి: మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?) -
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఏమైంది?
-
ఓటీటీకి అజయ్ దేవ్గణ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అజయ్ దేవ్గణ్ , రితేశ్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ రైడ్-2. గతంలో విడుదలైన రైడ్ మూవీకి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గత నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. థియేటర్ల వద్ద దాదాపు రూ. 157.88 కోట్ల నికర వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రైడ్-2 ట్రైలర్ను విడుదల చేసింది నెట్ఫ్లిక్స్. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించారు. రితేష్ దేశ్ముఖ్ ఎప్పుడూ చూడని పవర్ఫుల్ రోల్లో కనిపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో వాణి కపూర్, సౌరభ్ శుక్లా ప్రత్యేక పాత్రల్లో నటించారు.Aaj se ulti ginti shuru 🔥Amay Patnaik is back with a new case and the same old fire 👊 Watch Raid 2, out 26 June, on Netflix.#Raid2OnNetflix pic.twitter.com/f06uJB6feQ— Netflix India (@NetflixIndia) June 24, 2025 -
ఓటీటీలోకి వచ్చేసిన 'పంచాయత్' కొత్త సీజన్
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది కానీ లాక్ డౌన్ టైంలో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాంటి ఓ సిరీస్ 'పంచాయత్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్టైనింగ్గా ఈ సిరీస్కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. గత మూడు సీజన్లు చూసేసిన చాలామంది కొత్త సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సీజన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది.పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ. తొలి మూడు సీజన్లు వివిధ అంశాల ఆధారంగా తెరకెక్కించారు. నాలుగు సీజన్లో పంచాయతీలో జరిగే ఎన్నికల స్టోరీతో తీశారు. ఈసారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.(ఇదీ చదవండి: మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?) -
ప్రముఖ సింగర్కు అరుదైన గౌరవం.. ఆయన పేరిట ఏకంగా కోర్సు!
ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్కు అరుదైన ఘనత దక్కింది. ఆయన పేరుపై ఏకంగా కోర్సు ప్రారంభించనున్నట్లు కెనడాకు చెందిన యూనవర్సిటీ ప్రకటించింది. ఈ పంజాబ్ గాయకుడిపై ఏకంగా కోర్సును అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్న్ టు షైన్ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన ది క్రియేటివ్ స్కూల్లో వచ్చే ఏడాది నుంచి అతని పేరిట కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన సమ్మిట్లో ఈ విషయాన్ని ప్రకటించారు.కాగా.. పంజాబ్కు చెందిన దిల్జీత్ దోసాంజ్ ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గత ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో అభిమానులను అలరించారు. 'మూన్చైల్డ్ ఎరా', 'గోట్' లాంటి మ్యూజిక్ ఆల్బమ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. 'మూన్చైల్డ్ ఎరా' కెనడియన్ ఆల్బమ్ల జాబితాలో ఏకంగా 32వ స్థానానికి చేరుకుంది. ఒక భారతీయ కళాకారుడిగా అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆయనపై కోర్సు అందించడం అతని ప్రతిభకు నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.దిల్జీత్ దోసాంజ్ తన నటనా జీవితంలో అద్భుతంగా రాణించారు. 'జాట్ అండ్ జూలియట్', 'పంజాబ్ 1984', 'సజ్జన్ సింగ్ రంగ్రూట్' వంటి అనేక పంజాబీ సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. అలాగే 'ఉడ్తా పంజాబ్' లాంటి బాలీవుడ్ మూవీలోనూ కనిపించారు. గతేడాది 'చమ్కిలా' అనే చిత్రంలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 2023లో అతను తన 'దిల్-లుమినాటి' పర్యటనతో ఉత్తర అమెరికాలో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద పంజాబీ కచేరీలతో పేరు సంపాదించారు. -
'ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్లుంది' అమితాబ్ ఆన్సరిదే!
సమాజంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. సైబర్ క్రైమ్పై అవగాహన పెంచే కాలర్ ట్యూన్లను ఆ మధ్య తెగ ప్రసారం చేసింది. ఓటీపీలు షేర్ చేయొద్దు, లింక్స్ క్లిక్ చేయొద్దు.. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త! అంటూ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తోనూ చెప్పించింది. రోజుకు 8- 10 సార్లు ఈ కాలర్ ట్యూన్లు వినిపించేవి.పిచ్చి పట్టినట్లుందిదాని గురించి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో నసుగుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన బిగ్బీ.. అయితే వెళ్లి ప్రభుత్వానికి చెప్పండి. నేను వారు చెప్పిందే చేశాను అని రిప్లై ఇచ్చారు. ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్లుంది అన్న కామెంట్కు.. ఏదో ఒక రోజు నువ్వు కూడా ముసలాడివి అవుతావు. వయసు పెరిగినవారికి కొండంత అనుభవం, జ్ఞానం ఉంటుందని అంటుంటారు, తెలీదా? అని కౌంటర్ ఇచ్చారు. కాగా అమితాబ్ బచ్చన్ గతేడాది కల్కి 2898 ఏడీ, వేట్టయాన్ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామాయణ: పార్ట్1 సహా మరో చిత్రంలో నటిస్తున్నారు.చదవండి: థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం -
ఫేక్ కలెక్షన్స్నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు: సన్నీ డియోల్
ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీలో నటిస్తున్నారు. అంతేకాకుండా నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలోనూ కనిపించనున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూకు హాజరైన సన్నీ డియోల్ మూవీ కలెక్షన్స్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానులు ఫేక్ కలెక్షన్స్ను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు ఎలాంటివారో తనకు అర్థం కావడం లేదన్నారు. నకిలీ బాక్సాఫీస్ నంబర్స్ చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. సినీ పరిశ్రమ ప్రమాణాల కంటే కేవలం హైప్పైనే ఆధారపడడంపై సన్నీ డియోల్ తప్పుబట్టారు.సన్నీ డియోల్ మాట్లాడుతూ.. 'ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అభిమానులు వాస్తవికతను నమ్మడానికి ఇష్టపడరు. బాక్సాఫీస్ సంఖ్యలను పెంచి కానీ వాస్తవానికి భిన్నంగా చూపిస్తారు. టిక్కెట్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం.. నకిలీ బాక్సాఫీస్ సంఖ్యలు చూపించడం సరైంది కాదు. అది అలా ఉండకూడదు. మిమ్మల్ని మీరు హిట్ చేసుకోవడానికి ఇది మార్గం కాదు. అందువల్లే చాలా మంది యువకుల కథలు బయటకు రావడం లేదు. ప్రజలు కూడా మంచి కథకు విలువ ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో కథ ప్రభావం కంటే ఫేక్ కలెక్షన్స్ ద్వారా విజయం డిసైడ్ చేస్తున్నారు' అని అన్నారు.సన్నీ డియోల్ చివరిసారిగా 'జాట్' చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ ద్వారానే గోపీచంద్ మలినేని హిందీలో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో రెజీనా , రణదీప్ హుడా, సయామి ఖేర్, రమ్య కృష్ణన్ కూడా నటించారు. -
త్రిప్తి డిమ్రి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెలాగే హెయిర్కట్..
‘ఆ ఛాన్స్ నాకు ఎక్కడ దక్కుతుంది?’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన త్రిప్తికి.. కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చుట్టూ తిరిగి చివరకు ఆమెనే వరించింది. దీపికా పదుకొణే ప్లేస్ని భర్తీ చేసిన త్రిప్తి తాజా జర్నీ ఆసక్తికరమే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా!టాలీవుడ్లోనూ గుర్తింపుబాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో నటించి టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. త్రిప్తి.. దీపికా పదుకొణెకు పెద్ద అభిమాని. చిన్నతనంలో ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమాలో దీపికా లుక్ చూసి, అదే స్టయిల్లో హెయిర్ కట్ చేసుకుందట!మందు జోలికి వెళ్లనుమొన్నటి వరకు టీ ఎక్కువగా తాగే త్రిప్తి, ఇప్పుడు కాఫీ మీద మక్కువ పెంచుకుందట. టీ, కాఫీ తప్ప... ఇప్పటివరకు ఎప్పుడూ ఆల్కహాల్ టేస్ట్ చేయలేదని, భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండియన్ సినిమాల్లో న్యూడ్గా నటించేందుకు ధైర్యం చేసిన అరుదైన నటీమణుల్లో త్రిప్తి ఒకరు. ‘యానిమల్’లో బోల్డ్ సీన్లు చేసిన తర్వాత స్టార్ అయింది. అయితే ఆ సీన్లు చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని ఒప్పుకుంది. అయినా కెరీర్ కోసం ఇలాంటి సాహసాలు అవసరమే అంటోంది.యానిమల్ మూవీతో దశ తిరిగిందిత్రిప్తి 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ‘లైలా మజ్ను’, ‘బుల్ బుల్’ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ రాలేదు. చిన్నప్పటి నుంచే టాప్ హీరోయిన్ కావాలని కలలు కన్న త్రిప్తి, అవి నెరవేరక మొదట్లో చాలా డిజప్పాయింట్ అయిందట! సరిగ్గా అలాంటి సమయంలో ‘యానిమల్’ ఛాన్స్ రావడంతో వదులుకోలేకపోయింది. ఆ సినిమా ఆమె కెరీర్ను ఊహించని ఎత్తులకు చేర్చింది. రష్మిక మందన్నా కన్నా త్రిప్తికి ‘ఛోటా భాభీ’గా ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలుఆ తర్వాత కూడా బోల్డ్ కథలే త్రిప్తిని వెతుక్కుంటూ వచ్చాయి. ‘బ్యాడ్ న్యూస్’ చిత్రంలో ఇద్దరు బాయ్ఫ్రెండ్స్లో ఎవరి వల్ల గర్భం దాల్చిందో తెలియని యువతి పాత్రలో నటించింది. అలాగే, ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో’ అనే సినిమా హాలీవుడ్ సెక్స్ టేప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. కొత్తగా పెళ్లైన జంట తమ మొదటి రాత్రిని షూట్ చేయడం, ఆ వీడియో లీక్ కావడం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది.విమర్శలుత్రిప్తి నటనపై, డ్యాన్స్పై కొన్ని విమర్శలు వచ్చినా.. గ్లామర్, టాలెంట్, సక్సెస్ వల్ల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ‘యానిమల్’లో న్యూడ్ సీన్ తీసే సమయంలో డైరెక్టర్, హీరో ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపింది. ఆ సీన్ను చాలా అందంగా చూపించారని, ఏ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినా షూటింగ్ ఆపేస్తామని మాట ఇచ్చిన తర్వాతే షూట్ చేశారని చెప్పింది త్రిప్తి.స్పిరిట్లో నేనా?ఒకసారి ఓ జర్నలిస్టు త్రిప్తిని ‘స్పిరిట్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుందా?’ అని అడిగినప్పుడు ‘ఒక్క శాతం కూడా అవకాశం లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్లోకి ఎలా వస్తాను?’ అని ఆశ్చర్యంగా అంది. పైగా సందీప్ రెడ్డి వంగా తనకే మళ్లీ ఛాన్స్ ఇస్తాడా? అంటూ ఎదురు ప్రశ్నించింది. కానీ, విధి, సినిమా రంగం రెండూ మాయామయం! చివరకు దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది.చదవండి: షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్? -
షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్?
బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) విమర్శలపాలైంది. యోగా ఈవెంట్కు వెళ్లి ఆమె చేసిన పనికి అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే.. శనివారం నాడు ముంబైలో జరిగిన యోగా ఉత్సవాల్లో నుష్రత్ పాల్గొంది. తెలుపు దుస్తుల్లో అక్కడికి హాజరైన ఆమెకు సొంతంగా షూలు విడిచేందుకు కూడా కష్టమైంది. అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్ కాలు పట్టుకుని ఆమె షూ లేస్ తీసింది.. ఇంతలో నుష్రత్.. మరో కాలి షూ కూడా తీసేయమని వేలు పెట్టి చూపించింది. దీంతో ఆమె మరో కాలి షూ కూడా తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అది కూడా చేతకాదా?'నీ చేతులతో నువ్వు షూ లేస్ తీసేసి పక్కన విడిచిపెట్టలేవా?', 'నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేస్తున్నావా?', 'నువ్వింకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? డబ్బు, పాపులారిటీ చూశాక గర్వం తలకెక్కినట్లుంది' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నుష్రత్.. చివరగా చోరీ 2 సినిమాలో కనిపించింది. విశాల్ ఫ్యురియా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె తెలుగులో శివాజీ తాజ్మహల్ (2010) మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు -
కుబేర విలన్.. ఇతని గురించి తెలుసా..?
-
నా కూతురి జోలికొస్తే.. కాజోల్ మాస్ వార్నింగ్..!
-
రెండోసారి ప్రెగ్నెంట్? వీడియోతో క్లారిటీ వచ్చినట్లే!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) మరోసారి గర్భం దాల్చిందని కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు ఆలియా హాజరైనప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. పైగా జిమ్కు వెళ్లినప్పుడు కూడా కెమెరాలు కనిపించగానే ఎవరినీ పలకరించకుండా హడావుడిగా వెళ్లి కారులో కూర్చునేది. దీంతో నిజంగానే ఆలియా ప్రెగ్నెంట్ అయిందేమోనన్న అనుమానాలు వెలువత్తాయి. డ్యాన్స్ రిహార్సల్స్..కానీ, హీరోయిన్ లేటెస్ట్ వీడియోతో ఇవన్నీ వుట్టి పుకార్లేనని తేలిపోయాయి. ఆల్ఫా సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేసిన ఆలియా తాపీగా వెళ్లి కారెక్కింది. మధ్యలో అక్కడున్నవారిని కూడా పలకరించింది. పైగా తనకు పొట్ట కూడా లేకపోవడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. రాహా మూడో బర్త్డే..ఆలియా భట్ - రణ్బీర్ కపూర్ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది కూతురు రాహా జన్మించింది. ఈ ఏడాది రాహా మూడో బర్త్డే సెలబ్రేట్ చేసుకోనుంది. సినిమాల విషయానికి వస్తే ఆలియా ప్రస్తుతం 'ఆల్ఫా' మూవీ చేస్తోంది. 'ముంజ్య' హీరోయిన్ శార్వరితో కలిసి నటిస్తున్న ఈ మూవీ క్రిస్మస్కు విడుదల కానుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
ఇదెక్కడి ఆచారం రా నాయనా?.. హీరోకు ఏకంగా గిన్నె ఇచ్చారట!
బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా ఇటీవలే జాట్ మూవీలో కనిపించారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతోంది. అయితే బాలీవుడ్లో పలు సినిమాల్లో మెప్పించిన రణ్దీప్ హుడా రెండేళ్ల క్రితం తన ప్రియురాలు లిన్ లైస్రామ్ను పెళ్లాడారు. 2023లో మణిపూర్కు చెందిన లిన్ లైస్రామ్ను సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.తాజాగా ఆ పెళ్లి వేడుకలో తనకెదురైన విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. మణిపూరి సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో తనకు మూత్ర విసర్జన కోసం గిన్నె ఇచ్చారని రణదీప్ హుడా గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా ఈ పెళ్లి తంతు తనకు అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని తలపించేలా చేసిందని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఆ సంఘటనను రణ్దీప్ హుడా వివరిస్తూ..' పెళ్లిలో నాతో పాటు ఒక సహాయకుడు ఉన్నాడు. ఒక ట్యూటర్ లాగా. నేను నా వస్తువులను తలపై పెట్టుకున్న తర్వాత ఇక తలను వంచడం సాధ్యం కాదు. అప్పుడే నాకు ఒక గిన్నె, గొడుగు ఇచ్చారు. అప్పుడు మనల్ని ఓ ప్రదేశంలో ఉంచుతారు. అక్కడికి అందరూ వచ్చి మనల్ని చూడాలి. ఆ సమయంలో మనం చాలా గౌరవంగా కనిపించాలి. అయితే నేను గిన్నె దేనికోసం అని వారిని అడిగాను. మీరు మూత్ర విసర్జన చేయవలసి వస్తే.. మీకిచ్చిన ఆ గొడుగు తెరిచి అక్కనే మూత్ర విసర్జన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవుడు కాబట్టి అక్కడి నుంచి కదల్లేరన్నాడు. వాళ్ల సంస్కృతి చాలా కఠినమైనది. అలాగే చాలా సిస్టమాటిక్ కూడా " అని తనకెదురైన విచిత్ర అనుభవాన్ని వివరించారు.తన పెళ్లి గురించి మాట్లాడుతూ. 'నా పెళ్లి సమయంలో మణిపూర్లో ఒక పెద్ద సమస్య తలెత్తింది. కానీ మేమిద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఒక అమ్మాయి ఇంట్లో వివాహం చేసుకోకపోతే అది కూడా వివాహమేనా అని అక్కడే వివాహం చేసుకుంటానని తాను దృఢంగా చెప్పాను. ఈ పెళ్లి విషయంలో తనకు అస్సాం రైఫిల్స్లో బ్రిగేడియర్గా ఉన్న తన స్నేహితుడు సాయం చేశాడు. మీరు రండి పెళ్లి నేను జరిపిస్తాను అన్నాడు. దీంతో మేము దాదాపు 10 నుంచి 12 మంది అక్కడికి చేరుకున్నాం.' అని తెలిపారు. అయితే మేము లిన్ లైస్రామ్ ఇంటికి చేరుకున్నప్పుడు మంచి శాఖాహారం తిన్నారని.. వివాహం చేసుకునే ముందు వారి దేవుళ్లందరినీ పూజించారని గుర్తు చేసుకున్నాడు. అలాగే నా స్నేహితులు కూడా వివాహానికి తీసుకొచ్చావా? పవిత్ర తీర్థయాత్రకు తీసుకువచ్చావా? అంటూ తనతో జోక్ చేశారని రణ్దీప్ హుడా వెల్లడించారు. -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
ఇండియన్ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్-10 చిత్రాలేవో చూసేయండి.ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్ దంగల్ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్తో సమానంగా సౌత్ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.ప్రపంచవ్యాప్తంగా దంగల్ ఎక్కువ వసూళ్లు సాధించినప్పటికీ భారత్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది మాత్రం బాహుబలి 2 మూవీయే! 2017లో బాహుబలి 2: ది కన్క్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.బాహుబలి-2 కంటే కేవలం రూ. 46 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్-2 మూవీతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు -
చీప్గా చూశారు, దెబ్బకు తిరిగి వెళ్లిపోతాననుకున్నారు: నటి
సినీ నటిగా, యాంకర్గా మందిరా బేడీ (Mandira Bedi) అందరికీ సుపరిచితురాలు. క్రికెట్ ఈవెంట్స్కు కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఆ సమయంలో ఎవరూ తనను లెక్క చేయలేదని, చులకనగా చూశారంటోంది నటి. జూమ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మందిరా బేడీ మాట్లాడుతూ.. ఏదైనా డిఫరెంట్గా చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ మనల్నే పరిశీలిస్తుంటారు. ఏదో ఒకటి అనేందుకు సిద్ధంగా ఉంటారు. అది వారి అభిప్రాయం అనుకోండి.మొదటివారమే డిజాస్టర్కొందరు మనల్ని ఇష్టపడతారు. మరికొందరేమో ద్వేషిస్తారు. అయితే నాకు టీమ్ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది. అలా మొదటిసారి ఒక టోర్నమెంట్లో హోస్టింగ్ చేశాను. కానీ మొదటివారమే డిజాస్టర్ అయింది. మా టీమ్ నన్ను పిలిచి నీమీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. నువ్వేం భయపడకు. వెయ్యిమంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశాకే నిన్ను తీసుకున్నాం. నీలో ఆ సత్తా ఉంది అని ప్రోత్సహించారు.మైండ్సెట్ మార్చా..ఆ మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత మంచి అవకాశం ఎవరికి దక్కుతుంది? భయపడి వెనకడుగు వేయడం దేనికి? అని ఆలోచించాను. ఉత్సాహంగా ముందుకు సాగాను. నెమ్మదిగా ప్యానెల్లో, ప్రేక్షకుల్లో నాపై ఉన్న అభిప్రాయాలు మారాయి. చాలామంది మైండ్సెట్ను నేను మార్చగలిగాను. నిజానికి ప్యానెల్లో ఉన్న వారికి నేనుండటమే ఇష్టం లేదు. నాకు కాస్తైనా మర్యాద ఇచ్చేవారు కాదు. చీప్గా చూసేవారు, పక్కన పడేసేవారు. డమ్మీ అని తిట్టారుమొదట్లో బాధపడ్డాను. కానీ నేనెందుకు తలదించుకోవాలనుకున్నాను. వాళ్లు వినిపించుకోకపోయినా ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు అడిగేదాన్ని. కెమెరాలున్నాయి కాబట్టి వాళ్లు చచ్చినట్లు సమాధానం చెప్పేవాళ్లు. ఈమె తిరిగి వెళ్లిపోయేలా లేదని వాళ్లకర్థమైంది. చివరకు నన్ను ప్యానెల్లో మెంబర్గా స్వీకరించారు. సోషల్ మీడియాలో కూడా నేనో తెలివితక్కువదాన్ని, డమ్మీ అని తిట్టేవారు. నేనేదీ లెక్కచేయలేదు.యాంకర్గా, నటిగా..ఇక సౌతాఫ్రికా టోర్నమెంట్ నుంచి తిరిగి రాగానే నా ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. జనాలు నా గురించి తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. అలా రోజుకు నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చాను అని చెప్పుకొచ్చింది. పలు హిందీ సీరియల్స్లో యాక్ట్ చేసిన మందిరా.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (2003, 2007), ఛాంపియన్స్ ట్రోఫీ (2004, 2006)లకు హోస్టింగ్ చేసింది. మన్మథుడు, సాహో వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. చివరగా ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంలో నటించింది.చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
నా జోలికొస్తే ఊరుకుంటానేమో కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం అంతు చూస్తానంటోంది హీరోయిన్ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె మా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్.. తన కూతురిని ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. నా కూతుర్ని విమర్శించేవాళ్లెవరూ నా కారు ముందుకు రావొద్దు. నా కారు ముందుకొచ్చారంటే..ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది.హారర్ సినిమాహారర్ సినిమాలను మ్యూట్లో పెట్టుకునే చూసే కాజోల్.. తొలిసారి ఈ జానర్లో నటిస్తోంది. విశాల్ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్గుప్తా, కెరిన్ శర్మ, నితిన్, సూర్జ్యశిఖ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్.. 1999లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు.చదవండి: ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా? -
ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా?
బాలీవుడ్ నటుడు, కమెడియన్ విర్ దాస్ (Vir Das) చిక్కుల్లో పడ్డాడు. ఎయిరిండియాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది మరణించారు. అంతమంది చావుకు కారణమైన ఎయిరిండియాను పొగుడుతూ తాజాగా అతడు ఓ ట్వీట్ వేశాడు.పీఆర్ స్టంట్?నేను లండన్ నుంచి ఇంటికి ఎయిరిండియా (Air India) విమానంలోనే వచ్చాను. నాకెంతో గొప్పగా అనిపించింది. సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. వారిది ఎంతో మంచి మనసు అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఫ్రీ టికెట్ ఇచ్చారా?, ఈ చెత్త పీఆర్ స్టంట్ చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే.. ఇలాంటి సమయంలో ఈ ట్వీట్లు వేయడం బాధాకరం. మీ స్థాయిని మీరే తగ్గించేసుకుంటున్నారు అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మా తాత..దాంతో విర్ దాస్.. తనది పీఆర్ స్టంట్ కాదని వివరణ ఇచ్చాడు. ఎయిరిండియాకు నేనెందుకు సపోర్ట్ చేస్తున్నానో మీకు చెప్తాను.. మా తాత ఎయిరిండియాలోనే పని చేసేవాడు. ఆ సంస్థ విమానాల్లోనే నేను నలుమూలలా ప్రయాణించాను. ఆ విమానాల్లో నేను కూర్చోని సీటు అంటూ లేదు. అయితే, ఈ ఎయిరిండియాలో కొన్ని సమస్యలున్నాయి. కానీ, ఏ సిబ్బంది కూడా మిమ్మల్ని చులకనగా చూడరు. నవ్వుతూ ఆహ్వానిస్తారు. వారిని కూడా ఈ విమాన ప్రమాదంలో మనం కోల్పోయాం. ఈ నష్టాన్నెందుకు ఎవరూ గుర్తించడం లేదు. నేను మాత్రం వారికి మద్దతిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు. అనంతరం ఈ ట్వీట్ను డిలీట్ చేశాడు.అప్పుడు కూడా ఇంతే!జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పుడు కూడా విర్ దాస్ ఎయిరిండియాకు సపోర్ట్ ఇచ్చాడు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన రోజు ఇది! వారి కుటుంబాలకు ఇదే నా ప్రగాఢ సానుభూతి. విమాన సిబ్బందికి కూడా నా సపోర్ట్ తెలియజేస్తున్నాను. నా జీవితం మొత్తం ఎయిరిండియాలోనే తిరిగాను. ఇక్కడ సమస్యలు లేవని కాదు, కానీ, ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఎయిరిండియాలో పనిచేసే సిబ్బంది బెస్ట్ క్రూ అని మాత్రం బాగా తెలుసు. అసలు ఈ విషాదం ఎలా జరిగిందనేది సమయమే నిర్ధారిస్తుంది. పని చేస్తున్న ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోవడం ఎంత బాధాకరమో ఊహకు అందకుండా ఉంది అని ట్వీట్ చేశాడు. I flew Air India home from London. It was all great. The crew, happy to report, still the kindest in the sky. @airindia— Vir Das (@thevirdas) June 20, 2025 చదవండి: కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా? -
ఆమిర్ కొత్త సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
రీసెంట్ టైంలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2018లో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'తో వస్తే దారుణమైన డిజాస్టర్. 2022లో 'లాల్ సింగ్ చద్దా'తో వస్తే అదే సీన్ రిపీట్. దీంతో విపరీతమైన ట్రోలింగ్. కట్ చేస్తే యాక్టింగ్ కొన్నాళ్ల పాటు చేయనని చెప్పిన ఆమిర్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సితారే జమీన్ పర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తొలిరోజు ఎంత కలెక్షన్ వచ్చాయంటే?స్పానిష్ మూవీ 'ఛాంపియన్స్'కి రీమేక్గా 'సితారే జమీన్ పర్' సినిమా తీశారు. రిలీజ్కి ముందే ఆమిర్ ఖాన్ ప్రమోషన్లలో కాస్త హడావుడి చేశాడు గానీ బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.11.5 కోట్ల మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన హిందీ చిత్రాల్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన 6వ చిత్రంగా నిలిచింది. అయితే ఆమిర్ స్టార్డమ్కి ఈ కలెక్షన్ చాలా తక్కువనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో తీస్తున్న సినిమాలే తొలిరోజు రూ.10-20 కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. అలాంటిది ఆమిర్ ఖాన్ సినిమాకు తొలిరోజు దాదాపు రూ.11 కోట్లు మేర వసూళ్లు రావడం అంటే ఆలోచించాల్సిన విషయం. అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్స్లో ఈ నంబర్స్ పెరగొచ్చేమో చూడాలి? ఈ సినిమాని ఏ ఓటీటీకి అమ్మని ఆమిర్.. 8 వారాల తర్వాత యూట్యూబ్లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్కి అసిస్టెంట్ కోచ్గా గుల్షన్ అరోరా(ఆమిర్ ఖాన్) పనిచేస్తుంటాడు. హెచ్ కోచ్తో గొడవ జరిగి అతడిని కొడతాడు. ఆ కోపంలో తాగి బండి నడిపి పోలీస్ వాహనాన్ని గుద్దేస్తాడు. దీంతో కోర్ట్.. శిక్ష విధించకుండా మానసిక దివ్యాంగులకు మూడు నెలల పాటు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అలా 10 మంది దివ్యాంగులకు కోచ్గా మారతాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో గుల్షన్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్లో 'సితారే' టీమ్ గెలిచిందా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
నెలకు ఆరున్నర లక్షలా?.. ఖరీదైన ఫ్లాట్ తీసుకున్న స్టార్ హీరో భార్య!
ఈ రోజుల్లో నెలకు లక్ష రూపాయలు అద్దెకు ఇల్లు తీసుకోవడం అంటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. కానీ సినీతారల విషయానికొస్తే ఈ లెక్క మారుతుంది. వారు మినిమం లక్షకు పైగానే రెంట్ ఉంటుంది. ఇక పెద్ద పెద్ద స్టార్స్ అయితే రెండు, మూడు లక్షల పైమాటే. అయితే తాజాగా స్టార్ హీరో ఆర్ మాధవన్ భార్య సరిత ఏకంగా ఆరున్నర లక్షలకు ఓ అపార్ట్మెంట్ను లీజ్కు తీసుకుంది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో నెలకు దాదాపు రూ.6.50 లక్షలు చెల్లించేలా ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ముంబయిలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. ఈ ఏరియాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాసమున్నారు.ఇక మాధవన్ సినిమాల విషయానికొస్తే మా అనే చిత్రంలో నటించారు. కాజోల్ లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రలో కనిపిస్తాడు. దీంతో పాటు ఫాతిమా సనా షేక్ జంటగా ఆప్ జైసా కోయి అనే సినిమాలో కూడా నటించారు. ఈ రొమాంటిక్ సినిమా జూలై 2025లో నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. మాధవన్ చివరిసారిగా అక్షయ్ కుమార్, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం కేసరి చాప్టర్-2లో కనిపించాడు.అంతే కాకుండా ఈ ఏడాది ప్రారంభంలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన హిసాబ్ బరాబర్ విడుదలైంది . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో ప్రసారమవుతోంది. View this post on Instagram A post shared by Sarita Birje Madhavan (@msaru15) -
స్టార్ హీరో కుమారుడిని గుర్తు పట్టలేదా?.. ఇజ్జత్ మొత్తం పాయే!
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను చూసేందుకు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ షోకు హాజరయ్యారు. అయితే ఈ మూవీ వీక్షించేందుకు అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా వచ్చాడు. థియేటర్ వద్ద అదే సమయంలో సల్మాన్ ఖాన్ దగ్గరికి వచ్చేందుకు జునైద్ ఖాన్ యత్నించాడు. అయితే అతన్ని గుర్తుపట్టని బాడీగార్డ్స్ ఒక్కసారిగా పక్కకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టార్ హీరో కుమారుడిని కూడా గుర్తు పట్టలేరా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు గతంలో విక్కీ కౌశల్తో ఇలాంటి సంఘటన జరిగిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. 2023 ఐఫా అవార్డుల సమయంలో విక్కీ కౌశల్.. సల్మాన్ ఖాన్ను పలకరించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతని గార్డులు వెంటనే విక్కీ కౌశల్ను పక్కకు నెట్టారు.మరోవైపు అమిర్ ఖాన్- రీనా దత్తాల కుమారుడైన జునైద్ ఖాన్ 2024లో మహారాజ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏక్ దిన్ అనే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరం చివరి నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏడాది ఖుషీ కపూర్తో కలిసి నటించిన లవ్యాపా చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత జునైద్ ఖాన్ను దారుణంగా ట్రోల్ చేశారు. #SalmanKhan security 🤣 #JunaidKhan pic.twitter.com/cWXbxgxVaw— $@M (@SAMTHEBESTEST_) June 20, 2025 -
'చాహల్ వల్లే నీకు కెరీర్'.. ఆర్జే మహ్వశ్ రిప్లై చూశారా?
బాలీవుడ్లో ప్రముఖ ఆర్జే మహ్వశ్ (RJ Mahvash) గత కొంతకాలంగా తెగ వైరలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరు మార్మోగిపోయింది. దానికి కారణం దుబాయ్లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఆమెపేరు ఒక్కసారిగా నెట్టింట హల్చల్ చేసింది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్టేడియంలో కనిపించడంతో ఆర్జే పేరు వైరలైపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీమ్కు మద్దతుగా మహ్వశ్ మ్యాచుల్లో సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కోడై కూసింది. తనపై వస్తున్న రూమర్స్పై కూడా ఆమె స్పందించింది.తాజాగా ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అందులో నెటిజన్స్ చేసిన కామెంట్స్ను ప్రస్తావించింది. వాటికి వివరణ ఇస్తూ ఓ వీడియోను పంచుకుంది. 'యూజీ భాయ్నే ఇస్కా కెరీర్ బనా దియా'(యుజ్వేంద్ర చాహల్ ఆమె కెరీర్ను నిలబెట్టాడు) అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్స్కు తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది.నేను 2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. 2023లో సొంతగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించానని ఆర్జే మహ్వశ్ తెలిపింది. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా సెక్షన్-108 మూవీని నిర్మించినట్లు పేర్కొంది. అంతేకాకుండా మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అయినట్లు కూడా వెల్లడించింది. ఆ తర్వాత మీకు క్రికెట్ గురించి ఏమైనా తెలుసా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీరు పుట్టకుముందు నుంచే తాను క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నానని కుల్దీప్ యాదవ్, ధోని, బ్రెట్ లీ, సురేశ్ రైనా, క్రిస్గేల్, అక్తర్, జాక్వస్ కలిస్తో దిగిన ఫోటోలను కూడా వీడియో చూపించింది. మీరు ఏదైనా మాట్లాడేముందు తన గురించి తెలుసుకోవాలని హితవు పలికింది. అంతేకానీ ఎవరో పంపిన వాటిని ఫార్వార్డ్ చేయకండి అంటూ మహ్వశ్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఈ లెక్కన ఆర్జే మహ్వశ్.. యుజ్వేంద్ర చాహల్ పరిచయానికి ముందే క్రికెట్తో అనుబంధం ఉందన్నమాట. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
జెన్ Z అంటే ఇదేనా? ఆశిష్ను అగౌరవపరుస్తావా? నటుడి ఆగ్రహం
గుడుంబా శంకర్, పోకిరి, అన్నవరం వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi). తెలుగుతో పాటు తమిళ, మలయాళ, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక చిత్రాలు చేశాడు. ప్రస్తుతం ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో నటి అపూర్వ ముఖిజ .. ఆశిష్కు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడింది. ఆశిష్.. అని ఏకవచనంతో సంభోదించింది. నీ తీరు బాగోలేదుఅంత సీనియర్ను పేరు పెట్టి పిలవడమేంటని నటుడు సుధాన్షు పాండే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ద రెబల్ కిడ్ అపూర్వ (Apoorva Mukhija)కు ఉన్న వివాదాలు సరిపోవడం లేదా? తను చెడ్డదని చెప్పడం లేదు. ఆమె మంచి అమ్మాయే! తనకు మంచి మనసుంది. కానీ నీ మాటతీరు మాత్రం అస్సలు బాగోలేదు. అదే నీకు చెడుగా మారుతుంది. నీకంటే సీనియర్ల గురించి ఎలా మాట్లాడాలనేది తెలియకపోతే మొత్తం వ్యవహారమే తలకిందులవుతుంది జాగ్రత్త!చెత్త మాటలుఆశిష్ విద్యార్థి.. నీకే కాదు నాక్కూడా సీనియర్. నా వెనక నిల్చున్నప్పుడు ఆశిష్ వెళ్లిపోతే బాగుంటుంది అని మాట్లాడావు. ఆయన నీ చిన్ననాటి స్నేహితుడా? నీ తల్లిదండ్రుల కంటే పెద్దవాళ్లైన సీనియర్ల గురించి ఇలాగేనా మాట్లాడేది? దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? జెన్ Zకు ఇదంతా కూల్గా అనిపిస్తోంది. కానీ ఇదస్సలు లైట్ తీసుకునే విషయం కాదు. ఇవన్నీ చెత్త మాటలు అంటాను. ఈ ధోరణి మన సమాజానికి ఒక శాపం అని చెప్పుకొచ్చాడు. అపూర్వ.. నడానియన్ సినిమాలో నటించింది. అలాగే కొన్ని సిరీస్లు కూడా చేసింది. సుధాన్షు.. తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో అనేక చిత్రాలు చేశాడు. తెలుగులో మన్మథుడు 2లోనూ యాక్ట్ చేశాడు. హీరోయిన్ మాజీ ప్రియుడిగా నటించాడు.చదవండి: అమ్మా.. అంటూ తిరుపతిలో భిక్షమెత్తా: హీరో ధనుష్ -
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
సెలబ్రిటీలు ఏం మాట్లాడాలన్నా, ఎలాంటి పోస్టులు వేయాలన్నా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం. గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) ఇప్పుడలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయిన సంగతి తెలిసిందే! మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన అతడి పేరు విశ్వాస్ కుమార్ రమేశ్. చిన్నపాటి గాయాలతో సంఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు.అతడు చెప్పేది అబద్ధంఅతడి గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. విశ్వాస్ అబద్ధం చెప్తున్నాడని కొందరు పుకార్లు సృష్టించారు. అది నిజమని నమ్మిన సుచిత్రా కృష్ణమూర్తి ఆ రూమర్స్ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రమేశ్ అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అదేగనక నిజమైతే అతడికి కఠిన శిక్ష విధించాలి. లేదంటే పిచ్చి ఆస్పత్రిలో వేయాలి అని ట్వీట్ చేసింది.ట్వీట్ డిలీట్ఇది చూసిన నెటిజన్లు అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నావని విమర్శించారు. ఆయన విమాన ప్రమాదంలోని బాధితుడే అని అహ్మదాబాద్లోని ఆస్పత్రి అధికారులే ధృవీకరించాక ఇంకేంటి సమస్య? అని ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న సుచిత్ర.. వెంటనే సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా దాన్ని పోస్ట్ చేసినందుకు సారీ అని ట్వీట్ చేసింది.నటిగా..గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్లోనూ నటించింది. 1999లో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు శేఖర్కపూర్ను వివాహమాడింది. వీరికి కావేరీ అనే కూతురు జన్మించింది. 2007లో సుచిత్రా- శేఖర్ విడాకులు తీసుకున్నారు. Took out my last tweet on the air india crash survivor. Seems to be false news circulated for God knows what reason. My apologies— Suchitra Krishnamoorthi (@suchitrak) June 19, 2025 చదవండి: ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా! -
ఫిట్ అండ్ హెల్దీ : ‘యోగా సే హోగా’ అంటున్న సెలబ్రిటీలు (ఫొటోలు)
-
అత్యంత భయంకరమైన ప్రదేశం, రామోజీ ఫిల్మ్ సిటీ - కాజోల్
-
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్ అన్న పేరుతో ఉన్న ట్వీట్ కావడంతో ఇది కచ్చితంగా సింగర్ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్ (Sonu Nigam) ట్వీట్ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్ సోనూ నిగమ్ కాదు, బిహార్కు చెందిన లాయర్ సోనూ నిగమ్. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్కు బ్లూ టిక్ ఉండటంతో ఆ ట్వీట్ చేసి సింగర్ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్ సోషల్ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు -
సౌత్లో బాడీ షేమింగ్.. ఇండస్ట్రీ నుంచే వెలేశారు: హీరోయిన్
వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు (Banita Sandhu) ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి రీమేక్).. హిందీలో అక్టోబర్, సర్దార్ ఉద్ధమ్, మదర్ థెరిస్సా అండ్ మి చిత్రాలు చేసింది. హాలీవుడ్లో సినిమాతో పాటు వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 చిత్రం చేస్తోంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్ షెర్డిల్ మూవీ జీ5లో శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుంది.నిద్ర లేకుండా షూటింగ్ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బనితా సంధు మాట్లాడుతూ.. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతోంది. కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఊహించినదానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటలు పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్లు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను.. నాకోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. బ్లాక్లిస్ట్.. లెక్కచేయనుఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్లిస్ట్లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా (ఆదిత్య వర్మ) చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటిదానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
నేరుగా ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాళిధర్ లపతా'. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. ఈ మూవీని జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై విడుదలకు సిద్ధమైంది.అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు అభిషేక్ బచ్చన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు కాళిధర్ లపతా పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రం జూలై 4న జీ5లో ప్రీమియర్ అవుతుందని తెలిపారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్ పోషించగా.. దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను ఓటీటీలోనే చూసేయండి.తన కుటుంబం తనను వదిలించుకోవాలని చూస్తున్న విషయం తెలుసుకున్న ఓ వృద్ధుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుటుంబానికి దూరంగా పారిపోవడానికి ఆ వృద్ధుడు యత్నిస్తాడు. అతనికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లుతో ఊహించని పరిచయం.. జీవితాన్ని మార్చే సంఘటనకు దారితీస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్రంలో చూపించారు. కాగా.. అభిషేక్ బచ్చన్ చివరిసారిగా 'హౌస్ఫుల్ 5'చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. चर्चाओं पर अब फुल स्टॉप! Sometimes, getting lost isn’t a detour, it’s where the real story begins.Full of dreams, twists, and the people who make it worth it. 😊#KaalidharLaapata premieres 4th July, only on #ZEE5.#KaalidharLaapataOnZEE5@Mdzeeshanayyub #DaivikBaghela… pic.twitter.com/0BDqAumEUR— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) June 19, 2025 -
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan) నటించిన కొత్త సినిమా హౌస్ఫుల్ 5 కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను పొందుతోంది. ఇంతలో, ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశానంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సమస్యల వల్ల ఆయన ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ నెటిజన్లు సందేహిస్తున్నారు. కొంతకాలంగా నటి ఐశ్వర్యరాయ్( Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన చేసిన పోస్ట్ మరింత బలాన్ని ఇచ్చేలా ఉంది.అభిషేక్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రోజువారీ జీవితంలో ఎదురయ్యే బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టడం కంటే, అంతర్గత ఆనందం గురించి ఆలోచించడం ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. ' నేను మరోసారి ఒంటిరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది. ఈ జనసమూహం నుంచి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకూ కొంత సమయం కావాలి. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది.' అంటూ హిందీలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి: పురందేశ్వరి)నెటిజన్లు అభిషేక్ బచ్చన్ పోస్ట్పై ఇలా కామెంట్లు చేస్తున్నారు. మిస్ ఇండియాను వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే ఏమిటి..? సంతోషానికి కొలమానం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక వ్యక్తి సలహా ఇచ్చాడు- 'సార్, మీ భార్య, పిల్లలతో కొంత సమయం గడపండి, మీరు మంచిగా రీసెట్ అవుతారు.' అంటూ పేర్కొన్నాడు.సుమారు 17 ఏళ్ల క్రితం అభిషేక్ - ఐశ్వర్యలకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య(15) అనే కుమార్తె ఉంది. ఈ జంట విడాకులు తీసుకోనున్నారంటూ గత కొంతకాలంగా పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పరోక్షంగా స్పందించారు. అయినప్పటికీ ఆ వార్తల ప్రచారం ఆగలేదు. ఇప్పుడు అభిషేక్ షేర్ చేసిన పోస్ట్తో మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. -
OTT: రాజీవ్ గాంధీ హత్య కేసు ఆధారంగా 'ద హంట్'
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అదే ద హంట్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. జూలై 4 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది. అందులో.. 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా? ఆయనింకా బతికే ఉన్నారా?' అని శ్రీలంకలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి ఫోన్ రావడంతో టీజర్ మొదలవుతుంది. బాంబు పేల్చి రాజీవ్గాంధీని చంపిందెవరు? వారి ఉద్దేశ్యం ఏంటి? అన్న కోణాల్లో విచారణ మొదలుపెడతారు. ప్రతి సెకను కూడా ముఖ్యమేనంటూ నిందితులను పట్టుకునే పనిలో ఉంటారు. తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఓటీటీలో సిరీస్ చూడాల్సిందే! ద హంట్కు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. The assassination that shook the nation. The manhunt that stunned the world.The Hunt - The Rajiv Gandhi Assassination Case, streaming from 4th July on Sony LIV.#TheHuntOnSonyLIV pic.twitter.com/ExOXEZxYFK— Sony LIV (@SonyLIV) June 18, 2025 -
కోటి రూపాయల కారులో మోనాలిసా.. ఇప్పుడదే నా ఫ్రెండ్!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం ఏళ్లతరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు చాలామంది. అదే సమయంలో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవారూ బోలెడంతమంది ఉన్నారు. అందులో కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఒకరు. కుంభమేళాలో పూసలమ్ముకున్న ఈమె.. సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. సినిమా అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. కుంభమేళాతో పాపులర్షాప్ ఓపెనింగ్స్కు రమ్మని ఆహ్వానాలు అందాయి. అవన్నీ చూసి పొంగిపోయింది మోనాలిసా. జీవితం ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని ఆలోచించింది. అన్నింటినీ నవ్వుతూ ఓకే చెప్పింది. ఈ మధ్యే ఆమె నటించిన ఫస్ట్ సాంగ్ 'సాద్గి' కూడా రిలీజైంది. అందులో మోనాలిసా మరింత అందంగా కనిపించింది. కాకపోతే యాక్టింగ్ ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్న కామెంట్లు వినిపించాయి. కెమెరా ముందు నటించడం అదే తనకు తొలిసారి. నా ఫ్రెండ్.. కెమెరాఈ అనుభవం గురించి మోనాలిసా మాట్లాడుతూ.. సింగర్ ఉత్కర్ష్ శర్మ సర్ తన పాటలో నటించాలని అడగ్గానే ముందు మా ఇంట్లో మాట్లాడమన్నాను. వారు ఓకే అన్న తర్వాతే నేను అందులో యాక్ట్ చేశాను. అలాగే సాంగ్ కూడా నాకెంతగానో నచ్చింది. ఇప్పుడు కెమెరానే నా ఫ్రెండ్. కెమెరా ఎదుట కళ్లతోనే భావాలు పలికించడం, డ్యాన్స్ చేయడం కొత్తగా బాగుంది అని చెప్పుకొచ్చింది.రూ.1 కోటి కారులో మోనాలిసాఇదిలా ఉంటే తాజాగా మోనాలిసా ఖరీదైన కారులో కూర్చున్న ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఈ కారు ధర దాదాపు రూ.1 కోటి ఉండొచ్చని అంటున్నారు. రూ.100కు పూసల దండ అమ్ముకున్న మోనాలిసా ఇప్పుడు కోటి విలువైన కారులో తిరుగుతుండటం చూసి ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. మోనాలిసా ప్రస్తుతం ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Monalisa Official (@_monalisa_official) View this post on Instagram A post shared by Utkarsh Singh (@utkarshsinghofficial_)చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్.. హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదో భయంకరమైన ప్రదేశమని, జీవితంలో మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కారులో విజయ్-రష్మిక జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?)హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్.. ప్రస్తుతం 'మా' అనే సినిమా చేసింది. జూన్ 20న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చింది. 'ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది' అని కాజోల్ చెప్పింది.మరి కాజోల్ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాజోల్ కెరీర్ విషయానికొస్తే.. 1992 నుంచి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటైన 'దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే' సినిమాలో హీరోయిన్ ఈమె. తర్వాత కూడా పలువురు స్టార్స్తో మూవీస్ చేసింది. కొన్నాళ్లకు హీరో అజయ్ దేవగణ్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దో పత్తి తదితర చిత్రాలతో కాజోల్ ఆకట్టుకుంది. ఇప్పుడు 'మా' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)"I’ve felt negative vibes during shoots. Some places were so scary, I just wanted to leave and never come back.Like Ramoji Film City in Hyderabad itself, which is known as one of the most haunted places in the world."- Bollywood Actress #Kajol pic.twitter.com/0znOCXyQ4s— Movie Threat (@MovieThreat) June 18, 2025 -
'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం
'పుష్ప 2' సినిమా పేరు చెప్పగానే రికార్డులే గుర్తొస్తాయి. ఎందుకంటే థియేటర్లలో రిలీజై ఏకంగా రూ.1800 కోట్ల మేర వసూళ్లు సాధించి హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్లో ఒకటిగా నిలవగా.. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్లో కొనసాగింది. ఇప్పటికీ పలు షోలు, ప్రోగ్రామ్స్లోనూ పుష్పరాజ్ పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్లో మరో సంచలనానికి ఈ మూవీ కారణమైంది.తొలుత థియేటర్లలో, తర్వాత ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న పుష్ప 2.. ఇప్పుడు బుల్లితెరపై కూడా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేయగా.. ఏకంగా దేశవ్యాప్తంగా 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. థియేటర్లతో పాటు టీవీల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న 'స్త్రీ-2' సహా చాలా హిందీ చిత్రాల్ని టీఆర్పీ విషయంలో 'పుష్ప-2' దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)అలానే 5.4 కోట్ల హిందీ జనాలు ఈ సినిమాని చూసినట్లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే కాదు జూన్ 29న అంటే ఆదివారం రీలోడెడ్ హిందీ వెర్షన్ని టీవీలో ప్రసారం చేయనున్నారు. ఈసారి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో కాకపోయినా సరే కొన్నాళ్ల తర్వాత అయినా సరే 'పుష్ప 3' తీయడం గ్యారంటీ. ఎందుకంటే పుష్ప అంటే సినిమా పేరు కాదు. నార్త్లో అదో బ్రాండ్ అయిపోయింది.బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదివరకే దీపికా పదుకొణెని హీరోయిన్గా ప్రకటించగా మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఈ మూవీలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం ఓ చోట మాట్లాడిన డైరెక్టర్ అట్లీ.. దేశంలోనే ఇది ఖరీదైన చిత్రమని చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీతో అల్లు అర్జున్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం') -
'సితారే జమీన్ పర్' రిలీజ్.. రూ.120 కోట్ల ఆఫర్ వద్దన్న అమిర్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండానే సితారే జమీన్ పర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ తెగ వైరలవుతోంది. ఈ మూవీకి దాదాపు రూ.120 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. అయితే ఈ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఓటీటీలో సినిమా రిలీజ్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ థియేటర్లకు రప్పించేందుకు అమిర్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే సితారే జమీన్ పర్ థియేటర్లలో ప్రదర్శన తర్వాత యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతారని అమిర్ ఖాన్ చెబుతున్నారు. కానీ అది ఉచితం కాదు.. ప్రేక్షకులు సినిమా చూడటానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన వెంటనే యూట్యూబ్లో అందుబాటులోకి వస్తుందో లేదో అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే ఎనిమిది వారాల థియేటర్ రన్ తర్వాత విడుదల కోసం అమెజాన్ రూ. 120 కోట్లు ఆఫర్ చేసింది. -
ఆ హీరోతో పెళ్లి వార్తలు.. బొమ్మరిల్లు హీరోయిన్ రియాక్షన్!
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా తెలుగువారికి సుపరిచితమైన పేరు. టాలీవుడ్ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ ఆ తర్వాత నటుడు రితేశ్ దేశ్ముఖ్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం అమిర్ ఖాన్ చిత్రం సితారే జమీన్ పర్లో కనిపించనుంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.అయితే గతంలో హీరో జాన్ అబ్రహంతో జెనీలియా పెళ్లి జరిగిందన్న వార్తలొచ్చాయి. దాదాపు 14 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రచారంపై తాజాగా జెనీలియా స్పందించారు. ఆ వార్తలు ఎవరో సృష్టించారో తనకు తెలుసన్నారు. దానికి వాళ్లే సమాధానం చెప్పాలన్నారు.తాజా ఇంటర్వ్యూలో జెనీలియా మాట్లాడుతూ..'బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. నేు ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి వర్క్ చేశాం. ఆ సినిమా సెట్లో అనుకోకుండా మా పెళ్లి జరిగిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అదంతా కేవలం రూమర్స్ మాత్రమే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. మాకు పెళ్లి జరగలేదు. కొంతమంది పీఆర్లు ఇలాంటి చెత్త న్యూస్ క్రియేట్ చేశారు. ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేశారో వారినే అడగండి' అని అన్నారు. కాగా.. జెనీలియా - జాన్ అబ్రహం జంటగా ఫోర్స్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా 2011లో విడుదల కాగా.. ఓ సీన్లో భాగంగా వీరిద్దరికీ నిజంగానే పెళ్లి చేశారంటూ తెగ వైరలైంది. ఆ కథనాలకు చెక్ పెడుతూ ఆ తర్వాత ఏడాదిలోనే రితేశ్ దేశ్ముఖ్ను పెళ్లాడారు. -
'నా తమ్ముడి మరణానికి కారణం అదే'.. రూమర్స్పై రాహుల్ దేవ్!
రామ్ చరణ్ మూవీ ఎవడు చిత్రంలో అభిమానులను మెప్పించిన బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్. విలన్గా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రల్లో ఫ్యాన్స్ను మెప్పించారు. సౌత్లో చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేవ్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడు, నటుడైన ముకుల్ దేవ్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత ముకుల్ మరణంపై పలు రూమర్స్ వినిపించాయి. డిప్రెషన్ వల్లే అతను మృతి చెందాడని కథనాలొచ్చాయి.అయితే తాజాగా ఈ రూమర్లపై రాహుల్ దేవ్ స్పందించారు. ముకుల్ ఆరోగ్యం క్షీణించడానికి మానసిక ఆరోగ్య సమస్యలు కారణం కాదని తెలిపారు. అతని ఆహారపు అలవాట్లే కారణమని రాహుల్ దేవ్ వెల్లడించారు. చివరి నాలుగైదు రోజు తినడం పూర్తిగా మానేశాడని.. ఒంటరిగా ఉండేవాడని అన్నారు. ముఖ్యంగా అతనికి జీవితంపై ఆసక్తి కోల్పోయాడని.. ఎన్ని ఆఫర్స్ వచ్చినా తిరస్కరించేవాడని రాహుల్ దేవ్ వివరించారు.2019లో అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాడని రాహుల్ పంచుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి మరణం.. 2023లో తల్లిని కోల్పోవడం అతని ఒంటరితనం మరింత ఎక్కువైందని వెల్లడించారు. ఒంటరిగా జీవించడం పరిస్థితిని మరింత దిగజార్చిందని అతను పేర్కొన్నాడు. ముకుల్ తన కుమార్తెను మిస్ అవుతున్నాడని.. తనను జాగ్రత్తగా చూసుకోవడం లేదని కూడా బాధపడేవాడని రాహుల్ అన్నారు. ముకుల్ మరణం తరువాత సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అతను నిజంగా సూపర్ పవర్ అని.. అలాగే సున్నితమైన వ్యక్తిగా గుర్తుంచుకోవాలన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ముకుల్ 1996లో సుష్మితా సేన్ సరసన దస్తక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జై హో, హిమ్మత్ వాలా, మేరే దో అన్మోల్ రతన్, యమ్లా పగ్లా దీవానా, సన్ ఆఫ్ సర్దార్, భాగ్ జానీ వంటి లాంటి చిత్రాలలో నటించాడు. అంతే కాకుండా ముమ్కిన్, ఘర్వాలీ ఉపర్వాలి, కషీష్, ఫిర్ కోయి హై, కుంకుమ్ ఏక్ ప్యారా సా బంధన్ లాంటి టీవీ సీరియల్స్లో నటించారు -
ఓటీటీలో క్రేజీ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్ రెడీ
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది. లాక్ డౌన్ టైంలో మాత్రం పలు హిందీ సిరీసులు తెగ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వాటిలో ఒకటి 'స్పెషల్ ఓపీఎస్'. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. మధ్యలో 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వ్యూయర్స్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత రెండో సీజన్ని సిద్ధం చేశారు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడంతో పాటు ట్రైలర్ని కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?)కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించిన తొలి సీజన్కి నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ జానర్లో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సిరీస్పై అంచనాలు పెంచుతోంది. జూలై 11 నుంచి హాట్స్టార్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.రెండో సీజన్ కోసం ఇప్పటికే ఉన్నవాళ్లతో పాటు కొత్తగా పలువురు నటీనటులు చేరారు. అందులో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఈసారి మరింత థ్రిల్ పంచేలా సిరీస్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఈ వారం దాదాపు 22కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లేవు. కానీ పలు డబ్బింగ్, పరభాషా చిత్రాలు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్) -
Plane Crash: జీవితాల్ని నిలబెట్టిన విషాదం.. విడాకులు రద్దు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. జీవితం శాశ్వతం కాదని, మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందనేది చెప్పలేమని సమస్త ప్రజానీకానికి గుర్తు చేసింది. భూమిపై ఉన్నన్ని రోజులు గొడవలు తగ్గించి ప్రశాంతంగా, అయినవారితో సంతోషంగా గడపమని సందేశాన్ని పంపింది. విమాన ప్రమాదం అనే విషాదం కొందరి జీవితాల్లో మార్పు తెచ్చిందంటోంది సింగర్, నటి రాగేశ్వరి. విడాకులకు సిద్ధమైన వారు కూడా మనసు మార్చుకుని కలిసిపోయారని చెప్తోంది. సడన్గా ఎందుకీ మార్పు?మీకో విషయం తెలుసా? విమాన ప్రమాదం (Ahmedabad Air India Plane Crash) తర్వాత చాలామంది వారి కుటుంబాలకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతున్నారు, కాసేపు మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రెండు జంటలు విడాకుల వరకు వెళ్లగా.. ఇప్పుడు కలిసిపోయారు. సడన్గా వారిద్దరి కుటుంబాలు అహంకారాన్ని పక్కనపెట్టేశాయి. సమస్యలను పరిష్కరించుకున్నారు. అకస్మాత్తుగా ఎందుకింత మార్పు వచ్చింది? విపత్తులు వచ్చినప్పుడే మనకు జీవితం విలువ తెలిసొస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు.ప్రమాదాలే గుర్తు చేస్తాయిఎన్నో అపజయాలను చవిచూస్తే తప్ప విజయం అందదు. కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ పైకి వెళ్లలేరు. ఇలాంటి విషాదాలు మనల్ని ఒక్కసారిగా ఆపేస్తాయి. జీవితంలో మనకు ఏది ముఖ్యమనేది గుర్తు చేస్తాయి. కాబట్టి ఇప్పుడైనా మీ కుటుంబానికి కాస్త సమయం కేటాయించండి. నువ్వెలాంటి బట్టలు వేసుకున్నావు? ఎలా కనిపిస్తున్నావు? ఏం మాట్లాడావు? అనేది జనాలు గుర్తుపెట్టుకోరు. కానీ ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నావు? కుటుంబాన్ని ప్రేమించండివారిని ఎంత స్పెషల్గా చూస్తున్నావనేదే గుర్తుపెట్టుకుంటారు. మీ కుటుంబం ఎంత విలువైనదో గ్రహించండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. భూమిపై ఉన్నన్నాళ్లూ మనం పీల్చుకునే ఊపిరి, పొందే ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి వీలైతే క్షమించండి, సున్నితంగా మాట్లాడండి, ప్రేమగా ఉండండి అని చెప్పుకొచ్చింది. రాగేశ్వరి లూంబ్.. ఆంఖెన్, మై ఖిలాడీ తు అనారీ, దిల్ కిత్నా నడాన్ హై వంటి పలు చిత్రాల్లో నటించింది. దునియా, ప్యార్ కా రంగ్, సచ్ కా సాత్ వంటి ఎన్నో పాటలు పాడింది.విమానయానం విషాదం..అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం జూన్ 12న మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఓ వ్యక్తి తప్ప అందరూ సజీవ సమాధి అయ్యారు. అలాగే మెడికల్ కాలేజీ క్యాంటీన్లో భోజనం చేస్తున్న పలువురు మృతి చెందగా కొందరికి తీవ్రగాయాలయ్యాయి. View this post on Instagram A post shared by Raageshwari 🌏 (@raageshwariworld)చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి -
ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి.. జ్యోతిషుడి కామెంట్స్
సినిమా సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా సరే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటారు. కొన్నిసార్లు కొందరు జ్యోతిషులు.. పలువురు నటీనటుల భవిష్యత్ గురించి అంచనా వేసి చెబుతుంటారు. కొన్నిసార్లు ఇది నిజమైతే, కొన్నిసార్లు ఇది జరగదు. గతంలో వేణుస్వామి ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బాలీవుడ్లోనూ సుశీల్ కుమార్ అనే జ్యోతిషుడు.. హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సదరు జ్యోతిషుడు.. జాన్వీ కపూర్ కెరీర్ 2026లో మంచి స్థాయికి వెళ్తుందని చెప్పారు. అలానే ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందని, ఒకవేళ లేదంటే మాత్రం 33 ఏళ్లకు ఆమెకు వివాహం జరుగుతుందని అంచనా వేశాడు. ఓవైపు ఆమె వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని చెబుతూన.. గ్రహాగతుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.ఏదేమైనా ఇప్పుడు జ్యోతిషుడు సుశీల్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నమాట నిజమే. గతంలో ఇతడితోనే పలుమార్లు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. గతంలో ఓసారి మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకుని తిరుపతిలోనే సెటిల్ కావాలనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రామ్ చరణ్ 'పెద్ది', బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ తదితర క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటుందా అంటే కచ్చితంగా లేదని చెప్పొచ్చు. మరి సదరు జ్యోతిషుడు ఏ అంచనాతో చెప్పాడో ఏమో?(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్.. భయపెట్టడమే కాదు) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్గా ఘనత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన లంబోర్గిని ఎస్ఈని తన సొంతం చేసుకున్నారు. ఈ ప్రత్యేక మోడల్ను కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటుడిగా నిలిచారు. తన భార్య గౌతమి కపూర్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.5.21 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్ఈ మోడల్ కారును 2024లో అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ నటుడు ఈ కారును కొనలేదు. దీంతో మొదట ఈ లగ్జరీ కారు కొన్న నటుడిగా రామ్ కపూర్ నిలిచారు. రామ్ తన బ్రాండ్ న్యూ లంబోర్గిని కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అతని వద్ద రామ్ పోర్స్చే , పోర్సే, ఫెరారీ , రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ మిస్త్రీలో కనిపిస్తాడు. ఇది అమెరికన్ సిరీస్ ఆధారంగా తెరెకెక్కించారు. ఇందులో అతను డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా గతేడాది యుధ్రా మూవీలోనూ మెరిశారు. View this post on Instagram A post shared by Auto Journal India (@autojournal_india) -
'భాయ్ ఇంకా మనతోనే ఉన్నారు'.. సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్ట్
ధోని మూవీలో అభిమానులను అలరించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సుశాంత్ ఊహించని రీతిలో మృతి చెందారు. నేటికి సుశాంత్ మనకు దూరమై ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సుశాంత్ను గుర్తు చేసుకున్న అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తనను చాలా మిస్సవుతున్నట్లు రాసుకొచ్చింది. భౌతికంగా మీరు లేకపోయినా మాతో పాటు అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నారంటూ ఎమోషనలైంది. శ్వేత ఇన్స్టాలో రాస్తూ..' మా అన్న జూన్ 14, 2020న ఈ లోక విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు సీబీఐ కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. దాని కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న ఏమిటంటే.. ఏమి జరిగినా దేవునిపై విశ్వాసం కోల్పోకండి. మన సుశాంత్ జీవితాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అతని చిరునవ్వు, చిన్నపిల్లవాడిలాంటి అమాయకత్వం ఎవరి హృదయాన్నైనా ప్రేమతో కదిలించగలదు. మన సుశాంత్ దేనికోసం నిలబడ్డారో.. మనం దానికోసం నిలబడాలి' అంటూ రాసుకొచ్చింది.'భాయ్ ఎక్కడికీ వెళ్లలేదు. అతను మీలో, నాలో, మనందరిలోనే ఉన్నాడు. మనం మరింత నేర్చుకోవాలనుకునే ప్రతిసారీ అతన్ని గుర్తు చేసుకుందాం. అతనికి ఇష్టం లేని నెగెటివ్ భావనను వ్యాప్తి చేయడానికి భాయ్ పేరును ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఎందుకంటే సుశాంత్ దాని కోసం నిలబడలేదు. భాయ్ ఎంత మంది హృదయాలను ప్రభావితం చేశాడో చూడండి. అన్న పేరును నిలిచిపోయేలా చేయండి.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాపు. ఆ తర్వాత కొందరు ఆత్మహత్యగా భావించారు. కానీ ఆయన కుటుంబం న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దాదాపు ఐదేళ్ల తర్వాత.. ఆరోపణలను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ సీబీఐ నివేదికను కోర్టుకు సమర్పించింది. View this post on Instagram A post shared by Shweta Singh Kirti (@shwetasinghkirti) -
సడన్గా ఆ సీన్లో నటించమన్నారు.. ఇష్టం లేకుండానే..: మధుబాల
రోజా సినిమాతో మధుబాల (Madhoo/ Madhubala) క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లలో తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది. ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని భీష్మించుకుని కూర్చుంది. కానీ ఓ సినిమా కోసం దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధుబాల మాట్లాడుతూ.. నేను పెరిగిన వాతావరణం వల్ల ఆన్స్క్రీన్లో కొన్ని సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బందిగా అనిపించేది. సడన్గా ఆ సీన్లో..ఆయా సీన్లలో నటించలేక సినిమాలు వదిలేసుకున్న సందర్భాలెన్నో..! అయితే ఓ సినిమా చేస్తున్న సమయంలో ముద్దు సన్నివేశంలో నటించాలన్నారు. దీనిగురించి నాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. షూటింగ్కు ముందు ఒక్కమాటైనా చెప్పలేదేంటి? అని నిలదీశాను. అప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్లి.. ఈ సీన్ అవసరం.. అందుకే చేయమంటున్నాం అని బతిమాలారు. అసలు ఆ సీన్ అవసరమే లేదుఇష్టం లేకపోయినా ఆ సన్నివేశంలో నటించాను. దాన్ని సినిమాలో ఉంచకూడదని దర్శకుడిని నేనడగలేదు. వాళ్ల ఇష్టానికే వదిలేశాను. తీరా ఆ సీన్కు ఎటువంటి ప్రాధాన్యత లేదని పక్కన పెట్టేశారు. అప్పుడు నాది చాలా చిన్నవయసు. కానీ, ఈ రోజుల్లో 22 ఏళ్ల అమ్మాయి కూడా చాలా తెలివిగా ఉంటున్నారు. ఏ సీన్కైనా రెడీ అని సాహసం చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే మధుబాల నటించిన కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది.చదవండి: పాకిస్తాన్లో 'దంగల్' ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పిన ఆమిర్ ఖాన్ -
రెండు గంటలు... ఏడు ప్రాజెక్ట్లు!
ఎనిమిది పదుల వయసులో ఎంతో చురుకుగా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. వేగంగా పని చేయడం తనకు ఇష్టం అంటున్నారు ఈ బిగ్ బి. అందుకు ఉదాహరణగా ఇటీవల తాను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు (ఐదు వాణిజ్య ప్రకటనలు, రెండు ఫొటోషూట్లు) చేసిన విషయం గురించి చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు చేయడంతో నా డైరెక్టర్ ఫ్రెండ్ ఒకరు ‘ఇలా పని చేయడం సరి కాదు.ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనిని నువ్వు రెండు గంటల్లో పూర్తి చేస్తే ఎలా? నువ్వు పని వి«ధానాన్నిపాడు చేస్తున్నావు. ఇలా చేస్తే క్లైంట్లు ఒకే రోజులో ఎక్కువ ప్రాజెక్ట్లు చేయమంటారు. అది కరెక్ట్ కాదు’ అని చమత్కారంగా అన్నాడు. ఆ మాటలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నాకు ఇలా స్పీడ్గా పని చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు అమితాబ్ బచ్చన్. -
లగ్జరీ ఫ్లాట్లను అమ్మేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ కూడా నటించారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే హృతిక్ రోషన్ ఆయన తండ్రితో కలిసి ఖరీదైన మూడు ఫ్లాట్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని ఆంధేరి వెస్ట్లో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లను దాదాపు రూ.6.75 కోట్లకు విక్రయించారు. ఈ ఆస్తులు ముంబైలోని అంధేరి శివారులోనే ఉండగా.. వాటిలో రెండు ఆయన తండ్రి రాకేశ్ రోషన్వి కాగా.. మూడో ఫ్లాట్ హృతిక్ రోషన్కు చెందినదిగా సమాచారం.మరోవైపు హృతిక్ రోషన్ క్రిష్-4 మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను రాకేశ్ రోషన్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు హృతిక్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పాప్ స్టార్ జాక్సన్ వాంగ్ రోషన్ దంపతులను వారి నివాసంలో కలిశారు. అతను క్రిష్ 4లో భాగం అవుతానని ఇప్పటికే ధృవీకరించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే క్రిష్-4 ఇంకా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. -
అహ్మదాబాద్ ఘటన.. ఎయిరిండియాపై ప్రియాంక చోప్రా సిస్టర్ ఆగ్రహం!
అహ్మదాబాద్ విమానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మనిషి ప్రాణాలు పోవడానికి ఒక్క సెకను చాలు అనేది కళ్లముందు కనిపిస్తోంది. ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటేనే ఆలోచించే పరిస్థితి ఎదురవుతోంది. విమాన ప్రయాణం ఇంత విషాదంగా మారడంతో భద్రతపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి.ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు టికెట్స్ రద్దు చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మీరా చోప్రా భర్త కూడా ఉన్నారు. ఆమె భర్త ఈనెల 15న దుబాయ్కు ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం లేకపోవడంతో టికెట్ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీరా చోప్రా తెలిపింది. అయితే ఎయిరిండియా తమ టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ సిబ్బంది తీరుపై మీరా చోప్రా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.మీరా చోప్రా ట్వీట్లో రాస్తూ.. 'ఎయిరిండియా తీరు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. ఎందుకంటే ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే మీరా చోప్రా టికెట్ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ మీరాకు కౌంటరిచ్చారు. కాగా.. గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 అందరూ ప్రాణాలు కోల్పోయారు. #AirIndia insensitivity is beyond shocking..My husband is scheduled to travel to Dubai on 15th June on @airindia and we wanted to cancel the flight due to the lack of safety measures. But Air India declined to refund any amount citing no advisory has come to them. We all took…— Meerraa Chopraa (@MeerraChopra) June 12, 2025 -
కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?
సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్డేకు కేక్ కట్ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?ఫేమస్ సాంగ్..తెలుగులో ఓ ఫేమస్ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి (Mahima Chaudhry). శ్రీకాంత్, జగపతిబాబు నటించిన 'మనసులో మాట' సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. కూతురి బర్త్డే..తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్డే మై బేబీ అని క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.అందమైన కూతురుఅరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్తో లేదంటే పాతకాలం నాటి అమూల్ యాడ్లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్ ఖాన్ పర్దేశ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది. View this post on Instagram A post shared by Mahima Chaudhry (@mahimachaudhry1) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 12th ఫెయిల్ నటుడి ఇంట్లో విషాదం
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేకు తీవ్ర విషాదం మిగిల్చింది. ఇదే ఫ్లైట్లో తన బంధువు మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన మామయ్య అయిన క్లిఫర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ మరణించాడని విక్రాంత్ తన బాధను వ్యక్తం చేశారు. విక్రాంత్ తన బంధువు మృతికి సంతాపం తెలుపుతూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాద బాధిత కుటుంబాలందరికీ తన సానుభూతిని తెలియజేశారు.విక్రాంత్ మాస్సే ఇన్స్టాలో రాస్తూ..' "ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన ఊహించలేని విషాదం జరిగింది. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను చూసి నా హృదయం ముక్కలైంది. ఈ ఘటనలో మా మామ క్లిఫోర్డ్ కుందర్ తన కుమారుడు క్లైవ్ కుందర్ను కోల్పోయారని తెలిసి మరింత బాధగా ఉంది. ఎందుకంటే అతను ఈ విమానంలో పనిచేస్తున్న మొదటి అధికారి" అని రాసుకొచ్చారు.కాగా.. గురువారం మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులతో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ తారల దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాలీవుడ్ సినీతారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను షాక్కు గురి చేసిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో వారందరి కుటుంబాల కోసం మనందరం ఆ దేవుడిని ప్రార్థించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మరో నటుడు రితేశ్ దేశ్ముఖ్ సైతం స్పందించారు. విమాన ప్రమాదం గురించి విని తన గుండె పగిలిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రయాణీకులందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.ఈ ఘటనపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రణదీప్ హుడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని పోస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సన్నీ డియోల్ విచారం వ్యక్చం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ సమయంలో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను కదిలించిందని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేను.. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రతి కుటుంబం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చింది. మరో నటి అనన్య పాండే ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని నమ్మలేకపోతున్నానంటూ సీినియర్ నటి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేసింది. కాగా.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. Heartbroken by the tragic Ahmedabad Air India flight crash. My deepest condolences to the families of the victims. May their souls rest in peace. Truly heart-wrenching 💔— Allu Arjun (@alluarjun) June 12, 2025 Deeply saddened by the Ahmedabad Air India flight crash. Prayers and strength to everyone affected. My thoughts are with the passengers, crew members, and their families.— Jr NTR (@tarak9999) June 12, 2025 Extremely shocked and in disbelief to hear the crash of Air India flight from Ahmedabad to London, with 232 passengers on board, just after take off. Prayers for the safety of the passengers and the crew. #GodBeWithThem #planecrash— KhushbuSundar (@khushsundar) June 12, 2025 Heartbreaking to hear about the tragic plane crash in Ahmedabad.My thoughts and prayers are with all those affected.Hoping for survivors and strength for the rescue teams.May the departed rest in peace, and may their families find the strength to endure this immense loss. 🙏— Randeep Hooda (@RandeepHooda) June 12, 2025 Absolutely heartbroken and in shock after hearing about the tragic plane crash in Ahmedabad. My heart goes out to all the passengers, their families, and everyone affected on the ground. Holding them all in my thoughts and prayers during this incredibly difficult time.— Riteish Deshmukh (@Riteishd) June 12, 2025 Shocked and speechless at the Air India crash. Only prayers at this time 🙏— Akshay Kumar (@akshaykumar) June 12, 2025 -
సినిమాలతో కాదు.. ఆ ఒక్క డీల్తో కోట్ల రూపాయలు!
బాలీవుడ్ నటులు ఒక్కో సినిమాకు దాదాపు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అది సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్లోనూ కొందరు స్టార్స్ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి లిస్ట్లో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా చేరిపోయారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్ శివారులో మూడు అపార్ట్మెంట్లను ఆయన లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. వాటి ద్వారా ఐదేళ్లలో దాదాపు రూ.4.30 కోట్ల వరకు అర్జించనున్నారు. తాను లీజ్ తీసుకున్న మూడు అపార్ట్మెంట్లలో నెలవారీ అద్దె రూ. 6.30 లక్షలుగా ఉన్నట్లు టాక్. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.4 కోట్లకు పైగా సంపాందించనున్నారు జాన్ అబ్రహం. ఈ డీల్ను గత నెలలోనే క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు ఫ్లాట్లకు కలిపి రూ.36 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించారు.ప్రధానంగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్మెంట్లోకి మారనున్నారు.ఇక జాన్ అబ్రహం సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ది డిప్లొమాట్ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నటించిన టెహ్రాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలో నటించింది. -
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన షిరీన్.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు ఆహ్వానం పలికింది. జూన్ 9న తమకు బాబు పుట్టాడని దంపతులిద్దరూ ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.కాగా.. షిరీన్ మీర్జా బాలీవుడ్లో యే హై మొహబ్బతేన్ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోహోత్ ప్యార్ కర్తే హై, దై కిలో ప్రేమ్, యే హై ఆషికి, గుతుర్ గు, అన్హోనియోన్ కా అంధేరా లాంటి సీరియల్స్లో మెప్పించింది. షిరీన్ చివరిసారిగా యే హై చాహతేన్ షోలో కనిపించింది. షిరీన్ 2021లో హసన్ సర్తాజ్ను వివాహం చేసుకుంది. దాదాపు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో బుల్లితెర దంపతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కెరీర్, జాబ్ అంటూ వివాహాలు చేసుకోకుండా చాలామంది సింగిల్స్గానే బతికేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వాళ్లయితే ఏకంగా 40 పదుల వయస్సు దాటినా సింగిల్గానే ఉంటున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, త్రిష, ప్రభాస్ లాంటి అగ్రతారలేందరో ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో 40 పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో మరో బాలీవుడ్ భామ దివ్య దత్తా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.దివ్య పెళ్లి బంధం గురించి మాట్లాడుతూ.. “మీరు మంచి భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడం చాలా బాగుంటుంది. అదే పెళ్లి లేకపోతే జీవితం ఇంకా అందంగా సాగుతుంది. అందుకే పెళ్లి చేసుకోవడం కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిది. నాపై చాలా మంది పురుషులు శ్రద్ధ పెడుతుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తా అంతే. కానీ మీరు కనెక్ట్ అయితేనే రిలేషన్లో ఉండాలి. ఆ వ్యక్తి మీ చేయి పట్టుకోగలడని మీరు భావించాలి. ఒకవేళ అది జరగకపోతే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా కోసం నేను ఉన్నా.' అని మాట్లాడింది.దివ్య దత్తా ఇంకా మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కేవలం ఎవరైనా నాతో ప్రయాణించగల సహచరుడిగా ఉండటానికి ఇష్టపడతా. అది లేకపోయినా నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. నా ప్రాణ స్నేహితుడు నాకు ఒక కోట్ పంపాడు. 'నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నావు' కదా అని అడిగాడు. దానికి నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయానని చెప్పా. మంచి భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణం కావాలని అవసరం లేదు. గతంలో నాకు కూడా ఆ అపోహ ఉండేది." అని పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ.ఇక సినిమాల విషయానికొస్తే దివ్య దత్తా చివరిసారిగా ఛావా చిత్రంలో కనిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం దివ్య అర్జున్ రాంపాల్తో కలిసి నాస్టిక్లో కనిపించనుంది. ఈ సినిమాకు శైలేష్ వర్మ దర్శకత్వం వహించారు. -
ఆడవారి వాష్రూమ్కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్జెండర్ నటి
ఎన్నో అవమానాలు, ఆటంకాలు దాటుకుని వైద్య విద్యను అభ్యసించింది త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (Trinetra Haldar Gummaraju). దేశంలోనే రెండో ట్రాన్స్జెండర్ డాక్టర్గా ఆ మధ్య తన పేరు వార్తల్లో మార్మోగిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ రెండో సీజన్తో నటిగానూ మారింది. ఈ మధ్యే కంఖజుర అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. ఇది మే 30 నుంచి సోనీలివ్లో ప్రసారమవుతోంది.హాస్పిటల్లో చేదు అనుభవంతాజాగా త్రినేత్ర.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నాక ఒకసారి డాక్టర్ను కలిసేందుకు వెళ్లాను. ఆస్పత్రిలో ఉన్న్పపుడు వాష్రూమ్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అప్పటికి నా ముఖంలో అమ్మాయి పోలికలే లేవు. అలా అని అబ్బాయిల రెస్ట్రూమ్ వాడుకోలేను. ఏదైతే అదైందని అమ్మాయిల బాత్రూమ్లోకి వెళ్లాను. అంతే.. అక్కడున్న సెక్యురిటీ గార్డు నన్ను కోపంతో బయటకు తరిమేసింది. రచ్చ చేయాలనుకోలే..నేను అబ్బాయిని అనుకుని లోపలకు వెళ్లనివ్వలేదు. నేను ఏమీ అనలేదు. దాన్ని గొడవ చేసి రచ్చ చేయాలనుకోలేదు. అందుకే సైలెంట్గా అక్కడినుంచి వెళ్లిపోయాను. కానీ దీనివల్ల నా మనసు గాయపడింది. అమ్మాయిగా మారినప్పటికీ ఆడవారి బాత్రూమ్ ఉపయోగించుకోలేకపోయాను. ఇలాంటి ఇబ్బందుల్ని, అవమానాల్ని ఊహించే కాలేజీలో చదువుకునే రోజుల్లో వాష్రూమ్కి వెళ్లేదాన్నే కాదు. ఇందుకోసం నీళ్లు సరిగా తాగేదాన్ని కాదు. దీనివల్ల నేను యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇలా వివక్ష ఎదుర్కొనే సమాజంలో బతకడం దురదృష్టకరం అని చెప్పుకొచ్చింది.చదవండి: శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్ -
ముందుగానే వచ్చేస్తోన్న పంచాయత్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఓటీటీలు వచ్చాక సినీ వినోదం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. థియేటర్లలో కేవలం సినిమాలే కాదు.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్లకు ప్రత్యేకమై క్రేజ్ ఉంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సరికొత్త సిరీస్ పంచాయత్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్కు ప్రత్యేక ఆదరణ దక్కడంతో మేకర్స్ మరో సీజన్కు రెడీ అయిపోయారు. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ఇంకాస్తా తొందరగానే స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు.విలేజ్ నేపథ్యంలో సాగే సరికొత్త కామెడీ డ్రామా సిరీస్గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పంచాయత్ సీజన్- 4 జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటి ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. మొదట జూలై 2న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తాజాగా తేదీ మారడంతో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఈనెలలోనే సినీ ప్రియులకు అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సిరీస్లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్ను ఉత్తరప్రదేశ్లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు. shuru ho chuka hai election🗳 Manju Devi ya Kranti Devi, kiski hogi selection 👀#PanchayatOnPrime, New Season, June 24@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy@Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77… pic.twitter.com/dflHA71wbe— prime video IN (@PrimeVideoIN) June 11, 2025 -
సింగిల్గా అన్న.. రెండోపెళ్లితో రెండోసారి తండ్రయిన తమ్ముడు
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటుంటారు. కానీ ఈ జనరేషన్కు అది వర్తించదు. కెరీర్ వేటలో పడి ఆలస్యంగా పెళ్లి చేసుకుని లేటుగా సంసారసాగరాన్ని ఈదుతున్నారు. కొందరైతే మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరే పెళ్లి అనే జంఝాటమే వద్దని సింగిల్గా బతికేస్తున్నారు.57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా..బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) విషయంలో ఇదే జరిగింది. ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా పెళ్లికి మాత్రం సిద్ధపడలేదీ హీరో. 59 ఏళ్లు వచ్చినా సింగిల్గానే బతికేస్తున్నాడు. కానీ, ఇతడి సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) మాత్రం 57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నాడు.పట్టలేనంత సంతోషంఅర్బాజ్ భార్య షురా ఖాన్ గర్భం దాల్చిందన్న విషయాన్ని నటుడు మీడియాకు వెల్లడించాడు. మేము బయటకు వెళ్లినప్పుడు జనాలు ఆ విషయాన్ని ఇట్టే పసిగట్టారు. దాన్ని ఎంతోకాలం దాచలేమనుకోండి. ప్రస్తుతం మేమెంతో సంతోషంగా ఉన్నాం. మా జీవితాల్లో మరింత వెలుగు నింపేందుకు వస్తున్న బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం అన్నాడు.రెండో పెళ్లిఅర్బాజ్ గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. 2017లో అర్బాజ్-మలైకా విడాకులు తీసుకున్నారు. 2023 చివర్లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను నిఖా చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో ఎన్నో మూవీస్ చేసిన అర్బాజ్ తెలుగులో 'జై చిరంజీవ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'శివం భజే' వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: ప్రముఖ సింగర్ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం -
ఆమిర్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
'లాల్ సింగ్ చద్దా' లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'సితారే జమీన్ పర్' పేరుతో తీసిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)హాలీవుడ్ మూవీ 'ఛాంపియన్స్'కి అనధికారిక రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. కోపం ఎక్కువగా ఉండే ఓ బాస్కెట్ బాల్ కోచ్.. అనుకోని పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో మూడు నెలల పాటు మతిస్థిమితం సరిగా లేని వాళ్లకు కోచింగ్ ఇవ్వాలని జడ్జి ఆర్డర్ వేస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దానికి ఒప్పుకొంటాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని వాళ్లతోనే టోర్నీలో విజయాలు సాధిస్తాడు. ఇదే స్టోరీలా అనిపిస్తుంది.ఆమిర్ స్వయంగా కోచ్గా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాని ఓటీటీకి అమ్మకుండా.. 8 వారాల తర్వాత యూట్యూబ్లో పే పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తానని కొన్నిరోజుల క్రితమే ప్రకటించాడు. అలానే రీసెంట్గా పలువురు సెలబ్రిటీల కోసం 'సితారే జమీన్ పర్' ప్రీమియర్ వేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమిర్ మూవీ అంటే నెటిజన్ల నుంచి విమర్శలు సాధారణం. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!) -
బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న కేంద్ర మాజీ మంత్రి.. మరోసారి అలరించనుందా?
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు చాలామందే ఉన్నారు. అలా వచ్చినవారు చాలామంది పొలిటికల్గా సక్సెస్ కూడా అయ్యారు. అలాంటి వారిలో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా? బుల్లితెరపై తన అందంతో అలరించిన మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. భాజపాలో కీలకనేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలదించారు.బుల్లితెరపై రీ ఎంట్రీ?అయితే గతంలో బాలీవుడ్లో ఆమె నటించిన సూపర్ హిట్ సీరియల్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి'. ఈ సీరియల్కు మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ కోసం నటి స్మృతి ఇరానీ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. దాదాపు 150 ఎపిసోడ్లు ఉన్న ఈ షోలో ఆమె మరోసారి తులసి విరానీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా నివేదిక ప్రకారం స్మృతి ఇరానీ జూన్ 8న 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2' కోసం ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిసింది. రెండో వారం ప్రారంభంలోనే ఏక్తా కపూర్కో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం.కాగా.. ఇటీవల స్మృతి కపూర్ ఈ సీరియల్లో మిహిర్ విరానీ (మొదటి సీజన్) పాత్ర పోషించిన అమర్ ఉపాధ్యాయ్తో పాటు ఏక్తా కపూర్ పుట్టినరోజు వేడుకలో కనిపించారు. కరిష్మా తన్నా, అనితా హసానందనీ కూడా పార్టీకి హాజరయ్యారు. 'క్యుంకి సాస్ భీ కభీ బహు థి' అనే సీరియల్ హిందీ బుల్లితెర చరిత్రలో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్లో నటించిన వారి కెరీర్ కూడా మలుపు తిరిగింది. గతంలో ఈ షో 2000 నుంచి 2008 వరకు ప్రసారమైంది. ఆ తర్వాత స్మృతి ఇరానీకి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటిగా వరుసగా ఐదు అవార్డులను గెలుచుకుంది. అంతే కాకుండా రెండు భారతీయ టెలీ అవార్డులు కూడా దక్కించుకుంది. -
'నా చావు గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు'.. అమితాబ్ ఘాటు రిప్లై!
బిగ్బీ అమితాబ్కు ఆసక్తికర అనుభవం ఎదురైంది. అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో నెటిజన్లతో ఓ సెషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇచ్చారు బిగ్ బీ. మీ గాడ్జెట్స్ను బ్రేక్ చేయండి.. మీకు దీర్ఘాయుస్సు ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు.ఇది చూసిన ఓ నెటిజన్ అమితాబ్కు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. 'మీరు సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి..లేకపోతే ఎక్కువ కాలం జీవించలేరు' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పోస్ట్కు బిగ్బీ అమితాబ్ తనదైన స్టైల్లోనే నెటిజన్కు ఇచ్చిపడేశాడు. నా మరణం గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు.. అంతా ఆ ఈశ్వరుని దయ' అంటూ చేతులెత్తి నమస్కరించే ఎమోజీ జతచేశాడు.ఆ తర్వాత అమితాబ్ ఆరోగ్యం, జీవితం గురించి వరుసగా పోస్టులు పెట్టారు. మన జీవితాన్ని గడపడానికి ఉత్తమ మార్గానికి సంబంధించిన సూత్రాలను అభిమానులు, నెటిజన్లతో పంచుకున్నారాయన. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీతో అభిమానులను అలలరించాడు. ప్రస్తుతం కల్కి-2లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా 'కౌన్ బనేగా కరోడ్పతి' నెక్ట్స్ సీజన్ హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.मेरे मरण की बात करने के लिए धन्यवाद ; ईश्वर की कृपा 🙏— Amitabh Bachchan (@SrBachchan) June 9, 2025 -
'ది ఢిల్లీ ఫైల్స్' టైటిల్ను మార్చేసిన దర్శకుడు
‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన ‘ది ఢిల్లీ ఫైల్స్’ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు పోస్టర్స్తో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. అయితే, తాజాగా టైటిల్ను మార్పు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, చాలామంది కోరికమేరకే టైటిల్ను మార్పు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) నిర్మిస్తున్న 'ది ఢిల్లీ ఫైల్స్'(The Delhi Files) చిత్రాన్ని 'ది బెంగాల్ ఫైల్స్'(The Bengal Files)గా మార్పు చేస్తున్నట్లు దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ప్రకటించారు. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో మిథున్ చక్రవర్తితో పాటు పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్– ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్పై అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించనున్నారు.BIG ANNOUNCEMENT: The Delhi Files is now The Bengal Files. Teaser coming this Thursday, 12 June 2025 at 12 PM. In cinemas on 05 September 2025.দ্য দিল্লি ফাইলস এখন দ্য বেঙ্গল ফাইলস। টিজার আসছে আগামী বৃহস্পতিবার, ১২ই জুন ২০২৫, দুপুর ১২টায়।ছবিটি প্রেক্ষাগৃহে মুক্তি… pic.twitter.com/tzXEEYdS28— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 10, 2025 -
షారుక్ఖాన్ తో సుకుమార్?
బాలీవుడ్ హీరో షారుక్ఖాన్ , దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. షారుక్తో ఓ సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోందని, ఈ దిశగా చర్చలుప్రారంభమయ్యాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాకు షారుక్ ఓకే చెబితే, దర్శకుడిగా సుకుమార్తో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మైత్రీమూవీ మేకర్స్ అనుకుంటున్నారని టాక్. మరి.. సుకుమార్, షారుక్ఖాన్ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే.. ఇటీవల షారుక్ఖాన్ ను కలిశారట తమిళ దర్శకుడు వెట్రిమారన్ . ఈ నేపథ్యంలో షారుక్ఖాన్ సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం హిందీ చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్లో బిజీగా ఉన్నారు షారుక్ఖాన్ . ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. -
ప్రముఖ రాజకీయ నాయకుడితో రిలేషన్.. సోనాలి బింద్రే క్లారిటీ!
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి తన కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. సల్మాన్ ఖాన్తో ఓ మూవీ సెట్లో ఎదురైన సంఘటనను ఇటీవలే వెల్లడించింది. ఆ సమయంలో అతనిపై విపరీతమైన కోపం వచ్చేదని తెలిపింది. అయితే తన క్యాన్సర్ చికిత్స సమయంలో అమెరికా వచ్చి తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడని కూడా చెప్పుకొచ్చింది.తాజాగా ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్ థాకరే 20 ఏళ్ల క్రితం తనను ఇష్టపడ్డారన్న రూమర్స్పై బాలీవుడ్ నటి సోనాలి బింద్రే స్పందించారు. ఈ వార్తలపై సోనాలి అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ఎప్పుడూ అలాంటి వార్తలను పట్టించుకోలేదని సోనాలి తెలిపింది. సోనాలి మాట్లాడుతూ.. 'నాపై ఇలాంటి ప్రచారం జరిగినట్లు నాకే తెలియదు. కొందరు సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇది చాలా బాధాకరం. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజ్ థాకరే భార్య షర్మిలా, ఆమె తల్లికి మా పిన్ని మంచి స్నేహితురాలు. ఆ విధంగా ఇరు కుటుంబాల మధ్య మా చిన్నతనం నుంచే మంచి స్నేహం ఏర్పడింది. అలా ఇరు కుటుంబాల మధ్య నా చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ ఆ రిలేషన్ అలాగే ఉందని' తెలిపింది. కాగా.. సోనాలి బింద్రే చివరిసారిగా 'ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2'లో కనిపించింది. ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
సుష్మిత సంపాదిస్తుంటే తేరగా తింటున్నావ్.. ఇల్లు కూడా నీది కాదు!
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. సుష్మితా సేన్ (Sushmita Sen) సోదరుడు, బాలీవుడ్ నటుడు రాజీవ్ సేన్ (Rajeev Sen) కూడా అందుకు అతీతుడు కాదు. అక్క ఎలాగో పెళ్లి చేసుకోలేదు.. ఆమె బాగా సంపాదిస్తుంటే తేరగా వచ్చిందని పుష్టిగా తింటున్నావ్.. ఎంజాయ్ చేస్తున్నావ్ అని కొందరు అతడిపై నోరు పారేసుకున్నారు.అక్క సంపాదనతోనే..ఈ నెగెటివ్ కామెంట్లు రాజీవ్ కంటపడ్డాయి. అతడి కష్టాన్ని గుర్తించకపోగా ఇలా తక్కువ చేసి మాట్లాడటంతో నటుడి మనసు చివుక్కుమంది. దీంతో తన యూట్యూబ్ ఛానల్లో ఈ ట్రోలింగ్పై స్పందించాడు. రాజీవ్ సేన్ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అయితే మా అక్క సంపాదించే డబ్బుతోనే బతుకుతున్నానని, మా అమ్మానాన్న వల్లే ఇంత విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నానని చాలామంది అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.అలాగైతేనే సక్సెస్ అయినట్లా?నేనేంటో చూపించుకోవడానికి నేనేమీ సూపర్స్టార్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు.. నేను పది సినిమాలు చేశాను, ఎన్నో యాడ్స్లో నటించాను.. ఇంకా నా చేతిలో ఫలానా ప్రాజెక్టులున్నాయి. వాటితో మరింత సక్సెస్ అవుతా.. ఇలాంటివి చెప్తేనే, చేస్తేనే సక్సెస్ అయినట్లు కాదు. చాలామంది బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతున్నారు. రకరకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అవన్నీ కెమెరా ముందుకు వచ్చి చెప్పుకుంటారా? లేదు కదా! నగల బిజినెస్నాకు జ్యువెలరీ బిజినెస్ ఉంది. అమ్మానాన్నల సహకారంతో అది విజయవంతంగా రన్ చేస్తున్నాను. నేను కాస్త ఉన్నత కుటుంబంలోనే పుట్టాను. అయినా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే నగల వ్యాపారం ప్రారంభించాను. ఈ పని చాలాకాలంగా చేస్తున్నాను. ఇదే కాకుండా నటనవైపు వెళ్లాను, నిర్మాతగా కూడా ప్రాజెక్టులు చేస్తున్నా.. యూట్యూబ్ ఈ మధ్యే మొదలుపెట్టాను. ఇవన్నీ ప్యాషన్తో చేస్తున్నవే తప్ప డబ్బు సంపాదించడానికి చేయట్లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ను. నా సొంత పెట్టుబడితో చాలానే సంపాదించా.. అది ఎంత మొత్తమనేది మీకు చూపించాల్సిన అవసరం లేదు.గెంటేస్తే పోతా..నేను ఉండే ఇల్లు మా అమ్మదే.. ఈ ఇల్లు నాదే అని ఎన్నడూ చెప్పలేదే! రేప్పొద్దున అమ్మ.. వెళ్లిపో అని గెంటేస్తే తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తా! ఎందుకంటే నేను సంపాదించినవి మాత్రమే నా ఆస్తులు. ఇది నాది కాదు. అయినా మీరన్నట్లు మా అమ్మ సంపాదించిన విలాసవంతమైన ఇంట్లో ఉండి.. ప్రతి ఖర్చులు తనే భరిస్తూ.. మా అక్క కూడా తనే డబ్బిచ్చి ఎంజాయ్ చేయమంటే మీకేంటి సమస్య? నేనేం మీ జేబులోని డబ్బు తీయట్లేదుగా? మీరేమనుకున్నా నాకు ఫరఖ్ పడదు అని రాజీవ్ సేన్ ట్రోలర్స్కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. కొత్త జంట చేసిన పని చూశారా? -
రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో
పెళ్లైన దంపతులను నిండునూరేళ్లు కలిసి జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, ఈ కాలంలో నూరేళ్లు బతకడం కష్టమే అయితే, అంతవరకు కలిసి జీవించడం పెద్ద సవాల్గా మారింది. ఎన్నో జంటలు ఆడంబరంగా వివాహం చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి కాస్త ఎక్కువే కనిపిస్తుంది.నిందలు- బాధలుఅయితే విడాకులు తీసుకోవడం ఈజీ అయినా, ఆ బాధను మర్చిపోవడం అంత తేలిక కాదంటున్నాడు హీరో ప్రోసెంజిత్ చటర్జీ (Prosenjit Chatterjee). ఇతడు సహనటి దెబశ్రీ రాయ్ (Debashree Roy)ను పెళ్లాడాడు. వివాహమైన కొంతకాలానికే విడిపోయారు. ఈ విషయం గురించి ప్రొసెంజిత్ తాజాగా టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అప్పుడు మా వయసు పెద్దదేం కాదు. విడిపోయినప్పుడు ఒకరినొకరు నిందించుకున్నాం.టాప్ 10 నటుల్లో నేను లేనుకానీ ఆ బాధ నుంచి బయటపడలేకపోయాను. పనిపై దృష్టి సారించలేకపోయాను. కొంత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో బెంగాల్లో టాప్ 10 నటుల గురించి ఓ వార్త రాశారు. టాప్ 10 జాబితాలో ఎక్కడా నా పేరు లేదు. అది నన్ను మరింత బాధలోకి నెట్టేసింది. నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తిరిగి ఆఫీస్కు వెళ్లి ఒకేసారి తొమ్మిది సినిమాలు సంతకం చేశాను. ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేం లేదు.ప్రొసెంజిత్ చటర్జీ- దెబశ్రీ రాయ్మూడు పెళ్లిళ్లుబాధగా అనిపించినప్పుడల్లా నా తోటకి వెళ్లేవాడిని. ఎవరితోనూ మాట్లాడకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చునేవాడిని అని చెప్పుకొచ్చాడు. దెబశ్రీకి విడాకులు ఇచ్చాక ప్రొసెంజిత్ మరోసారి ప్రేమలో పడ్డాడు. అపర్ణ గుహ తకుర్తను పెళ్లాడాడు. వీరికి ప్రేరణ అనే కూతురు పుట్టింది. తర్వాత ఈ జంట మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. నటి అర్పితా పాల్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. కెరీర్బాలీవుడ్ నటుడు బిస్వజిత్ చటర్జీ కుమారుడే ప్రొసెంజిత్. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రొసెంజిత్ హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. బెంగాలీ, హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు. దోసర్ మూవీకి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. చివరగా ఖాకీ: ద బెంగాల్ చాప్టర్ అనే వెబ్ సిరీస్లో కనిపించాడు. ప్రస్తుతం మాలిక్ అనే మూవీ చేస్తున్నాడు. పులకిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, మానుషి చిల్లరి, మేధా శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
కూతురికి రూ. 250 కోట్లు గిఫ్ట్గా ఇచ్చిన స్టార్ హీరో దంపతులు
తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కోట్ల ఆస్తిని కూడబెడుతుంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ అతీతులు కాదని చెప్పవచ్చు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల (Ranbir Kapoor, Alia Bhatt) ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు మూడేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు త్వరలో షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో ఈ దంపతులు రాశారు. ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు. అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేపించుకోకుండా కూతురు, అమ్మకు గిఫ్ట్గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు.ఆ ఇంటితో రణబీర్ అనుబంధంవాస్తవంగా ఆ ఇల్లు రణబీర్ కపూర్కు వారసత్వంగా వచ్చింది. రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్లో ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషీ కపూర్ అందులోనే ఉన్నారు. అలా వారసత్వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే, దానిని రీమోడలింగ్ చేయించారు. పాత కట్టడాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించారు. మరో రెండు నెలల్లో గృహప్రవేశం చేయనున్నారు.రణబీర్కు ఆ ఇల్లు వారసత్వానికి గుర్తు.. దానిని చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాడు. అయితే, తనకు కూతురు పుట్టిన తర్వాత కెరీర్ పరంగా ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో దాదాపు రూ. 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేపించాడు. దాంతో బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది. భవిష్యత్లో తన కూతురు ఆ ఇంట్లో ఎలా ఉండాలో అందుకు అనుగుణంగానే ఆయన నిర్మించుకున్నారట. వచ్చే దీపావళిని తన కూతురుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వీధిలోకొచ్చారు... థియేటర్కి వెళ్లారు... గోడ దూకారు!
ఒక హీరో తన సినిమా ప్రమోషన్ కోసం జనాల్లోకి వచ్చారు... ఇంకో హీరో విడుదలైన తన సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి థియేటర్కి వెళ్లారు... మరో నటుడు షూటింగ్కి లేట్ అవుతుందని గోడ దూకేశారు... వీరు ఏం చేసినా సినిమా కోసమే. బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ తాజాగా ఇలా హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఆ విశేషాలు తెలుసుకుందాం. వడపావ్ చేస్తూ... సినిమా ప్రమోషన్ కోసం ఏ అవతారం ఎత్తడానికైనా రెడీ అయిపోతారు ఆమిర్ ఖాన్. అందుకు ఓ ఉదాహరణ ‘3 ఇడియట్స్’ (2009) సినిమా. ఈ చిత్రం విడుదల సమయంలో పంజాబ్లో జరిగిన పెళ్లి వేడుకలకు ఫారినర్లా డ్రెస్ చేసుకుని హాజరయ్యారు ఆమిర్. ఆ తర్వాత అసలు గెటప్లోకి మారి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా తాను హీరోగా నటిం చిన ‘సితారే జమీన్ పర్’ ప్రచారం కోసం జనాల్లోకి వచ్చి, ‘వడపావ్’ తయారు చేశారు ఆమిర్. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఆమిర్ ఖాన్ దర్శకత్వం వహించి, నటించిన ‘తారే జమీన్ పర్’ (2007)కి సీక్వెల్గా ‘సితారే జమీన్ పర్’ రూపొందింది. ఆర్ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి ఆమిర్ ఖాన్ ఓ నిర్మాత. రివ్యూ కోసం మాస్క్తో!మామూలుగా సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉందో తెలుసుకోవడానికి నిర్మాతలు, పంపిణీదారులు, సన్నిహితులను అడుగు తుంటారు స్టార్స్. అయితే ‘హౌస్ఫుల్ 5’ సినిమా ఎలా ఉందో స్వయంగా ప్రేక్షకులను అడిగి తెలుసుకోవాలనుకున్నారు ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేసిన అక్షయ్ కుమార్. ముఖానికి మాస్క్ తొడుక్కుని ముంబైలోని ఓ థియేటర్కి వెళ్లి, మైక్ పట్టుకుని ‘సినిమా ఎలా ఉంది’ అని థియేటర్ నుంచి బయటికొస్తున్న ప్రేక్షకులను అడిగారు. ఆ వీడియో వైరల్గా మారింది. ‘హౌస్ఫుల్’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ‘హౌస్ఫుల్ 5’లో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఏడు పదుల వయసులో గోడ దూకి...షూటింగ్కి ఆలస్యం అవుతోంది... డ్రైవర్ని కారు వేగం పెంచమన్నారు అనుపమ్ ఖేర్. కట్ చేస్తే... షూటింగ్ లొకేషన్కి చేరుకోలేదు. ఎందుకంటే కారు డెడ్ ఎండ్కి చేరుకుంది. రివర్స్ చేసుకుని, వెనక్కి వెళదామంటే వీలు పడలేదట. ఓ గోడ దూకితే అటు పక్క లొకేషన్ ఉంది. సాహసం చేసేద్దాం అని అనుపమ్, ఆయన టీమ్ నిర్ణయించుకున్నారు. నిచ్చెన తెచ్చారు. అనుపమ్ ఖేర్ ఆ నిచ్చెన ఎక్కి, గోడ దూకి లొకేషన్లోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన వయసు ఎంతో తెలుసా? 70. ఏడు పదుల వయసులో అనుపమ్ ఖేర్ ఇలా జోష్గా, జోరుగా గోడ దూకడం హాట్ టాపిక్ అయింది.ఆయన ఏ షూటింగ్లోపాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్నారంటే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం. ఈ చిత్రంలో ఈ బాలీవుడ్ నటుడు కీలకపాత్ర చేస్తున్నారు. ఇక తాను ఇలా గోడ దూకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వివరించి, ఆ వీడియోను షేర్ చేశారు అనుపమ్ ఖేర్. ‘‘నా 40 ఏళ్ల సినిమా ప్రయాణంలో పలు రకాలుగా షూటింగ్ లొకేషన్స్కి వెళ్లాను. కానీ, ఇలా వెళ్లడం చాలా ప్రత్యేకంగా, కామెడీగా అనిపించింది’’ అని రాసుకొచ్చారీ సీనియర్ నటుడు. -
'చిన్ననాటి కల నెరవేరింది.. అత్తారింటికి దారేది నటుడు పోస్ట్'!
అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న స్టార్ నటుడు బోమన్ ఇరానీ. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొత్త ఏడాదిలో ది మెహతా బాయ్స్ సినిమాతో డైరెక్టర్గా మారిన ఆయన.. తాజాగా నటిస్తోన్న చిత్రం 'తన్వి ది గ్రేట్'. అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో నటి శుభంగి దత్ టైటిల్ రోల్లో నటించింది. ఈ చిత్రాన్ని ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 18న థియేటర్లో సందడి చేయనుంది.ఇక బోమన్ ఇరానీ సినిమాల సంగతి పక్కనపడితే.. ఆయన వ్యక్తిగతంగానూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా తన చిన్ననాటి కల నేరిందని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రత్యేక పుట్టినరోజున నా కలను సాకారం చేసిన తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెంచ్ ఓపెన్ చూడాలనుకున్న తన కలను నేరవేర్చినందుకు తన భార్య జెనోబియా, కుమారులు దనేశ్, కయోజ్ ఇరానీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్ప్రైజ్ను వారంతా కలిసి తన పుట్టినరోజుకు ప్లాన్ చేసి మరి బహుమతిగా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
ప్రేక్షకుల వెంట పరిగెత్తిన స్టార్ హీరో.. ఎవరూ గుర్తుపట్టలేదు!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవలే హౌస్ఫుల్-5 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హౌస్ఫుల్ సూపర్ హిట్ సిరీస్లో వచ్చిన ఐదో చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నటించిన అక్షయ్ కుమార్ ఫ్యాన్స్కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తన మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి థియేటర్ వద్దకు వెళ్లాడు.ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ రోజు నేను కిల్లర్ మాస్క్ ధరించి బాంద్రాలో హౌస్ఫుల్ 5 థియేటర్ నుంచి బయటికి వస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశా. ఈ అనుభవం చాలా హ్యాపీగా అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే అక్షయ్ కుమార్ను ఏ ఒక్క అభిమాని కూడా గుర్తు పట్టకపోవడం విశేషం. ఇది చూసిన నెటిజన్స్ ఇలా చేయడం అక్షయ్కి మాత్రమే సాధ్యమని అంటున్నారు.కాగా.. జూన్ 6న విడుదలైన హౌస్ఫుల్-5 మూవీ దేశీయ బాక్సాఫీస్ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ. 24 కోట్లు రాబట్టిన ఈ మూవీ..రెండో రోజున దాదాపు రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) Whaaat this is so funny. He is so cute and funny 😍How could the people there not notice? I knew @akshaykumar sir by his walk, voice, physical structure, clothes, bracelet on his wrist and even his smell. I wish the people there knew how lucky they were 😱🥹#AkshayKumar : "… pic.twitter.com/tkkiPAE9Ej— Emine Gelinci ʰᵒᵘˢᵉᶠᵘˡˡ⁵ 🧡🔥 Forever Akkian (@Akkian_Emine87) June 8, 2025 #AkshayKumar instagram post lmao. Akki sir asking how's his movie to public. Unka chhodo me bata deta hu mast movie me must watch just go for it.😂🔥or @akshaykumar sir aapki team badlo jinko kesa mike use karna chahiye wo bhi nahi pata.#Housefull5 #Housefull5Review pic.twitter.com/mKUU9NYX1F— axay patel 🔥🔥 (@akkiDhoni2) June 8, 2025 -
బీ గ్రేడ్ చిత్రాలతో కెరీర్ నాశనం.. పెద్ద సినిమాలు చేజార్చుకున్నా!
దీప్శిఖ నగ్పాల్ (Deepshikha Nagpal).. కోయిల, బాద్షా, దిల్లగీ, పార్ట్నర్ వంటి బాలీవుడ్ (Bollywood) హిట్ సినిమాల్లో నటించింది. హిందీ బిగ్బాస్ 8వ సీజన్లోనూ పాల్గొంది. బుల్లితెరపైనా పలు సీరియల్స్లో తళుక్కుమని మెరిసింది. అయితే కొన్ని చెత్త సినిమాలను సెలక్ట్ చేసుకోవడం వల్ల అవకాశాలు తగ్గడంతో బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చిందంటోంది.తప్పుడు నిర్ణయాలతో కెరీర్ తలకిందులుఇన్స్టంట్ బాలీవుడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్శిఖ మాట్లాడుతూ.. నేను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కెరీర్ను దెబ్బకొట్టాయి. అప్పట్లో ఎలా ఉండేదంటే.. యశ్ రాజ్, సుభాష్ వంటివారు నిర్మించేవి మాత్రమే ఏ గ్రేడ్ సినిమాలుగా పరిగణించేవారు. కొత్త నిర్మాణ సంస్థ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుందంటే అది బీ గ్రేడ్ సినిమాలకిందే లెక్కేసేవారు. నాకు ఏవి సెలక్ట్ చేసుకోవాలనేది అర్థం కాలేదు.ఏదైనా పనే అనుకున్నా..పైగా నా ఫ్యామిలీలో ఎవరికీ సినీరంగంతో పరిచయమే లేదు. కానీ సినీరంగంలో మనకు సలహాలిచ్చే వ్యక్తి ఉంటే బాగుంటుందని నాకిప్పుడనిపిస్తుంది. సినిమాల ఎంపికలో చాలా తప్పులు చేశాను. మా తాతయ్య ఏమనేవారంటే.. ఏ పనీ చిన్నది, పెద్దది అని వ్యత్యాసం చూపించకూడదనేవారు. ఏదైనా పనే అనేవారు. దాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను. అందుకనే నాకు ఏ అవకాశం వచ్చినా ముందూవెనకా ఆలోచించకుండా చేసుకుంటూ పోయాను. ఈ క్రమంలో ఎన్నో చెత్త సినిమాలు చేశా.. అవి ఇప్పటికీ రిలీజ్ కాకుండా ఆగిపోయాయి.(చదవండి: అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి)ఆ పోస్టర్ దెబ్బ కొట్టిందికొన్ని విడుదలయ్యాయి.. కానీ, అవి నా కెరీర్ను దెబ్బకొట్టాయి. ఉదాహరణకు ట్రేడ్ గైడ్ అనే సినిమా చేసినప్పుడు ఓ పోస్టర్ వదిలారు. అప్పటికే నేను చాలా పెద్ద సినిమాలకు సంతకం చేశాను. కానీ ఆ పోస్టర్ చూశాక నేను బీ గ్రేడ్ సినిమాలు చేస్తున్నానని పక్కన పెట్టేశారు. నాకు విషయం అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ సినిమాల గురించి మర్చిపోదాం అని కోరినా కూడా వాళ్లు వినలేదు. నిన్ను తీసుకుంటే మేము నష్టపోవాల్సి వస్తుంది అని రిజెక్ట్ చేశారు. చెత్త సినిమాలు చేసినందున జనాలు నన్ను నమ్మడం మానేశారు.ఆ కోపంతో బుల్లితెరకు షిఫ్ట్పెద్ద సినిమాల్లో పని చేసే అర్హత లేదని భావించారు. నాకు పట్టరానంత కోపం వచ్చింది. అందుకే బుల్లితెరపై ఫోకస్ పెట్టాను. ఇక్కడ సీరియల్స్, షోలు చేయడం స్టార్ట్ చేశాను. శాశ్వతంగా కనుమరుగైపోకుండా నటిగా నిలబడ్డాను అని చెప్పుకొచ్చింది. దీప్శిక.. సన్ పరి, రామాయణ్, కరిష్మా- ద మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ, బల్వీర్, మధుబాలా- ఏక్ ఇష్క్ ఏక్ జునూన్, సంతోషి మా వంటి పలు సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు చేసింది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి -
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. మా ఇద్దరి కెరీర్ ముగిసింది: రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తీవ్ర విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బాలీవుడ్ను కుదిపేసింది. అతని మరణం తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను పోలీసులు సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆమెతో తమ్ముడైన షోయిక్ చక్రవర్తిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో వారిద్దరి జీవితం అనేక మలుపులు తిరిగింది.తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన రియా చక్రవర్తి..సుశాంత్ మరణం తర్వాత తాను, తన తమ్ముడు అనుభవించిన బాధను పంచుకుంది. సుశాంత్ మృతి తర్వాత మాపై ఆరోపణలు రావడంతో మా ఇద్దరి కెరీర్ ఒక్కసారిగా తలకిందులైందని వెల్లడించింది. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయని తెలిపింది.రియా మాట్లాడుతూ.. "సుశాంత్ మరణం తర్వాత మేము ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణం. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయి. నాకు నటనాపరంగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అంతేకాకుండా నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96 పర్సంటైల్ పొందాడు. కానీ అదే సమయంలో నాతో పాటు అతను అరెస్టు అయ్యాడు. జైలు నుంచి నా తమ్ముడు తిరిగి వచ్చాక మొదటి త్రైమాసిక పరీక్షలు మిస్సయ్యాడు. దీంతో అతని ఎంబీఏ కెరీర్ భవిష్యత్తును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఏదైనా కార్పొరేట్లో ఉద్యోగం పొందడం చాలా కష్టమైంది. ఎందుకంటే నా తమ్ముడిని నియమించుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. కొద్దిరోజులు మా జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాలేదు. ఆ తర్వాత ఛాప్టర్-2 డ్రిప్ అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించాలనే ఆలోచన తనకు, షోయిక్కు వచ్చిందని.. దాన్నే కెరీర్గా ఎంచుకున్నామని " అని తాము ఎదుర్కొన్న బాధలను వివరించింది.అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్కాస్ట్ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. -
ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు
సినిమా కోసం కొన్నిసార్లు విన్యాసాలు చేయక తప్పదంటున్నాడు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). అదేదో సినిమాలో స్టంటనుకునేరు, కానే కాదు సినిమా సెట్కు వెళ్లేందుకు స్టంట్ చేయాల్సి వచ్చింది. అనుపమ్ ఖేర్.. ప్రభాస్ ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే సెట్లోకి వెళ్లేందుకు అనుపమ్ గోడ దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇదే తొలిసారినా 40 ఏళ్ల జర్నీలో ఎన్నో రకాలుగా షూటింగ్ లొకేషన్కు వెళ్లాను. కానీ ఈరోజు ఇలా సెట్కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి, ప్రత్యేకం కూడా! హైదరాబాద్లో ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్కు బయలుదేరాం. మా డ్రైవర్ దాన్ని సాహసోపేతంగా మార్చాలనుకున్నాడేమో బహుశా.. ఏకంగా అడవిలాంటి ప్రదేశంలోకి తీసుకొచ్చాడు. తీరా డెడ్ ఎండ్కు చేరుకున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. గోడ దూకి సెట్లోకి..కారు రివర్స్ తీద్దామని ప్రయత్నించినా వీలు కాలేదు. మా పక్కనే సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో గోడ దూకి సెట్లోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన జనాలు.. కెరీర్ తొలినాళ్లలో ముసలి వ్యక్తిగా నటించారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో అడవిలో ఈ స్టంట్లు చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జంటగా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ.. -
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
మలయాళ సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) 'కల్కి 2898 ఏడీ' సినిమా (Kalki 2898 AD Movie)తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే వచ్చిన తుడరుమ్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది.అమితాబ్తో పాట షూటింగ్బచ్చన్ సర్ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. నాతో కలిసి పనిచేసినవారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్ ఆయన. గొప్ప ఆర్టిస్టుల్లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్ (Amitabh Bachchan) సర్ గురించి మీకో విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్ సర్ దగ్గర కారవాన్ ఉంది. కానీ చాలామంది షూట్ చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా స్థంభించిపోయింది.చెట్టు వెనకాల..నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు.. తను మలయాళ సినిమా నుంచే కదా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతారు. చెట్టు వెనకాల దుస్తులు మార్చుకుంటుందిలే అని కామెంట్ చేశారు. బచ్చన్ సర్ దగ్గరున్న వాకీటాకీలో ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది? అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారవాన్లోకి తీసుకెళ్లాడు. నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.కల్కి 2898 ఏడీలో..కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువున్న దుస్తులు వేసుకున్నాడు. భారీ ప్రోస్తటిక్స్ (హెవీ మేకప్) వాడాడు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవాడు అని చెప్పుకొచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించాడు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, శోభన మరియంగా, దీపికా పదుకొణె సుమతిగా, కమల్ హాసన్ యాస్కిన్గా నటించారు. ఈ చిత్రం గతేడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం వెయ్యికోట్లపైనే వసూళ్లు రాబట్టింది. కల్కి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కనుంది. చదవండి: ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్ -
చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే భయం!
పాపులర్ కమెడియన్ జానీ లివర్ (Johny Lever) కూతురు జామీ లివర్ (Jamie Lever) హిందీలో అనేక సినిమాలు చేసింది. గతేడాది ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె తన బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. నాకు పదేళ్లుంటాయనుకుంటా. స్కూల్ అయిపోగానే వెళ్లి కారులో కూర్చున్నాను. మా డ్రైవర్ నా సోదరుడు జెస్సీ కోసం బయట ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి మా కారు దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కారు డోర్ తీసి లోపలకు వస్తే నా పరిస్థితి ఏంటని భయంతో వణికిపోయాను.మమ్మల్ని కాపాడాల్సిన వ్యక్తే..డోర్ లాక్ చేసి తనను చూడనట్లే ఉన్నాను. దాంతో అతడు కాసేపటికి వెళ్లిపోయాడు. బస్ కండక్టర్ కూడా మాతో పద్ధతిగా ప్రవర్తించేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా తాకాలని చూసేవాడు. ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవాలనుకునేదాన్ని. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తే ఇలా నీచంగా ఆలోచిస్తే ఏమనాలి? ఇవన్నీ చూశాక అబ్బాయిలను నా జీవితంలోకి ఆహ్వానించాలంటేనే భయమేసింది. 20'sలో కేవలం ఒక్కరిని మాత్రమే డేటింగ్ చేశాను. నాకు జరిగిన అనుభవాలను అమ్మ సుజాతకు, నాన్న జానీ లివర్కు కూడా చెప్పుకోలేదు అని తెలిపింది.చదవండి: పవన్ కల్యాణ్ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్ నారంగ్ -
నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా: అతియా ఎమోషనల్
మనకెంతో ఇష్టమైనవారిని కోల్పోతే ఆ బాధ తట్టుకోలేం. వాళ్లిక మనముందుకు ఎప్పటికీ రాలేరన్న నిజాన్ని జీర్ణించుకోలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తోంది హీరోయిన్ అతియా శెట్టి (Athiya Shetty). తను ఎంతో ప్రేమగా చూసుకునే పెంపుడు కుక్క బ్రోడీ కన్నుమూసింది. దీంతో భావోద్వేగానికి లోనైన అతియా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. మై బ్రోడీ.. నువ్వు లేకుండా ఇంటిని, ఈ జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. నా చిన్నతనంలో నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ.. అని రాసుకొచ్చింది.మాటల్లో చెప్పలేకపోతున్నా..అతియా సోదరుడు, నటుడు అహాన్ (Ahan Shetty) సైతం బ్రోడీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నీకు వీడ్కోలు పలకాలంటే మనసు భారంగా ఉంది. నా జీవితంలో అతి ముఖ్యమైన సమయాల్లో నువ్వు నావెంటే ఉన్నావు. నువ్వు నాకెంత ఇష్టమనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావ్.. ఒక తమ్ముడిలా నిలబడ్డావ్.. యు వర్ మై హార్ట్. నీకు గుడ్బై చెప్పడం ఎంతో కష్టంగా ఉంది. ఎంతగానో మిస్ అవుతాను బ్రోడీ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. అటు సునీల్ శెట్టి సైతం.. రిప్ మై బేబీ అని బాధపడ్డాడు.సినిమా..బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty)కి కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్ సంతానం. హీరో, ముబాకరన్, మోతీచూర్ చక్నాచూర్ సినిమాలతో మెప్పించిన అతియా.. 2023లో క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడింది. వీరికి ఈ మధ్యే పాప పుట్టింది. అహాన్.. తడప్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బోర్డర్ 2, సంకి చిత్రాల్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ahan Shetty (@ahan.shetty) చదవండి: 'ఢీ'.. దిల్రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు -
90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో తల్లి!
90 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ స్టార్ హీరో తల్లి మాత్రం వృద్ధాప్యంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) తల్లి జీనత్ ఖాన్ (Zeenat Khan) ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో నటించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమిర్ స్వయంగా వెల్లడించాడు. బ్లాక్బస్టర్ సినిమా సీక్వెల్లో..'2007లో వచ్చిన తారే జమీన్ పర్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే! దానికి సీక్వెల్గా సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par Movie) రాబోతోంది. ఈ మూవీలో అమ్మ ఓ చిన్న పాత్రలో కనిపించనుంది. నిజానికి తనకు సినిమాలంటే పెద్దగా ఇష్టముండదు. నాతో సెట్స్కు ఎప్పుడూ వచ్చేది కాదు. కానీ, సడన్గా ఓ రోజు నా మూవీ షూటింగ్ ఏ ప్రదేశంలో జరుగుతోంది? అని ఆరా తీసింది. అది విని నేను ఆశ్చర్యపోయాను. తనకు సెట్కు రావాలనుందని చెప్పింది.మొట్టమొదటిసారి కెమెరాముందుకు..దాంతో నా సోదరి అమ్మను వీల్చైర్లో నేనున్న లొకేషన్కు తీసుకొచ్చింది. ఆ రోజు పెళ్లి సెలబ్రేషన్స్పై పాట షూట్ చేస్తున్నాం. దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్నకు అప్పుడే ఓ అద్భుతమైన ఐడియా తట్టింది. మీ అమ్మను కూడా పాటలో కనిపించేలా చేస్తే ఎలా ఉంటుంది? అని అడిగాడు. కానీ, తను ఒప్పుకుంటుందా? అని ఆలోచించాను. ఏదైతే అది అయిందని అమ్మను అడిగితే ఆమె వెంటనే ఓకే చెప్పి నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యామిలీతో కలిసి..కొన్ని షాట్స్లో ఆమె కనిపిస్తుంది. తను నటించిన ఏకైక సినిమా ఇదే కావడంతో ఈ మూవీ నాకెప్పుడూ ఓ అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోనుంది. నా సోదరి కూడా తొలిసారి నాతో కలిసి నటించింది. భవిష్యత్తులో కూడా తనతో మరోసారి కలిసి యాక్ట్ చేస్తానేమో.. అని ఆమిర్ చెప్పుకొచ్చాడు. సితారే జమీన్ పర్ సినిమాలో అరోష్ దత్త, గోపీ కృష్ణ వర్మ, వేదాంత్ శర్మ, రిషబ్ జైన్, ఆశిష్ పెండ్సే.. తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది.చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా! -
భాయ్... బాబా... ఓ అంతర్జాతీయ చిత్రం
‘‘అదిరింది టీజర్... సల్మాన్ భాయ్ భలే ఉన్నాడు... సంజూ బాబా కూడా బాగున్నాడు’’ అంటూ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ల అభిమానులు ఆనందపడిపోతున్నారు. శుక్రవారం విడుదలైన సౌదీ అరేబియన్ మూవీ ‘7 డాగ్స్’ టీజర్లో సల్మాన్, సంజయ్ల లుక్స్ని ఇలా ప్రశంసించారు. ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి అంతర్జాతీయ చిత్రం ఇది.ఈ చిత్రానికి అదిల్ ఎల్ అరబీ, బిలాల్ ఫల్లాహ్ దర్శకత్వం వహిస్తున్నారు. అరబ్ స్టార్స్ కరీం అబ్దెల్ అజీజ్, అహ్మద్ ఎజ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో సల్మాన్, సంజయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. టీజర్లో ఇద్దరి పాత్రల గురించిన విశేషాలను బయటపెట్టలేదు. సల్మాన్ విచిత్రమైన చూపులు చూస్తుండగా, తుపాకీ గురి పెట్టి, కోపంగా కనిపించారు సంజయ్ దత్.కథేంటంటే... వార్తల్లో ఉన్న ప్రకారం... ఇంటర్పోల్ ఆఫీసర్ ఖలీద్ అల్ అజ్జాజీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. రహస్య ప్రపంచ నేరాల సిండికేట్ అయిన ‘7 డాగ్స్’లోని ఉన్నత స్థాయి సభ్యుడు ఘాలీ అబు దావూద్ను ఈ అధికారి పట్టుకుంటాడు. ఓ ఏడాది తర్వాత ఆ సంస్థ తిరిగి పుంజుకుంటుంది. పింక్ లేడీ అనే కొత్త డ్రగ్ను రవాణా చేయడం ప్రారంభిస్తుంది. ఈ ముఠా గుట్టుని రట్టు చేయడానికి ఖలీద్ అయిష్టంగానే ఘాలీతో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ అని సమాచారం. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. -
మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.బ్లాక్బస్టర్ కల్కిస్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్.. ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ నిర్మించాడు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు -
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
కెరీర్ ప్రారంభంలో అవమానాలు, చీవాట్లు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎందరో! తొలి సినిమాకు తను కూడా అలాంటి బాధే అనుభవించానంటున్నాడు నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం (Muzammil Ibrahim). ఈ సూపర్ మోడల్ ఢోకా సినిమాతో హీరోగా మారాడు. ఆ సమయంలో డైరెక్టర్ పూజా భట్ తనను చులకనగా చూసేదని, తల కొట్టేసినట్లుగా ఉండేదని చెప్తున్నాడు.తొలి సినిమా.. దారుణ అనుభవాలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ముజమ్మిల్ ఇబ్రహీం మాట్లాడుతూ.. పూజా భట్ (Pooja Bhatt) నన్ను అన్ప్రొఫెషనల్ అని పిలిచేది. తనకు కోపమెక్కువ. అందుకుతోడు యాటిట్యూడ్.. నటులను చులకనగా చూసేది. నిర్మాత మహేశ్ భట్కు మాత్రం నేనంటే చాలా ఇష్టం. మంచి నటుడినని అంటుండేవారు. ఢోకా సినిమా సమయానికి నా వయసు దాదాపు 20 ఉంటుందనుకుంటా.. అంతే! సెట్లో నన్ను దారుణంగా చూసేవారు. నేను అందరితోనూ గౌరవంగా నడుచుకునేవాడిని.. నాకంటూ కొన్ని అంచనాలుండేవి. కానీ అవన్నీ తలకిందులు చేశారు. నటులంటే శునకాలు!నాతో దుర్భాషలాడిన తీరు చూశాక మరెలాంటి అంచనాలు పెట్టుకోలేదు. ఆ రేంజ్లో ఆమె నన్ను తిట్టేది. ఈ వాతావరణం చూశాక నాకు చాలా భయమేసింది. సూపర్ మోడల్గా ఇండియాలో నాకంటూ గుర్తింపు, గౌరవం ఉండేది. నేను పడుతున్న అవమానాలు చూసి మహేశ్ భట్ సర్.. నాతో అలా ప్రవర్తించవద్దని పూజా భట్ను కోరేవాడు. కానీ ఆయన సెట్లో లేనప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేది. అంతేకాదు.. నటులు కుక్కల్లాంటివారని.. తాము కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలని ఆమె అంటూ ఉండేదట. (చదవండి: ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ)పీడకలలు వెంటాడేవిచిన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవన్నీ విని భరించలేకపోయాను. నాపై వచ్చిన వార్తలు చూసి మరింత కలత చెందాను. నిద్రలో కూడా పీడకలలు వచ్చేవి. ఎలాగోలా ఆ రోజు బతికితే చాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తుండేవాడిని. అలా కష్టాలు అనుభవించాను. అందుకే తర్వాత రాజ్ 2 ఆఫర్ వచ్చినా చేయలేదు అని చెప్పుకొచ్చాడు. దీపికాతో రిలేషన్దీపికా పదుకొణె (Deepika Padukone)తో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ముంబైకి వచ్చిన కొత్తలో దీపిక పదుకొణె మోడల్గా పని చేసింది. అప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నాం. మా దగ్గర డబ్బు లేక రిక్షాలోనే తిరిగేవాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పుకున్నాం. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు పెళ్లయ్యాక మాట్లాడుకోవడమే మానేశాం అని తెలిపాడు. దీపికా.. హీరో రణ్వీర్ సింగ్ను 2019లో పెళ్లాడింది. వీరికి గతేడాది దువా అనే కూతురు జన్మించింది.సినిమాఢోకా మూవీ (Dhokha Movie) విషయానికి వస్తే.. 2007లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ముజమ్మిల్ నటనకు ప్రశంసలు దక్కాయి. తులిప్ జోషి హీరోయిన్గా నటించగా అనుపమ్ ఖేర్, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.చదవండి: అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్లకు స్టార్డమ్: ఆర్జీవీ -
స్టార్ హీరోతో 'లోకేష్ కనగరాజ్' కొత్త సినిమా ప్రకటన
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్లో విక్రమ్, లియో, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో టాప్ దర్శకుడిగా దేశవ్యాప్తంగా లోకేష్ కనగరాజ్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తొలిసారి ఒక బాలీవుడ్ సినిమాను తెరకెక్కించనున్నారు.ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ కనగరాజ్తో తాను ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలిపారు. అత్యంత భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయని ఆయన అన్నారు. సూపర్హీరో జానర్లో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే, వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఈ సినిమా గురించి చర్చించుకుందామని ఆమిర్ ఖాన్ సూచించారు.‘పీకే 2’ సినిమా గురించి సోషల్మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమిర్ ఖాన్ అన్నారు. పీకే2 సినిమా చేయాలనే ఆలోచన లేదని ప్రకటించారు. అయితే, 'దాదా సాహెబ్ ఫాల్కే'పై సినిమా చేస్తున్నామని, రాజ్ కుమార్ హిరాణీతో చర్చలు జరుగుతున్నాయిని చెప్పారు. ‘మహాభారతం’పై సినిమా చేయాలనేది తన 25 ఏళ్ల డ్రీమ్ అంటూ ఆమిర్ ఖాన్ తెలిపారు. అదొక యజ్ఞంలా చేయాలనే ఆలోచన ఉంది. చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని విషయాలు చెబుతానని ఆమిర్ అన్నారు.ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ మరో కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని ఆమిర్ సినిమా చేయనున్నారు. -
కేన్సర్పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్ పెళ్లి సందడి (ఫొటోలు)
-
ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్. ఈ సినిమాలో సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'జాట్' ఏప్రిల్ 10న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన జాట్.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్ల వరకు రాబట్టింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా విలన్గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.జాట్ అసలు కథేంటంటే..?ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్ (సన్నీ డియోల్)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది. ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్తో జాట్ రెచ్చిపోతాడు. ఈ విషయం కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.Don't fear, Jaat is finally here 💥 Iske jaisa na kabhi hua hai, na kabhi hoga 🔥💪Watch Jaat, out now in Hindi and Telugu on Netflix.#JaatOnNetflix pic.twitter.com/3IBxy7QNhi— Netflix India (@NetflixIndia) June 5, 2025 -
సినిమా ఒకటి... క్లైమాక్స్లు రెండు
ఒకప్పుడు ప్రేక్షకులకు వినోదం అంటే థియేటర్స్లో సినిమాయే. కానీ అభివృద్ధి చెందిన సాంకేతికత వల్ల ప్రేక్షకులకు పలు రకాల వినోద మాధ్యమాలు (ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఓటీటీ వంటివి) ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకురావడం హీరోలు–దర్శక–నిర్మాతలకు పెద్ద సవాల్గా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్ప స్టార్ హీరోల సినిమాలూ ఎక్కువ రోజులు థియేటర్స్లో ఆడే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇక రిపీట్ ఆడియన్స్ అన్నమాట దాదాపుగా కనుమరుగైపోతోంది. స్టార్ హీరోల సినిమాలకు సైతం రిపీట్ ఆడియన్స్ ఉండటం లేదు. ఎలాగూ నెల రోజులు తిరిగే లోపు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా స్ట్రీమింగ్ ఉంటుందనేమో ప్రేక్షకులు నచ్చిన సినిమాను మరోసారి థియేటర్స్లో చూసేందుకు ఏమాత్రం సిద్ధపడటంలేదు. స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే రెండోసారి ప్రయత్నిస్తుండవచ్చు కానీ సగటు ప్రేక్షకుడు ఒకే సినిమాను థియేటర్స్లో రెండోసారి చూస్తున్న సందర్భాలు చాలా తక్కువైపోయాయన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హీరోలు–దర్శక–నిర్మాతలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ని ఆకర్షించే సరికొత్త వ్యూహాలను రచిస్తూనే ఉన్నారు. తాజాగా హిందీ చిత్రం ‘హౌస్ఫుల్ 5’ యూనిట్ ప్రేక్షకులను ఆకర్షించే ఓ సరికొత్త వ్యూహానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 5ఏ అండ్ 5బీ హిందీ చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీస్లో ‘హౌస్ఫుల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు నాలుగు సినిమాలొచ్చాయి. ఐదో సినిమా ‘హౌస్ఫుల్ 5’ ఈ నెల 6న విడుదలకు సిద్ధమైంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్... ఇలా ప్రముఖ తారలు ‘హౌస్ఫుల్ 5’ సినిమాలో నటించారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాని ‘హౌస్ఫుల్ 5ఏ, హౌస్ఫుల్ 5బీ’ అంటూ రిలీజ్ చేస్తున్నారు. కానీ... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావడం లేదు. ఒకే సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్లు ఉంటాయన్నమాట. అంటే... ‘హౌస్ఫుల్ 5ఏ’ సినిమాలో ఒక క్లైమాక్స్ ఉంటే, ‘హౌస్ఫుల్ 5బీ’లో మరో డిఫరెంట్ క్లైమాక్స్ ఉంటుంది. అలాగే ‘హౌస్ఫుల్ 5ఏ, హౌస్ఫుల్ 5బీ’... ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలవుతున్నాయి. ఈ విషయాన్ని ఈ చిత్రంలో హీరోలుగా నటించిన అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్ ఇన్స్టాలో ఓ వీడియోతో అధికారికంగా ధ్రువీకరించారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా ‘హౌస్ఫుల్ 5’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘హౌస్ఫుల్ 5’ కూడా సిద్ధమైంది. ‘హౌస్ఫుల్ 5’ సినిమా రెండు డిఫరెంట్ క్లైమాక్స్లతో రాబోతోంది. మరి... మీరు ‘హౌస్ఫుల్ 5ఏ’ చూస్తారా? లేక ‘హౌస్ఫుల్ 5బీ’ చూస్తారా? లేదా రెండూ చూస్తారా?’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు అక్షయ్ అండ్ రితేష్. ఇదిలా ఉంటే... ‘హౌస్ఫుల్ 5’ సినిమా కథాంశం ఓ కిల్లర్ను కనుక్కునే నేపథ్యంలో సాగుతుంది. దీంతో ‘హౌస్ఫుల్ 5ఏ’లో కిల్లర్ ఒకరైతే, ‘హౌస్ఫుల్ 5బీ’లో కిల్లర్ మరొకరు ఉంటారట. తొలి ఇండియన్ సినిమా! కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచి ఆకట్టుకున్నా క్లైమాక్స్లో మాత్రం ఆడియన్స్ను నిరాశపరుస్తాయి. కానీ ‘హౌస్ఫుల్ 5’ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారికి ఈ సమస్య ఉండకపోవచ్చు. ‘హౌస్ఫుల్ 5ఏ’ సినిమా చూసిన ఆడియన్స్ ‘హౌస్ఫుల్ 5బీ’ సినిమా క్లైమాక్స్ కోసం మళ్లీ ఆ సినిమాను చూసేందుకు థియేటర్స్కు వెళ్లొచ్చు. అలాగే ‘5బీ’ చూసినవాళ్లు ‘5ఏ’ క్లైమాక్స్ ఇంకా బాగుందని వింటే... ఆ వెర్షన్ చూడ్డానికి వెళ్లే అవకాశం ఉంది. ఇలా ప్రేక్షకుల్లో ‘హౌస్ఫుల్ 5’ సినిమా గురించి ఓ రకమైన చర్చ మొదలవుతుంది. ఈ చర్చ సినిమాకు మౌత్టాక్గా మారి, ప్రమోషన్కు ఉపయోగపడుతుంది. ఇదే జరిగితే థియేటర్స్కు వచ్చే ఆడియన్స్ సంఖ్య మెల్లిగా పెరుగుతుంది. వసూళ్లకు ఇదో కొత్త మార్గం అవుతుంది. రిపీట్ ఆడియన్స్తో థియేటర్లు హౌస్ఫుల్ అయితే... హౌస్ఫుల్ టీమ్ వ్యూహం సక్సెస్ అయినట్లే లెక్క. మరి... ఈ ‘హౌస్ఫుల్ 5’ టీమ్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే... రెండు డిఫరెంట్ క్లైమాక్స్లతో ఒకేసారి విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ‘హౌస్ఫుల్ 5’ అంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. -
Wedding: క్యాన్సర్తో నటి.. కంటికి రెప్పలా చూసుకునే ప్రియుడు..
బుల్లితెర సెలబ్రిటీ జంట హీనా ఖాన్ (Hina Khan)- రాకీ జైస్వాల్ (Rocky Jaiswal) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 11 ఏళ్ల ప్రేమాయణానికి శుభం పలుకుతూ బుధవారం నాడు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను హీనా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇద్దరి ప్రపంచాలు వేరైనా ప్రేమ అనే బంధంతో ఒక్క గూటికి చేరాం. రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఎవరూ విడదీయలేనంతగా మా బంధం బలపడింది. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నటిదాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాం. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వైవాహిక ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే హీనా ఖాన్, రాకీ జైస్వాల్ 2014 నుంచి డేటింగ్ చేస్తున్నారు. తన విజయాల్లోనే కాకుండా కష్టాల్లోనూ ఆమెకు రాకీ అండగా ఉన్నాడు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఆమెకు సపోర్ట్గా నిలబడ్డాడు. సీరియల్స్..కీమోథెరపీ వల్ల ఆమె జుట్టు తీసేయాల్సి వస్తే అతడు సైతం గుండు గీయించుకుని తనకు మద్దతుగా ఉన్నాడు. తల్లిలా దగ్గరుండి సేవ చేశాడు. ఇలాంటి పార్ట్నర్ దొరకడం తన అదృష్టమని హీనా ఖాన్ పలుమార్లు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో పాపులారిటీ సంపాదించుకుంది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ప్రధాన పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ.. -
టాలీవుడ్ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే!
బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి (Gurmeet Choudhary) - దెబీనా బెనర్జీ (Debinna Bonnerjee) ఇంట దొంగతనం జరిగింది. అది కూడా గుర్మీత్ ఇంట్లో ఉన్న సమయంలోనే కావడం గమనార్హం. ఈ చోరీ విషయాన్ని నటుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అలర్ట్: కొత్తగా చేరిన ఓ పనిమనిషి మా ఇంట్లో కొన్ని వస్తువులు దొంగిలించి పారిపోయాడు. అయితే మా ఇంట్లో ఎవరు పనిలో చేరుతున్నా వారి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను. దానివల్ల పోయిన వస్తువులు తిరిగి రాబట్టుకోవడం సులువైంది. చోరీ సమయంలో ఇంట్లోనే..దొంగతనం జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నా పిల్లలు వారి రూమ్లో సురక్షితంగా ఉన్నారు. ఇలా జరగడం మా దురదృష్టం. కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నేర్చుకున్నాను. మీ ఇంట్లో ఎవరు పనికి చేరుతున్నా వారి గురించి ముందే అన్నీ తెలుసుకోండి. వారి వివరాలు సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.డేటింగ్.. పెళ్లిటీవీ సెలబ్రిటీలు దెబీనా బెనర్జీ- గుర్మీత్ చౌదరి రామాయణ్ సీరియల్లో సీతారాముడిగా నటించారు. ఈ సీరియల్ కంటే ముందే వీరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. సీతారాముడిగా పాపులారిటీ పొందడంతో పాటు పెద్దల ఆశీర్వాదాలు అందడంతో 2011 ఫిబ్రవరి 15న పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐవీఎఫ్ ద్వారా లియానా జన్మించింది. తర్వాత దివిషా పుట్టింది. త్వరలోనే గుర్మీత్, దెబీనా.. పతీ పత్ని ఔర్ పంగా- జోడియాన్ కా రియాలిటీ అనే షోలో కనిపించనున్నారు. ఇకపోతే దెబీనా.. అమ్మాయిలు అబ్బాయిలు అనే తెలుగు సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. పేరరసు అనే తమిళ మూవీలో హీరోయిన్గా చేసింది. విజయ్కాంత్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో కాశీ విశ్వనాథ్గా డబ్ అయింది.చదవండి: మురళీమోహన్, అలీని తిట్టిన రాజేంద్రప్రసాద్.. అసలేం జరిగిందంటే -
బెంగళూరు విజయం.. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సెలబ్రేషన్స్ చూశారా?
ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో సంబురాలు మిన్నంటాయి. కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆనందం పట్టలేకపోయింది. ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. అనంతరం కోహ్లీని కౌగిలించుకుని ఎమోషనలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనుష్క శర్మ వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని హత్తుకుని ఓదార్చింది.(ఇది చదవండి: ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్తో లింక్!)అనుష్క గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "అనుష్క నాకు అన్ని కష్టాల్లోనూ అండగా నిలిచింది. వందశాతం ఆర్సీబీకి మద్దతుగా ప్రతి మ్యాచ్కు వస్తోంది. ఈ విజయం అనుష్క శర్మ గర్వంగా భావిస్తుందని కోహ్లీ అన్నారు. తను నాతో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచింది. ఆమెకు బెంగళూరుతో చాలా అనుబంధం కలిగి ఉంది. ఎందుకంటే తను కూడా బెంగళూరు అమ్మాయి. అందుకే ఈ గెలుపు ఆమెకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ విజయంతో తను చాలా గర్వంగా ఉంది.' అని అన్నారు.After IPL win, Virat posed with Anushka, whom he always credits for his success.🔥🔥🔥🔥#iplfinal2025 #RCBvsPBKSfinal #ViratKohli #AnushkaSharma#RCBChampion #ABdeVilliers pic.twitter.com/NGubvamHav— Gagan Meena (@GaganMeena47) June 4, 2025Thank you Anushka Sharma for taking care of this Kid for us 😭❤️ thank you so being there every time he needed someone so strong who can control that storm in him Thank you for being our Lady luck ❤️RCB RCB RCB #AnushkaSharma #EeSalaCupNamde pic.twitter.com/MZpZ9glX6c— Rahul | 🇮🇳 (@TheGoatNDevil) June 3, 2025 -
రాజ్కుమార్ రావు యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయొలెంట్గా టీజర్!
బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది స్త్రీ-2తో సూపర్ హిట్ కొట్టిన నటుడు.. ఇటీవల భూల్ చుక్ మాఫ్ అనే మూవీతో ప్రేక్షకులను పలరించారు. తాజాగా మరో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్తో రెడీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మాలిక్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.టీజర్ చూస్తే మోస్ట్ వయోలెంట్ గ్యాంగ్స్టర్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్లో యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 1988లో అలహాబాద్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజ్కుమార్ రావు గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. టిప్స్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మించారు. ఈ సినిమా జూలై 11, 2025న థియేటర్లలో విడుదల కానుంది. -
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. వీళ్లు చెప్పిందే రాజ్యం అన్నట్లు నడుస్తోంది. కొత్త మూవీస్ ఎప్పుడు రిలీజ్ కావాలి? ఎప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావాలనేది సదరు సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ సినిమా విషయంలో అలానే జరిగినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఉండగానే స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చేస్తున్నారట. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులోకి రానుంది?రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా 'భోల్ చుక్ మాఫ్'. లెక్క ప్రకారం ఈ మూవీ గత నెల తొలి వారంలో రిలీజ్ కావాల్సింది. కానీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని సడన్గా ప్రకటించారు. దీంతో ప్రముఖ మల్టీప్లెక్ సంస్థ.. కోర్టుని ఆశ్రయించింది. రూ.60 కోట్ల మేర దావా వేసింది. దీంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. అలానే మే 23న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కురచ దుస్తులపై కామెంట్స్.. సురేఖావాణి ఏమందంటే?)విడుదలై రెండు వారాలు కూడా కాలేదు. అప్పుడే 'భోల్ చుక్ మాఫ్' సినిమాని అమెజాన్ ప్రైమ్లోకి తీసుకొచ్చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. జూన్ 6 నుంచి అంటే ఈ వీకెండ్లో సినిమా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే గనక థియేటర్లలో ఉండగానే సినిమా.. డిజిటల్గా అందుబాటులోకి వచ్చేస్తున్నట్లే.భోల్ చుక్ మాఫ్ విషయానికొస్తే.. వారణాసిలో ఉండే రంజన్(రాజ్ కుమార్ రావ్).. టిట్లీ(వామికా గబ్బీ)ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ శివుడికి ఇచ్చి మొక్కుని మరిచిపోతాడు. దీంతో టైమ్ లూప్లో చిక్కుకుని, పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకే మళ్లీ మళ్లీ వస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడే ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. కామెడీని ఎంజాయ్ చేసే వాళ్లకు ఇదో టైమ్ పాస్ మూవీ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు) -
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్గా సంగీత్తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!)ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది. -
ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!
బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2ట'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ మరో సర్ప్రైజ్కు సిద్ధమయ్యారు.ఇవాళ జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్లో వార్-2ను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ ప్రోమోలను స్టేడియంలో ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో హృతిక్, ఎన్టీఆర్ల పాత్రలకు సంబంధించిన వీడియోను ఓవర్ బ్రేక్ల మధ్య దాదాపు పది సెకన్ల పాటు ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్లో పంజాబ్, బెంగళూరు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 'WAR 2' 10-SECOND PROMOS TO PREMIERE DURING IPL 2025 FINALS... The 10-second promos of #War2 – starring #HrithikRoshan, #JrNTR and #KiaraAdvani – will premiere on #JioHotstar during the #RCB vs #PBKS #IPLFinals tomorrow [3 June 2025]. #RCBvsPBKS pic.twitter.com/hPvvUBc6F1— taran adarsh (@taran_adarsh) June 2, 2025 -
కమల్ హాసన్ థగ్ లైఫ్లో మీర్జాపూర్ నటుడు.. క్లారిటీ ఇదే!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన పంకజ్.. ఈ వార్తలపై స్పందించారు. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్లో తాను నటించలేదని అన్నారు. ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ మాత్రమేనని తెలిపారు.గతంలో తాను దక్షిణాది భాషల్లో నటించడంపై పంకజ్ మాట్లాడారు. అక్కడ నటించాలంటే తనకు భాష ప్రధాన సమస్య అని తెలిపారు. తెలియని భాషలో నటించాలంటే అసౌకర్యంగా ఉంటుందని.. హిందీ అయితే తనకు కంఫర్ట్గా ఉంటుందన్నారు. ఒకసారి తెలుగు సినిమాలో చేయడానికి వెళ్లినప్పుడు ఏబీసీడీల దగ్గర నుంచి చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తనకు అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించారు. నా పాత్రలో చెప్పేది అర్థం నాకు అర్థం కావాలని.. అలాగే నా పాత్ర హిందీలో మాట్లాడాలి.. అప్పుడే నా నటన సహజంగా అనిపిస్తుందని పంకజ్ త్రిపాఠి పంచుకున్నారు. కాగా.. పంకజ్ త్రిపాఠి ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'మెట్రో ఇన్ డినో' ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
బాయ్ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో జాన్వీకపూర్ సిస్టర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ తన ప్రియుడి బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. బాలీవుడ్ నటుడు వేదాంగ్ రైనాతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ జూన్ 2న అతని పుట్టినరోజును కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను వీరి స్నేహితురాలు కరీమా బారీ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ బర్త్ డే పార్టీలో అనురాగ్ కశ్యప్ కుమార్తె, యూట్యూబర్ ఆలియా కశ్యప్ కూడా పాల్గొన్నారు.కాగా.. వేదాంగ్ రైనా రెండేళ్ల క్రితం ది ఆర్చీస్ (2023)తో హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన జిగ్రా (2024) మూవీలో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె తమ్ముడిగా ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వేదాంగ్ రైనా తన రాబోయే చిత్రంలో అనన్య పాండేతో స్క్రీన్ను పంచుకోనున్నారు. -
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు
మన దగ్గర తక్కువ గానీ బాలీవుడ్లో ప్రేమ, బ్రేకప్ అనేవి చాలా ఎక్కువగా వినిపిస్తుంటాయి. కలిసి సినిమా చేయడం లేటు తెగ రూమర్స్ వచ్చేస్తాయి. వాటిలో కొన్ని నిజమవుతుంటాయి. కొన్ని మాత్రం ఆదిలో ఆగిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అప్పట్లో ప్రేమించుకున్నారనే రూమర్స్ వచ్చి, విడిపోయిన ఓ జంట.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కలిశారు. రొమాంటిక్ మూవీ కూడా చేయబోతున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్.. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో 'పతీ పత్ని ఔర్ ఓ' మూవీ చేస్తున్న టైంలో హీరోయిన్ అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. తర్వాత 'కాఫీ విత్ కరణ్' షోలో ఈ విషయమై మాట్లాడిన కరణ్ జోహార్.. వాళ్లకు బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఇదే కరణ్ జోహార్.. 'దోస్తానా 2' విషయమై కార్తీక్ ఆర్యన్తో గొడవపడ్డాడు. ఇకపై తన నిర్మాణ సంస్థలో కార్తీక్తో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.కట్ చేస్తే ఇప్పుడు అదే కరణ్ జోహార్.. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా 'తూ మేరీ మైన్ తేరా, మైన్ తేరా తూ మేరీ' సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది వాలంటైన్స్ సందర్భంగా ఫిబ్రవరి 13న మూవీ థియేటర్లలోకి వస్తుందని చెప్పారు. దీంతో కార్తీక్-అనన్యతో పాటు కార్తీక్-కరణ్ జోహార్ మళ్లీ కలిసిపోయారనే టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?) -
ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె
బంగారు కళ్ల బుచ్చమ్మో.. పాటలో అమాయకంగా కనిపించి అందర్నీ ఇట్టే బుట్టలో వేసుకుంది హీరోయిన్ సోనాలి బింద్రె (Sonali Bendre). మురారి సినిమాలో ఆమె నటనకు తెలుగులో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకుండా పోయింది. దాదాపు 20 ఏళ్లలో కేవలం మూడే సినిమాలు చేసింది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో జడ్జిగా కనిపించేది.ముఖం చిట్లించేవాడుతాజాగా ఆమె ఓ స్టార్ హీరోతో చేసిన సినిమా అనుభవాల్ని పంచుకుంది. బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాలి బింద్రె మాట్లాడుతూ.. 1999లో వచ్చిన హమ్ సాత్ హై సినిమాలో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి నటించాను. ఆ సినిమా షూటింగ్లో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లం.తిట్టాలన్నంత కోపంక్లోజప్ షాట్స్ ఉన్నప్పుడు కూడా తన ముఖం అదోలా పెట్టేవాడు. అసలు నీ సమస్య ఏంటి? అని తిట్టాలనిపించేది. కానీ అలా చేయలేకపోయాను. అయితే సల్మాన్ బయటకు కనిపించేంత కఠినాత్ముడు కాదు. తను చాలా మంచివాడు. సినిమా షూటింగ్ అయ్యేకొద్దీ అతడి గురించి కొద్దికొద్దిగా తెలుసుకుంటూ వచ్చాను. తను బయటకు కోపంగా కనిపిస్తాడు. అందరూ తనను ద్వేషించాలన్నట్లుగానే ప్రవర్తిస్తాడు.బ్లాక్బస్టర్ బొమ్మకానీ తను మృదు స్వభావి. అతడి లోని మంచి మనిషిని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చింది. సల్మాన్, సోనాలి జంటగా నటించిన హమ్ సాత్ హై సినిమాను సూరజ్ బార్జాత్యా తెరకెక్కించాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, టబు, మోహ్నిష్, కరిష్మా కపూర్ తదితరులు నటించారు. ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్ -
క్యాన్సర్తో పోరాటం.. ట్రీట్మెంట్ పనిచేయక నటుడు మృతి
బుల్లితెర నటుడు విభు రాఘవ్ క్యాన్సర్తో సోమవారం (జూన్ 2న) కన్నుమూశాడు. పెద్దపేగు క్యాన్సర్తో పోరాడి అలిసిపోయిన అతడు ముంబైలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఆరువారాల క్రితం తన అనారోగ్యం గురించి అతడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.ఫలించని ట్రీట్మెంట్జనవరిలో కీమోథెరపీ మొదలుపెట్టాం. నాలుగు రౌండ్లయ్యాక ఓ స్కాన్ చేశారు. అప్పుడు తెలిసిందేంటంటే నాకు ఇస్తున్న ట్రీట్మెంట్ ఏమాత్రం పనిచేయడం లేదు. క్యాన్సర్ నియంత్రణలో ఉండటం కాదుకదా ఏకంగా శరీరమంతా వ్యాపిస్తోంది. ఇప్పుడు వేరే చికిత్స మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో చూడాలి. నాకు మీ ప్రేమాభిమానాలు కావాలి. అదొక్కటే నేను మీనుంచి ఆశించేది అని చిరునవ్వుతో వీడియో ముగించాడు. ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు.. నీ పెదాలపై ఆ నవ్వు అలాగే ఉండాలి.. నీకంతా మంచే జరుగుతుంది, ఈసారైనా ట్రీట్మెంట్ విజయవంతం కావాలి అని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెట్టారు.పెద్ద పెగే క్యాన్సర్తో పోరాటంవిభు అసలు పేరు వైభవ్ కుమార్ సింగ్ రాఘవ్. నిషా ఔర్ ఉస్కే కజిన్స్, సావధాన్ ఇండియా.. ఇలాంటి పలు షోలలో కనిపించాడు. 2022లో పెద్దపేగు క్యాన్సర్ బారిన పడ్డాడు. ఈ మధ్యే అతడి పరిస్థితి విషమించడంతో సెలబ్రిటీలు అతడి చికిత్స కోసం ఆర్థిక సాయం చేయమని అర్థించారు. గతవారం సైతం నటి సింపుల్ కౌల్.. విభును కాపాడుకుందామంటూ తోచినంత సాయం చేయమని అభిమానులను కోరింది. కానీ ఇంతలోనే విభు ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. View this post on Instagram A post shared by VIBHU k RAGHAVE ✨ विभु राघव (@vibhuzinsta) చదవండి: ‘గద్దర్ అవార్డ్స్’ లో తెలంగాణకు అన్యాయం: ప్రతాని రామకృష్ణ గౌడ్ -
అలా చేసుంటే సత్య సినిమా సర్వనాశనమయ్యేది: ఆర్జీవీ
హారర్ సినిమాలు హిట్టయ్యాయంటే వరుసపెట్టి మరీ అవే తీస్తూ ఉంటారు. అదేవిధంగా యాక్షన్ మూవీ బ్లాక్బస్టర్ అయిందంటే అలాంటివే వరుసగా వదులుతూ ఉంటారు. ఈ ధోరణిలో మార్పు రావాలంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kahsyap). ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. కేజీఎఫ్, సలార్ సినిమాలు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరంతా చూశారుగా.. తర్వాత వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఒకేలా కనిపించేవి. హింసపై ఫోకస్యానిమల్ విషయానికి వస్తే ఇందులో హింస, రక్తపాతం బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమా రూ.900 కోట్లు సంపాదించింది. ఇది చూసిన ఫిలిం మేకర్స్ తమ చిత్రాల్లోనూ రెట్టింపు హింసను ప్రవేశపెట్టారు. కొన్నిసార్లు అవసరం ఉన్నా, లేకపోయినా బలవంతంగా వాటిని చొప్పించేవారు. వాళ్లు తప్పు దారిలో వెళ్లడం చూసి నాకు భయమేసేది అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడదే ట్రెండ్ఇదే ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. బాహుబలి సినిమా తర్వాత అందరూ బడ్జెట్, స్పెషల్ ఎఫెక్ట్స్పైనే ఫోకస్ చేశారన్నాడు. భారీ బడ్జెట్ సినిమాలు తీయడమే ప్రస్తుతమున్న ట్రెండ్ అని, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. తాను కూడా సత్య సినిమాకు మరో రూ.5 కోట్లు ఎక్కువ పెట్టుంటే ఆ మూవీ సర్వనాశనమయ్యేదన్నాడు.బాలీవుడ్కు గుడ్బైబాలీవుడ్లో దర్శకుడిగా, నటుడిగా రాణించిన అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాడు. హిందీలో ప్రయోగాలు చేయడం కష్టమని, అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, అందుకే బాలీవుడ్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. పూర్తిగా దక్షిణాది సినిమాల్లోనే ఉంటానని తెలిపాడు. ఈయన ప్రస్తుతం అడివిశేష్ హీరోగా నటిస్తున్న డకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు.చదవండి: ఓటీటీలో 'జాట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? -
బాల్య వివాహం.. అలాంటి దుస్తులు వేసుకోమనగానే ఏడ్చేశా: హీరోయిన్
ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించినవారిలో మౌసమి చటర్జీ (Moushumi Chatterjee) ఒకరు. మౌసమి అసలు పేరు ఇందిర. చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేజర్ కాకముందే వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. తన ఆంటీ చివరి కోరిక మేరకు పదో తరగతిలో ఉండగానే జయంత్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అనురాగ్ అనే చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అంధురాలిగా నటించింది. ఈ సినిమా సక్సెస్తో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. అయితే అసభ్యత, అశ్లీలతకు చోటు లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయింది.నా వల్ల కాలేదుకానీ ఓ సినిమా యూనిట్ చేసిన పనికి తను భయంతో రోదించానంటోంది మౌసమి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1973లో వచ్చిన కుచ్చె ఢాగె సినిమా షూటింగ్లో జరిగిన సంఘటన ఇది.. నాకు బ్యాక్లెస్ బ్లౌజ్, పొట్టి గాగ్రా ఇచ్చి వేసుకోమన్నారు. అవి చూడగానే నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఆ డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్లే అనిపించింది. వెంటనే నా భర్తకు ఫోన్ చేసి నాకిక్కడ పని చేయాలని లేదు.. ఒక్క ఫోన్ కాల్..నన్ను కోల్కతాకు పంపించేయమని వేడుకున్నాను. అప్పటికే వాళ్లు నా బట్టలన్నీ తీసేసుకున్నారు. నా ఫోన్కాల్తో ఆయన వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ డ్రెస్ వేసుకుంటే తప్పేమీ కాదని నాకు నచ్చజెప్పారు. అలా ఆ సినిమా పూర్తి చేశాను. పొట్టి స్కర్టు ధరించాల్సి ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డి సినిమాను రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది. గుడ్డి చిత్రంలో జయా బచ్చన్ నటించగా ఇది కల్ట్ క్లాసిక్గా నిలిచింది.సినిమామౌసమి 'ఆరి' అనే బెంగాలీ చిత్రంతో ఇటీవలే వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఆమె చివరగా నటించిన పీకు సినిమా కూడా మే 9న రీరిలీజ్ అయింది. బాలీవుడ్లో మౌసమి.. రోటీ కపడా ఔర్ మకాన్, అనారి, జిందగీ, స్వర్గ్ నరక్, ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్, ప్రేమ్ బంధన్, స్వయంవర్, అంగూర్, నిశ్చయ్ వంటి పలు చిత్రాలు చేసింది.చదవండి: నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్ -
నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
అద్నాన్ సమీ (Adnan Sami).. పాకిస్తాన్ ఈ సింగర్ స్వదేశాన్ని కాదనుకుని భారత్పై ప్రేమ పెంచుకున్నాడు. భారతీయ వారసత్వం తీసుకుని ఇక్కడే స్థిరపడిపోయాడు. సంగీత ప్రపంచంలో తనకంటూ గొప్ప స్థానం సంపాదించుకున్న ఇతడిని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇవన్నీ పాకిస్తాన్కు గిట్టలేదు. అవకాశం దొరికినప్పుడు అతడిని ముప్పుతిప్పలు పెట్టిందట.తల్లి చనిపోయిందని తెలిసినా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అద్నాన్ సమీ మాట్లాడుతూ.. మా అమ్మ బేగం నౌరీన్ పాక్లో మరణించింది. తన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని రెండు దేశాలను కోరాను. భారత్ అందుకు అంగీకరించినా.. పాక్ మాత్రం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. మా అమ్మ చనిపోయిందని చెప్పినా కూడా వీసా ఇవ్వలేదు. వాట్సాప్ వీడియోలో తన అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది.భారత్ సొంతిల్లుగా ఎలా మారిందంటే?1998లో నేను కొన్ని పాటలు రిలీజ్ చేశాను. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక నా పని అయిపోయిందని అంతా అన్నారు. నా పాటలకు మార్కెటింగ్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు నా పాటలు ఎప్పుడొచ్చాయో, పోయాయో కూడా ఎవరికీ తెలీదు. నన్ను తొక్కేయాలనే అదంతా చేస్తున్నారని నాకర్థమైంది. అప్పుడు నేను కెనడాలో ఉన్నాను.ఆమె సలహా వల్లే..సింగర్ ఆశా భోంస్లేతో మాట్లాడాను. ఇక్కడున్నవాళ్లు నాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. ఇకపై లండన్లోనే మీతో కలిసి పని చేస్తాను అని చెప్పాను. అందుకామె లండన్లో రికార్డ్ చేయడం దేనికి? నీకు నిజంగా ఏదైనా కొత్తగా చేయాలనుంటే ముంబైకి వచ్చేయ్. ఇక్కడ హిట్టయిన పాటలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి అని చెప్పింది.కోట్లు విలువైన ఆస్తుల్ని వదులుకుని..అలా నేను ముంబై వచ్చాను. ఆమె దివంగత భర్త, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ ఇంట్లోనే బస చేశాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. పాకిస్తాన్లో వర్కవుట్ కాని పాటలన్నీ ఇక్కడ ఎంతో ఆదరణ పొందాయి. ప్రజల ప్రేమకు ఎంతగానో సంతోషించాను. డబ్బు సంపాదించడం కోసం ఇక్కడకు రాలేదు. అంతేకాదు, పాకిస్తాన్లో కోట్లు విలువ చేసే ఆస్తుల్ని వదిలేసుకుని ఇక్కడే స్థిరపడిపోయాను అని చెప్పుకొచ్చాడు.కెరీర్..అద్నాన్ సమీ.. తెలుగులో యే జిల్లా.. (శంకర్ దాదా ఎంబీబీఎస్), నచ్చావే నైజాం పోరీ.. (వర్షం), నేనంటే నాకు చాలానే ఇష్టం.. (ఊసరవెల్లి), నిన్ను చూడకుండా నేను ఉండలేనే.. (దేనికైనా రెడీ), ఓ ప్రియా ప్రియా.. (ఇష్క్) ఇలా అనేక పాటలు పాడాడు. హిందీ, ఉర్దు, ఇంగ్లీష్, తమిళ, కన్నడ, మలయాళంలో అనేక సాంగ్స్ ఆలపించాడు.చదవండి: రీరిలీజ్లో ఆల్టైమ్ రికార్డ్.. నీ వల్ల అవుద్ది సామీ! -
కన్నీళ్లు పెట్టుకున్న మహిళ అభిమాని.. అక్షయ్ కుమార్ ఏం చేశారంటే?
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన నటించి తాజా చిత్రం హౌస్ఫుల్-5. ఈ కామెటీ ఎంటర్టైనర్ సిరీస్లో వస్తోన్న ఐదో చిత్రం కావడం విశేషం. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో అక్షయ్ కుమార్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పుణెలోని ఓ మాల్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు.అయితే ఊహించని విధంగా మహిళలు, చిన్నపిల్లలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. అదే సమయంలో అక్షయ్ కుమార్ వేదికపై మాట్లాడుతుండగా తోపులాట జరిగింది. అభిమానులు తోసుకోవడంతో ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన అక్షయ్ కుమార్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు.. దయచేసి ఎవరూ కూడా తోసుకోవద్దు అంటూ అభిమానులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత ఏడుస్తున్న ఆ మహిళ అభిమానిని హీరోయిన్లు బజ్వా, ఫెర్నాండెజ్ కౌగిలించుకుని ఓదార్చారు. కాగా.. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నానా పటేకర్, జాక్వెలిన్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సౌందర్య శర్మ, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 6న థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్ ఈజీనా? మీకేం తెలుసు?: నటి కన్నీళ్లు
కొన్ని సంతోషాలను కోట్లు పెట్టినా సొంతం చేసుకోలేము. ఆ సంతోషాన్ని ఆస్వాదించడం కోసం కోట్లు వదిలేసుకున్నా బాధ ఉండదు. మహిళకు అత్యంత ఆనందాన్నిచ్చేది అమ్మతనం. 'అమ్మ'యినందుకే ఇలియానా సూపర్ హిట్ మూవీ రైడ్కు సీక్వెల్లో చేయమని ఆఫర్ వచ్చినా వదిలేసుకుంది. కళ్లు చెదిరే పారితోషికం ఇస్తామన్నా.. ప్రస్తుతం తన కొడుకును చూసుకోవడమే ముఖ్యం అని కరాఖండిగా చెప్పేసింది.మిస్క్యారేజ్అయితే కొందరికి అమ్మతనం అంత ఈజీగా దొరకదు. చాలామందికి మొదటి కాన్పు ఆగదు. గర్భస్రావం అవుతూ ఉంటుంది. బాలీవుడ్ నటి, మోడల్, హిందీ బిగ్బాస్ 7 విన్నర్ గౌహర్ ఖాన్ (Gauahar Khan) జీవితంలోనూ అదే జరిగింది. తొలిసారి తన మిస్క్యారేజ్ అనుభవాలను యూట్యూబ్ వేదికగా వెల్లడించింది. గౌహర్.. మానొరంజన్ అనే పాడ్కాస్ట్ను ప్రారంభించింది. ఇందులో మాతృత్వం గురించి, పిల్లల పెంపకం గురించే మాట్లాడనుంది. మొదటగా ఈ పాడ్కాస్ట్లో తన అనుభవాలను వెల్లడించింది.9 వారాలకే కుప్పకూలిన ఆశలుఇంతవరకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పనేలేదు. ఈసారి దాన్ని బయటపెడుతున్నా.. జెహాన్ పుట్టడానికంటే ముందు నాకు గర్భస్రావం అయింది. ఆ బాధను మాటల్లో చెప్పలేను. దాదాపు 9 వారాలపాటు కడుపులో మోశాక బిడ్డను కోల్పోయాను. నా సంతోషం ఆవిరైపోయింది. దీని గురించి తర్వాతి ఎపిసోడ్స్లో మాట్లాడతాను. జెహాన్ పుట్టినప్పటి నుంచి అది సాధారణ డెలివరీనా? సీ సెక్షనా? అని అడుగుతూనే ఉన్నారు. నాకు సీ సెక్షన్ చేశారు. అయినా రెండూ కష్టమే.. మీకేం తెలుసు?: నటి కన్నీళ్లుఈ మధ్య ఓ సెలబ్రిటీ (సునీల్ శెట్టి) సాధారణ ప్రసవం కన్నా ఆపరేషన్ ఈజీ అన్నారు. ఆ మాట వినగానే గట్టిగా అరవాలనిపించింది. అలా ఎలా అనగలిగారు? అబ్బాయిలకు ప్రెగ్నెన్సీ ఉండదు, నవమాసాలు మోయరు, సీ సెక్షన్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అసలే అర్థం కాదు. మీకసలు ఏదీ తెలీదు అని కన్నీళ్లు పెట్టుకుంది. నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty).. తన కూతురు అతియా కంఫర్టబుల్గా ఉంటుందని సీ సెక్షన్కు వెళ్లకుండా కష్టమైనా నేచురల్ డెలివరీనే ఎంచుకుందని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని క్షమాపణ చెప్పాడు.ఎవరీ గౌహర్ ఖాన్?గౌహర్ ఖాన్ విషయానికి వస్తే.. ఈమె శంకర్ దాదా ఎంబీబీఎస్లో నా పేరే కాంచనమాల అనే ఐటం సాంగ్తో అలరించింది. రాకెట్ సింగ్, ఓ యారా ఐన్వయి ఐన్వయి లుట్ గయా, ఫీవర్, తేరే ఇంతేజార్ వంటి పలు చిత్రాలు చేసింది. తాండవ్, సాల్ట్ సిటీ, బెస్ట్ సెల్లర్ వంటి వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ను 2020లో పెళ్లి చేసుకోగా 2023లో కుమారుడు జెహాన్ పుట్టాడు. ప్రస్తుతం ఆమె మరోసారి గర్భం దాల్చింది.చదవండి: ఆర్మీలో రెండేళ్ల ట్రైనింగ్.. ఆ మాటలతో మధ్యలోనే ఆగిపోయా!: -
లేటు వయసులో డేటింగ్.. పొరపాటున జరిగిపోయింది: అమిర్ ఖాన్
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాల కంటే వ్యక్తిగతంగానే వార్తల్లో నిలుస్తున్నారు. ఆరు పదుల వయస్సులో ప్రేమ అంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన బర్త్ డే వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూలో గౌరీ స్ప్రాట్తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. ఈ వయలులో మళ్లీ ప్రేమలో పడాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. ఇప్పటికే తన వయసు అయిపోయిందని.. తనకు భాగస్వామి దొరకడం సాధ్యం కాదని భావించేవాడినని ఆమిర్ పేర్కొన్నారు. తనకు వృద్ధాప్యఛాయలు వచ్చినట్లు అనిపించిందని.. గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నానని తెలిపారు. నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నామని అమిర్ ఖాన్ వెల్లడించారు.గౌరీతో పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ.. 'నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నాం. ఆ తర్వాత మేము స్నేహితులమయ్యాం.. మా మధ్య ప్రేమ పుట్టింది. నాకు నా తల్లి, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. నాకు ఇప్పటికే చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నాకు భాగస్వామి అవసరం లేదు. కిరణ్, రీనా నేను ఇప్పటికీ పానీ ఫౌండేషన్ కోసం కలిసి పని చేస్తున్నాం. మేము ప్రతిరోజూ కూర్చుని మాట్లాడుకుంటాం. ఒక కుటుంబంగా మా మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది మేము ఎల్లప్పుడూ కుటుంబంగానే ఉంటాం. మేము భార్యాభర్తలం కాకపోవచ్చు.. కానీ మేము ఎల్లప్పుడూ ఓకే ఫ్యామిలీగానే ఉంటాం. వారు ఎప్పటికీ నా జీవితంలో ఒక శాశ్వత భాగం.' అని వెల్లడించారు. కాగా..అమిర్ ఖాన్, గౌరీ ఏప్రిల్ 12న చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో జంటగా మొదటిసారి కనిపించారు. ప్రస్తుతం అమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', లోకేష్ కనగరాజ్ 'కూలీ'చిత్రంలో కనిపించనున్నారు. -
పెద్ద సినిమా.. నేనే రిజెక్ట్ చేశా.. ఎందుకంటే?: ఇలియానా
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) హిట్ సినిమాల్లో రైడ్ మూవీ ఒకటి. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా (Ileana D’Cruz) హీరోయిన్గా నటించింది. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో విడుదలైంది. ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా రైడ్ 2 రిలీజైంది.నోరు విప్పిన బ్యూటీకానీ ఇందులో ఇలియానా స్థానంలో వాణీ కపూర్ తళుక్కుమని మెరిసింది. ఇలియానాను సెలక్ట్ చేయకపోవడంపై దర్శకుడు రాజ్ కుమార్ స్పందిస్తూ.. పెళ్లి తర్వాత ఆమె జీవితం మారిపోయిందని.. తను విదేశాలకు వెళ్లిపోవడం వల్లే కథానాయికను మార్చాల్సి వచ్చిందని వెల్లడించాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఇలియానా పెదవి విప్పింది. రైడ్ 2లో నిన్ను మిస్ అయ్యాం. ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తావ్? అన్న అభిమాని ప్రశ్నకు సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రైడ్ సినిమాలో అజయ్ దేవ్గణ్, రాజ్ కుమార్ గుప్తాతో కలిసి పని చేయడం మర్చిపోలేను.అందుకే చేయలేకపోయా..ఈ మూవీ నాకెంతో స్పెషల్. దీని సీక్వెల్లో కూడా నటించమని ఆఫర్ వచ్చింది. కానీ నేనే చేయలేకపోయాను. ఆ అవకాశం వచ్చినప్పుడు నాకు కొడుకు పుట్టాడు. అప్పుడు వాడే నా మొదటి ప్రాధాన్యత. సినిమా టీమ్ ఇచ్చిన షెడ్యూల్ నాకు సెట్టవలేదు. అలా వదులుకోవాల్సి వచ్చింది. అయినా రైడ్ 2లో వాణి కపూర్ చాలా బాగా చేసింది. తన పాత్రకు మరింత అందాన్ని తీసుకొచ్చిందని ప్రోమోలు చూస్తేనే అర్థమైపోతుందని చెప్పుకొచ్చింది.కచ్చితంగా మళ్లీ వస్తా!వెండితెరపై ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు.. డైపర్లు మార్చే పనిలో బిజీగా ఉన్నానంటూ బాబు ఫోటోను షేర్ చేసింది. వెండితెరపై రీఎంట్రీ ఉంటుందా? అన్న ప్రశ్నకు తప్పకుండా మళ్లీ సినిమాలు చేస్తానని హామీ ఇచ్చింది. ఇలియానా.. ప్రియుడు మైఖేల్ డోలన్ను 2023లో పెళ్లి చేసుకుంది. వీరికి అదే ఏడాది బాబు పుట్టాడు. ప్రస్తుతం ఇలియానా రెండోసారి గర్భం దాల్చింది.చదవండి: శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్ను అంతమాట అనేసిందేంటి! -
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్,న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించడం, ప్రపంచంలోని పలు దేశాల్లోని ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంతో శర్మిష్టా పనోలి చర్చాంశనీయంగా మారారు. ఇంతకీ ఈ శర్మిష్టా పనోలి ఎవరు? శర్మిష్టా పనోలి ఎవరు?శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న న్యాయ విద్యార్థిని రాజకీయ, సామాజిక అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో పేరు సంపాదించారు.వివాదాస్పద వీడియోలో ఏమన్నారంటే?అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై (2025 Pahalgam attack) ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ ఆపరేషన్ సిందూర్తో (Operation Sindoor) సైనిక చర్యకు దిగింది. పాక్ను చావు దెబ్బ కొట్టింది. ఇదే అంశంపై ఓ పాక్ యూజర్.. శర్మిష్టాను పలు ప్రశ్నలు సంధించాడు. సదరు యూజర్ వేసిన ప్రశ్నలపై శర్మిష్ఠ పోనోలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి పలు అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడితో మౌనం వహించడంపై బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణవీర్ అల్లాహ్బాదియాపై విమర్శలు గుప్పించారు. Kolkata, West Bengal: Kolkata Police arrested a law student Sharmistha Panoli from Pune in Gurgaon for allegedly hurting religious sentiments through social media posts on Operation Sindoor. She was brought to Kolkata on transit remand and produced before the Alipore CJM Court.… pic.twitter.com/jxDpcVSzlJ— IANS (@ians_india) May 31, 2025ఆ విమర్శలు మిస్ఫైర్ అయ్యాయి. శర్మిష్ట చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో శర్మిష్ట నెటిజన్లను క్షమాపణలు కోరారు. అనంతరం, ఆ వీడియోను డిలీట్ చేశారు. అయినప్పటికీ, కోల్కతా పోలీసులు శర్మిష్టాపై చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మతసామరస్యాన్ని దెబ్బతీయడం, సామాజిక కలహాలు సృష్టించేలా ప్రేరేపించడంపై కేసు నమోదు చేశారు. 1500 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీసులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని అలిపూర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించించింది. జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి పంపింది. విచారణ సందర్భంగా శర్మిష్టా తరఫున న్యాయవాది, అన్ని డిజిటల్ ఆధారాలు ఇప్పటికే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు. కోర్టు ఆ వాదనల్ని ఖండించింది. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. Free the brave Sharmishta Panoli!It’s a disgrace for the freedom of speech that she was arrested. Don’t punish her for speaking the truth about Pakistan and Muhammad. Help her @narendramodi! @AmyMek #Sharmishta#IStandwithSharmishta #ReleaseSharmistha #FreeSharmishta pic.twitter.com/YhGSLhuyr2— Geert Wilders (@geertwilderspvv) May 31, 2025మోదీజీ శర్మిష్టా పనోలిని రక్షించండిశర్మిష్టా పనోలి అరెస్టుపై వివాదం రాజుకుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి పలువురు విజ్ఞప్తులు పంపుతున్నారు. శర్మిష్టా పనోలి అరెస్టుపై డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కోల్కతా పోలీసుల తీరు వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. ఆమెను రక్షించండి.ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్టను విడుదల చేసేలా ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచంలో అందరి దృష్టి శర్మిష్టపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ సింగర్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ జాంకీ పరేఖ్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెర నటుడు నకుల్ మెహతాను పెళ్లాడిన ముద్దుగుమ్మ రెండోసారి గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా.. ఈ జంటకు ఇప్పటికే ఓ కుమారుడు జన్మించారు. మా రెండో బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పోస్ట్ చేశారు.ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు అభినందనలు చెబుతున్నారు. దియా మీర్జా, అదితి శర్మతో పాటు పలువురు సినీతారలు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేశారు. కాగా.. 13 ఏళ్ల క్రిత జాంకీ పరేఖ్.. నకుల్ మెహతాను పెళ్లాడింది.బుల్లితెర నటుడైన నకుల్ మెహతా 'ఇష్క్బాజ్', 'బడే అచ్చే లగ్తే హై 2' వంటి ప్రముఖ టీవీ షోలతో ఫేమస్ అయ్యారు. ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బుల్లితెర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నకుల్ మెహతా నటించారు. View this post on Instagram A post shared by Nakuul Mehta (@nakuulmehta) -
బాలీవుడ్ లో భయం భయం
బాలీవుడ్లో హారర్ సినిమాల హవా కనిపిస్తోంది. గత ఏడాది విడుదలైన హిందీ హారర్ చిత్రాలు ‘స్త్రీ 2, భూల్ భూలెయ్యా 3, సైతాన్, ముంజ్య’ వంటివి సూపర్హిట్స్గా నిలిచాయి. ఓ విధంగా 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్కు హారర్ చిత్రాలే వెన్నుదన్నుగా నిలిచాయి. ఇలా హారర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉందని గమనించిన బాలీవుడ్ స్టార్స్ వరుసగా ఆ తరహా చిత్రాలకు సైన్ చేస్తున్నారు. ఆ హారర్ సినిమాల వివరాలపై ఓ లుక్ వేద్దాం...భూత్ బంగ్లాలో అక్షయ్ కుమార్హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్లది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో ‘హేరా ఫెరి, గరమ్ మసాలా, భూల్ భూలెయ్యా’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ 2010లో వచ్చిన ‘ఖట్టా మీఠా’ తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్లో మరో సినిమా అనౌన్స్మెంట్ రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. గత ఏడాది అక్షయ్ కుమార్ 57వ బర్త్ డే సందర్భంగా ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామెడీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకుడు. హారర్ కామెడీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వామికా గబ్బి, టబు, పరేష్ రావల్, జిస్సూ సేన్ గు΄్తా ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తొలుత ఈ హారర్ కామెడీ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్కు రిలీజ్ను వాయిదా వేశారు. మరి.. హీరో అక్షయ్ కుమార్–దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్ మరోసారి హిట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ.పోలీస్ స్టేషన్లో భూతంహారర్, గ్యాంగ్స్టర్, రొమాంటిక్... ఇలా డిఫరెంట్ జానర్స్లో సినిమాలు చేశారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. అయితే హారర్ కామెడీ జానర్లో మాత్రం ఆయన సినిమా చేయలేదు. ఈ జానర్లోనూ తన సత్తా నిరూపించుకోవాలనిపోలీస్స్టేషన్ మే భూత్’ అనే సినిమాను ప్రకటించారు రామ్గోపాల్ వర్మ. ‘యూ కాంట్ కిల్ ది డెడ్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. ఈ చిత్రంలో మనోజ్ భాజ్పేయి లీడ్ రోల్ చేస్తారు. ‘మనకు భయం వేస్తేపోలీస్స్టేషన్కు వెళ్తాం. అదేపోలీసులకే భయం వేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్తారు?’ అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. ‘‘ఓపోలీస్స్టేషన్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది.ఈ ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్స్ దెయ్యాలుగా మారి,పోలీసులను ఇబ్బందిపెడితే ఎలా ఉంటుంది? అన్నపాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది. హారర్ కామెడీ జానర్లోనే ఈ సినిమా ఉంటుంది’’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు రామ్గోపాల్ వర్మ. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారు. ‘సత్య’ (1998), ‘కౌన్’ (1999), ‘శూల్’ (1999) వంటి చిత్రాల తర్వాత దర్శకుడు రామ్గోపాల్ వర్మ, హీరో మనోజ్ భాజ్పేయిపాతిక సంవత్సరాల తర్వాత మళ్లీపోలీస్స్టేషన్ మే భూత్’ సినిమా కోసం కలిసి పని చేస్తుండటం విశేషం.ప్రేతాత్మతోపోరాటంభూత, ప్రేతాత్మల నుంచి తన కుమార్తెను కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే అసాధారణపోరాటం నేపథ్యంలో సాగే హిందీ చిత్రం ‘మా’ (తెలుగులో అమ్మ అని అర్థం). కాజోల్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో రోనిత్ డాలీ, ఇంద్రనీల్ శుభ్రా, జితిన్ జ్యోతీ గులాటి లీడ్ రోల్స్లో నటించారు. ఈ సీరియస్ హారర్ సినిమాకు విశాల్ రేవంతి ఫ్యూరియా దర్శకత్వం వహించారు. అజయ్ వీణా దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. క్షుద్ర శక్తులు ఓ చిన్నారిని బలి కోరడం, తన కుమార్తె కోసం తల్లి ఓ క్షుద్ర శక్తులతో వీరోచితమైనపోరాటం చేయడం వంటì సీన్స్ ఈ చిత్రం ట్రైలర్లో కనిపిస్తున్నాయి.హాంటెడ్ హౌస్మహేశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘1920’ (2008) సూపర్హిట్గా నిలిచింది. ఆ తర్వాత ‘1920’ హారర్ సిరీస్లో వచ్చిన మరికొన్ని హారర్ సినిమాలతో అసోసియేట్ అయ్యారు విక్రమ్ భట్. తాజాగా ఆయన డైరెక్షన్లోనే ‘హాంటెడ్ హౌస్ 3డీ: ఘోస్ట్స్ ఆఫ్ ది ఫాస్ట్’ అనే సినిమా రానుంది. ఆనంద్ పండిట్, రాకేశ్ జునేజా, శ్వేతాంబరి భట్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాలో మహాక్షయ్ చక్రవర్తి, టియో బాజ్పాయ్, అంచిత్ కౌర్, ఆరిఫ్ జకారియా ప్రధానపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ చేస్తామన్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇండియన్ స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ ఫిల్మ్గా ‘హాంటెడ్ హౌస్ 3డీ: ఘోస్ట్స్ ఆఫ్ ది ఫాస్ట్’ మూవీ రానుంది.సైతాన్ తిరిగి వస్తాడుగత ఏడాది మార్చిలో థియేటర్స్లోకి వచ్చిన ‘సైతాన్’ ప్రేక్షకులను బాగా భయపెట్టాడు. అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, జ్యోతిక, జానకి బోడివాలా, అంగద్ రాజ్ లీడ్ రోల్స్లో నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘సైతాన్’. వికాస్ బాల్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది మార్చిలో థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ను భయపెట్టి, సూపర్ హిట్ అయింది. ఆ సమయంలోనే ‘సైతాన్’ సినిమాకు సీక్వెల్ను ప్రకటించారు అజయ్ దేవగన్. అయితే ప్రస్తుతం అజయ్ దేవగన్ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత అజయ్ దేవగన్ ‘సైతాన్ 2’ సినిమాను సెట్స్కు తీసుకువెళ్తారని ఊహింవచ్చు.ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ఫారెస్ట్లో భయం అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా హీరో హీరోయిన్లుగా హిందీలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే సినిమా రానుంది. హారర్ ఎలిమెంట్స్తోపాటు మైథలాజికల్ అంశాలు కూడా మిళితమై ఉన్న ఈ సినిమాకు అరుణభ్ కుమార్– దీపక్ మిశ్రా ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా నుంచి తమన్నాపాత్ర తాలూకు ప్రీ టీజర్లాంటి ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. రాత్రివేళ తమన్నా అడవిలోకి వెళ్లడం, అక్కడ ఓ దీపం వెలిగించడం వంటి విజువల్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాను 2026లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ప్రేతాత్మగా రష్మిక?హారర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా లీడ్ రోల్స్లో నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ ఈ సినిమాకు దర్శకుడు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో హారర్ చిత్రం ఇది. ఈ సినిమాలో రష్మికా మందన్నా డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఒకపాత్రలో ఆమె ప్రేతాత్మగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ప్రధానంగా నార్త్ ఇండియా లొకేషన్స్లో చిత్రీకరించారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయిందట. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘థామా’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.మరికొన్ని హారర్ చిత్రాలు...మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగానే ‘శక్తి శాలిని’, ‘బేడియా 2’, ‘చాముండ’, ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’, ‘పెహ్లా మహాయు«థ్, దూస్రా మహాయు«ద్’ వంటి సినిమాలను ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లోని ‘థామా’ సినిమా ఈ ఏడాది దీపావళికి, ఈ ఏడాది డిసెంబరు 31న ‘శక్తి శాలిని’, వచ్చే ఏడాది ఆగస్టు 14న ‘బేడియా 2’, డిసెంబరు 4న ‘చాముండ’ 2027లో ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’ చిత్రాలు, 2028లో ‘పెçహ్లా మహాయు«ద్, దూస్రా మహాయు«ద్’ సినిమాలు రిలీజ్ కానున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.ఇక వరుణ్ ధావన్ హీరోగా ‘బేడియా’ ఫ్రాంచైజీ, శ్రద్ధాకపూర్–రాజ్కుమార్ రావు లీడ్ రోల్స్లో ‘స్త్రీ’ ఫ్రాంచైజీ వెండితెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ‘ముంజ్య’ సినిమాలో అభయ్ వర్మ, శర్వారీ లీడ్ రోల్స్ చేశారు. ఆదిత్య సర్పోత్థార్ డైరెక్షన్లోని ‘ముంజ్య’ సినిమా 2024లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ తరుణంలో ఈ సినిమా సీక్వెల్ ‘మహా ముంజ్య’లో వీరే నటిస్తారా? లేక కొత్త నటీనటులు కనిపిస్తారా? అని తెలియాల్సి ఉంది. ఇంకా ‘శక్తి శాలిని, చాముండ’ వంటి సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్కు హీరోయిన్స్ కియారా అద్వానీ, ఆలియా భట్ వంటి వాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
ప్రభాస్ హీరోయిన్ కు మంచి రోజులు
-
పంజాబ్ ఓటమి.. పాపం.. చాహల్ గర్ల్ఫ్రెండ్ రియాక్షన్ చూశారా?
ఇటీవల ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నుంచే ఆమె పేరు తెగ వైరలవుతోంది. ఎందుకంటే టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో ఆమె కనిపించడమే ప్రధాన కారణం. దుబాయ్లో వీరిద్దరు జంటగా మెరవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆర్జే మహ్వశ్పైనే పడింది. ఇంతకీ చాహల్తో ఉన్న ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీశారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్లకు హాజరు కావడంతో డేటింగ్ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురువారం ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్కు కూడా హాజరైంది. మొదటి నుంచి ఈ సీజన్లో చాహల్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆర్జే మహ్వశ్ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో తుది జట్టులో చాహల్ లేకపోయినప్పటికీ ఆమె స్టేడియంలో సందడి చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలవ్వడంచో ఆర్జే మహ్వశ్ తీవ్ర నిరాశకు గురైంది. ఆనందంగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఆమెకు పంజాబ్ ఓడిపోవడంతో అప్సెట్ అయినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. యుజ్వేంద్ర చాహల్ వేలు గాయం కారణంగా పంజాబ్ చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఆర్జే మహ్వశ్- చాహల్ డేటింగ్ రూమర్స్..యుజ్వేంద్ర చాహల్ తన భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నుంచి మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్ -ఆర్జే మహ్వశ్ జంటగా కనిపించడంతో డేటింగ్ వార్తలొచ్చాయి. అయితే ఆర్జే మహవాష్ తాము కేవలం స్నేహితులమని స్పష్టం చేసింది. చాహల్ తన భార్యతో విడాకుల తర్వాత ఆర్జే మహ్వశ్తో అనేక సందర్భాల్లో జంటగా కనిపించారు. आज #RCBvsPBKS मैच का दो फोटो सबसे ज्यादा सुर्खियों में है।First Virat Kohli and Anushka Sharma Second Shubhankar mishra and Rj mahvashRCB INTO THE FINALS Congratulations RCB#IPLPlayoffs #Qualifier1 pic.twitter.com/T1agohOxUG— Chandan Yadav (@ChandankryadavN) May 29, 2025 -
సౌత్ డైరెక్టర్తో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం.. రివీల్ చేసిన రానా నాయుడు నటి!
సినీ ఇండస్ట్రీలో క్యౌస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో ఛాన్సుల పేరుతో చాలామందికి ఇలాంటి అనుభవం ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. సినీ ఇండస్ట్రీతో పాటు చాలా చోట్ల క్యాస్టింగ్ కౌచ్ అనే తరచుగా వింటుంటాం. అలా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెబుతోంది బాలీవుడ్ భామ సుర్వీన్ చావ్లా. తన కెరీర్లో కాస్టింగ్ కౌచ్ ఎదురైన చేదు అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. చావ్లా తన వివాహం తర్వాత కూడా జరిగిన కొన్ని చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నారు.ఓ దర్శకుడి కార్యాలయంలో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని సుర్వీన్ చావ్లా. ఒకసారి అతని ఆఫీస్ క్యాబిన్లో మీటింగ్ తర్వాత నేను వెళ్తుండగా.. సెండాఫ్ చెప్పేందుకు డోర్ వద్దకు వచ్చాడని తెలిపింది. నాకు వీడ్కోలు చెప్పడానికి తలుపు దగ్గరకు వచ్చి.. తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆ చేదు అనుభవాన్ని వెల్లడించింది. నేను వెంటనే అతన్ని వెనక్కి నెట్టివేశానని తెలిపింది. అతని ప్రవర్తనతో షాక్కు గురయ్యానని.. అసలేం ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వివరించింది. అతను నా వ్యక్తిగత జీవితం గురించి.. అలాగే నా భర్త ఏం చేస్తున్నారని అడిగాడని గుర్తు చేసుకుంది. ఇలాంటి అనుభవం తనకు చాలాసార్లు ఎదురైందని పంచుకుంది. మరోసారి సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్తో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని సుర్వీన్ చావ్లా వెల్లడించింది. దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడు షూటింగ్ సమయంలో తనతో పడుకోవాలని అడిగాడని వివరించింది. అతనికి హిందీ బాష రాకపోవడంతో ఓ మధ్యవర్తి ద్వారా చెప్పించాడని తెలిపింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదామె. అంతకుముందు ఇంటర్వ్యూలో ఆడిషన్ల సమయంలో తన బాడీ షేమింగ్కు గురైనట్లు సుర్వీన్ చావ్లా పంచుకుంది. పరిశ్రమలోని మహిళలను తక్కువగా చూస్తారని.. దాని కారణంగా మహిళలు తమను తాము తక్కువగా భావిస్తారని అన్నారు. కెరీర్లో ఎన్ని అడ్డంకులు ఎదురైన చావ్లా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమె ఇటీవలే 'క్రిమినల్ జస్టిస్ సీజన్ 4' వెబ్ సిరీస్లో కనిపించింది. అంతకుముందు నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడులోనూ నటించింది. ప్రస్తుతం ఆమె 'రానా నాయుడు సీజన్ 2'లోనూ కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్లో రానా దగ్గుబాటి సరసన మెప్పించనుంది. -
బాలీవుడ్ నటుడు సహా 58 మందిపై సెబీ బ్యాన్
షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంత మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చర్యలు చేపట్టింది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి ఐదేళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియాకు చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించిన సెబీ సాధన బ్రాడ్ కాస్ట్ (ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 మంది వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా, రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా అర్షద్ వార్సీ రూ.41.70 లక్షలు, ఆయన భార్య మారియా రూ.50.35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేశ్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబీ తుది ఉత్తర్వుల్లో గుర్తించింది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్ మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య జీవోగా వ్యవహరించారని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రెండేళ్ల క్రితమే బ్రేకప్.. మరో నటుడితో యంగ్ హీరోయిన్ డేటింగ్!
సినీ ఇండస్ట్రీలో బ్రేకప్, డేటింగ్ అనే పదాలు చాలా కామన్. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో అయితే ఇవీ కాస్తా ఎక్కువగానే వినిపిస్తుంటాయి. తాజాగా మరో బాలీవుడ్ భామ డేటింగ్కు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ తారా సుతారియా మరో నటుడితో డేటింగ్ ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. అడార్ జైన్తో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ మరో బాయ్ఫ్రెండ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ నటుడు వీర్ పహరియాతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు కొన్ని నెలల క్రితం డేటింగ్ ప్రారంభించారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇటీవల కొద్ది కాలంగా ఈ జంట పలుసార్లు ఈవెంట్లకు హాజరైనట్లు తెలుస్తోంది. లక్మే ఫ్యాషన్ వీక్తో పాటు ఎ సమ్మర్ ఆఫ్ స్టైల్ అనే ఈవెంట్లో జంటగా కనిపించారు. (ఇది చదవండి: కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!)కాగా.. మరోవైపు వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్తో డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరు జంటగా స్కైఫోర్స్ అనే మూవీలో నటించారు. అయితే తమపై డేటింగ్ వార్తలపై ఎవరూ కూడా స్పందించలేదు. కాగా.. తారా సుతారియా అంతకుముందు ఆడార్ జైన్తో రిలేషన్లో ఉంది. అయితే 2023లో వారు విడిపోయిన తర్వాత.. అడార్ జైన్ తన స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నారు.గతంలో డేటింగ్పై వీర్ పహారియా మాట్లాడుతూ.. 'నా రిలేషన్స్ గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. నాకు కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ వార్తలు వింటున్నా. అప్పుడు నేను పబ్లిక్ ఫిగర్ కాదు. అందుకే ఎవరూ నన్ను అడగలేదు. సోషల్ మీడియాలో ఏది ఉన్నా అది ప్రజలకు నిజమనిపిస్తుంది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. కానీ నేను ఏం చేయగలను? అలాంటి వాటిని పట్టించుకోవటం మానేశాను.' అని అన్నారు. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!
బాలీవుడ్ భామ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో దెయ్యం సీన్స్ ఆడియన్స్కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్ ఆద్యంతం ఆడియన్స్లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్గణ్, రోనిత్రాయ్, సుభద్ర సేన్గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. -
ఆ పాట తర్వాత.. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకుంటారనుకోలేదు!
అతిలోక సుందరి ఐశ్వర్యా రాయ్.. హీరో అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ కాంబోని ఎవరూ అస్సలు ఊహించలేదు. స్టార్ కొరియోగ్రాఫర్ అయిన వైభవి మర్చంట్ కూడా తను ఇలానే అనుకున్నానని చెప్పింది. ఓ ఐటమ్ సాంగ్లో వీళ్లిద్దరూ నటించిన తర్వాత.. పెళ్లి జరగడంతో ఒక్కసారిగా షాకయ్యానని చెప్పుకొచ్చింది.అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. మొన్నటివరకు సహాయ పాత్రల్లో కనిపించాడు. ప్రస్తుతం ఓటీటీ సినిమాల్లో హీరోగా మెరుసున్నాడు. గతంలో అభిషేక్, తండ్రి అమితాబ్తో కలిసి 'బంటీ ఔర్ బబ్లీ' అనే మూవీ చేశాడు. 'కజరారే..' అనే ఐటమ్ సాంగ్ వినే ఉంటారుగా. అది ఈ సినిమాలోనిదే. ఈ చిత్రానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొరియోగ్రాఫర్ వైభవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)''కజరారే..' పాట చేస్తున్నప్పుడు.. తండ్రి అమితాబ్ కూడా సెట్లోనే ఉండటంతో అభిషేక్ చాలా భయపడుతుండేవాడు. ఐశ్వర్య అయితే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని సందేహపడుతూ ఉండేది. ఈ పాట జరిగిన కొన్నేళ్ల తర్వాత అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకోవడంతో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత వివాహం చేసుకుంటారని అస్సలు ఊహించలేదు. కానీ జరిగింది' అని వైభవి మర్చంట్ చెప్పుకొచ్చింది.ఈ పాటలో అమితాబ్-అభిషేక్-ఐశ్వర్య.. ముగ్గురూ డ్యాన్స్తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఈ సాంగ్ ఓ రకంగా ఐశ్వర్యకు కమ్ బ్యాక్ అని అనుకోవచ్చు. ఈ తరహా పాటలతో పాటు సినిమాల్లో మళ్లీ ఈమెకు హీరోయిన్గా అప్పట్లో అవకాశాలు వచ్చాయి. ఏదేమైనా ఓ పాట.. ఇద్దరు స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లికి కారణమైందనమాట!(ఇదీ చదవండి: ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్) -
వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)
-
'నేను మరొకరిలా ఉండేందుకు రాలేదు'.. ఐశ్వర్యతో పోలికపై మండిపడ్డ ఊర్వశి భామ!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. విభిన్నమైన డ్రెస్సులతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఫోటోలకు పోజులిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది ముద్దుగుమ్మ. అయితే ఈ ఫెస్టివల్లో ఊర్వశి తీరుపై విమర్శలొచ్చాయి. తన ఫోటో షూట్ కోసం మెట్లను బ్లాక్ చేశారంటూ సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. కానీ అలాంటిదేం జరగలేదని.. తాను ముందే అనుమతి తీసుకున్నానని తెలిపింది ఊర్వశి రౌతేలా.అంతేకాకుండా ఈ కాన్స్ ఫెస్టివల్కు హాజరైన ఐశ్వర్య రాయ్తో కొందరు పోల్చడంతో ఊర్వశి మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఐశ్వర్య ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో మాత్రమే కనిపించింది. కాన్స్లో గుర్తింపు పొందిన ఐశ్వర్యతో పోల్చడం ఎవరికైనా గౌరవప్రదమైన విషయం అయినప్పటికీ.. నెటిజన్స్ కామెంట్ చేయడంపై ఊర్వశి స్పందించింది. ఈ మేరకు ఇన్స్టా స్టోరీస్లో క్లారిటీగా రాసుకొచ్చింది.ఊర్వశి తన ఇన్స్టాలో రాస్తూ.. "నేను నా సొంత చరిష్మాతో ఐశ్వర్య రాయ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే డార్లింగ్ ఐశ్వర్య ఓ ఐకానిక్. కానీ నేను మరొకరిలా నకిలీగా ఉండటానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నేను ఒక బ్లూ ప్రింట్. కాన్స్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా నిలబడటానికే వచ్చా. నా లుక్, నా స్టైల్, నా విశ్వాసం మీకు అసౌకర్యంగా అనిపిస్తే గట్టిగా ఓ శ్వాస తీసుకోండి. నేను అందరికీ నచ్చే వ్యక్తిని కాదు. నేను ఎల్లప్పుడు బాణసంచా, షాంపైన్ లాగా ఉంటా. నాపై ఎన్ని విమర్శలొచ్చినా ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటా. ఎందుకంటే ఎవరూ మీలాగా చేయరు.' అని రాసుకొచ్చింది. -
స్టార్ హీరో ఇంట్లోకి ప్రవేశించిన మహిళ.. చివరికి ఏమైందంటే?
బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో గుర్తు తెలియని మహిళ ప్రవేశించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో ఇంటికి వచ్చిన ఆమె పనిమనిషితో ఆదిత్య రాయ్ కపూర్ను కలిసేందుకు వచ్చానని తెలిపింది. ఆయన కోసం బహుమతులు కూడా తీసుకొచ్చానని చెప్పింది. దీంతో ఆమెను ఇంట్లోకి అనుమతించారు. కానీ ఆ సమయంలో ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేరని సమాచారం.ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంట్లోకి మహిళ వచ్చిన విషయాన్ని ఆ తర్వాత హీరోకు సిబ్బంది తెలియజేశారు. దీంతో ఆదిత్య రాయ్ కపూర్ వెంటనే హౌసింగ్ సొసైటీ అధికారులను సంప్రదించగా.. వారు ఖర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 47 ఏళ్ల గజాలా సిద్ధిక్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.అయితే ఈ కేసు దర్యాప్తులో ఇది సిద్ధిక్కు ఇలా చేయడం మొదటి సారి కాదని తెలిసింది. గత వారంలో ఆమె సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దుబాయ్ నివాసిగా చెప్పుకునే గజాలా సిద్ధిక్.. ఆదిత్య రాయ్ కపూర్ను కలవడానికి ముంబైకి వచ్చానని పోలీసులతో చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన బాలీవుడ్ ప్రముఖులను సంప్రదించడానికి ఆమె పదే పదే ప్రయత్నించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదోసారి అలరించేందుకు వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హౌస్ఫుల్-5. గతంలో ఈ సిరీస్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హౌస్ఫుల్ సిరీస్లో ఐదో చిత్రంగా ఈ సినిమా రానుంది. బాలీవుడ్లోనే నాలుగు భాగాలను రూపొందించిన మొట్టమొదటి ఫ్రాంచైజీగా హౌస్ఫుల్ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సిరీస్లో ఐదో భాగంగా హౌస్ఫుల్-5 ట్రైలర్ చూస్తుంటే నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే ఇందులో కామెడీ మరింత అలరించేలా ఉంది. కాగా.. ఈ చిత్రంలో రితేశ్ దేశ్ముఖ్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సోనమ్ బాజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సాజిద్ నడియాద్వాలా నిర్మాతగా వ్యవహరించగా.. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. -
అందాల పోటీల్లో పత్తా లేని పాన్ ఇండియా స్టార్లు
హైదరా‘బాత్’.. క్యా హై!తమ గ్లోబల్ ఈవెంట్ మరింత ప్రజాదరణ పొందేలా చేయడానికి మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులు దేశంలోని సినీ రంగ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపడం సాధారణమే. ఫ్యాషన్, గ్లామర్, సామాజిక సేవ అనే రంగాల సంగమంగా ఈ వేడుక సాగుతుంది కాబట్టి సినిమా రంగం తోడ్పాటును వారు ఎప్పుడూ ఆహా్వనిస్తారు. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు జడ్జీలుగా లేదా స్పెషల్ గెస్టులుగా కూడా పాల్గొంటారు. అయితే ఈ దఫా ఈవెంట్లో జడ్జిగా ఇప్పటివరకూ ఒక్క సోనూసూద్ పేరు తప్ప మరెవరి పేరూ వినిపించడం లేదు. అలాగే నగరం వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో నాగార్జున లాంటి ఒకరిద్దరు తప్ప టాలీవుడ్ సెలబ్రిటీల జాడ కనపడడం లేదు. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సార్లుగా పేరు తెచ్చుకున్న పలువురు టాలీవుడ్ నటులు ఈ పోటీల వైపు కన్నెత్తి చూస్తున్నట్టు గానీ, వీటి గురించి పన్నెత్తి మాట్లాడుతున్నట్టు గానీ లేదు. తుది పోటీలకు ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఫైనల్స్లో అయినా టాలీవుడ్ తారలు సందడి చేస్తారని, నగర ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింపజేసే ఈవెంట్కు అదనపు జోష్ జత చేస్తారని ఆశిద్దాం.సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత పురాతనమైన అందాల పోటీ మిస్ వరల్డ్. ఈ పోటీలు మన దేశపు అతివల అందాన్ని మాత్రమే కాదు మేధస్సును, శక్తియుక్తులను ప్రపంచానికి అనేకసార్లు చాటి చెప్పాయి. ఈ పోటీలకు ఆతి«థ్యం ఇచ్చే అవకాశం తొలిసారి ఓ తెలుగు రాష్ట్రానికి, అందులోనూ తెలంగాణకు దక్కింది. గత కొన్నిరోజుల క్రితం ప్రారంభమైన ఈ పోటీలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వివిధ రకాల పోటీల్లో పాల్గొంటూ సుందరీమణులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్లో ఇంత హల్చల్ జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం అంత పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నిరాసక్తత చర్చనీయాంశంగా మారుతోంది. నేరుగా మోడలింగ్, సినిమాలతో అనుబంధం కలిగి ఉండే ఈ పోటీల విషయంలో చిత్ర పరిశ్రమ తీరు ఆశ్చర్యకరంగా, ఒకింత ఆక్షేపణీయంగా కూడా ఉంది. బెంగళూరు.. బాలీవుడ్ సందడి ప్రపంచ సుందరి పోటీలు భారత్లో ఇంతకుముందు రెండుసార్లు జరిగాయి తొలుత బెంగళూరులో 1996లో జరగగా, 2024లో ముంబయిలో జరిగాయి. ఈ రెండు సందర్భాల్లోనూ మిస్ వరల్డ్ ఈవెంట్కు భారతీయ సినిమా పరిశ్రమ నుంచి విశేష మద్దతు లభించింది. తొలిసారి బెంగళూరులో జరిగిన పోటీల నిర్వహణ బాధ్యతలను బిగ్ బి అమితాబ్ బచ్చన్కు చెందిన ఏబీసీఎల్ తలకెత్తుకోగా.. బాలీవుడ్ నుంచి పలువురు తారాగణం తరలివచ్చి ఆ ఈవెంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మన తొలి మిస్ వరల్డ్గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యా రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముంబై... స్టార్స్ జై ముంబైలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ బాధ్యతల్లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, మేగన్ యంగ్ సంస్థలు పాలుపంచుకున్నాయి. అప్పుడు కూడా భారతీయ సినీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్తో పాటు దీపికా పదుకొణె, ఆలియా భట్..దక్షిణాది నుంచి మణిరత్నం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, మానుషి చిల్లర్ వంటి మిస్ వరల్డ్ మాజీ విజేతలు ఆ పోటీలకు అదనపు ఆకర్షణ చేకూర్చారు. ఇక కృతిసనన్, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, మన్నారా చోప్రా తదితర హీరోయిన్లతో పాటు నిర్మాత, దర్శకుడు సాజిద్ నడియాడ్వాలాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలకు హాజరైన వారిలో బాలీవుడ్ చిన్నితెర ప్రముఖులు కూడా ఉండడం విశేషం. రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా, దివ్యాంకా త్రిపాఠి, వివేక్ దహియా తదితర చిన్నితెర స్టార్స్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్ గాయనీ గాయకులు నేహా కక్కర్, టోనీ కక్కర్లు, షాన్లు తమ సంగీత ప్రదర్శనలతో అలరించారు. -
ఓటీటీల విషయంపై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం
బాలీవుడ్ ఆగ్ర నటుడు అమిర్ ఖాన్ (Aamir Khan) నటిస్తోన్న కొత్త చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) థియేటర్లో విడుదలైన తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్లో విడుదల చేసే యోచనలో ఉన్నారు. సినిమాలపై ఓటీటీల ప్రభావం తగ్గించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఓటీటీల ప్రభావం థియేటర్లపై పడుతోందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు ఎనిమిది వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి డీల్ వ్యాపారంలో సరైంది కాదన్నారు.అమీర్ ఖాన్ కొత్త సినిమా 'సితారే జమీన్ పర్' జూన్ 20న విడుదల కానుంది. సాధారణంగా థియేటర్ రన్ 8వారాలు పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావాల్సిందే. అయితే, దానిని అమీర్ బ్రేక్ చేయనున్నారు. ఓటీటీలో కాకుండా యూట్యూబ్లో విడుదల చేయనున్నారు. అది కూడా చాలా రోజుల తర్వాతే అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. ఆ సమయంలో సినిమా చూడాలనుకునే వారు చిత్ర నిర్మాతలు సూచించిన రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నిర్మాతలకు నష్టం వాటిల్లదని ఆయన అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఈ నిర్ణయంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ చెప్పిన మాట ప్రకారం ఇలా ఓటీటీని బాయ్కాట్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.అమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ.. 'థియేటర్లలో విడుదలైన సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సినిమా థియేటర్స్ తీవ్రంగా నష్టపోతున్నాయిని నేను నమ్ముతున్నాను. ఇక నుంచి నేను నటించే సినిమాలు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాను. వాటిని థియేటర్స్లో మాత్రమే విడుదల చేస్తాను. అభిమానులు కూడా నా సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలని కోరుకుంటారు. అందుకే నా మూవీని థియేటర్స్లో విడుదల చేస్తాను. దీంతో సినిమా వ్యాపారం బలం పుంజుకుంటుందని నమ్ముతున్నాను.' అని అన్నారు. ఓటీటీల వల్ల ఆడియన్స్ను థియేటర్లకు రావొద్దని మనమే పరోక్షంగా చెబుతున్నామని, అందుకే సినిమాలు విజయవంతం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. 2007లో వచ్చిన 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్గా ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ కామిడీ డ్రామాగా ఈ చిత్రం రానుంది. -
వయస్సు తేడా ఉన్నప్పటికీ: యంగ్ హీరో
బాలీవుడ్ యువనటుడు ఇషాన్ ఖట్టర్ ప్రస్తుతం హోమ్బౌండ్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే 78వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్కు జాన్వీ కపూర్, నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్.. టబుతో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమెతో ఇంటిమేట్ సీన్స్ చేయండపై మాట్లాడారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ ఆమెతో అలాంటి సీన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదని అన్నారు.ఇషాన్ మాట్లాడుతూ.. " నిజాయితీగా చెప్పాలంటే టబు లాంటి నటితో దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు.. ఆమెతో ఇంటిమేట్ సీన్ చేయడానికి నేను భయపడలేదు. నిజానికి నేను చాలా సేఫ్గా భావించా. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో అర్థం చేసుకోవడమే కాకుండా.. దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లగలిగే నటితో నేను నటించా. అదే టబులో ఉన్న గొప్పదనం. మనం ఒక సన్నివేశంలో ఏమి చేస్తున్నామో దాని గురించి ఎప్పుడూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఆమె సెట్లో చిన్నపిల్లాడిలా ఉంటుంది. జోక్స్ వేస్తూ అందరినీ నవిస్తుంది " అని అన్నారు.కాగా.. ఇషాన్ ఖట్టర్ గతంలో 'ఎ సూటిబుల్ బాయ్' అనే వెబ్ సిరీస్లో టబుతో కలిసి నటించారు. 1993లో విక్రమ్ సేథ్ రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్లో టబు నటించింది. సీనియర్ హీరోయిన్ టబుతో ఇషాన్ ఖట్టర్ ఇంటిమేట్ సీన్స్ను తెరకెక్కించారు. మరోవైపు ఇషాన్ చివరిసారిగా 'ది రాయల్స్'లో కనిపించాడు. ఇది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్, నోరా ఫతేహి, డినో మోరియా, మిలింద్ సోమన్, ల్యూక్ కెంట్ కీలక పాత్రల్లో నటించారు. -
నేరుగా ఓటీటీలో వచ్చేస్తున్న థ్రిల్లర్ సినిమా
ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ. భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు. అందుకు తగ్గట్లే దర్శకులు కూడా డిఫరెంట్ స్టోరీలతో ఈ తరహా మూవీస్ తీస్తుంటారు. అలా ఇప్పుడు ఓ హిందీ చిత్రం.. గతంలో పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దీన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.మీర్జాపుర్, పాతాళ్ లోక్ తదితర వెబ్ సిరీసులతో అభిషేక్ బెనర్జీ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'స్టోలెన్'. దీన్ని జూన్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. చూచాయిగా స్టోరీ ఏంటనేది బయటపెట్టారు.(ఇదీ చదవండి: కొంతమంది చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు: దిల్ రాజు)స్టోలెన్ విషయానికొస్తే.. ఓ రైల్వే స్టేషన్లో ఉన్న తల్లి దగ్గరున్న పాపని దుండగులు ఎత్తుకుపోతారు. దీన్ని చూసిన గౌతమ్, రామన్ అనే అన్నదమ్ములు.. ఆ పాపని వెతికిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దాదాపు 14 కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హిట్ 3, రెట్రో, అజ్ఞాతవాసి అనే కన్నడ సినిమా చూడదగ్గ వాటిలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సడన్ రిలీజయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి.(ఇదీ చదవండి: లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష.. ఎన్ని కోట్లో తెలుసా?) -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఇద్దరం ఉన్న మేము ఇప్పుడు ముగ్గురం అయ్యామంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. బాలీవుడ్లో 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. మాల్వికా రాజ్ రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాల్వికా రాజ్. కొన్ని డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. బీచ్లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
పటిష్ట భద్రత నడుమ పెళ్లికి హాజరైన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆయన తన స్నేహితుడైన అయాజ్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ పెళ్లికి అతని సోదరుడు సోహైల్ ఖాన్, మేనల్లుడు నిర్వాన్ కూడా పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లికి హాజరైన సల్మాన్ ఖాన్ తన అత్యంత భద్రతా నడుమ కనిపించారు. పెళ్లి జంటను ఆశీర్వదించేందుకు వై ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చారు. అయితే మే 20న తన నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్స్లో ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సల్మాన్ పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. ఇషా చాబ్రియా అనే 36 ఏళ్ల మహిళ నటుడి ఇంట్లోకి ప్రవేశించడండో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాంద్రా కోర్టులో హాజరుపరిచగా.. ఆమెను 14 రోజుల రిమాండ్కు తరలించారు.ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ చివరిసారిగా రష్మిక మందన్నతో కలిసి సికందర్ మూవీలో కనిపించారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించి సాజిద్ నదియాద్వాలా నిర్మించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, అంజిని ధావన్,జతిన్ సర్నా కూడా నటించారు. ఈ ఏడాదిలో మార్చి 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమిగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వెండితెరపై ఆపరేషన్స్ ఖుక్రీ
మేజర్ జనరల్ రాజ్పాల్ పునియా జీవితం వెండితెరపైకి రానుంది. బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా ప్రధానపాత్రధారిగా హిందీలో ‘ఆపరేషన్స్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది. ఈ మిలటరీ వార్ డ్రామా సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘ఆపరేషన్స్ ఖుక్రీ: ది అన్స్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్కీపింగ్ మిషన్స్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ పుస్తకం హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. 2000లో వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రాలియోన్లో జరిగిన ఆపరేషన్స్ ఖుక్రీ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.యునైటెడ్ పీస్కీపింగ్ మిషన్స్ లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు, అక్కడి రెబల్ ఫోర్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. ఈ సైనికుల రక్షణ రెస్క్యూ ఆపరేషన్స్ ను రాజ్పాల్ పునియా లీడ్ చేశారు. ఈ రాజ్పాల్ పునియాగానే రణ్దీప్ హుడా నటించనున్నారు. మరోవైపు హిందీలో ‘బదాయి హో, మైదాన్స్ ’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు అమిత్ శర్మ కూడా ‘ఆపరేషన్స్ ఖుక్రీ’ ఘటనల నేపథ్యంలో ఓ సినిమా తీయాలని స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆలియా అరంగేట్రం అదిరిందయ్యా
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు హీరోయిన్ ఆలియా భట్. నిజానికి ఈ చిత్రోత్సవాల తొలి రోజు (మే 13)నే ఆలియా ఈ వేడుకలకు హాజరు కావాల్సింది. అయితే వెళ్లలేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా –పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలియా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కాలేదనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లోని ‘లవ్ అండ్ వార్’ (రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉండటం వల్లే ఆలియా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున వెళ్లలేదట.ఫైనల్గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో ఆమె రెడ్ కార్పెట్పై మెరిశారు. అయితే ఆలియా భట్ ధరించిన కాస్ట్యూమ్స్పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2017లో 70వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి మల్లికా షెరావత్ ధరించిన కాస్ట్యూమ్ డిజైన్నే ఆలియా అనుకరించారని కొందరు నెటిజన్లు, ఫ్యాషన్ లవర్స్పోలికలు పెట్టారు. అయితే ఆలియా ఎంట్రీ అదిరిందని, చాలా క్యూట్గా కనిపించారనే ప్రశంసలూ ఆమెకు దక్కాయి.ఇక కెల్లీ రిచర్డ్స్ డైరెక్షన్లోని ‘ది మాస్టర్ మైండ్’ సినిమాను ప్రదర్శించగా, ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఫ్రాన్స్లో పవర్ కట్స్ కారణంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజు వేడుకల నిర్వహణకు ఇబ్బందులు ఎదరయ్యాయని, అయినా నిర్వాహకులు అనుకున్నప్లాన్ పరంగానే ఉత్సవాలు పూర్తయ్యేలా సన్నాహాలు చేశారనే వార్తలు వస్తున్నాయి. -
ఓటీటీలో సల్మాన్, రష్మికల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా నటించిన సికందర్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైంది. 200 కోట్ల బడ్జెట్తో సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో రూ. 210 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. బాలీవుడ్లో విడుదలైన సినిమాలు కొన్ని 8వారాలకు ఓటీటీలో విడుదలౌతున్నాయి. ఇదేబాటలో సికందర్ చిత్రం కూడా స్ట్రీమింగ్కు రానుంది. మే 25 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్ను కూడా నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. అయితే, కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.కథకథ చాలా పాతదే.. దర్శకుడు చెప్పిన తీరు అంతే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు. రాజ్కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్కోట్కు రెండు పేర్లు ఉంటాయి. సికందర్, రాజాసాబ్ (సల్మాన్ ఖాన్), రాణి సాయిశ్రీ (రష్మిక మందన్న) అన్యోన్య దంపతులుగా ఉంటారు. తమ రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకొంటారు. ఈ క్రమంలో ఒకరోజు మంత్రి ప్రధాన్ (సత్యరాజ్)తో మొదలైన వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. ఆమె చివరికోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేయాలని కోరుతుంది. అయితే, ఎవరైతే రాణి నుంచి అవయవదానం పొందుతారో వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముగ్గురి జీవితాల్లోకి సికందర్ ఎలా ఎంటర్ అవుతాడు. మంత్రి ప్రధాన్ అనుచరుల నుంచి వారిని సికందర్ ఎలా కాపాడుతాడు..? ఇంతకీ సాయిశ్రీ ఎలా మరణించింది? అవయవదాన గ్రహీత వైదేహీ (కాజల్ అగర్వాల్)కు ఉన్న సమస్య ఏమిటి..? అనేది సినిమాలో తెలుసుకోవాల్సిందే.