breaking news
Bollywood
-
పండగపూట ప్రమాదం.. నా భుజం వరకు మంటలు..: బుల్లితెర నటి
దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియా మాలిక్ (Priya Malik) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్ అంటుకుంది.ఫోటోలు దిగుతుండగా..క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.నాకే ఆశ్చర్యం!చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్బాస్ 9తో పాపులర్ అయిన ప్రియ మాలిక్.. 2022లో ఎంటర్ప్రెన్యూర్ కరణ్ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్ జన్మించాడు.చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
దీపికా పదుకోన్ దివాలీ సర్ప్రైజ్.. మహారాణిలా బుజ్జి ‘డింపుల్ క్వీన్’ (ఫొటోలు)
-
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడ్చే హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇలాంటి చిత్రాలు చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. 2023లో విడుదలై నేషనల్ అవార్డ్ దక్కించుకున్న హారర్ మూవీ వాష్. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గుజరాతీలో తెరకెక్కించిన ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి సీక్వెల్గా వాష్ లెవెల్-2 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజైన రెండు నెలల్లోపే డిజిటల్గా స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 22 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. గుజరాతీ భాషతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. అయితే సౌత్ భాషల్లో మాత్రం స్ట్రీమింగ్ కావడం లేదు. కాగా.. ఈ చిత్రానికి కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించారు. Darr ka mahaul hai. Iss baar bachna hoga mushkil 👀 Watch Vash Level 2, out 22 October, on Netflix.#VashLevel2OnNetflix pic.twitter.com/5fIrKyBR5J— Netflix India (@NetflixIndia) October 21, 2025 -
పింక్ బాల్ ఈవెంట్ : ష్యాషన్తో మెస్మరైజ్ చేసిన తల్లీ కూతుళ్లు (ఫొటోలు)
-
విలక్షణం, విశిష్టం 'కుమార్ సాను' గాత్రం!
(అక్టోబర్ 20 ప్రముఖ గాయకుడు 'కుమార్ సాను'(Kumar Sanu) పుట్టినరోజు)“సాంసోం కీ జరూరత్ హై జైసే జిందగీ కే లియేబస్ ఎక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే!”80s కిడ్స్కి పరిచయం అక్కర్లేని పాట ఇది. ఈ పాట పాడినవారికి కూడా పరిచయం అక్కర్లేదనుకోండి! దశాబ్దానికి పైగా బాలీవుడ్ సినీ సంగీతాన్ని ఏలిన మెలోడీ కింగ్ కేదార్ నాథ్ భట్టాచార్య ఉరఫ్ కుమార్ సాను పాడిన పాట ఇది.నదీమ్-శ్రవణ్తో స్వర ప్రయాణం:నదీమ్-శ్రవణ్ జోడీతో కలిసి 'కుమార్ సాను'(Kumar Sanu) పాటలు పాడిన కాలాన్ని బాలీవుడ్ కి స్వర్ణ యుగంగా చెప్పకోవచ్చు. ‘ఆషికీ’లో ప్రతి పాటా ఎన్ని వందలసార్లు విన్నా ఎప్పటికీ పాతబడదు. ‘సాంసోంకీ జరూరత్’, ‘తూ మేరీ జిందగీ హై’, ‘నజర్ కే సామ్ నే’ ఎంత మెలోడీయస్ గా ఉంటాయో ‘అబ్ తేరే బిన్’ అంత ఆవేశపరుస్తుంది. కాబట్టే ఈ పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. 1991లో ఈ పాటకుగాను మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న కుమార్ సాను వరసగా ఐదేళ్ళు, అంటే 1995 వరకు ఈ అవార్డు అందుకుంటూనే ఉన్నారు. ‘సాజన్’లోని ‘మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై’ కుమార్ సాను ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న పాటల్లో ఒకటి. గొంతులో ఒక రకమైన జీరతో, నాసల్ వాయస్లో పాడే కుమార్ సాను మెలోడీస్ వింటే చాలు అప్పట్లో సంగీత ప్రియుల గుండెలు విలవిల్లాడిపోయేవి. ‘దిల్ హై కె మాన్తా నహీ’ టైటిల్ సాంగ్, ‘తుమ్హే అప్నా బనానే కీ కసమ్’ (సడక్), ‘ధీరే ధీరే ప్యార్ కో బఢానా హై’ (ఫూల్ ఔర్ కాంటే), ‘గవా హై చాంద్ తారే’ (దామిని), ‘సోచేంగే తుమ్హే ప్యార్ కర్కే నహీ’ (దీవానా), ‘ఘూంఘట్ కీ ఆడ్ సే’ (హమ్ హై రాహీ ప్యార్ కే), ‘పర్ దేసీ జానా నహీ’ (రాజా హిందూస్తానీ), ‘దో దిల్ మిల్ రహే హై’, ‘మేరీ మెహబూబా’ (పర్ దేస్)- ఇలా నదీమ్-శ్రవణ్ స్వరపరిచిన పాటలను కుమార్ సాను తన గొంతుకతో ఎవర్ గ్రీన్ హిట్స్ గా మలిచారు. మొత్తమ్మీద ఈ జోడీ కాంబినేషన్ లో కుమార్ సాను 300 దాకా పాటలు పాడారు. అను మల్లిక్తో :నదీమ్ శ్రవణ్ తర్వాత కుమార్ సాను ఎక్కువగా పని చేసింది అను మల్లిక్ కే. ‘బాజీగర్’ కోసం కుమార్ సాను పాడిన ‘యే కాలీ కాలీ ఆంఖే’ ఫిలింఫేర్ సాధించుకుంది. అనుమల్లిక్ స్వర కల్పనలో కుమార్ సాను ‘చురాకే దిల్ మేరా’ లాంటి ఎన్నో హిట్ నంబర్స్ పాడారు. ‘దిల్ జలే’ లోని ‘జిస్కే ఆనే సే’ అనే పాట లిరిక్స్, కంపోజిషన్ పరంగా ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ పాటను పోలి ఉన్నా దానికి వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు. కానీ కుమార్ సాను పాడిన క్లాసిక్ సాంగ్స్ లో ఇదీ ఒకటి. 1990ల నాటి బ్యాక్ గ్రౌండ్ తో ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్ హీరో హీరోయిన్లుగా 2015లో వచ్చిన సినిమా ‘దమ్ లగాకే హైషా’. 90ల నాటి సినిమా గనక నేచరల్ గానే ఇందులోని హీరో హీరోయిన్లకు కుమార్ సాను పాటలంటే పిచ్చి అన్నట్లు చూపిస్తారు. ఈ సినిమాలో అను మల్లిక్, కుమార్ సానుతో రెండు పాటలు పాడించారు. ఒక పాటలో ఆయన కేమియో అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. జతిన్-లలిత్తో:జతిన్-లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన మెలొడీలు శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడిస్తాయి. "దిల్ వాలే దుల్హనియా లేజేయేంగే" కోసం కుమార్ సాను లతా మంగేష్కర్ తో కలిసి పాడిన ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ ఇప్పటికైనా ఎప్పటికైనా మర్చిపోగలమా? ‘సీనే మే దిల్ హై’, ‘తు మేరే సాథ్ సాథ్’ (రాజు బన్ గయా జంటిల్ మ్యాన్), ‘ఐ కాష్ కే హమ్’(కభీ హా కభీ నా), ‘మై కోయీ ఐసా గీత్ గావూ’, ‘ఏక్ దిన్ ఆప్’(యస్ బాస్),‘దుష్మన్’ కోసం లతా మంగేష్కర్తో కలిసి పాడిన ‘ప్యార్ కో హో జానే దో’ లాంటి పాటలు షారుఖ్ ఖాన్ కెరీర్ లో మైలురాళ్ళ లాంటివి. కానీ జతిన్ లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన ‘జబ్ కిసీ కీ తరఫ్’ (ప్యార్ తో హోనా హీ థా) వీటన్నింటినీ మించిన ఆల్ టైం హిట్. ఇక ‘ఖూబ్ సూరత్’సినిమా కోసం కవితా కృష్ణమూర్తితో కలిసి కుమార్ సాను పాడిన‘మేరా ఎక్ సప్నా హై’వింటే కలల్లో తేలిపోవడం ఖాయం. రాజేశ్ రోషన్తో:‘జబ్ కోయి బాత్ బిగడ్ జాయే’ – జుర్మ్ సినిమా కోసం రాజేశ్ రోషన్ మ్యూజిక్ డైరెక్షన్ లో కుమార్ సాను పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘కరణ్ అర్జున్’, ‘సబ్సే బడా ఖిలాడీ’, ‘కోయ్ లా’, ‘క్యా కెహ్ నా’ లాంటి సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన ‘పాపా కెహ్తే హై’ అట్టర్ ఫ్లాప్ సినిమా. కానీ రాజేశ్ రోషన్ పాటలు మాత్రం సూపర్ హిట్. ఇందులో ఉదిత్ నారాయణ్ పాడిన ‘ఘర్ సే నికల్తే హీ’తో పాటు కుమార్ సాను పాడిన ‘యే జో థోడే సే హై పైసే’, ‘ప్యార్ మే హోతా హై క్యా జాదూ’ పాటలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. ఇక ‘కహో నా ప్యార్ హై’లో కుమార్ సాను పాడిన ‘చాంద్ సితారే’ చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఆర్డీ బర్మన్తో: 1995కిగాను ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ (1942 ఎ లవ్ స్టోరీ) అనే పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ సాధించింది. ఆర్డీ బర్మన్ చివరిసారిగా కంపోజ్ చేసిన ఈ పాట కుమార్ సాను జర్నీకి ఒక క్లాసిక్ టచ్ ఇచ్చింది. సంగీతం, స్వరం, విధు వినోద్ చోప్రా పిక్చరైజేషన్తో పాటు జావేద్ అఖ్తర్ లిరిక్స్ వల్ల ఈ పాట అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇదే సినిమాలో కుమార్ సాను పాడిన ‘కుఛ్ నా కహో’ చాలా హాయిగా అనిపిస్తుంది. ఎ. ఆర్. రెహమాన్తో సింగిల్ సాంగ్! ఎందుకంటే...:ఉదిత్ నారాయణ్ లాంటి సింగర్స్ తో ఎన్నో పాటలు పాడించిన రెహమాన్, కుమార్ సానుతో ఒకే ఒక్క పాట పాడించడం జీర్ణం కాదు. ‘కభీ న కభీ’ లో ‘మిల్ గయీ మిల్ గయీ’ అనే ఈ పాట ‘అంజలి అంజలి పుష్పాంజలి’ అనే పాట ట్యూన్ లో సాగుతుంది. ఒక ఇంటర్ వ్యూలో రహమాన్ని అసలు మ్యూజిక్ డైరెక్టర్ గానే గుర్తించను అని కుమార్ సాను చెప్పారు. ఎందుకని అడిగితే ఆయన నన్ను సింగర్ గా గుర్తించలేదు కాబట్టి అని సమాధానమిచ్చారు. ఈ మాటలు వింటే ఇద్దరికీ ఎక్కడో కుదరలేదని అర్థమవుతుంది.బెస్ట్ కో-సింగర్ ఎవరంటే...: కుమార్ సాను లతా మంగేష్కర్, అనురాధా పౌడ్వాల్, సాధనా సర్గమ్ లాంటి సింగర్స్ తో కలిసి ఎన్ని పాటలు పాడినా అల్కా యాగ్నిక్ తో పాడిన పాటలు వింటే మాత్రం తేనెలో ముంచి తేల్చినట్లే అనిపిస్తుంది. ‘ముఝ్ సే మొహబ్బత్ కా’, ‘యే ఇష్క్ హై క్యా’, ‘తేరీ మొహబ్బత్ నే’, ‘హమ్ కో సిర్ఫ్ తుమ్ సే ప్యార్ హై’, ‘జాదూ హై తేరా హీ జాదూ’, ‘జో హాల్ దిల్ కా’ లాంటి పాటలు ఈ కాంబినేషన్కి గొప్ప ఉదాహరణలు. కుమార్ సాను పేరు వెనక కథ:కుమార్ సానుకి లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ అంటే గొప్ప గౌరవం. 1983లో సాను భట్టాచార్యగా బెంగాలీలో సింగింగ్ కెరీర్ ఆరంభించిన కేదార్ నాథ్ భట్టాచార్య, 1988లో ‘హీరో హీరాలాల్’ అనే హిందీ సినిమాలో తొలిసారి పాడారు. 1989లో జగ్ జీత్ సింగ్ ఆయన్ను కల్యాణ్ జీ-ఆనంద్ జీ జోడీలోని కల్యాణ్ జీకి పరిచయం చేశారు. వాళ్ళ సూచనతో కిశోర్ కుమార్ పేరులోని కుమార్ కి ‘సాను’ కలిపి కుమార్ సాను గా తన పేరు మార్చుకున్నారు. అంతే కాదు ‘కిశోర్ కుమార్ కీ యాదే’ పేరుతో కిశోర్ దా పాపులర్ సాంగ్స్ పాడుతూ ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశారు.కుమార్ సాను తెలుగులో ఏ పాటలు పాడారంటే...:మన తెలుగులోనూ కుమార్ సాను ‘దేవుడు వరమందిస్తే’, ‘మెరిసేటి జాబిలి నువ్వే’, ‘ఒక్కసారి చెప్పలేవా’, 'నీ నవ్వులే వెన్నలని' లాంటి హిట్ సాంగ్స్ పాడారు. ఆయన విలక్షణమైన గొంతుక తెలుగువారికి బాగా నచ్చేసింది. కుమార్ సాను సెకండ్ ఇన్నింగ్స్:2004లో పాలిటిక్స్ లోకి వెళ్ళిన కుమార్ సాను ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తిరిగి వచ్చారు. ‘రౌడీ రాథోడ్’, ‘గన్స్ & గులాబ్స్’ లాంటి సినిమాల్లో పాడారు. అక్టోబర్ 20, 1957లో పుట్టిన కుమార్ సానుకి ఇప్పుడు 68 ఏళ్ళు. ఈ వయసులోనూ ఆయన గొంతు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ మధ్యనే ‘కుమార్ సాను అఫీషియల్’ పేరుతో యూట్యూబ్లో ఆయన సొంత మ్యూజిక్ లేబుల్ ఒకటి ప్రారంభించారు. అందులోని పాటలు వింటే ఈ విషయం అర్థమవుతుంది.మొత్తం ఎన్ని పాటలు పాడారంటే...:కుమార్ సాను మాతృభాష అయిన బెంగాలీతో పాటు హిందీ, తెలుగు సహా 16కి పైగా భాషల్లో పాటలు పాడారు. ఒకే రోజు 28 పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. బీబీసీ రూపొందించిన ‘ఆల్ టైం 40 సాంగ్స్ ఆఫ్ బాలీవుడ్’లో కుమార్ సాను పాటలే ఎక్కువగా కనిపిస్తాయి. 2009లో పద్మశ్రీ అందుకున్నారు. మెలోడీ కింగ్ అని శ్రోతలతో పిలిపించుకున్న కుమార్ సాను ఇప్పుడు ఎక్కువగా పాడలేకపోతుండవచ్చు. కానీ ఆయన పాడిన ప్రతి పాటా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది.-శాంతి ఇషాన్ (Shanti Ishan) -
బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ.. ఈ దివాళీని మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోనుంది. తమకు బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు విషెస్ చెబుతున్నారు. కాగా.. 2023లో పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్లో మాత్రమే నటించింది. ఇటీవల పరిణితి చోప్రా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో పాల్గొన్న తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకున్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!)అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Raghav Chadha (@raghavchadha88) -
టీమిండియా మహిళ స్టార్ క్రికెటర్తో పెళ్లి.. హింట్ ఇచ్చిన దర్శకుడు
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మృతి బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన పలాశ్ ముచ్చల్కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. ఆమె త్వరలోనే ఇండోర్కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా'మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.తాజాగా ఇవాళ ఇంగ్లాండ్తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు' తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు. -
డేట్ ఫిక్స్
ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా నిర్మించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 4న విడుదల చేయనున్నట్లుగా శనివారం మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఓ సస్పెన్స్ ఎలిమెంట్తో రూపొందిన సినిమా ఇది.ఈ సినిమాలో రకుల్ప్రీత్ సింగ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కథను మలుపు తిప్పే పాత్రలో రకుల్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. ఇక కార్తీక్ ఆర్యన్ హీరోగా, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే హీరోయిన్లుగా నటించిన సక్సెస్ఫుల్ మూవీ ‘పతీ పత్నీ ఔర్ వో’ (2019) సినిమాకు సీక్వెల్గా ‘పతీ పత్నీ ఔర్ వో దో’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. -
ఎమోషనల్గా కనెక్ట్ కావడమే స్టార్డమ్: షారుక్ ఖాన్
‘‘స్టార్ అనే ట్యాగ్ మాకు నచ్చదు. మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం. మాతో కలిసి పని చేసిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ పాల్గొని, సందడి చేశారు. ఈ వేడుకలో ఈ ఖాన్ త్రయం వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.‘‘నాకు, ఆమిర్ ఖాన్కు సినీ నేపథ్యం ఉంది. కానీ షారుక్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఎదిగాడు’’ అని సల్మాన్ మాట్లాడగా, ఇదే విషయంపై షారుక్ స్పందించారు. ‘‘సల్మాన్, ఆమిర్ల కుటుంబ సభ్యుడిగా నన్ను నేను భావిస్తాను. ఈ విధంగా నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లే’’ అని షారుక్ చెప్పారు. అలాగే అభిమానులతో ఎమోషనల్గా కనెక్ట్ కావడమే స్టార్డమ్ అని కూడా షారుక్ తెలిపారు.అది సాధ్యమే: సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. మంచి కథ కుదిరితే ఆమిర్, షారుక్లతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని సల్మాన్ చెప్పారు. కానీ మా ముగ్గర్నీ భరించడం మేకర్స్కి సులభం కాదని సరదాగా అన్నారు సల్మాన్ ఖాన్. -
25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న దంగల్ నటి
దంగల్ ఫేమ్ జైరా వాసిం (Zaira Wasim) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిఖా జరిగినట్లు రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో తన ముఖం చూపించలేదు కానీ భర్తతో నెలవంకను చూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దంగల్తో ఫేమ్16 ఏళ్ల వయసులో దంగల్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది జైరా. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇందులో చిన్నప్పటి గీతా ఫొగట్ పాత్రలో యాక్ట్ చేసింది జైరా. ఈ మూవీకిగానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత సీక్రెట్ సూపర్స్టార్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. సినిమాలకు గుడ్బైaఈ రెండు సినిమాలకుగానూ నేషనల్ చైల్డ్ అవార్డు గెలుచుకుంది. ఆమె నటించిన మూడో సినిమా ద స్కై ఈజ్ పింక్. ఇదే తన ఆఖరి సినిమా! తన విశ్వాసాలకు ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో సినిమా ఇండస్ట్రీకి గుడ్బై చెప్పింది. సోషల్ మీడియాలో ఉన్న తన ఫొటోలను డిలీట్ చేయాలని అభిమానులను కోరింది. View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) చదవండి: ఒక్క టాస్క్కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం -
వెండితెరపై సినీ జీవితం
సైన్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్... ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్స్లో సినీ తారలు నటించడం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలో ఇప్పటివరకు చాలా బయోపిక్స్ వచ్చాయి. మరికొన్ని బయోపిక్స్ రానున్నాయి. అయితే వీటిలో సినీ తారల బయోపిక్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ సడన్గా ఇప్పుడు బాలీవుడ్లో సినీ తారల జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్స్ సంఖ్య ఎక్కవైంది. మరి... ఏ స్టార్స్ బయోపిక్స్ వెండితెరపైకి రానున్నాయి? ఈ తారల బయోపిక్స్లో ఎవరు నటించనున్నారు? అన్న వివరాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకుంటాం. పూర్తి నిడివితో తొలి భారతీయ సినిమా తీసిన వ్యక్తిగా దాదా సాహెబ్ ఫాల్కే ఘనత గొప్పది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా దాదా సాహెబ్ ఫాల్కే పేరిట అవార్డును ప్రదానం చేస్తుంది. ఇలాంటి ప్రముఖ వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు... ఇండస్ట్రీ వర్గాల్లోనూ క్రేజ్ ఉంటుంది. దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కేగా ఆయన కనిపిస్తారు.ఆమిర్ ఖాన్తో గతంలో ‘పీకే, 3 ఇడియట్స్’ వంటి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ తీసిన రాజ్కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్లో నటించనున్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా వెల్లడించారు. రాజ్కుమార్ హిరాణి, అజిభిత్ జోషి, హిందుకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్ ఈ సినిమా స్క్రిప్ట్పై నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ బయోపిక్కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయట. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఈ సినిమాకు దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స పోర్ట్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా: ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2023 సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘నోట్ బుక్’ ఫేమ్ నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా, కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మించనున్నట్లుగా ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనౌన్స్మెంట్లో ఉంది.అయితే దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని, అందుకే రాజమౌళి ఈ సినిమాలో భాగమయ్యారని, ఇందులో దాదా సాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాను 2023 సెప్టెంబరులో ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. సో... ఈ చిత్రంపై స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజిక్ మేస్ట్రో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బయోపిక్ వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్లో ఇళయరాజాగా ధనుష్ నటిస్తారు. గత ఏడాది మార్చిలో ఇళయరాజా బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే పూర్తి స్థాయిలో ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందట.ప్రస్తుతం ధనుష్ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ను హీరోగా పరిచయం చేసే సినిమా పనుల్లో అరుణ్ బిజీగా ఉన్నారు. ఇలా ధనుష్, అరుణ్ల ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ‘ఇళయరాజా’ బయోపిక్ సెట్స్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఇళయరాజా బయోపిక్లో రజనీకాంత్, కమల్హాసన్లు గెస్ట్ రోల్స్లో నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రోడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సంస్థలు ఈ బయోపిక్ను నిర్మించనున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్పై ఉంది.ఆమిర్ లేదా రణ్బీర్ ప్రఖ్యాత గాయకులు కిశోర్ కుమార్ బయోపిక్ వెండితెర పైకి రానుంది. ఈ బయోపిక్పై దర్శకుడు అనురాగ్ బసు ఎప్పట్నుంచో వర్క్ చేస్తున్నారు. ఈ బయోపిక్లో రణ్బీర్ కపూర్ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేక పోయారు. ‘‘కిశోర్ కుమార్గారి బయోపిక్లో రణ్బీర్ కపూర్ను అనుకున్న మాట వాస్తవమే. కాక పోతే ఈ బయోపిక్కు బదులు ‘రామాయణ’ సినిమాను రణ్బీర్ కపూర్ ఎంపిక చేసుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో అతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అనురాగ్ బసు.కాగా కిశోర్ కుమార్ బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో తెరపైకి వచ్చాయి. ఇటీవల ఓ సందర్భంలో కిశోర్ కుమార్గారి బయోపిక్లో నటించే చాన్స్ వస్తే తప్పుకుండా చేస్తానన్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా చె΄్పారు. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించే అవకాశం ఉందని ఊహించవచ్చు. కానీ కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు తొలుత రణ్బీర్ కపూర్ను అనుకున్నారు. అప్పట్లో కుదర్లేదు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ సినిమా పూర్తి కావొచ్చింది. రణ్బీర్ కపూర్ చేస్తున్న మరో సినిమా ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో కిశోర్ కుమార్ బయోపిక్లో రణ్బీర్ కపూర్ నటించే అవకాశం లేక పోలేదు. పైగా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్తో ఆమిర్ ఖాన్ బిజీ కానున్నారు. ఒకేసారి రెండు బయోపిక్స్లో ఆమిర్ ఖాన్ నటించడం సాధ్యం కాక పోవచ్చు కనుక కిశోర్ కుమార్గా వెండితెరపై రణ్బీర్ కపూర్ కనిపించే అవకాశం లేక పోలేదు.ఫైనల్గా కిశోర్ కుమార్ బయోపిక్లో ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరోవైపు కిశోర్కుమార్ బయోపిక్ చేయాలని బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్ ఓ కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ను హీరోగా అనుకున్నారు. కానీ అనురాగ్ బసు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న సూజిత్ సర్కార్ తన ప్రయత్నాలను ఆపేశారు. ఈ విషయాలను సుజిత్ సర్కార్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు.గురుదత్ బయోపిక్లో విక్కీ? ‘సైలాబ్, కాగజ్ కె పూల్, ఫ్యాసా’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్ ఫిల్మ్స్ తీసిన లెజెండరీ దర్శకుడు గురుదత్ జీవితం వెండితెర పైకి రానుందని బాలీవుడ్ సమాచారం. అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బయోపిక్కు భావనా తల్వార్ దర్శకత్వం వహిస్తారని, ‘ ఫ్యాసా’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలో గురుదత్గా విక్కీ కౌశల్ నటిస్తారని, ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఈ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్ భోగట్టా. మరి... వెండితెరపై గురుదత్గా విక్కీ కౌశల్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.మధుబాల బయోపిక్ ‘ ఫ్యార్ కియాతో డర్నా క్యా...’ అంటూ వెండితెరపై అనార్కలిగా మధుబాల నటన అద్భుతం. 1960లో విడుదలైన ‘మొఘల్ ఏ అజం’ సినిమా మధుబాలకు అప్పట్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాయే కాదు... పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మధుబాల. దాదాపు 60 సినిమాల్లో నటించిన మధుబాల 36 సంవత్సరాల చిన్న వయసులో తుది శ్వాస విడిచారు. కాగా, మధుబాల బయోపిక్ రానుంది. గత ఏడాది మార్చిలో ఈ బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన ‘డార్లింగ్స్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన జస్మీత్ కె. రీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్ సంస్థతో బ్రిజ్ భూషణ్ (మధుబాల సోదరి) మధుబాల బయోపిక్ను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో మధుబాలగా ఆలియా భట్ లేదా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనీష్ మల్హోత్రా కూడా మధుబాల బయోపిక్ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో మధుబాలగా కృతీ సనన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ మనీష్ మల్హోత్రా నిర్మించే మధుబాల బయోపిక్పై తమకు సమాచారం లేదన్నట్లుగా బ్రిజ్ భూషణ్ ఓ సందర్భంలో వెల్లడించారనే వార్తలు బాలీవుడ్ ఉన్నాయి.ట్రాజెడీ క్వీన్ దివంగత ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా రానుంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ సినిమా ప్రారంభం కాలేదు. తొలుత ‘కమల్ ఔర్ మీనా’ చిత్రానికి మనీష్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీకి దర్శకుడిగా సిద్ధార్థ్. పి మల్హోత్రా ఉన్నారు. అలాగే ఈ ‘కమల్ ఔర్ మీనా’లో మీనా కుమారిగా తొలుత కృతీ సనన్ పేరు వినిపించింది.కానీ ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని దర్శకుడు కమల్ అమ్రోహిగా ఆయుష్మాన్ ఖురానా, రాజ్కుమార్ రావు వంటి హీరోల పేర్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయట. అయితే ఈ అంశాలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ ఏడాది జూలైలో కియారా అద్వానీ ఓ పాపకు జన్మనిచ్చారు. దీంతో కియారాకు సెట్స్కు వచ్చేందుకు వీలుపడదు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని బాలీవుడ్ సమాచారం. అమ్రోహీ ఫ్యామిలీతో కలిసి సిద్ధార్థ్. పి. మల్హోత్రా, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.ది అన్టోల్డ్ స్టోరీ గ్లామరస్ క్వీన్గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్ స్మిత. ఆ తరం స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేశారు. అయితే సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నారామె. ఎవరూ ఊహించని రీతిలో 1996 సెప్టెంబరు 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది.విద్యాబాలన్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా సిల్క్ స్మిత జీవితం ఆధారంగానే మరో సినిమా రానుంది. ‘సిల్క్ స్మిత: ది అన్టోల్డ్ స్టోరీ’గా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సిల్క్ స్మితగా చంద్రికా రవి నటిస్తున్నారు. ఈ మూవీతో జయరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇలా సినిమా తారల జీవితాల ఆధారంగా రూపొందనున్న మరికొన్ని బయోపిక్స్ చర్చల దశల్లో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
ముంబైలో ల్యాండ్ కొన్న సోనూసూద్.. ధర ఎంతంటే?
విలక్షణ నటుడు సోనూసూద్ (Sonu Sood) ప్లాట్ కొనుగోలు చేశాడు. కుమారుడు ఇషాన్తో కలిసి ముంబై పన్వేల్లోని 777 చదరపు గజాల భూమిని తన సొంతం చేసుకున్నాడు. దీనికోసం రూ.1.09 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు, స్టాంప్డ్యూటీ కింద రూ. 6.3 లక్షలు చెల్లించాడు. ముంబై-పుణె మార్గంలో పన్వేల్ ప్రాంతం ఉంది. పన్వేల్లో ఐటీ సంస్థలు, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి.ఇటీవలే అపార్ట్మెంట్ కొనుగోలుముంబై రెండో అంతర్జాతీయ విమానాశ్రయం (Navi Mumbai International Airport) కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. కాగా సోనూసూద్ కుమారుడు ఇషాన్.. ఇటీవల ఆగస్టులో సైతం ముంబైలోని అంధేరి వెస్ట్లో ఓ అపార్ట్మెంట్ కొన్నాడు. దీనికోసం రూ. 2.6 కోట్లు ఖర్చు చేశాడు. అదే నెలలో సోనూసూద్.. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో తన అపార్ట్మెంట్ను రూ.8.10 కోట్లకు అమ్మేశాడు. దీన్ని 2012లో రూ.5 కోట్లకు కొనుగోలు చేయగా దాదాపు 13 ఏళ్ల తర్వాత 8 కోట్లకు అమ్మేశాడు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ చివరగా ఫతే సినిమాలో నటించాడు. స్వీయదర్శకత్వంతో పాటు సోనూసూద్ హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఇతడు పుష్కరకాలం క్రితం నటించిన తమిళ మూవీ మదజగరాజ మాత్రం జనవరిలో రిలీజై సూపర్ హిట్ అందుకుంది.చదవండి: కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం -
డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ 35వ 'ఫ్యాషన్ గాలా'లో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఆలియా భట్ ఇంటికి ప్రత్యేకమైన గణేశుడు.. 17న పూజలు
ప్రముఖ బాలీవుడ్ స్టార్ జంట రణ్ బీర్ కపూర్, ఆలియా భట్(Alia Bhatt) కోసం మైసూరు శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) ఒక గణపతి మూర్తిని రూపొందించారు. ముంబైలోని రణ్బీర్(Ranbir Kapoor) దంపతులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇంటికి గణపతి విగ్రహం కావాలని యోగిరాజ్కు వారు గతంలోనే ఆర్డర్ ఇచ్చారు. అయోధ్య శ్రీరామ మూర్తిని యోగిరాజే రూపొందించడం తెలిసిందే. అప్పటి నుంచి యోగిరాజ్ పేరు ప్రతిష్టలు దేశ్యాప్తంగా వ్యాపించాయి. గత ఆరు నెలల నుంచి కష్టపడి నల్ల ఏకశిలతో ఆకర్షణీయమైన గణపతి విగ్రహాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దారు. నాలుగు అడుగుల ఎత్తుతో ఈ విగ్రహం ఉంది. ఈనెల 17న ఆలియా దంపతులు ఇంటిలో ప్రతిష్టించి పూజలు చేయనున్నారు. విగ్రహం ధర ఎంత అన్నది మాత్రం గుట్టుగా ఉంచారు.కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. ముగ్గురు శిల్పులు వేర్వేరు శిలలతో రాముడి శిల్పాలను చెక్కగా అందులో యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్నే ఎంపిక చేశారు. రామ్లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ చిన్నారి రాముడి విగ్రహాన్ని దాదాపు 4.25 అడుగుల ఎత్తుతో ఎంతో ఆకర్షణీయంగా కృష్ణశిలతో ఆయన తీర్చిదిద్దారు. ఇప్పుడు మరోసారి అలియా భట్ దంపతుల కోసం గణేశుడి విగ్రహాన్ని అందించనున్నారు. -
దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. తొలి భారతీయ సెలబ్రిటీగా రికార్డ్
భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంటారు నటి దీపికా పదుకొణె (Deepika Padukone). కేవలం తన నటనతోనే కాకుండా తన స్పీచ్లతోనూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అందుకే ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెటా AIకి తన గొంతును అందించిన తొలి భారతీయ సెలబ్రిటీగా ఆమె నిలిచింది. తాను ఇప్పుడు మెటా ఏఐలో భాగమైనట్లు ఒక వీడియోతో సోషల్మీడియాలో పంచుకున్నారు. ఆమెకు మరోసారి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది.మెటా ఇటీవల ప్రత్యేక ఏఐ చాట్బాట్ యాప్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వివిధ రకాల టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాతో శిక్షణ ఇవ్వడం వల్ల మీరు అడిగే ప్రశ్నను కూడా విస్తృత స్థాయిలో అర్థం చేసుకుంటుంది. మీతో చాటింగ్ చేయడమే కాకుండా వాయిస్తో సలహాలు, కబుర్లు కూడా చెబుతుంది. మీకు కావాల్సింది ప్రాంప్ట్లను అందిస్తే చాలు మాట్లాడేస్తుంది. ఏదైనా అంశం మీద లోతుగా తెలుసుకోవాలనుకుంటే విశ్లేషణ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇవ్వన్ని మీ అభిమాన నటి దీపికా పదుకొనె వాయిస్తో మీరు వినేయవచ్చు. ఆమెతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ, ఆమె వాయిస్ మాత్రం ఏఐ ఆధారంగా మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.వాయిస్ ఇన్పుట్స్తో మెటా ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు దానికి దీపికా పదుకొణె వాయిస్ తోడవుతుంది. అంటే స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఎప్పుడైనా దీపికతో మాట్లాడొచ్చన్నమాట. మెటా ఏఐలో హాలీవుడ్ నుంచి కొంతమంది ప్రముఖుల వాయిస్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇండియా నుంచి మాత్రం కేవలం దీపికా పదుకొనె వాయిస్ మాత్రమే అందుబాటులోకి రానుంది.ఈ క్రమంలోనే దీపిక ఒక వీడియోను షేర్ చేసుకున్నారు. ఇది చాలా బాగుంది అని తాను అనుకుంటున్నట్లు పేర్కంది. తాను ఇప్పుడు మెటా AIలో భాగమయ్యానని దీంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ అంతటా తన వాయిస్తో ఇంగ్లీషులో చాట్ చేయవచ్చని ఆమె పంచుకున్నారు. ఒక్కసారి దీనిని ప్రయత్నించి ఏమనుకుంటున్నారో తెలియజేయాలని ఆమె కోరారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. 2023లో రాజకీయ నాయకుడితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా సినిమాలు చేయడం తగ్గించింది. గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించింది. ప్రస్తుతం కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్లో నటించింది.సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే హీరోయిన్ పరిణితి చోప్రా బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలోనే పరిణీతికి మరో స్టార్ హీరోయిన్ గిఫ్ట్ను పంపి సర్ప్రైజ్ ఇచ్చింది. డెలివరీకి ముందే పుట్టబోయే బిడ్డ కోసం బహుమతి పంపిన విషయాన్ని పరిణీతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.(ఇది చదవండి: అలాంటి డ్రెస్లో సోనాక్షి.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసినట్టేనా!) మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న పరిణీతి చోప్రాకు స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) సర్ప్రైజ్ ఇచ్చింది. తన సొంత బ్రాండ్ అయిన ఎడ్-ఎ-మమ్మా నుంచి సరికొత్త హ్యాంపర్ను గిఫ్ట్గా పంపింది. ఆలియా భట్ బహుమతిపై పరిణీతి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది. తన బిడ్డకోసం గిఫ్ట్ పంపినందుకు ధన్యావాదాలు తెలిపింది. కాగా.. పరిణితి చోప్రా ఇటీవలే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కనిపించింది. ఆ తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకుంది.అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు పంకజ్ ధీర్(Pankaj Dheer) ( 68) ఇవాళ కన్నుమూశారు. కొన్నేళ్ల పాటు క్యాన్సర్తో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే క్యాన్సర్కు పలుసార్లు శస్త్ర చికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంకజ్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికాగ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ముంబయిలోని విలే పార్లేలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఇది చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు)కాగా.. పంకజ్ ధీర్ నవంబర్ 9.. 1956న పంజాబ్లో జన్మించారు. 1980 ప్రారంభంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్లో బుల్లితెరతో పాటు సినిమాల్లో నటించారు. బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్రలో మెప్పించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. మహాభారతంతో పాటు చంద్రకాంత(1994–1996), ది గ్రేట్ మరాఠా, ససురల్ సిమర్ కా లాంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా సడక్, బాద్షా, సోల్జర్ వంటి చిత్రాలలో కూడా కనిపించారు.అయితే అనితా ధీర్ను పంకజ్ వివాహం చేసుకున్నాడు. వీరికి నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నాడు. అతను కూడా నటనలో రాణిస్తున్నారు. ఆయన కుమారుడు నికితిన్ బుల్లితెర నటి క్రతికా సెంగర్ను వివాహం చేసుకున్నాడు. అతను తన తండ్రి పంకజ్ ధీర్తో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. Actor Pankaj Dheer, played Karn in Mahabharat, Passed Away. Om Shanti🙏#pankajdheer pic.twitter.com/uJSTFoOb4b— Sumit Kadel (@SumitkadeI) October 15, 2025 -
అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. ఎంతో ఏడ్చా!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఐటం గర్ల్గా పలు సినిమాలు చేసింది దీప్షిక నగ్పాల్ (Deepshikha Nagpal). షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'కోయిల' మూవీ (Koyla Movie)లో ఓ అభ్యంతకర సన్నివేశంలో యాక్ట్ చేసింది. అందులో దుస్తులు తొలగిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ.. అది నిజం కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కోయిల మూవీ డైరెక్టర్ రాకేశ్ సర్ నాకు ఆ సన్నివేశం గురించి ముందే చెప్పారు. నా తల్లి ఎదురుగానే సీన్ వివరించారు. సరే, షూటింగ్ ఎప్పుడు? అని ఎటువంటి బెరుకు లేకుండా అడిగాను.డ్రెస్ ధరించే సీన్ కంప్లీట్ చేశానేను చెప్పింది అంతా గుర్తుందిగా? అని ఆయన మరోసారి క్రాస్చెక్ చేసుకున్నారు. గుర్తుందని బదులిస్తూనే మీరేం భయపడవద్దని ధైర్యం చెప్పాను. కెమెరాను నా ఎదురుగా కాకుండా టాప్ యాంగిల్లో పెట్టమన్నాను. కేవలం నా భుజాల వరకే కనిపించేలా జాగ్రత్తపడ్డాను. నేను డ్రెస్ తీసేస్తున్నట్లుగా మీకు కనిపించింది కానీ, మినీ టాప్, అలాగే జీన్స్ నా ఒంటిపై అలాగే ఉన్నాయి. బట్టలు ధరించే ఎంతో సులువుగా ఆ సీన్ పూర్తి చేశాం. కానీ సినిమా రిలీజయ్యాక ఆ సీన్ ఎంతో వివాదాస్పదమైంది. హేళన చేశారుకెమెరా ముందు దుస్తులు తొలగించావా? అని నా అనుకున్నవాళ్లే నన్ను దారుణంగా విమర్శించారు. ఆ మాటలకు ఎన్నోసార్లు ఏడ్చాను. ఒకసారి నా కూతురు కోయిల సినిమా సీడీని కోపంతో విరిచేసింది కూడా! సినిమాల్లోలాగే నిజ జీవితంలో కూడా నేను అలాగే చేస్తానని నా క్యారెక్టర్ను తప్పుపట్టారు. నా పిల్లలు కూడా నన్ను గౌరవించరని హేళన చేశారు అని చెప్తూ ఎమోషనలైంది. ఒకప్పుడు సినిమాలు చేసిన దీప్షిక.. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఈమెకు రెండు పెళ్లిళ్లవగా రెండుసార్లు విడాకులయ్యాయి. హిందీ బిగ్బాస్ 8వ సీజన్లో పాల్గొనగా మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయింది.చదవండి: బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ -
సల్మాన్ తో దిల్ రాజు.. క్రేజీ కాంబో
-
దత్తత కూతురి బర్త్ డే సెలబ్రేషన్లో సన్నీ లియోన్ (ఫొటోలు)
-
తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?
మరో తెలుగు హీరోయిన్ వివాదంలో నిలిచింది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుతో వివాదం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సదరు మేకప్ ఆర్టిస్ట్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో ఈ సంగతి బయటపడింది. సదరు హీరోయిన్, ఆమె తల్లిపై లేడీ మేకప్ ఆర్టిస్టు సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?'గత కొన్నిరోజులుగా ఓ స్టార్ హీరోయిన్ నన్ను వేధిస్తోంది. ఆమె టీమ్, కుటుంబ సభ్యులు అయితే చాలా స్టుపిడ్గా ప్రవర్తిస్తున్నారు. దక్షిణాదిలో వాళ్లకు తక్కువ మొత్తానికి లేదంటే ఫ్రీగా పనిచేసినట్లు ఇక్కడ కూడా పనిచేస్తారని అనుకుంటున్నారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. నాకు నీతో పనిచేయాలని లేదు. కాబట్టి ఇకపై ఫోన్, మెసేజ్ చేయకు'(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం)'ఆమె కుటుంబానికి చెందిన ఓ మనిషి.. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మిగతావాళ్లు సారీ చెబుతున్నారు. కానీ నాకు మీతో పనిచేయాలని లేదు. మా డబ్బులు నొక్కేయడం ఆపండి. లేదంటే ఈసారి మీ పేర్లు బయటపెడతాను' అని సదరు మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.విషయానికొస్తే.. రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. అయితే నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసే మేకప్ ఆర్టిస్టులని ఈ హీరోయిన్ తల్లి వద్దని చెబుతోందట. బదులుగా వేరే వాళ్లని పెట్టుకుని వాళ్లకు డబ్బులిస్తోంది. అయితే మేకప్ ఆర్టిస్టులకు ఎంత డబ్బులు ఇస్తుందో అంతకు రెట్టింపు.. నిర్మాత నుంచి వసూలు చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?(ఇదీ చదవండి: శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?) -
'నా కూతురిని ఒకరి భార్యగా పెంచలేదన్నాడు'.. సుస్మితా సేన్
బాలీవుడ్ భామ సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. తనకు 18 ఏళ్ల వయసులోనే విశ్వసుందరిగా ఘనతను సొంతం చేసుకుంది. తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుస్మితా సేన్.. బాలీవుడ్, టాలీవుడ్లోనూ నటించింది. తెలుగులో నాగార్జునతో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది.అయితే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుస్మితా సేన్ తన వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పలువురితో డేటింగ్ చేసిన ఆమె..ఏ ఒక్కరిని పెళ్లాడలేదు. ఆమె రిలేషన్స్ మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. ప్రేమాయణం కొనసాగించడం.. కొన్నేళ్లకు బ్రేకప్ ఆమె లైఫలో సర్వసాధారణంగా మారిపోయింది.ఇద్దరు పిల్లలకు తల్లిగా..అయితే సుస్మితా సేన్ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. తన తల్లిదండ్రుల మద్దతుతో కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ పిల్లలను దత్తత తీసుకోవడంలో ఎదురైన ఇబ్బందులను పంచుకుంది. తన తండ్రి సుబీర్ సేన్ తిరుగులేని మద్దతువల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. 2000 సంవత్సరంలో రెనీని దత్తత తీసుకున్నప్పుడు జరిగిన సంఘటలను పంచుకుంది. ఒంటరి మహిళలు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవడాన్ని జువెనైల్ జస్టిస్ చట్టాలు ఎప్పుడు నిషేధించలేదని వెల్లడించింది.సుస్మితా మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో చట్టబద్ధంగా ఏం చేయాలో నాకు తెలుసు. రెనీ కోసం చట్టపరమైన పోరాటం చేసే సమయంలో నాలో ఆందోళన మొదలైంది. రెనీ విషయంలో కుటుంబ కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే.. వారు బిడ్డను తిరిగి తీసుకుంటారు. అప్పటికే రెనీ నన్ను అమ్మా అని పిలవడం ప్రారంభించింది. అప్పు నాకు ఓ ఐడియా వచ్చింది. పాపను తీసుకుని కారులో నువ్వు పారిపో అని నాన్నతో చెప్పాను. మనం అలాంటి పని చేయకూడదు. కానీ బిడ్డను మా నుంచి ఎవరు తీసుకోలేరని గట్టిగా అనుకున్నాం."అని అన్నారు. అయితే ఈ కేసు మాకు అనుకూలంగా రావడంతో తన తండ్రి పెద్ద పాత్ర పోషించారని పంచుకుంది. నా తండ్రి వల్లే నాకిప్పుడు పిల్లలు ఉన్నారు.. నా బిడ్డను పోషించడానికి కోర్ట్ చెప్పినట్లుగా సగం ఆస్తిని రెనీ పేరిట రాసిచ్చారని తెలిపింది.ఆ సమయంలో న్యాయమూర్తి తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ను ప్రస్తావించింది. మంచి కుటుంబంలోని అబ్బాయి ఎవరూ కూడా నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడరని న్యాయమూర్తి నా తండ్రిని కూడా హెచ్చరించారని వివరించింది. నేను ఆమెను ఎవరి భార్యగా పెంచలేదని నాన్న జడ్జితో చెప్పారని వెల్లడించింది. ఆ తీర్పే నా జీవితాన్ని మార్చేసిందని సుస్మితా సేన్ తెలిపింది. కాగా.. సుస్మితా సేన్ 1975 నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. -
ఎన్టీఆర్ వార్-2.. బాక్సాఫీస్ నో క్రేజ్.. ఓటీటీలో సూపర్ రికార్డ్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది.అయితే ప్రస్తుతం వార్-2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 09 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ఫామ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. 3.5 మిలియన్ల వ్యూస్తో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ, సన్ ఆఫ్ సర్దార్-2, మహావతార్ నర్సింహా, మదరాసి సినిమాలను దాటేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని వార్-2 చిత్రానికి డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. Top 5 most-watched films on OTT in India, for the week of Oct 6-12, 2025, estimated based on audience researchNote: Estimated number of Indian audience (in Mn) who watched at least 30 minutes. pic.twitter.com/1a4ouoYh45— Ormax Media (@OrmaxMedia) October 13, 2025 -
శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?
యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఈ ఏడాది 'రాబిన్హుడ్', 'జూనియర్' సినిమాలతో వచ్చింది. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఈనెల 31న 'మాస్ జాతర' మూవీతో రానుంది. దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు. ఇవి కాకుండా తెలుగు, తమిళ, హిందీలో తలో చిత్రం చేస్తోంది. ఇప్పుడు ఇన్ స్టాలో కొత్తగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇప్పుడిది ఏంటా అనే క్వశ్చన్ మార్క్గా మారింది.(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)'ఏజెంట్ మిర్చి'గా శ్రీలీల.. అక్టోబరు 19న ప్రకటన రానుందని చెబుతూ ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో గ్లామరస్గా రఫ్ అండ్ టఫ్ లుక్లో కనిపించింది. క్యాప్షన్ చూస్తుంటే ఇదేదో హిందీ ప్రాజెక్టులా అనిపిస్తుంది. అయితే అది సినిమానా లేదా వెబ్ సిరీస్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇవేం కాకుండా యాడ్ లాంటిది అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', శివకార్తికేయన్ 'పరాశక్తి', కార్తిక్ ఆర్యన్తో ఓ రొమాంటిక్ సినిమా చేస్తోంది. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ నిలబడాలంటే ఇవి కచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన వరస చిత్రాల్లో నటించింది. కాకపోతే 'ధమాకా', 'భగవంత్ కేసరి'తో పాటు 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ తప్పితే మిగతావి ఏవి ఉపయోగపడలేదు. ఇప్పుడు చేస్తున్న మూవీస్పై కాస్త బజ్ ఉంది. మరి శ్రీలీల లక్ ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
51 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్
రష్మిక హీరోయిన్గా చేస్తున్న లేటెస్ట్ హిందీ సినిమా 'థామా'. 'స్త్రీ' యూనివర్స్ నుంచి వస్తున్న కొత్త మూవీ ఇది. అక్టోబరు 21న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో పాటలు మాత్రం ప్రతిదీ ఐటమ్ సాంగే అనిపిస్తుంది. తాజాగా రిలీజైన సాంగ్లో అయితే 51 ఏళ్ల బ్యూటీ అదిరిపోయే స్టెప్పులేయడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'థామా' నుంచి తాజాగా 'పా*యిజన్ బేబీ' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇది కూడా పార్టీ నేపథ్యంగా సాగే గీతం అర్థమవుతోంది. తొలుత మలైకా అరోరా గ్లామరస్గా కనిపిస్తూ స్టెప్పులేయగా, చివరలో రష్మిక కూడా మలైకతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇదే కాదు గతంలో 'దిల్బర్' అంటూ సాగే మరో పాట రిలీజ్ చేశారు. ఇందులో నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది. ఇది ఐటమ్ సాంగ్. అంతకుముందు రష్మిక పాట కూడా చూడటానికి ఐటమ్ సాంగ్లానే అనిపిస్తుంది. చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటు ఐటమ్ గీతాలు చాలానే ఉన్నాయి!(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ కృతి శెట్టి, కల్యాణి బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్) -
'థామ' ప్రమోషన్స్లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)
-
సినిమాల్లో బోల్డ్ సీన్స్.. ఆ విషయంలో భయపడ్డా..: హీరోయిన్
బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పంజాబీ ముద్దుగుమ్మ సోనమ్ బజ్వా. ప్రస్తుతం ఏక్ దీవానే కి దీవానియాత్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనమ్.. బాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.బాలీవుడ్లో తాను చాలా సినిమాలు తిరస్కరించినట్లు సోనమ్ బజ్వా తెలిపింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్, ముద్దు సన్నివేశాలకు నో చెప్పానని వెల్లడించింది. అయితే ఆ అవకాశాలు వదిలేసుకున్నందుకు తానిప్పుడు చింతిస్తున్నట్లు పేర్కొంది. తన సొంత రాష్ట్ర పంజాబ్లో ప్రజలు, తమ కుటుంబం ఆ సీన్స్ చూస్తే ఎలా స్పందిస్తారోనని భయపడ్డానని రివీల్ చేసింది.సోనమ్ మాట్లాడుతూ..'బాలీవుడ్లో చాలా సినిమాలకు నేను నో చెప్పాను. ఎందుకంటే తన సొంత రాష్ట్రం పంజాబ్ ఇలాంటి వాటిని అంగీకరిస్తుందా భయపడ్డాను. మా కుటుంబాల మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. అందుకే అప్పట్లో సినిమాల్లో ముద్దు సన్నివేశం చేయడానికి చాలా భయపడ్డాను. నన్ను అలా చూస్తే ప్రజలు ఎలా స్పందిస్తారు? నన్ను నేనుగా మార్చిన వ్యక్తులు ఏమనుకుంటారు? ఇదంతా సినిమా కోసమేనని నా కుటుంబం అర్థం చేసుకుంటుందా?' అని నా మనసులో నేనే బాధపడ్డా' అని పంచుకుంది.అయితే తన తల్లిదండ్రుల మద్దతు ఇచ్చారని సోనమ్ వెల్లడించింది. ఈ రెండేళ్ల క్రిత దాని గురించి మా అమ్మానాన్నలతో మాట్లాడా.. అది కేవలం సినిమా కోసం అయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అది నేను కూడా షాక్ అయ్యా.. ఈ విషయం గురించి మొదట వారితో ఎందుకు మాట్లాడలేదని బాధపడ్డా.. దీని గురించి నా తల్లిదండ్రులతో చర్చించడానికి చాలా సిగ్గుపడ్డానని తెలిపింది.ఇక సోనమ్ కెరీర్ విషయానికొస్తే 2013లో బెస్ట్ ఆఫ్ లక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పంజాబ్ 1984 మూవీతో ఫేమ్ తెచ్చుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా నిక్కా జైల్దార్, క్యారీ ఆన్ జట్టా 2, అర్దాబ్ ముతియారన్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా బాబు బంగారం, సుశాంత్ నటించిన ఆటాడుకుందాం రా చిత్రంలో కనిపించింది. 2019లో బాలా మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత స్ట్రీట్ డాన్సర్ 3డీ, హౌస్ఫుల్ 5 సినిమాలు చేసింది. ప్రస్తుతం ఏక్ దీవానే కి దీవానియాత్తో పాటు టైగర్ ష్రాఫ్తో బాఘి 4లో కనిపించినుంది. -
దీపిక అడిగింది ఇవ్వాల్సిందే!: అర్జున్ రెడ్డి బ్యూటీ
మిగతా ఇండస్ట్రీల మాదిరిగా సినీ పరిశ్రమ ఓ పద్ధతి ప్రకారం లేదు. ఇక్కడ పనిగంటలు కరెక్ట్గా ఉండవు. అన్నిచోట్లా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఈ డిమాండ్లు సెట్ అవుతాయేమో కానీ భారీ బడ్జెట్ చిత్రాలకు వీటిని ఫాలో అవడం కష్టం!దీపికా.. నాకు చాలా ఇష్టంఈ కారణం వల్లే స్పిరిట్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దీపిక చేజారిపోయాయి. దీపిక డిమాండ్ గురించి తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం. స్కూల్లో చదువుకునే రోజుల నుంచి తనను చూస్తున్నాను. ఆమె జర్నీని ఫాలో అయ్యాను. తనొక గొప్ప యాక్టర్. తనకు ఏది అవసరమో దాని గురించి నిర్భయంగా మాట్లాడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని నొక్కి చెప్పింది. తనవల్లే మేమందరం మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాం. సినిమాతను కోరుకున్నది తనకు దక్కాల్సిందేనని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. అటు కొంకణ సేన్ శర్మ మాట్లాడుతూ.. మేమేం సర్జరీ చేసే డాక్టర్స్ కాదు కదా.. మేమూ మనుషులమే! మాకూ చిన్నపాటి బ్రేక్స్ కావాలి అని పేర్కొంది. షాలిని పాండే తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బాగా పాపులర్ అయింది. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లోనూ తళుక్కుమని మెరిసింది. ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది.చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి -
ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా..
ఫిలింఫేర్ అవార్డుల్లో (Filmfare Awards 2025) లాపతా లేడీస్ సినిమా విజయ ప్రభంజనం మోగించింది. ఏకంగా 13 విభాగాల్లో పురస్కారాలు ఎగరేసుకుపోయింది. ఎక్కువ ఫిలింఫేర్లు అందుకున్న సినిమాగా ఇప్పటివరకు గల్లీ బాయ్ పేరిట (13 పురస్కారాలతో) రికార్డు ఉంది. ఇప్పుడు లాపతా లేడీస్ (Laapataa Ladies Movie) ఆ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్లో శనివారం జరిగిన 70వ ఫిలింఫేర్ వేడుకకు షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ యాంకర్స్గా వ్యవహరించారు.'ఐ వాంట్ టు టాక్' మూవీకి గానూ అభిషేక్ బచ్చన్, 'చందు: ఛాంపియన్' సినిమాకుగానూ కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. జిగ్రా చిత్రానికిగానూ ఆలియా భట్ (Alia Bhatt) ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. లాపతా లేడీస్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు అందించారు.అవార్డు విజేతలు వీళ్లే..ఉత్తమ దర్శకుడు: కిరణ్ రావు (లాపతా లేడీస్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): ఐ వాంట్ టు టాక్ (డైరెక్టర్ సుజిత్ సర్కార్)ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): రాజ్కుమార్ రావ్ (శ్రీకాంత్ మూవీ)ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్): ప్రతిభ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయ నటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయ నటి: ఛాయా కదమ్ (లాపతా లేడీస్)ఉత్తమ డెబ్యూ నటుడు: లక్ష్య (కిల్)ఉత్తమ డెబ్యూ నటి: నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: కునాల్ కెమ్ము (మడగావ్ ఎక్స్ప్రెస్), ఆదిత్య సుహాస్ జంబలే (ఆర్టికల్ 370)ఉత్తమ యాక్షన్: సీయాంగ్ ఓ, పర్వేజ్ షైఖ్ (కిల్)ఉత్తమ స్క్రీన్ప్లే: స్నేహ దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ కథ: ఆదిత్య ధర్, మోనాల్ టక్కర్ (ఆర్టికల్ 370)ఉత్తమ సంభాషణలు: స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: రామ్ సంపత్ (లాపతా లేడీస్)ఉత్తమ లిరిక్స్: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్)ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (లాపతా లేడీస్)ఉత్తమ గాయని: మధుబంతి బగ్చి (స్త్రీ 2)ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: రితేశ్ షా, తుషార్ షీతల్ జైన్ (ఐ వాంట్ టు టాక్)ఉత్తమ సౌండ్ డిజైన్: సుభాష్ సాహో (కిల్)ఉత్తమ నేపథ్య సంగీతం: రామ్ సంపత్ (లాపతా లేడీస్)ఉత్తమ వీఎఫ్ఎక్స్: రీడిఫైన్(ముంజ్యా)ఉత్తమ కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్ (బ్యాడ్ న్యూస్ మూవీలో తాబ తాబ పాట)ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పానికర్ (కిల్)ఉత్తమ కాస్ట్యూమ్: దర్శన్ జలన్ (లాపతా లేడీస్)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ (కిల్)ఉత్తమ సినిమాటోగ్రఫీ: రఫీ మహ్మద్ (కిల్)ప్రత్యేక అవార్డులుజీవిత సాఫల్య పురస్కరం: శ్యామ్ బెనగల్ (మరణానంతరం), జీనత్ అమన్ఆర్డీ బర్మన్ పురస్కారం: అచింత్ టక్కర్ (జిగ్రా, మిస్టర్ అండ్ మిసెస్ మహి)చదవండి: నేను కూర్చుంటే లేచి వెళ్లిపోయేవారు.. పవన్-రీతూల లవ్ట్రాక్ ఫేక్! -
జీవన తాత్వికతను ప్రతిబింబించిన అమర స్వరం
‘జిందగీ కా సఫర్ కోయి సమ్ ఝా రహ’... ‘ముసాఫిర్ హు యారో న ఘర్ హై నా ఠికాన’... ‘మేరే నైనా సావన్ బాధో ఫిర్ భి మేరా మన్ ప్యాసా’... ‘ఘుంఘురూ కి తరా బజ్ థా హి రహా హూ మై’... ఆ బరువైన స్వరం వినగానే విషాదంలో కూరుకొనిపోయిన వారికి ఉపశమనం కలుగుతుంది. జీవన సమరంలో ఓడిపోయిన వారికి పోరాడే ధైర్యం వస్తుంది. నిరాశ నిస్పృ హలో కొట్టు మిట్టాడినవారికి ఆశలు చివురిస్తాయి.పల్లవులను చూడగానే ఆ స్వరం ఎవరిదో తెలిసిపోతుంది... ఆ పల్లవులను వింటే చాలు, రాసిన రచయితలకంటే, సంగీతం అందించిన స్వరకర్తల కంటే ముందుగా సాక్షాత్కరించే గాన గంధర్వుడెవరన్నది... అది నాలుగు దశాబ్దాలుగా తన నవరసభరిత గాత్రంతో బాలీవుడ్ సినీ రంగాన్ని శాసించిన అపురూప, అరుదైన గాయకుడు కిషోర్ కుమార్దేనని. అందరూ ప్రేమగా పిలుచుకొనే ‘కిషోర్ దా’ భౌతికంగా దూరమై, మూడున్నర దశాబ్దాల పైనే అవుతోంది.‘నీవు లేవు నీ పాట వుంది’ అని తిలక్ అన్నట్లు కిషోర్ దా మన మధ్య లేకున్నా ఆయన పాటలు స్వర స్మరణీయలుగా మన హృదయాలను స్పృశించడానికి కారణం ఆయన స్వరంలోని జీవశక్తి... ఆయన గాత్రంలోని జీవన తాత్వికత... కవి హృదయాన్ని అవగతం చేసుకొని కథా సన్నివేశాన్ని, పాత్రల మనోభావాలను మమేకం చెంది, సంగీత దర్శకుని బాణీలను ఇంప్రో వైజ్ చేసి, స్వీయ అనుభవాలను మిళితం చేసి, అనుభూతి చెంది పాడ డం వల్ల కిషోర్ స్వరం భాస్వరంలా ప్రజ్వరిల్లింది.ఆయన గాత్రంలోని జీర, బరువు, స్థాయి, మధురిమ, డైనమిక్స్ అన్నీ పంచామృతమై గానధారలుగా రస ప్లావితం చేసింది. ఆ శైలీ ప్రభంజనంలో పడిపోయిన వేలాది గాయకులు జూనియర్ కిషోర్ కుమారులై వేదికల మీద పాడుతూ మురిసిపోతున్న మాట వాస్తవం..కిషోర్ కుమార్ నటుడు కావాలనుకున్నాడు కానీ గాయకుడయ్యాడు. ‘జిద్దీ’ (1948) చిత్రంలో ఖేమ్ చంద్ర ప్రకాశ్ తొలి పాటను పాడించాడు. కానీ ఆయనలోని ప్రతిభను, చిలిపితనాన్ని, వలపుతనాన్ని గుర్తించింది ఎస్.డి. బర్మన్. యాభైలలో రఫీ ప్రభంజనం ఉన్న రోజుల్లో కిషోర్కు మంచి పాటలిచ్చి ్రపోత్సహించాడు.1960 దశకం ప్రారంభంలో ఆయన సినిమాలు విఫలమైన తరుణంలో ఎస్.డి. బర్మన్ కొడుకు ఆర్.డి. బర్మన్ ‘పడోసన్’లో ‘మేరే సామ్ నె వాలే ఖిడ్ కీ మే’ పాటనిచ్చి కిషోర్ గొంతులోని రొమాంటిజాన్ని ఆవిష్కరించి, అందరి దృష్టినీ ఆకర్షించాడు.కిషోర్ జీవితంలోని ‘ఆరాధన’ (1969) పెద్ద మలుపు. ఆ చిత్ర స్వరకర్త ఎస్.డి. బర్మన్... రఫీతో రెండు పాటలు రికార్డు చేశాక జబ్బు పడడంతో ఆర్.డి. కిషోర్తో ‘రూప్ తేరా మస్తాన...’ పాడించి హిట్ చేయడంతో కిషోర్ ప్రభంజనం మొదలైంది. ఆ పాటలతో హిందీ సినీ గీతాల దిశ కూడా మారింది.కిషోర్ యువతీ యువకుల పాలిట రొమాంటిక్ సింగర్ అయ్యాడు. అయితే కిషోర్ మరోవైపు జీవన తాత్వికతను తెలిపే బరువైన పాటలూ పాడాడు. ఆ పాటలే ఆయనను సమున్నత స్థానానికి చేర్చాయి. నిజానికి విషాద గీతాలను పాడి మెప్పించడం చాలా కష్టమని ప్రసిద్ధ గాయకులు చెప్పే మాట... కానీ కిషోర్ దా పాడిన ప్రతి విషాద గీతం కంటతడి పెట్టిస్తుంది. ఆయన గొంతులోని మార్దవం మనల్ని ఓదారుస్తుంది.‘యే జీవన్ హై... ఇస్ జీవన్ కా యహీహై యహీహై రంగ్ రూప్... ‘పియా కా ఘర్’ (1972) లోని ఈ పాట అర్థం తెలిస్తే మనం ఎంతో ఉపశమనం ΄÷ందుతాం... ఇందులో ‘జీవితం కొంత సుఖం... కొంత కష్టం... బతుకుతో పంతం వద్దు’ అని చెబుతుంది. ఈ పాట కిషోర్కు ఎంతో ఇష్టమైనది. ఇదే ఆనంద్ భక్షి రాసిన ‘చింగారి కోయీ భడ్ కే, తొ సావన్ ఉసే భుజాయే, సావన్ జొ అగన్ లగాయే, ఉసె కౌన్ భుజాయె’ (నిప్పును వర్షం చల్లారుస్తుంది, అయితే వర్షంలోనే నిప్పు పుడితే ఎవరు చల్లారుస్తారు) అని ‘అమర్ ప్రేమ్’లోని పాట ఆద్యంతం మనకు విధి నిర్ణయాలలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. కిషోర్ ఈ పాటను ఎంతో నెమ్మదిగా... మంద్రంగా పాడాడు. ‘మేరా జీవన్ కోరా కాగజ్ కోరా హి రహ్ గయా... జో లిఖాథా ఆంసు వోంకె సంగ్ బహ్ గయా’ (నా జీవితం ఓ తెల్ల కాగితం... ఏదైనా రాస్తే అదంతా కన్నీటితో తుడచుకుపోయింది) అని ‘కోరా కాగజ్’ చిత్రంలోని ఈ పాట కంట తడి పెట్టిస్తుంది. జీవితంలో అంతా కోల్పోయిన వారు వేదాంతిలా మారిపోతారు, లేదా జీవించే ప్రయత్నం చేయక మరణాన్నే ప్రేమిస్తుంటారు. ‘ఘుంఘురూ కీ తరహా బజ్ థా హూ రహా హు మై’ (చోర్ మఛాయే షోర్) మొదలైన పాటలు ఇందుకు ఉదాహరణలే.జీవన వైచిత్రిని, జీవన సత్యాన్ని తెలిపే గీతాలకు కిషోర్ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు.జిందగీ కా సఫర్ ... హై యే కైసా సఫర్కోయి సమ్ ఝా నహి కోయి జానా నహిహై యే కైసే డగర్... చల్ తె హై సబ్ మగర్... (ఈ జీవిత పయనం ఎవరికీ తెలియదు.. ఎవరికీ అర్థం కాదు. అందరం ఏ తోవన వెళుతున్నామో తెలియకున్నా వెళుతూనే వున్నాం). ‘సఫర్’ (1970) చిత్రంలోని ఈ పాట అందర్నీ కదిలిస్తుంది...అలాగే ‘ఆప్ కి కసమ్‘ సినిమా (1974)లో జీవితంలో గడచిన క్షణాలు, సంఘటనలు మళ్ళీ రావు అనే సత్యాన్ని ఆరు రుతువులతో పోలుస్తూ రాసిన గీతాన్ని కిషోర్ హృద్యంగా పాడారు.‘జిందగీ కా సఫర్ మై గుజర్ జాతే హై జో మఖామ్... వో ఫిర్ నహీ ఆతీ... వో ఫిర్ నహీ ఆతీ’... (ఇందులో శిశిరంలో రాలిన పూలు వసంతంలో చిగురిస్తాయని అనుకోవద్దని, ఒక్కసారి దూరమైన వ్యక్తులు మరల చేరువ కారని మనిషికి అనుమానం ఉంటే అది పెనుభూతమవుతుందని, జీవితం అశాంతిమయమనే) భావనతో రాసిన గీతాన్ని కిషోర్ ఎంతో గంభీరంగా పాడాడు. ‘అందాజ్’ (1971) చిత్రంలోని ‘జిందగీ ఎక్ సఫర్ హై సుహానా యహ కల్ క్యా హో కిస్ నే జానా’ ఆల్ టైం హిట్గా నిల్చింది. (రేపు ఏమవుతుందో తెలియదు. మృత్యువు అనుక్షణం వెంటా డుతుంటుంది. అనుభవించేదేదో ఈ క్షణమే అనుభవించు) అనే భావంతో ఈ పాట సాగుతుంది. ‘అమర్ ప్రేమ్’ (1972) లోని ‘కుఛ్ తో లోగ్ కహేంగే... లోగోంక కామ్ హై కహనా’ (ప్రజలు ఎప్పుడు ఏవో మాట్లాడుతూ వదంతులు సృష్టిస్తూనే వుంటారు... ఆ మాటలను పట్టించుకోవద్దు... సీతమ్మ వారినే నిందించింది లోకం... మనం లోకానికి జవాబుదారు కాము) గీతాన్ని ఎంతో అనునయంగా పాడాడు కిషోర్...‘కాలా పత్తర్’ (1979) చిత్రంలోని ‘ఎక్ రాస్ థా హై జిందగీ’ గీతాన్ని కిషోర్ పాడిన తీరు మనల్ని కట్టి పడేస్తుంది..కిషోర్ వ్యక్తిగత జీవితమూ రక రకాల గతుల్లో పయనించింది. ఆయన జీవితంలో నలుగురు స్త్రీలు ప్రవేశించి కొన్నాళ్ల తరువాత నిష్క్రమించారు. తొలుత రూమాదేవి 1950ల్లో తరువాత మధుబాలను, తరువాత 1970ల్లో యోగితా బాలిని, చివరికి 1980ల్లో లీనా చందా వర్కర్ను వివాహమాడాడు... వీరందరూ ప్రసిద్ధ నటీమణులే... కిషోర్ వాయిద్యాలతో, సంగీత దర్శకులతో ట్యూన్ అయ్యాడు కానీ ఆయన భార్యలు మాత్రం ఆయనతో ట్యూన్ కాలేదు. కారణం ఆయన నిలకడ లేనితనం, చిన్నపిల్లాడి తత్వమే! 1969లో మధుబాల మరణంతో కిషోర్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. తరువాత చాలా కాలానికి యోగితా బాలి ఆయన జీవితంలో ప్రవేశించింది. ఆ తర్వాత లీనా చందా వర్కర్... కిషోర్ జీవితంలో చివరివరకున్నది... కిషోర్ ఉమనైజర్ కాడు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన వ్యక్తిగత జీవితం తెగిన గాలి పటమైంది. కానీ ఇవేవీ ఆయన స్వర జీవితంపై ప్రభావం చూపలేదు..కిషోర్ తరచూ గుండె నొప్పి అని, అందర్నీ ఆట పట్టించేవాడు. అక్టోబర్ 13న (1987) కూడా అలాగే అంటే భార్య లీనా జోక్ కాబోలనుకుంది... కానీ మరుక్షణంలోనే డాక్టర్ను పిలిపించింది... డాక్టర్ వచ్చే లోపే కిషోర్ తుది శ్వాస వదిలాడు. అప్పుడు ఆయన వయసు 58 యేళ్ళు... కిషోర్ లేడు అనుకోగానే... ‘మౌత్ ఆయేగీ ఆయేగీ ఎక్ దిన్... జాన్ జాయేగీ జాయేగీ ఎక్ దిన్’ కిషోరే పాడిన పాట గుర్తుకు వస్తుంది... కానీ కిషోర్ మాత్రం తనకు ఎన్నడు వీడ్కోలు ఇవ్వద్దని వెళుతూ మరీ చె΄్పాడు.‘చల్ తే చల్ తే మేరే యే గీత్... యాద్ రఖ్ నా కభి అల్ విద నా కహనా’ (చల్ తే చల్ తే)... అవును.. కిషోర్ దా గాత్రానికి మరణం లేదు.. అది అజరం, అమరం.– డా. వి.వి. రామారావు (గాయకుడు, రచయిత, వ్యాఖ్యాత) -
అమ్మాయిల్ని ఇంటికి తీసుకొస్తా.. పేరెంట్స్ అర్థం చేసుకుంటారు
బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ (Farah Khan) ఈ మధ్య యూట్యూబ్ వ్లాగ్స్పై స్పెషల్ ఫోకస్ చేసింది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ ఇంటికి వెళ్లి చిట్చాట్ చేస్తూ వీడియోలు తీస్తోంది. అలా తాజాగా హిందీ నటుడు కరణ్ టక్కర్ (Karan Tacker) ఇంటికి వెళ్లింది. ఎప్పటిలాగే తన వంటమనిషి దిలీప్ను తోడుగా తీసుకెళ్లింది. ఫరాఖాన్ చేసే వీడియోల పుణ్యమా అని దిలీప్ ఎక్కువ ఫేమస్ అయిపోయాడు. ఫ్యామిలీ హౌస్.. కానీ!కరణ్ ఇంటికి వెళ్లగా.. అక్కడున్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఫరాఖాన్కు బదులుగా దిలీప్ను గుర్తుపట్టి హాయ్ చెప్పింది. అది చూసి అవాక్కైన ఫరా.. ఆమె నాకు బదులుగా నీకు హాయ్ చెప్పింది అని ఆశ్చర్యపోయింది. అందుకు దిలీప్ మురిసిపోతూ ఈ మధ్య నాకు ఆడవాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోయిందన్నాడు. ఇక మెయిన్ డోర్ నుంచి అడుగుపెడుతూనే ఇదెవరి ఇల్లు అని అడిగింది ఫరా. అందుకు కరణ్.. మా కుటుంబానిది అని బదులిచ్చాడు. అలాగైతే కచ్చితంగా ఇది నీది కాదు, నీ తల్లిదండ్రుల ఇల్లే! అది సరే, మరి అమ్మాయిలను ఇంటికి ఎలా తీసుకొస్తావ్? అని సరదాగా అడిగింది. నాకింకా పెళ్లవలేదుఅందుకు కరణ్ వెంటనే.. మా ఇంట్లో అందరూ అర్థం చేసుకునేవాళ్లే! మా అభిరుచులకు అనుగుణంగా ఈ ఇల్లు కట్టారు. నాకింకా పెళ్లి కాలేదు కాబట్టి రెండు లివింగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి మా పేరెంట్స్ కోసం, మరోటి నాకోసం! ఎప్పుడైనా ఎవరినైనా ఇంటికి తీసుకొస్తే మా ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ చేస్తాను. అప్పుడు వాళ్లు వారి లివింగ్ రూమ్ దాటి ఇటుపక్క రారు. నా పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్.. రియాలిటీ షోలుకరణ్ టక్కర్.. లవ్ నే మిలాది జోడి, ఏక్ హజారూ మే మేరి బెహ్నా హై వంటి పలు సీరియల్స్లో నటించాడు. డ్యాన్స్ రియాలిటీ షో 'జలక్ దిక్లాజా 7'వ సీజన్లో పార్టిసిపేట్ చేయగా ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. 'ద వాయిస్', 'నాచ్ బలియే 8' వంటి పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. స్పెషల్ ఆప్స్, ఖాకీ వంటి వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడు. తన్వి: ద గ్రేట్ సినిమాలోనూ నటించాడు. View this post on Instagram A post shared by Karan Tacker (@karantacker) చదవండి: గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు -
అభిషేక్ బచ్చన్కు ప్రతిష్టాత్మక అవార్డ్.. హాజరు కాని ఐశ్వర్య రాయ్!
బాలీవుడ్ హీరో, బిగ్బీ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గానూ ఈ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఈవెంట్లో అవార్డ్ అందుకున్నారు. చందు ఛాంపియన్ సినిమాకు గాను కార్తీక్ ఆర్యన్ సైతం అవార్డ్ అందుకున్నారు. తొలిసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్న సందర్భంగా అభిషేక్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ 83వ పుట్టినరోజు కావడం మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.అభిషేక్ మాట్లాడుతూ.. "ఈ ఏడాదితో సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. నాకు అవకాశాలు ఇచ్చిన అందరు దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. ఈ ఘనత రావడం అంత సులభం కాదు. నా లైఫ్లో విలువైంది. ఈ అవార్డు కోసం నేను ఎన్నిసార్లు స్పీచ్ ఇచ్చేందుకు ప్రాక్టీస్ చేశానో గుర్తులేదు. ఇది ఒక కల. ఈ అవార్డ్ వచ్చినందుకు చాలా వినయంగా ఉన్నా. నా కుటుంబం ముందు అవార్డ్ అందుకోవడం మరింత ప్రత్యేకం. ఇక్కడ నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కార్తీక్ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తమ డ్రీమ్ కోసం ప్రతి ఒక్కరూ నమ్మకంతో పనిచేయండి. నిరంతరం కృషి చేయండి' అని పంచుకున్నారు.(ఇది చదవండి: సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!)సతీమణి ఐశ్వర్య గురించి అభిషేక్ మాట్లాడుతూ.."ఐశ్వర్య, ఆరాధ్యలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను బయటకు వెళ్లి నా కల నిజం చేసుకునే అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడానికి వారి త్యాగాలే కారణం. ఈ అవార్డును ఇద్దరు చాలా ప్రత్యేకమైన వ్యక్తులకు అంకితం చేయాలనుకుంటున్నా. నా తండ్రితో పాటు కుమార్తెకు అంకితం చేయాలనుకుంటున్నా." అని అన్నారు.ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ గైర్హాజరు..అయితే అభిషేక్ బచ్చన్ ఈ అవార్డ్ను తల్లి జయ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్, మేనకోడలు నవ్య నవేలి నందా సమక్షంలో అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు భార్య ఐశ్వర్య రాయ్ , కుమార్తె ఆరాధ్య హాజరు కాలేదు. కాగా.. గతంలో ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు పలుసార్లు జంటగా కనిపించడంతో విడాకుల వార్తలకు చెక్ పడింది. -
దీపావళి డిన్నర్ పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
రూ.100 కోట్లు ఇచ్చినా సరే తనతో పని చేయను
రూ.100 కోట్లు ఇచ్చినా సరే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్ (Ismail Darbar). వీరిద్దరూ 'హమ్ దిల్ దే చుకే సనమ్', 'దేవదాస్' సినిమాలకు కలిసి వర్క్ చేశారు. ఈ రెండు చిత్రాల ఘన విజయంలో ఇస్మాయిల్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. కలిసి బ్లాక్బస్టర్లు కొట్టిన వీళ్లిద్దరి మధ్య తర్వాత పెద్ద అగాధమే ఏర్పడింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ మాట్లాడాడు.భయమెందుకు?'హీరామండి ప్రాజెక్ట్ ఈ మధ్య అనుకుంది కాదు. రెండున్నర దశాబ్దాల కిందటే ఆ ప్రాజెక్ట్కు పునాది పడింది. ఆ సమయంలో ఓ వార్తాపత్రికలో హీరామండి ప్రాజెక్ట్కు నేను అందించే సంగీతమే వెన్నెముకలా నిలవనుంది అని రాశారు. ఇది నేనే పత్రికలో వేయించానని సంజయ్ అనుమానించాడు. పిలిచి నిలదీశాడు. నిజంగా నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే నీకు భయపడాల్సిన అవసరమే లేదు. నీ ముందు కూడా అదే చెప్తాను. అయినా పేపర్లో అది ఎవరు రాశారో నాకసలు తెలీనే తెలియదు అని చెప్పాను.నేనే బ్యాక్బోన్సరే, వదిలెయ్ అని అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వదిలెయ్ అన్నది ఈ విషయాన్ని కాదు, ప్రాజెక్ట్ అని నాకు తర్వాత అర్థమైంది. తనతో చెప్పించుకోవడం దేనికని నేనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా! తర్వాత.. హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ సినిమాలకు నేనే వెన్నెముక అని సంజయ్ పీఆర్ టీమ్కు కూడా తెలిసొచ్చింది. కానీ సంజయ్కు ఇగో ఎక్కువ. నా కష్టానికి కూడా తనే క్రెడిట్ తీసుకుంటాడు. అందుకే తనతో పనిచేయకూడదనుకున్నాను. తను రూ.100 కోట్లు ఇచ్చినా సరే ఆయన సినిమాకు పని చేయను' అని ఇస్మాయిల్ చెప్పుకొచ్చాడు.చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్ -
పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్, ఇద్దరితో పెళ్లి!
కుటుంబం గురించైనా, వ్యక్తిగత విషయాల గురించైనా కొందరు ఓపెన్గా మాట్లాడుతుంటారు. మరికొందరు మాత్రం అన్నీ గోప్యంగానే ఉంచాలనుకుంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునికా సదానంద్ (Kunickaa Sadanand) మొదటి కోవకు చెందుతుంది. దాపరికాల్లేకుండా అన్నీ బాహాటంగానే మాట్లాడుతుంది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది.మందుకు బానిసయ్యాబిగ్బాస్ (Bigg Boss Reality Show) హౌస్లో తనకున్న చెడు అలవాట్ల గురించి ఓపెన్ అయింది. నేనెప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. కానీ నాకు మందు తాగే అలవాటుంది. బ్రేకప్ అయినప్పుడు మందుకు బానిసయ్యాను. బాధతో ఇంకా ఎక్కువ తాగేసి చాలా బరువు పెరిగిపోయాను. డబ్బింగ్ చెప్పడానికి స్టూడియో వెళ్లినప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుని షాకయ్యాను. నేనిలా అయిపోయానేంటి? అనుకున్నాను. గుండెనిండా బాధతో పగలూరాత్రీ తేడా లేకుండా మద్యం సేవించేదాన్ని. పట్టపగలే బీర్ తాగేదాన్ని. యాక్టర్స్ను ప్రేమించలేదురాత్రి క్లబ్కు వెళ్లి మళ్లీ మందు తాగుతూ కూర్చునేదాన్ని. మందు తాగడం మానేయ్ అని నాన్న హెచ్చరించినా లెక్క చేయలేదు. రిలేషన్స్ విషయానికి వస్తే.. నేను ఇద్దరితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా.. నలుగురితో రొమాన్స్ చేశా.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. కానీ యాక్టర్స్తో మాత్రం ప్రేమలో పడలేదు. యాక్టర్స్ ఎప్పుడూ అద్దంలో వారి ముఖాన్ని చూసుకుని మురిసిపోతుంటారు. పక్కవాళ్లకంటే ముందు వారినే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ అద్దం ముందు ఉండేవాళ్లతో నేనెలా ఉండగలను? అని చెప్పుకొచ్చింది.పర్సనల్ లైఫ్కాగా కునికా సదానంద్.. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ బాబు పుట్టాడు. కానీ, దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ను పెళ్లి చేసుకోగా.. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కానీ, ఈ జంట కూడా కలిసుండలేకపోయింది. భార్యాభర్తలిద్దరూ విడిపోయారు.చదవండి: వాడికి యాక్టింగ్ వద్దు.. కోహ్లి బ్యాట్ కావాలి, రోహిత్..: కరీనా కపూర్ -
భానురేఖ గణేషన్ ..వెండి తెరకు పసిడి వన్నెలద్దిన అందాల ‘రేఖ’ (ఫొటోలు)
-
వాడికి యాక్టింగ్ వద్దు.. కోహ్లి బ్యాట్ కావాలి, రోహిత్..: కరీనా కపూర్
స్టార్ సెలబ్రిటీల పిల్లలు యాక్టింగ్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అలా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మొదటి భార్య (అమృత సింగ్) పిల్లలు ఇబ్రహీం అలీ ఖాన్, సారా అలీ ఖాన్ కూడా పేరెంట్స్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అయితే సైఫ్- కరీనా కపూర్ (Kareena Kapoor) పిల్లలు మాత్రం యాక్టింగ్పై అంతగా ఆసక్తి చూపించడం లేదట! ఈ విషయాన్ని కరీనా తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెల్లడించింది.యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదుసైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న పాడ్కాస్ట్కి కరీనా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తైమూర్కు యాక్టింగ్పై ఏమాత్రం ఆసక్తి లేదు. డ్రామా క్లాసుల్లో జాయిన్ అవుతావా? అని అడిగితే వాడు నో చెప్పేవాడు. ఒకసారి యాక్టింగ్ ట్రై చేసి చూడు అని అడిగితే.. లేదమ్మా, యాక్టింగ్ నేను ఎంజాయ్ చేయలేను అన్నాడు. అందుకే వాడిని నేను బలవంతం చేయదల్చుకోలేదు.కోహ్లి బ్యాట్ ఇప్పిస్తావా?సైప్కు వంట చేయడం ఇష్టం. తండ్రిని చూసి వాడు కూడా కుకరీ క్లాస్లో జాయిన్ అవుతానన్నాడు. వాడెప్పుడూ నాతోపాటు సెట్స్కు రాలేదు. ఏ యాక్టర్నూ కలవలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నీ ఫ్రెండ్సేనా? వాళ్ల బ్యాట్ ఇవ్వమని మెసేజ్ చేస్తావా? లియోనాల్ మెస్సీ ఫోన్ నెంబర్ నీ దగ్గరుందా? ఇలాంటి ప్రశ్నలే అడుగుతుంటాడు. వాళ్లెవరి నెంబర్లూ నా దగ్గర లేవని చెప్పేదాన్ని. వాడికి యాక్టర్స్ గురించి పెద్దగా ఏమీ తెలీదు. ఎంతసేపూ విరాట్తో మాట్లాడిస్తావా? అంటూ క్రీడాకారుల గురించే ఆరా తీస్తుంటాడు అని చెప్పుకొచ్చింది.సైఫ్-కరీనా ఫ్యామిలీసైఫ్- కరీనా కపూర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో తైమూర్ జన్మించాడు. 2021లో జహంగీర్ పుట్టాడు. సైఫ్ జంట ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే.. పిల్లల స్కూల్ ఈవెంట్స్కు మాత్రం తప్పక హాజరవుతూ ఉంటారు. తైమూర్కు స్పోర్ట్స్ అంటేనే ఇష్టం అని కరీనాయే స్వయంగా చెప్తోంది. మరి జహంగీర్ కూడా అన్నలాగే ఆలోచిస్తాడా? పేరెంట్స్ దారిలో పయనిస్తాడా చూడాలి!చదవండి: వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్గా కల్యాణ్ -
వేడుకగా కర్వాచౌత్ వ్రతం, ఈ సెలబ్రిటీలను మిస్ అయితే ఎలా? (ఫొటోలు)
-
ఓటీటీలో హృతిక్ స్టార్మ్
ఓటీటీలో హృతిక్ రోషన్ ‘స్టార్మ్’ మొదలైంది.పార్వతి తిరువోత్తు, ఆలియా .ఎఫ్, శ్రిష్టి శ్రీవాత్సవ, సబా ఆజాద్ ప్రధానపాత్రల్లో నటించనున్న వెబ్ సిరీస్ ‘స్టార్మ్’ (వర్కింగ్ టైటిల్). ముంబై నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ సిరీస్కు అజిత్పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్కు హృతిక్ రోషన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. శుక్రవారం ఈ ‘స్టార్మ్’ సిరీస్ను ప్రకటించి త్వరలోనే షూటింగ్ ఆరంభించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.హృతిక్ రోషన్కు నిర్మాతగా ఓటీటీలో తొలిప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ‘‘భారతీయ వినోద రంగంలో నేను నిర్మాతగా పరిచయం అవుతున్నాను. ఇండస్ట్రీలో నటుడిగా నేను 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇలా కొత్త అడుగు వేయడం చాలా సంతోషంగా ఉంది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ‘స్టార్మ్’ సిరీస్ కథనం ఆకట్టుకుంటుంది’’ అని హృతిక్ రోషన్ పేర్కొన్నారు. -
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. దేశంలోనే మొదటి వ్యక్తిగా!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో 8 గంటల పనిపై కామెంట్స్ చేయడమే. స్టార్ హీరోలంతా కేవలం ఎనిమిది గంటలే పని చేస్తున్నారని.. తాను కూడా అంతేనని తేల్చి చెబుతోంది. ఇటీవలే కల్కి 2, స్పిరిట్ వంటి రెండు పెద్ద సినిమాల నుంచి అనూహ్యంగా తప్పుకుంది. దీపికా రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందని వార్తలొచ్చాయి. అంతేకాకుండా తనతో పాటు తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్లో వసతులు కల్పించాలని షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కావడంతో దీపికా పదుకొణెను ఇండియాకు అంబాసిడర్గా నియమించారు. ది లివ్ లవ్ లాఫ్ (LLL) ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన దీపికాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) మనదేశ మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపికైంది. దీపికా ఎంపిక భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి విస్తృతంగా అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.ఈ నియామకంపై దీపికా పదుకొణె మాట్లాడుతూ.. 'కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా పనిచేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో గణనీయమైన పురోగతి సాధించింది. మనదేశంలో అవగాహన కల్పించడానికి.. మరింత బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.అంతేకాకుండా 2015లో తాను స్థాపించిన ది లైవ్ లవ్ లాఫ్ ప్రయాణం గురించి మాట్లాడింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించానని తెలిపింది. ప్రజలు నా దగ్గరికి వచ్చి నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు..నువ్వు నా కూతురికి సహాయం చేశావు అని చెప్పినప్పుడు వచ్చిన ఆనందం మరెక్కడా తనకు లభించలేదని తెలిపింది. మనదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాలను రోజువారీ జీవితంలో ఒక సాధారణ ప్రక్రియగా మార్చడంలో కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. మానసిక ఆరోగ్య అవగాహన అనేది ఏదో ఒక రోజు గల్లీ క్రికెట్ లాగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని చెప్పుకొచ్చింది. -
ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా వివాదాల్లో నానుతూనే ఉంది. కల్కి 2, స్పిరిట్ వంటి రెండు పెద్ద సినిమాల్లో భాగమైన ఆమె.. అనూహ్యంగా వాటినుంచి సైడ్ అయిపోయింది. కారణం తను పెట్టిన కండీషన్లే! 8 గంటల పనిదినాలతో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందని, తనతో పాటు తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్లో వసతులు కల్పించాలని షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది.భారీ సినిమాలు చేజార్చుకున్న దీపికాస్టార్ హీరోయిన్ కాబట్టి అన్నింటికీ తలాడించిన నిర్మాతలు 8 గంటల పనిదినాల దగ్గర మాత్రం ఒప్పుకోవడానికి నిరాకరించారు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఈ రూల్ పని చేయదు. అది పాటిస్తే బడ్జెట్ చేయిదాటిపోతుందన్నది వారి వాదన! అందుకే ఆమె చేతినుంచి సినిమాలు చేజారుతున్నాయి. తాజాగా తొలిసారి దీపికా పదుకొణె మీడియా ముందు ఈ వివాదంపై పెదవి విప్పింది. స్టార్ హీరోలు 8 గంటలే..ఆమె మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది సూపర్స్టార్స్, టాప్ హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇదేమీ సీక్రెట్ కాదు. అయినా ఎప్పుడూ ఈ విషయం వార్తల్లోకెక్కలేదు. వాళ్ల పేర్లు నేను చెప్పను. ఇప్పుడుకానీ వాళ్ల పేర్లు ప్రస్తావిస్తే విషయం పెంటపెంట అవుతుంది. అందుకే ఆ హీరోల గురించి చెప్పాలనుకోవడం లేదు. చాలామంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేస్తారు, వీకెండ్లో సెలవు తీసుకుంటారు. నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నా..ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన కొందరు హీరోయిన్లు కూడా 8 గంటలే వర్క్ చేయడం ప్రారంభించారు. కానీ, వాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు. నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో మొదట దీపికను అనుకున్నారు. కానీ, సడన్గా తన స్థానంలోకి త్రిప్తి డిమ్రి వచ్చి చేరింది. కల్కి 2898 ఏడీ సినిమాలో దీపిక నటించిన విషయం తెలిసిందే! ఈ మూవీ సీక్వెల్లో నిబద్ధతతో పనిచేసేవారు అవసరమంటూ దీపికను తప్పించారు.చదవండి: ఇలాగైతే నావల్ల కాదు, ఇంటికి పంపించేయండి.. సంజనా ఏడుపు -
గొప్ప ప్రయాణం
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’. ప్రియదర్శన్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రోడక్ష న్స్, తెస్పియన్ ఫిలింస్పై వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్లో అక్షయ్ కుమార్ పాల్గొంటున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.‘‘సరికొత్త థ్రిల్లర్గా రూ పొందుతోన్న చిత్రం ‘హైవాన్’. ఈ మూవీలో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు అక్షయ్ కుమార్’’ అన్నారు మేకర్స్. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘హైవాన్’ చిత్రంతో ఒక గొప్ప ప్రయాణం చేస్తున్నాను. ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర పలు విధాలుగా నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి రోల్లో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ ప్రియదర్శన్కు థ్యాంక్స్. ఆయన చేస్తున్న మూవీ సెట్లో ఉంటే ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. సైఫ్తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అంటూ అక్షయ్ తెలి పారు. -
ముందే పాఠం నేర్పుకుందాం
ఇప్పుడు ప్రపంచం వైఫైలో బందీ! ఆ వైఫైయే సెల్ఫోన్కు ఆహారం.. ఆ సెల్ఫోనే అందరికీ ప్రాణాధారం! రియల్ లైఫ్ కన్నా వర్చువల్ వరల్డ్లోనే శ్వాసిస్తున్నాం! పిల్లలకైతే చెప్పక్కరలేదు.. చదువు – సంధ్య, ఆట – పాట అంతా డిజిటల్ డివైజే! అందుకే ఆన్లైన్లో అవతలివైపు వాళ్లకు అవలీలగా దొరికిపోతున్నారు.. ఆటవస్తువులుగా మారుతున్నారు! ఈ ప్రమాదానికి సెలబ్రిటీల పిల్లలూ వల్నరబులే.. ప్రైవసీ కంచె వాళ్లను కాపాడలేకుంది! తాజా ఉదాహరణ.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూతురు నితారా కుమార్కు ఎదురైన అనుభవమే!అక్షయ్ కుమార్ కూతురు నితారాకు పదమూడేళ్లు. అందరి పిల్లల్లాగే ఆ అమ్మాయికీ ఆన్లైన్ గేమ్స్ అంటే మహా ఇష్టం. అమ్మ ట్వింకిల్ ఖన్నా అనుమతితో రోజులో కొంచెంసేపు ఆన్లైన్ గేమ్స్తో ఎంటర్టైన్ అవుతూంటుంది. ఎప్పటిలాగే ఆ రోజూ గేమ్స్టార్ట్ చేసింది. అవతలి వైపు నుంచి ఓ అపరిచితుడు అమ్మాయికి గేమ్ పార్ట్నర్గా చేరాడు. గేమ్ ఆడుతూ నితారాతో సంభాషణ మొదలుపెట్టాడు. ‘చాలా స్మార్ట్గా ఆడుతున్నావ్.. వెరీ గుడ్’ అంటూ ప్రశంసించాడు. ‘థాంక్స్’ చెప్పింది నితారా. ఇంకో రెండుమూడు క్యాజువల్ మాటల తర్వాత ‘నువ్వు అమ్మాయివా? అబ్బాయివా?’ అంటూ అడ్వాన్స్ అయ్యాడు. ‘అమ్మాయిని’ అంటూ బదులిచ్చింది నితారా. ‘ఒకసారి నీ ఫొటోగ్రాఫ్స్ పంపవా?’ అని అడిగాడు. ఏదో అపశ్రుతి పసిగట్టిన ఆ అమ్మాయి వెంటనే డివైజ్ షట్డౌన్ చేసి, విషయాన్ని తల్లికి చెప్పింది. ‘నా కూతురు చేసిన తెలివైన పని అదే. డివైజ్ క్లోజ్ చేసి ఆ ఆన్లైన్ అబ్యూజ్ను తల్లితో షేర్ చేసుకోవడం’ అంటాడు అక్షయ్ కుమార్. సైబర్ అవేర్నెస్ మంత్ క్యాంపెయిన్లో మాట్లాడుతూ తన కూతురు ఎదుర్కొన్న పరిస్థితిని వివరించాడు అక్షయ్ కుమార్.పాఠ్యాంశంగా.. అక్షయ్, ట్వింకిల్ ఖన్నా ఇద్దరూ క్రమశిక్షణకు మారుపేరు. పిల్లలిద్దరినీ మీడియాకు దూరంగానే ఉంచుతారు. వాళ్ల ప్రైవసీకే ప్రాధాన్యం ఇస్తారు. అయినా నితారా ఆన్లైన్ అబ్యూజ్ను ఎదుర్కొంది. అంత కంటికి రెప్పలా కాచుకుంటేనే ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే.. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లల్లో పిల్లల సంగతి ఎలా ఉంటుందో! 24 గంటలు కాదుకదా.. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు కూడా పర్యవేక్షించలేనంత బిజీగా ఉంటున్నారు పేరెంట్స్. అందుకే స్కూళ్లల్లో సైబర్ సేఫ్టీని పాఠ్యాంశంగా చేర్చాలంటున్నాడు అక్షయ్ కుమార్.ఎందుకంటే పిల్లల స్క్రీన్ టైమ్ మీద నియంత్రణ లేకపోతే సైబర్ ట్రోలింగ్, బుల్లీయింగ్, అబ్యూజ్కి గురయ్యే ప్రమాదం ఎలాగూ ఉంటుంది. దానితోపాటు అది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం పై, వాళ్ల సోషల్ బిహేవియర్ మీదా దుష్ప్రభావం చూపిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి అక్షయ్ కుమార్ చెప్పినట్టు పిల్లలకు బడిలో పుస్తక పాఠాలతోపాటు సైబర్ బిహేవియర్ జాగ్రత్తలనూ నేర్పించాలని చైల్డ్ సైకాలజిస్ట్లూ సూచిస్తున్నారు. అంతేకాదు పెద్దలకూ ఆన్లైన్ అవేర్నెస్ మీద వర్క్షాప్స్ను నిర్వహించాలని.. సైబర్ క్రైమ్ పోలీసులే దీని మీద చొరవ చూపాలని కోరుతున్నారు.వీళ్లు కూడా.. షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నుంచి కాజోల్, అజయ్ దేవ్గన్ల కూతురు నైసా దేవ్గన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్యా బచ్చన్, అనూష్కా శర్మ, విరాట్ కొహ్లీల కూతురు పసికూన వమికా దాకా అందరూ ఆన్లైన్ ట్రోలింగ్, బుల్లీయింగ్కి గురైనవారే. సుహానా ఖాన్ ఒంటి రంగు, యాక్టింగ్ స్కిల్స్ను వెక్కిరిస్తూ ట్రోల్ చేశారు. నైసా దేవ్గన్ కూడా ఒంటిరంగు పట్ల ఆన్లైన్ హేళనకు గురైంది. ఆరాధ్యనయితే బాడీషేమింగ్ చేశారు. కెమెరా ముందు నిలబడటం రాదని ఎద్దేవా చేశారు. దీన్ని సీరియస్గా తీసుకుని ఐశ్వర్య సైబర్ పోలీసులకు ఫిర్యాదూ చేశారు. ఆ మాటలు, వెక్కిరింతలు ఆరాధ్య మనసును గాయపరచి ఆమె మానసిక ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తాయని.. ఐశ్వర్య కూతురిని డిజిటల్ మాధ్యమానికి దూరంగా ఉంచారు. కనీసం ఫోన్ కూడా వాడదు ఆరాధ్య. ఈ విషయాన్ని ఒక సందర్భంలో స్వయంగా అభిషేక్ బచ్చనే ప్రస్తావించారు. భార్యకు బెస్ట్ మదర్గా కితాబూ ఇచ్చారు. నటులు దియా మిర్జా, సమీరా రెడ్డి కూడా పేరెంట్స్గా.. పిల్లల స్క్రీన్ టైమ్ మీద నియంత్రణ ఉండాలని, దాన్నెలా ఫాలో కావాలో, పేరెంటింగ్లో ఎలా భాగం చేయాలో పేరెంట్స్కి నిపుణులు వర్క్షాపులు నిర్వహించి అవగాహన పెంపొందించాలని కోరుతున్నారు.కనీస అవసరాల నుంచి ఫ్లయిట్ టికెట్స్ దాకా, బడి పాఠాల నుంచి ప్రొఫెషనల్ మీటింగ్స్ దాకా అన్నిటికీ ఆన్లైనే మాధ్యమం. అలాంటి ఈ డిజిటల్ యుగంలో పిల్లల జోక్యాన్ని నివారించడం అసాధ్యమే. కానీ దాని మంచి చెడు, వ్యక్తిగత డేటాను ఎలా కాపాడుకోవాలి, ఆన్లైన్ భద్రత కోసం ఏం చేయాలి.. వంటి అంశాల మీద అవగాహన కల్పించడం మాత్రం సాధ్యమే! అత్యవసరం కూడా!ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్! -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. టైగర్-3 నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్(41) మరణించారు. తన గాయానికి సర్జరీ కోసం అమృత్సర్లోని ఫోర్టిస్ ఆస్పత్రికి వెళ్లిన వరీందర్ సింగ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అతను కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. ఛాంపియన్ బాడీబిల్డర్ ఛాంపియన్ కూడా. అతని మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతిని కలిగించింది.కాగా..వరీందర్ సింగ్ గుమాన్ 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఆ తర్వాత మిస్టర్ ఆసియాలో రన్నరప్గా నిలిచాడు. వరీందర్ సింగ్ బాడీ బిల్డింగ్తో పాటు చిత్ర పరిశ్రమలో కూడా తనదైన ముద్ర వేశారు. అతను 2012లో పంజాబీ చిత్రం 'కబడ్డీ వన్స్ ఎగైన్'లో కీలక పాత్రలో నటించాడు ఆ తర్వాత 2014లో 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్'తో హిందీలో రంగ ప్రవేశం చేశాడు. అతను 2019లో 'మర్జావాన్'తో సహా పలు హిందీ చిత్రాల్లో కనిపించాడు. ఇటీవలే సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన 'టైగర్ 3'లో పాకిస్తాన్ జైలు గార్డు షకీల్ పాత్రలో గుమాన్ కనిపించాడు. టైగర్ 3 చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. -
మహారాణి మళ్లీ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ వాటికైతే ఎక్కువమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. వీటితో పాటు పొలిటికల్ థ్రిల్లర్స్కు సైతం విశేష ప్రేక్షకాదారణ ఉంటోంది. అలా రాజకీయ కోణంలో వచ్చి.. సూపర్ హిట్గా నిలిచిన పొలిటికల్ సిరీస్ మహారాణి(Maharani Season4). ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. తాజాగా మరో సీజన్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.బాలీవుడ్ స్టార్ హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. ఈ వెబ్ సిరీస్కు పునీత్ ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహారాణి సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేశారు. నవంబర్ 7వ తేదీ నుంచి సోని లివ్లో ప్రసారం కానుందంటూ ట్రైలర్ను షేర్ చేశారు మేకర్స్.తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఎలాంటి భయం లేకుండా ఉండే ముఖ్యమంత్రి రాణి భారతిగా హ్యుమా ఖురేషి తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్లే పవర్ఫుల్ పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీజన్లో రాణి భారతి పాట్నాను వదిలి.. ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. The lioness returns to defend her home! Rani gears up for her biggest battle yet.#Maharani4 streaming from 7th Nov only on Sony LIV#MaharaniOnSonyLIV pic.twitter.com/Xzkt7owqrp— Sony LIV International (@SonyLIVIntl) October 9, 2025 -
కష్టాల్లో జాన్వీ..! ఆశలన్నీ రామ్ చరణ్ పైనే
-
బాలీవుడ్లో రష్మిక మందన్న సినిమాలు
-
డెక్కన్ డెర్బీ–2025 : యురేకా... మలైకా!
సాక్షి, సిటీబ్యూర : రేస్–2 విన్ ఫౌండేషన్ (Race2Win Foundation ) ఆధ్వర్యంలో హైదరాబాద్ రేస్ క్లబ్లో డెక్కన్ డెర్బీ– 2025 (Deccan Derby 2025 ) లో ఫ్యాషన్, రేసింగ్, సేవల మేలు కలయికగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఇందులో ప్రముఖ డిజైనర్ ద్వయం రోహిత్ గాంధీ – రాహుల్ ఖన్నా రూపొందించిన ‘ఫ్యాషన్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్’ కలెక్షన్ ప్రదర్శనలో బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) షోస్టాపర్గా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్ బాజ్వా, రెజినా కసాండ్రా, అవంతిక మిశ్రా, నైరా బెనర్జీ తదితర సినీ ప్రముఖులు పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆనందంగా వుంది.. మలైకా అరోరా మాట్లాడుతూ.. ‘హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రోహిత్ గాం«దీ, రాహుల్ ఖన్నా డిజైన్ కలెక్షన్ ఆకట్టుకుంది. రేస్–2 విన్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం’ అని అభినందించారు. రేస్–2 విన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.గోపీరావు మాట్లాడుతూ, ‘డెక్కన్ డెర్బీ 2025 ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా రేసింగ్, ఫ్యాషన్, సేవా కార్యక్రమాల సమ్మేళనం అనే వెవిధ్యం సాకారమైంది’ అన్నారు. ఇదీ చదవండి: Director Sukumar టీ కోసం క్యూ కట్టడం చూశా.. -
58 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయిన నటుడు
అన్న పెళ్లి మాటే మర్చిపోయాడు. కానీ తమ్ముడు రెండో పెళ్లి చేసుకోవడమే కాదు, 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకోగా వీరికి అర్హాన్ ఖాన్ సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. 2023 డిసెంబర్లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు.ఏడాదిన్నర తిరిగేలోపు..ఈ ఏడాది ప్రారంభంలో షురా గర్భం దాల్చింది. నేడు (అక్టోబర్ 5న) ముంబైలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సల్మాన్.. ఫామ్హౌస్ నుంచి నేరుగా ఆస్పత్రికి పయనమయ్యాడట! అర్బాజ్ ఖాన్.. ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, నిర్దోష్, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో జై చిరంజీవ మూవీలో విలన్గా నటించాడు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.చదవండి: హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే! -
వార్2 ఫలితంపై స్పందించిన 'హృతిక్ రోషన్'
-
అవి నా చేతుల్లో ఉండవు: హృతిక్ రోషన్
‘‘హీరో.. డైరెక్టర్.. నిర్మాత.. ఇలా ఓ సినిమాకి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సినిమా విజయం సాధించాలనే కోరుకుంటారు. అయితే అన్ని సినిమాలూ విజయం సాధిస్తాయని చెప్పలేం. వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేయడమే నా చేతుల్లో ఉంటుంది. హిట్లు, ఫ్లాపులు అనేవి నా చేతుల్లో ఉండవు.. వాటిని నిర్ణయించేది ప్రేక్షకులే. ఓ సినిమా ఫలితం ఎలా ఉన్నా పాజిటివ్గానే తీసుకోవాలి’’ అని హీరో హృతిక్ రోషన్ తెలిపారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల అయింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ విషయంపై హృతిక్ రోషన్ తాజాగా స్పందించారు. ‘‘వార్ 2’ కోసం అయాన్ ముఖర్జీ చాలా కష్టపడ్డారు. తన ఎనర్జీ చూసి నాకు కూడా ఎంతో ఉత్సాహంగా పని చేయాలనిపించేది. ఈప్రాజెక్ట్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి కబీర్ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశాను. ఒక నటుడిగా మన బాధ్యతను 100 శాతం పూర్తి చే యాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రతి దాన్ని సీరియస్గా కాకుండా ఈజీగానే తీసుకోవాలి. అన్ని సినిమాలూ హిట్ అవుతాయనే నమ్మకంతోనే చేస్తాం. కానీ, ఫలితం మాత్రం ప్రేక్షకులే ఇస్తారు. వీటన్నిటినీ మనం పాజిటివ్గానే తీసుకోవాలి’’ అంటూ హృతిక్ రోషన్పోస్ట్ చేశారు. -
ఐదేళ్ల తర్వాత చేతికి పాస్పోర్ట్.. హీరోయిన్ భావోద్వేగం
ఐదేళ్ల క్రితం లాక్డౌన్ టైంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ విషయమై అప్పట్లో ఇతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు, కేసులు అంటూ ఆ కేసు చాన్నాళ్ల పాటు సాగుతూనే వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈమెకు కొంతమేర విముక్తి దొరికినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!)దాదాపు ఐదేళ్ల తర్వాత పాస్పోర్ట్ తన చేతికి తిరిగొచ్చిందని రియా చక్రవర్తి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటినటీనటులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రియానే స్వయంగా చెప్పింది. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ కేసు విచారణ సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్పోర్ట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగిచ్చేయడంతో రియా ఆనందగానికి హద్దుల్లేకుండా పోయింది.పశ్చిమ బెంగాల్కి చెందిన రియా చక్రవర్తి.. 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. మొత్తంగా ఏడెనిమిది చిత్రాల్లో మాత్రమే నటించింది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ చనిపోయాడో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు కొంతమేర క్లియర్ కావడంతో మళ్లీ సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే రియా చక్రవర్తి.. బిగ్బాస్ షోలో పాల్గొని తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
నా కుమార్తె నగ్న చిత్రాలు అడిగారు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్న అక్షయ్ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని గుర్తు చేశారు. తన 13 ఏళ్ల కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక కలతపెట్టే సంఘటనను పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.సైబర్ నేరగాళ్లు తన కుమార్తెతో ఎలా ప్రవర్తించారో ఇలా పంచుకున్నారు. "కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటనను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే మీరు మేల్, ఫీమేల్నా అంటూ జెండర్ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్ చేశాడు. ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, వెళ్లి నా భార్యతో చెప్పింది. ఇలాంటివి సైబర్ నేరంలో ఒక భాగం.. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాష్ట్రలో ఏడవ తరగతి నుంచే పిల్లలకు ఈ నేరాల గురించి తెలియాలి. అందుకోసం ప్రతి స్కూల్లో సైబర్ పీరియడ్ అని ఒక గంట సమయం కేటాయించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి నేరాళ గురించి పిల్లలకు వివరించాలి. నేటి ప్రపంచంలో సైబర్ నేరం వీధి నేరాల కంటే ప్రమాదంగా మారుతోందని మీ అందరికీ తెలుసు. ఈ నేరాన్ని ఆపడం చాలా ముఖ్యం..." అని అక్షయ్ వెల్లడించారు. ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు కూడా ఆవతల మరో వ్యక్తితో ఆడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తన కుమార్తె ఘటనను అక్షయ్ గుర్తుచేశారు.ముంబైలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (మహారాష్ట్ర), రష్మి శుక్లా, ఇక్బాల్ సింగ్ చాహల్ (ఐపీఎస్), రాణి ముఖర్జీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటి
రావణాసురుడు కొంటెవాడే కానీ రాక్షసుడు కాదంటోంది బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్. దసరా పండగనాడు రావణుడి బొమ్మను దహనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రతి ఏడాది దసరా రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రావణా.. నువ్వు కాస్త కొంటెగా ఉన్నావే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. కొంటెతనం తప్ప అంతకుమించి ఏ తప్పూ చేయలేదు.తిండి పెట్టావ్తొందరపడి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశావు. ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవమర్యాదలతో పోలిస్తే అప్పట్లో నువ్వే ఒక స్త్రీ(సీతాదేవి)ని ఎంతో గౌరవించావు. ఆమెకు మంచి తిండి, ఆశ్రయం కల్పించావు. తన భద్రత కోసం మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించావు(వాళ్లు అందంగా లేరనుకో..). పార్లమెంటులో ఉన్న సగం మంది సభ్యులకంటే కూడా నువ్వే ఎక్కువ చదువుకున్నావు. ట్వీట్ డిలీట్రావణుడి బొమ్మను కాల్చడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న.. అంతే! హ్యాపీ దసరా అని ట్వీట్ చేసింది. ఈ పోస్ట్పై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. కాగా సిమి గరేవాల్.. దో బడాన్, మేరా నామ్ జోకర్, కర్జ్ వంటి సినిమాల్లో నటించింది. యాంకర్గా టాక్ షోలు కూడా చేసింది. కొన్ని సీరియల్స్, సినిమాలకు డైరెక్టర్గానూ వ్యవహరించింది.చదవండి: తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. -
రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలు.. అదుపులో బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు వెళ్లమని.. భారత్కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు. -
సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ.. భయపెట్టేలా సాంగ్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జటాధర. ఈ మూవీలో పాన్ ఇండియా మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో పాటను విడుదల చేశారు.జటాధర మూవీలోని ధన పిశాచి అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా..సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటకు సమీర్ కొప్పికర్ సంగీతమందించారు. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. సోనాక్షి సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. -
దేనికీ భయపడను, ఎవరికీ తలవంచను: దీపికా పదుకొణె
తానెన్నడూ భయపడిందే లేదంటోంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). కష్టతరమైన మార్గంలోనూ దర్జాగా నడిచానని, ప్రశ్నించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదని పేర్కొంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎమ్డీబీ (IMDB) 25 ఏళ్ల భారతీయ సినిమా (2000-2025) అంటూ 130 అత్యుత్తమ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. అందులో 10 చిత్రాల్లో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించడం విశేషం.కష్టాలదారిలోనే నడిచా..ఈ అరుదైన ఘనత అందుకోవడంపై దీపిక సంతోషం వ్యక్తం చేసింది. అలాగే రెండు పెద్ద సినిమాలైన స్పిరిట్, కల్కి 2లు చేజారడంపైనా పరోక్షంగా కామెంట్లు చేసింది. ఈ మేరకు తన జర్నీ గురించి దీపిక మాట్లాడుతూ.. నటిగా ప్రయాణం ప్రారంభించిన కొత్తలో నేనెలా ఉండాలి? ఏం చేస్తే సక్సెస్ అవుతానని నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచే నేను ముక్కుసూటిగా ఉన్నాను. ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించేందుకు వెనకడుగు వేయలేదు. కష్టాలదారిలోనే కొనసాగాను, నాకెదురైన పరిస్థితులను సవాల్ చేస్తూ ముందడుగు వేశాను తప్ప ఎక్కడా తలవంచలేదు.నా తర్వాత వచ్చేవారికోసం..నా కుటుంబసభ్యులు, అభిమానులు నాపై ఉంచిన నమ్మకమే నేను తీసుకునే బలమైన నిర్ణయాలకు కారణం. నా తర్వాత వచ్చేవారు అనుసరించే మార్గాన్ని నేను శాశ్వతంగా మారుస్తానని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. బహుశా 8 గంటల షిఫ్ట్ గురించే ఆమె పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే దీపికా ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి కింగ్ మూవీ చేస్తోంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.చదవండి: విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్-సైంధవి -
దేవీనవరాత్రులు.. దుర్గమ్మను దర్శించుకున్న ప్రియాంక చోప్రా (ఫోటోలు)
-
ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి.. ఆ ఇద్దరు అరెస్ట్
ప్రముఖ గాయకుడు, కింగ్ ఆఫ్ హమ్మింగ్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) మృతి కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF) నిర్వాహకుడు శ్యాంకను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్దార్థ శర్మను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్లో ఈవెంట్ ముగించుకుని వచ్చిన మహంతను న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో, సిద్దార్థ శర్మను గురుగ్రామ్లోని అతడి అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిద్దరినీ గౌహతికి తీసుకెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు.సింగర్ అనుమానాస్పద మృతిసింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబీన్.. సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగర్ మృతికి కారణమైనవారిని వదిలేది లేదని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది.ఎవరీ జుబీన్ గార్గ్?జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. తల్లి గాయని, తండ్రి కవి కావడంతో ఇద్దరి ప్రతిభను అందిపుచ్చుకుని మంచి గాయకుడిగా మారారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. సింగర్గానే కాకుండా రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు.చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు -
వివాదాలు సృష్టించవద్దు!: ఫరా ఖాన్
దర్శకురాలు ఫరా ఖాన్, హీరోయిన్ దీపికా పదుకోన్ల మధ్య అబీప్రాయభేదాలొచ్చాయని, అందుకే ఇన్స్టాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారన్నది బాలీవుడ్ టాక్. దీపిక కెరీర్లోని రెండు బ్లాక్బస్టర్ చిత్రాలు ‘ఓం శాంతి ఓం’ (2007), ‘హ్యాపీ న్యూ ఇయర్’ (2014)లో షారుక్ ఖాన్ హీరోగా నటించగా, ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ఇలా దీపిక–ఫరాల మధ్య మంచి అనుబంధం ఉంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల్లో హీరోయిన్స్ 8 గంటలే పని చేయాలన్నట్లుగా, ‘ఎయిట్ అవర్స్ షిఫ్ట్’ కాన్సెప్ట్ గురించి దీపిక మాట్లాడారు. ఈ కాన్సెప్ట్పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఫరా ఈ ‘ఎయిట్ అవర్స్ షిప్ట్’ గురించి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో దీపికను ఉద్దేశించే ఫరా ఖాన్ అలా మాట్లాడారని, అందుకే వీరిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాలో అన్ఫాలో అయ్యారని ప్రచారమవుతోంది.ఈ ప్రచారంపై ఫరా స్పందించారు. ‘‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలోనే నేను, దీపిక ఇన్స్టాలో కాకుండా డైరెక్ట్ మెసేజ్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడాలనుకున్నాం. అప్పుడే మేం ఒకరినొకరం అన్ఫాలో అయ్యాం. కొన్ని వెబ్పోర్టల్స్ కొత్త వివాదాలు సృష్టిస్తున్నారు’’ అంటూ తన ఇన్స్టా స్టోరీలో ఫరా షేర్ చేశారు. ఈ స్టోరీకి ఓ నమస్కారం ఎమోజీతో దీపిక స్పందించారు. -
హర్ట్ అయిపోయిన దీపిక.. ఆ డైరెక్టర్తో కటీఫ్
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో రెండుసార్లు కలిసి పనిచేసిన ఓ దర్శకురాలి మాటలకు హర్ట్ అయింది. ఆమె ఏదో సరదాగా అన్న వ్యాఖ్యల్ని మరీ సీరియస్గా తీసుకున్న దీపిక.. దూరం పెట్టేసింది. సోషల్ మీడియాలోనూ అన్ ఫాలో కొట్టేసింది. ఇంతకీ ఏంటా విషయం? ఎవరా డైరెక్టర్?కొన్ని రోజులు క్రితం దీపిక పదుకొణెని ప్రభాస్ 'స్పిరిట్' కోసం హీరోయిన్గా తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా అనుకున్నాడు. ఈ మేరకు డిస్కషన్ జరిగింది. అంతా ఓకే అనుకునే టైంలో దీపిక చెప్పిన కండీషన్స్ నచ్చక.. సందీప్ తన మూవీ నుంచి దీపికని పక్కకు తప్పించాడనే టాక్ వచ్చింది. దీంతో ఈ టైంలో చాలామంది సందీప్ కి సపోర్ట్గా నిలిచారు. మరికొందరు దీపికకు సపోర్ట్ చేశారు. మొన్నీమధ్య ప్రభాస్ 'కల్కి' టీమ్ కూడా దీపిక తాము తీయబోయే సీక్వెల్లో ఉండదని తేల్చి చెప్పారు.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్')అయితే దీపిక.. రోజుకు 7 గంటలే పనిచేస్తానని చెప్పిందని, తన టీమ్ దాదాపు 25 మంది కోసం ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్స్, ఫుడ్ లాంటివి కావాలని అడిగిందని.. అలానే రెమ్యునరేషన్ కూడా తొలి పార్ట్కి తీసుకున్న దానికంటే భారీగా డిమాండ్ చేసిందని.. అందుకే 'కల్కి' మేకర్స్ దీపికని తప్పించారని మాట్లాడుకున్నారు. తాజాగా ఓ షోలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరా ఖాన్ పాల్గొంది. నటీనటుల వర్కింగ్ అవర్స్(పనిగంటలు) గురించి ఫన్నీగా కామెంట్ చేసింది.'ఆమె ఇప్పుడు పనిచేసేదే 8 గంటలు, ఇక ఈ షోకు ఎలా వస్తారా? ఆమెకు అంత టైమ్ ఎక్కడ ఉంటుంది' అని చెప్పి దీపికని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఫరా ఖాన్ ఫన్నీగా మాట్లాడింది. ఈ మాటలకు దీపిక బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉంది. ఇన్ స్టాలో ఫరా ఖాన్ని అన్ ఫాలో చేసింది. దీంతో ఫరా కూడా దీపికని అన్ ఫాలో చేసింది. గతంలో ఫరా తీసిన 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూఇయర్' సినిమాల్లో దీపికనే హీరోయిన్. కానీ ఇప్పుడు కామెడీగా చేసిన కామెంట్స్ ఇద్దరి మధ్య దూరానికి కారణమైనట్లు కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!) -
బాలీవుడ్లో కుమ్మేస్తున్న రష్మిక..
-
బ్లాక్ డ్రెస్లో జాన్వీ కపూర్.. కొత్త సినిమా ప్రమోషన్స్ క్రేజ్ (ఫోటోలు)
-
మనం కలిసి బతుకుదామా...
‘‘నేను ఏ సినిమా చేసినా అందులో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాను. ‘థామా’ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్ని అలరిస్తుంది. ఈ సినిమాలోని అలోక్ క్యారెక్టర్ చేయడం కొత్తగా అనిపించింది. ‘థామా’ చిత్రం కోసం యాక్షన్ సీక్వెన్స్ చాలా చేశాను’’ అని ఆయుష్మాన్ ఖురానా అన్నారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ ఫిల్మ్స్ యూనివర్స్ (ఎమ్హెచ్సీయు) లో భాగంగా ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 21న విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో ‘థామా’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రమోషన్స్ కోసం తొలిసారిగా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ‘థామా’ ఫుల్ పాన్ ఇండియా మూవీ. రష్మికగారితో తొలిసారి కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె బ్రిలియంట్ పెర్ఫార్మర్. ‘థామా’ సినిమాను థియేటర్స్లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. ‘‘మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.‘థామా’ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు రష్మికా మందన్నా. ‘పోలీసుల కోసం నేను ఏమైనా చేస్తాను’, ‘ఏం చేశారో చెప్పండి’, ‘విక్రమార్కుడు సినిమా ఎనిమిది సార్లు చూశాను సార్’, ‘నేను వెళ్లక తప్పదు అలోక్... నా కారణంగా నువ్వు కూడా ప్రమాదంలో పడతావ్..’, ‘నాకేం కలిసి చనిపోయే ఉద్దేశం లేదు... మనం కలిసి బతుకుదామా!’, ‘నేను నీతో పాటు ఉండలేను... మన ప్రపంచాలు ఒకటి కావు’ అనే డైలాగ్స్ ‘థామా’ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. -
చాహల్తో పెళ్లి.. మొదటి ఏడాదిలోనే అంతా తెలిసిపోయింది: ధనశ్రీ వర్మ
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుని ఆరు నెలలైనా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో కంటెస్టెంట్గా ఉన్న ధనశ్రీ.. తన వివాహం, విడాకులపై కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా చాహల్ వివాహం తర్వాత ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. చాహల్ తనను మోసం చేశాడని షాకింక్ విషయాన్ని రివీల్ చేసింది. పెళ్లైన మొదటి ఏడాది రెండో నెలలోనే అతని మోసాన్ని కనిపెట్టానని ధనశ్రీ తెలిపింది. దీంతో మరోసారి చాహల్- ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.ఈ షోలో తన వివాహ బంధంపై ధనశ్రీ వర్మకు ఓ ప్రశ్న ఎదురైంది. చాహల్తో పెళ్లి.. పొరపాటు చేశానని మీకెప్పుడు అనిపించింది? అని మరో కంటెస్టెంట్ కుబ్రా సైత్ అడిగింది. దీనిపై చాహల్ మాజీ భార్య ధనశ్రీ స్పందించింది. పెళ్లైన మొదటి సంవత్సరం.. రెండవ నెలలోనే చాహల్ను పట్టుకున్నా అంటూ సమాధానమిచ్చింది. ఈ సమాధానం విన్న కుబ్రా సైత్ షాకింగ్రు గురైంది. కాగా.. చాహల్తో విడాకుల తర్వాత ధనశ్రీ పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ చేసిందనే వార్తలొచ్చాయి. ఈ షోలోనే వీటిపై కూడా క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేసింది ధనశ్రీ వర్మ. -
మాజీ భార్య మరణం.. స్పందించని అదుర్స్ నటుడు!
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్లో అదుర్స్, సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) మాజీ భార్య మరణించింది. ఆయన మొదటి భార్య, ఫ్యాషన్ డిజైనర్ దీపా మెహతా ఇవాళ కన్నుమూశారు. తల్లి మరణ వార్తను కుమారుడు సత్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్ యూ అమ్మా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.దీపా మెహతా మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహేశ్ మంజ్రేకర్, దీపా మెహతాను 1987లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1995లో విభేదాలు రావడంతో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరికి కుమారుడు సత్య మంజ్రేకర్, కుమార్తె అశ్వమి మంజ్రేకర్ ఉన్నారు. ఆ తర్వాత మహేశ్ మేధా మంజ్రేకర్ను వివాహం చేసుకున్నాడు. వీరికి సాయి మంజ్రేకర్ అనే కుమార్తె ఉంది. అయితే మాజీ భార్య మరణం పట్ల మహేశ్ ఎలాంటి పోస్ట్ చేయలేదు.కాగా.. మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) వాస్తవ్ అనే చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. వాస్తవ్ సినిమాలో సంజయ్దత్, నమ్రత శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పరేశ్ రావల్, దీపక్, సంజయ్ నర్వేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1999 అక్టోబర్లో విడుదలైంది. వాస్తవ్ హిట్టవడంతో దర్శకుడు మహేశ్ దీనికి సీక్వెల్గా హత్యార్ తీశాడు. ఇందులోనూ సంజయ్ దత్ హీరోగా నటించాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు భాషల్లో నటుడిగా మెప్పించారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన అదుర్స్.. ప్రభాస్ సాహో మూవీస్లోనూ మెప్పించాడు. -
విషాదం.. 'వీర్ హనుమాన్' బాల నటుడు మృతి
ప్రమాదం ఏ వైపు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. ఇప్పుడు కూడా అలా అనుకోని సంఘటన కారణంగా ఓ బాల నటుడు, అతడి సోదరుడు కన్నుమూశారు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతుండగా జరిగిన అగ్ని ప్రమాదం కాస్త ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో మలయాళీ భామ.. మరో బాలీవుడ్ బ్యూటీ ఔట్!)హిందీలో 'శ్రీమద్ రామాయణ్', 'వీర్ హనుమాన్' సీరియల్స్లో నటించిన వీర్ శర్మ(10), ఇతడి సోదరుడు శౌర్య శర్మ(15) ఆదివారం రాత్రి ఇంట్లో ఓ గదిలో నిద్రపోతున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగి, అన్నదమ్ములిద్దరూ పడుకుని ఉన్న రూంతో పాటు హాల్ అంతా పొగ వ్యాపించింది. అయితే గాఢనిద్రలో ఉండేసరికి వీర్, శౌర్య కదల్లేక పొగ పీల్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే పిల్లలిద్దరూ మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.ఈ ప్రమాదం జరిగే సమయంలో వీర్ తల్లి మరో గదిలో ఉండగా.. తండ్రి బయటకు వెళ్లారు. దీంతో వీళ్లకు ఏమి కాలేదు. చిన్నారులు మాత్రం తుదిశ్వాస విడిచారు. అయితే కొడుకులు చనిపోయారే బాధలో ఉన్నప్పటికీ.. పిల్లలిద్దరూ కళ్లని దానం చేసేందుకు తల్లదండ్రులు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం హిందీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సీరియల్స్ చేసిన వీర్.. త్వరలో ఓ హిందీ సినిమాతో బిగ్ స్క్రీన్పై కనిపించబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆ పిల్లల తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చింది.(ఇదీ చదవండి: 'బాయ్కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?) -
దుర్గా పూజలో బాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
ప్రేమ విహారం
ఇటలీ వీధుల్లో ప్రేమవిహారం చేస్తున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. షాహిద్ కపూర్, కృతీ సనన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘కాక్టైల్ 2’. హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని తెలిసింది. షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా షాహిద్ కపూర్, రష్మికల మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటలీ షూటింగ్ షెడ్యూల్లో టాకీ పార్టుతో పాటు సాంగ్స్ని కూడా చిత్రీకరించాలని ప్లాన్ చేశారని తెలిసింది. విదేశాల్లోనే ఈ సినిమా మేజర్ షూటింగ్ జరుగుతుందని బాలీవుడ్ భోగట్టా. దినేష్ విజన్, లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ ‘కాక్టైల్ 2’ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. ఇక సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీ ప్రధాన పాత్రధారులుగా హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘కాక్టైల్ (2012)’కి సీక్వెల్గా ‘కాక్ టైల్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. -
లతా మంగేష్కర్ జయంతి.. స్పెషల్ టీజర్తో నివాళి!
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పటి యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన టీజర్ అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమె నివాళిగా ప్రత్యేక టీజర్ను విడుదల చేశారు. 1962 భారత-చైనా యుద్ధంలో అమరవీరులను గౌరవించటానికి లతా మంగేష్కర్ 1963లో మొదటిసారి 'ఏ మేరే వతన్ కే లోగోన్' అనే సాంగ్ను ఆలపించారు. ఈ పాట చాలా కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.కాగా.. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సోల్జర్గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే యుద్ధ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్లోని విజువల్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్లో రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, అమిత్ చంద్రా నిర్మించారు. -
బాలీవుడ్ ఎంట్రీ
‘హిట్ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు మీనాక్షీ చౌదరి. ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైందని సమాచారం. జాన్ అబ్రహాం నటించనున్న హిందీ చిత్రం ‘ఫోర్స్ 3’లోని హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షీ చౌదరిని ఎంపిక చేసిందట యూనిట్. భావ్ దులియా దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ ఈ నవంబరులో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మీనాక్షి పాత్రకూ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం ఆమె శిక్షణ తీసుకోనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ మొదలయ్యాయని, కొన్ని వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయని భోగట్టా. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా...
ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి. ఓ సీనియర్ హీరో, ఓ రైజింగ్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు స్టార్స్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి మల్టీస్టారర్ సినిమాలూ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్తో రాణించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, ఇద్దరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం, చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ‘మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా’ అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్ హీరోలు చేస్తున్న మూవీస్పై ఓ లుక్ వేయండి.46 సంవత్సరాల తర్వాత... కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్హాసన్. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత రజనీకాంత్, కమల్హాసన్ కలిసి నటించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది. రజనీకాంత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్హాసన్ చె΄్పారు.ఇలా కమల్ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్హాసన్తో తాను సినిమా చేస్తున్నానని, రెడ్ జెయింట్ మూవీస్–కమల్హాసన్ ప్రోడక్షన్ హౌస్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్ స్పష్టం చేశారు. దీంతో రజనీకాంత్, కమల్హాసన్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్లో ఊపందుకుంది.కాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. కమల్తో ‘విక్రమ్’ వంటి హిట్ మూవీ తీశారు లోకేశ్. అలాగే రజనీకాంత్కు ‘కూలీ’తో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేశ్. దీంతో కమల్–రజనీకాంత్ కాంబినేషన్ సినిమాకి లోకేశ్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే కుదిరితేనే లోకేశ్తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్–రజనీ. అంతేకాదు... మరికొంత మంది యువ దర్శకులను కూడా మంచి కథల కోసం అ్రపోచ్ అవుతున్నారట.తాజాగా ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడిగా ‘కోమలి’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఆ తర్వాత ‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్ అయ్యారు. రజనీకాంత్–కమల్హాసన్ కాంబినేషన్కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్గా 46 సంవత్సరాల తర్వాత కమల్హాసన్–రజనీకాంత్ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.పండక్కి వస్తున్నారు సిల్వర్స్క్రీన్పై ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, వెంకటేశ్ కనిపిస్తే తెలుగు ఆడియన్స్కు పండగే. అదీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే, ఈ పండగ సంక్రాంతి అయితే... ఇక చెప్పేది ఏముంది? వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్ స్క్రీన్పై చూపించనున్నారు ‘మన శంకర వరప్రసాద్గారు’. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరీన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోందని తెలిసింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్లో వెంకటేశ్ కూడా పాల్గొననున్నారు. చిరంజీవి – వెంకటేశ్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. అలాగే చిరంజీవి–వెంకటేశ్–నయనతార– కేథరీన్ల కాంబినేషన్లో ఓ సెలబ్రేషన్ సాంగ్ను కూడా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.మరో మల్టీస్టారర్! మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో సీనియర్ హీరో వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. ‘ఎఫ్ 2, వెంకీమామ, గోపాల గోపాల’... ఇలా వెంకీ కెరీర్లో మల్టీస్టారర్ మూవీస్ మెండుగానే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వెంకటేశ్ మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేశ్ తెలిపారు. అయితే ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’ కాదు. దీంతో వెంకటేశ్ చేయనున్న లేటెస్ట్ మల్టీస్టారర్లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పేట్రియాటిక్ మూవీలో...మలయాళ స్టార్ హీరోలు మోహన్లాల్, మమ్ముట్టీ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ 2008లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘ట్వంటీ 20’ తర్వాత మమ్ముట్టీ, మోహన్లాల్ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలోని ‘పేట్రియాట్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మమ్ముట్టీ, మోహన్లాల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలిసింది.ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది. అయితే మమ్ముట్టీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందనీ అజర్ బైజాన్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల లోకేషన్స్లో చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పఠాన్ వర్సెస్ టైగర్! షారుక్ ఖాన్ హీరోగా చేసిన బ్లాక్బస్టర్ మూవీ ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘టైగర్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్–షారుక్ ఖాన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఈ ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్లో నటించి, దాదాపు 30 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లు కలిసి లీడ్ రోల్స్లో మరో సినిమా చేయలేదు. అయితే గత ఏడాదిగా సల్మాన్, షారుక్ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోందని బాలీవుడ్ సమాచారం.‘పఠాన్’, ‘టైగర్ 3’... ఈ రెండూ వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లోని చిత్రాలే. కాబట్టి ఈ స్పై యూనివర్స్లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రానుందని, యశ్రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ‘పఠాన్, వార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని, కాకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది.అలాగే ‘వార్’ సినిమా కూడా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగమే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే నిజమమైతే అప్పుడు సల్మాన్, షారుక్, హృతిక్లను ఒకే ఫ్రేమ్లో చూడొచ్చని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి... ఫ్యాన్స్ ఆశలు నిజమౌవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.17ఏళ్ల తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ల కాంబినేషన్లో బాలీవుడ్లో ‘హైవాన్’ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలాజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కొచ్చి, ఊటీ లొకేషన్స్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్. తాజా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్కు మోహన్లాల్తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ ‘హైవాన్’లో మోహన్లాల్ ఓ గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించారట. ఇక ఈ చిత్రంలో మోహన్లాల్నే ఎందుకు గెస్ట్ రోల్కి తీసుకోవాలనుకున్నారంటే.. ‘ఒప్పం’కు హిందీ రీమేక్గా ‘హైవాన్’ సినిమా తెరకెక్కుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒప్పం’ సినిమా 2016లో విడుదలై, బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. మరోవైపు ‘తషాన్’ చిత్రం తర్వాత 17 ఏళ్లకు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’యే కావడం విశేషం. ముగ్గురు డాన్లు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ డాన్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘డాన్ 3’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే 1978లో వచ్చిన ‘డాన్’ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, 2006, 2011లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ సైతం ‘డాన్ 3’లో భాగం కానున్నారని, ఆ దిశగా ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.మరి... రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్లు కలిసి ఒకే ఫ్రేమ్లో హిందీ సిల్వర్స్క్రీన్పై కనిపిస్తే, అంతకుమించిన ఆనందం హిందీ సినీ లవర్స్కి ఏముంటుంది. ఇక ‘డాన్ 3’లో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారు. విలన్గా విజయ్ దేవరకొండ, విక్రాంత్ మెస్సే, అర్జున్ దాస్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ‘డాన్ 3’ చిత్రంలో ఎవరు విలన్గా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2027లో ‘డాన్ 3’ చిత్రం థియేటర్స్లో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.కథే హీరో కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్.బి. శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘45’. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేసిన అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎం. రమేశ్ రెడ్డి, ఉమా రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని, కథే ఈ సినిమాకు హీరో అని శివ రాజ్కుమార్ ఓ సందర్భంలో చె΄్పారు. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా నటించిన ‘ఓం’ (1995) సినిమా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ రాజ్కుమార్, ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్ కావడం ఇదే అని టాక్. కొంత గ్యాప్ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్ సినిమాలు చేసే సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు
తల్లయ్యాక తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని కరాఖండిగా చెప్తోంది! భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి కండీషన్లు పెడితే కష్టమని కల్కి 2 నుంచి ఆమెను తప్పించేశారు. దానికంటే ముందు స్పిరిట్ నుంచి కూడా దీపికా సైడ్ అయిపోయింది. దీంతో అసలు 8 గంటల షిఫ్ట్ తప్పా? ఒప్పా? అని ఎవరికి వారు చర్చల్లో మునిగిపోయారు.8 గంటలే దీపిక పనిఅయితే ఈ విషయంపై దీపికాపై ఫన్నీ సెటైర్లు వేసింది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan). తన చెఫ్ దిలీప్తో కలిసి ముంబైలో నటుడు రోహిత్ సరఫ్ ఇంటికి వెళ్లింది ఫరా. ఈ మేరకు ఓ యూట్యూబ్ వ్లాగ్ చేసింది. అందులో మొదటిసారి రోహిత్ సరఫ్ తల్లిని చూపించింది. నా సినిమా కోసం దీపికను ఒప్పించడానికి కూడా ఇంత సమయం పట్టలేదేమో! అంటూ రోహిత్ తల్లిని హత్తుకుంది. ఇంతలో ఫరా చెఫ్ దిలీప్.. దీపిక పదుకొణె మేడమ్ మన షోకి ఎప్పుడొస్తారు? అని అడిగాడు. అందుకామె.. దీపిక ఇప్పుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తుంది. మన షోకి వచ్చేంత తీరిక తనకెక్కడిది? అంది. సినిమాఫరాఖాన్ దర్శకత్వంలోనే దీపిక బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం. ఇందులో షారూఖ్ హీరోగా నటించాడు. ఫరా, దీపికా, షారూఖ్.. ముగ్గురూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ (2014) అనే మరో సినిమా చేశారు. ఆమధ్య 'కల్కి' మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె.. చివరగా ఫైటర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి 'కింగ్' మూవీ చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్ సినిమాలోనూ భాగమైంది. ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ అనే హాలీవుడ్ సినిమా సీక్వెల్లోనూ భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.చదవండి: నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త -
నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త
బతికున్నప్పుడు ఆమె చేయి వదల్లేదు, చనిపోయాక తన జ్ఞాపకాలను, గుర్తులను వదలడం లేదు. ఆమె జీవించినప్పుడే కాదు మరణం తర్వాత కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. 'కాంటా లగా' సాంగ్ ఫేమ్, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (Shefali Jariwala) మరణించి మూడు నెలలు కావస్తున్నా ఆమెను క్షణమైనా మర్చిపోలేకున్నాడు భర్త, నటుడు పరాగ్ త్యాగి (Parag Tyagi). అందుకే అణువణువునా ఉన్న ప్రేమను పచ్చబొట్టు రూపంలో హృదయంపై ఆమె ముఖచిత్రాన్ని పదిలంగా పరుచుకున్నాడు. భార్య దిండుపైనే నిద్రతాజాగా 'షెఫాలీ పరాగ్ త్యాగి' అంటూ ఓ పాడ్కాస్ట్ చానల్ను ప్రారంభించాడు. ఇందులో మొదట తన సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పరాగ్ మాట్లాడుతూ.. షెఫాలీ బ్రష్తోనే నా పళ్లు తోముకుంటున్నాను. తన దిండుపైనే నిద్రిస్తున్నాను. తన టీషర్ట్స్, షార్ట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటినెప్పుడూ నాపక్కనే పెట్టుకుంటున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తను ఆర్డర్ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఆమె విడిచిన బట్టల్ని ఇంతవరకు ఉతకలేదు. అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను. కానీ, వాటిని కప్పుకునే ప్రతిరోజు నిద్రిస్తున్నాను.సీపీఆర్ చేశా..షెఫాలీ చివరిరోజు మా సింబా(పెంపుడు శునకం)ను వాకింగ్కు తీసుకెళ్లమని నాకు చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది. సీపీఆర్ కూడా చేశాను. రెండుసార్లు శ్వాస తీసుకుంది. ఆ వెంటనే కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. యాంటీఏజింగ్ డ్రగ్స్ వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్ కొట్టిపారేశాడు. తనెప్పుడూ డ్రగ్స్ వాడలేదని క్లారిటీ ఇచ్చాడు. కేవలం మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ తీసుకునేదని తెలిపాడు.చదవండి: మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్రూమ్కు -
రష్మిక మందన్నా సినిమా ప్రమోషన్స్లో బాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)
-
బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తే
ప్రకృతి దగ్గరగా జీవించాలని, ఆర్గానిక్ ఆహారాన్ని మాత్రమే తినాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆచరణ ఎలాగో అర్థంకాదు. అలా నిస్తేజంగా, నిర్జీవంగా జీవితం గడపకుండా, పచ్చని ప్రకృతి,స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని భోజనమే జీవితం అనుకుంది స్నేహా రాజ్గురు. ఇది తన ఒక్కదానికే పరిమితం కాకుండా తన తండ్రితో కలిసి ‘బాప్ బేటీ ఫామ్స్’’ పేరుతో సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతోంది. ఎవరీ స్నేహ, తెలుసుకుందాం పదండి.స్నేహ రాజ్గురు పుణెలో పుట్టి పెరిగింది. ఇద్దరు అన్నయ్యలు. తండ్రి అనిల్ రాజ్గురు. స్నేహ రాజ్గురు సినిమాల్లో పనిచేస్తానంటే సంపూర్ణ మద్దతిచ్చారు. స్నేహ బాలీవుడ్లో స్క్రిప్ట్ సూపర్వైజర్గా, ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసింది, 'బుల్బుల్', 'లుకా చుప్పి' వంటి సినిమాలకు పనిచేసింది. వృత్తిలో భాగంగా భారతదేశం అంతటా అద్భుతమైన ప్రదేశాలను సందర్శించింది. ఈ క్రమంలోనే ఆమె జీవితం మలుపుతిరిగింది. ‘లూకా చుప్పి’ సినిమా లొకేషన్ల కోసం మదురై వెళ్లింది. అక్కడి ప్రకృతి, మట్టితో కట్టిన ఇళ్లు చూసి పరవశించి పోయింది. అపుడే నిర్ణయించుకుంది..ప్రకృతిలో మమేకమవుతూ, సేంద్రియ ఆహారాన్ని సేవిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని. మట్టిలో మెరుపుపశ్చిమ బెంగాల్ అడవులలోని పెర్మాకల్చర్ ఫామ్లో 52 రోజుల బస చేయడం తన ఆలోచనలకు మరింత బలం వచ్చింది. అలంకరణలు లేవు, ఫిల్టర్లు లేవు, కేవలం ఒక టెంట్, అడవి. స్నేహ ఇక్కడే పెర్మాకల్చర్ సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, ప్రకృతిని వినడం, వర్షంలో లయను, కలుపు మొక్కలలోని జ్ఞానాన్ని చూడటం నేర్చుకుంది. అలా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన వృత్తిని వదిలిపెట్టి, తన తండ్రి అనిల్ రాజ్గురుతో కలిసి పూణే సమీపంలో 'బాప్ బేటీ ఫామ్స్'ను ఏర్పాటు చేసింది. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm)బాప్ బేటీ ఫామ్స్ (BaapBeti Farms) "నేను కథలు చెప్పడం మాత్రమే కాదు.. ఆ కథల్లో ఈ ప్రకృతిలో జీవించాలనుకున్నాను. అదే నన్ను భూమికి అనుసంధానించినది. భూమినుంచే తీసే తాజాగా తినే ఆహారం, పాలిష్ చేయని, ప్రాసెస్ చేయని , స్వచ్ఛమై ఆహారంతో నా సంబంధాన్ని శాశ్వతంగా మార్చివేసింది”అంటారు స్నేహ. ముంబైలో తన జీవితాన్ని సర్దుకుని పూణేకు తిరిగి వచ్చింది. బ్యాకప్ ప్లాన్ ఏమీ లేదు. ఉన్నదల్లా నమ్మకం. ఓర్పు, అభిరుచే పెట్టుబడి. దీనికి కూతురి కలలకు అండగా నిలిచిన తండ్రి తోడ్పాటు, పెర్మాకల్చర్లో కోర్సులు, భూమి భాషను అధ్యయనం తోడైంది. టాటా మోటార్స్ పనిచేస్తున్న పదవీ విరమణకు దగ్గరగా ఉన్న స్నేహ తండ్రి అనిల్ రాజ్ గురు తొలుత ఆమె నిర్ణయానికి విస్మయం చెందాడు. అయితే “స్నేహ ఎప్పుడూ ఆరుబయట ఉండటం ఇష్టపడేది. చిన్నప్పుడు కూడా, ఆమె నేల వైపు ఆకర్షితురాలైంది," అని గుర్తు చేసుకుంటారుపూణే దగ్గర ఉందీ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ సేంద్రీయ కూరగాయలు, పళ్లు పండిస్తారు. అందుకే ఆమె వ్యవసాయం గురించి ప్రస్తావించగానే మారు మాట్లాడకుండా ఆమెతో చేయి చేయి కలిపారు.పూణే బయట బంజరుగా ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని కనుగొన్నారు. విత్తనాలు నాటారు. భూమిని పెర్మాకల్చర్ జోన్లుగా విభజించారు, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, అందంగా అమర్చుకున్న పర్యావరణ వ్యవస్థ. పక్షులు, తేనెటీగలు, కూరగాయలు, కోళ్లు, కంపోస్ట్ కుప్పలు - ప్రతిదీ ఈ పచ్చని సోయగంలో తన పాత్రను పోషించింది. (ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్) ప్రతీ ఆకులో ఒక వారసత్వాన్ని వెతుక్కున్న వారి కృషి ఫలించింది. స్ట్రాబెర్రీల నుండి లెట్యూస్, క్యాప్సికమ్ వరకు స్థానిక ఉత్పత్తులలో ప్రయోగాలు వరకు, బాప్బేటి ఫామ్స్ పూర్తిగా సేంద్రీయం మారిపోయింది. వ్యక్తిగత ప్రయాణంగా ప్రారంభమై, ఉద్యమంగా మారింది. స్నేహ ఈ పొలాన్ని Airbnbలో జాబితా చేసింది, అతిథులను స్థిరమైన జీవనశైలిని అనుభవించమని ఆహ్వానించింది. నగరవాసులు క్యూ కట్టారు. ఈ తండ్రీ కూతుళ్లు ఎంతోమంది రైతులకు మార్గ నిర్దేశకులయ్యారు. ఆమె తండ్రి అనధికారిక టూర్ గైడ్ అయ్యాడు. అంతేకాదు నచ్చిన పనిచేస్తూనే ప్రతి ఉదయం ప్రకృతిలో నడక. దీంతో సుగర్ నియంత్రణలోకి వచ్చింది. 18 కిలోగ్రాముల బరువ తగ్గాను అంటూ సంతోషంగా చెబుతారు అనిల్. అన్నింటికంటే ముఖ్యం నా బిడ్డ కల సాకారంలో నేను ముఖ్య భూమికనయ్యాను అంటారు. చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీసంపాదన కాదు ముఖ్యంబాప్ బేటి ఫామ్స్ నెలకు రూ.80 వేలకు పైగా సంపాదిస్తుంది. కానీ తనకు డబ్బు కాదు ముఖ్యం. ప్రకృతిలో జీవించడం, వ్యవసాయ క్షేత్రం స్వయం సమృద్ధిగా, నిరంతరం అభివృద్ధి చెందడం. అలాగే ఏ హాలీవుడ్ చిత్రం రాయలేని ట్విస్ట్లు, విలువల కంటే మేటి జ్ఞానం.అదే నిజమైన బహుమతి అంటారు స్నేహ. -
ఆ హీరో అంటే విపరీతమైన క్రష్.. నా గదిలో కూడా: బద్రి హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. హిందీ మూవీస్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ.. టాలీవుడ్లో బద్రిలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లోనూ మెప్పించింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత గదర్-2లో మెప్పించింది. అయితే ఇటీవల ఓ పాడ్కాస్ట్కు హాజరైన అమీషా పటేల్ తన పెళ్లితో పాటు కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాల పంచుకుంది.అంతేకాకుండా తన క్రష్ గురించి కూడా ఈ పాడ్కాస్ట్లో మాట్లాడింది. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తనకు విపరీతమైన ప్రేమ ఉందని అమీషా పటేల్ మనసులోని మాటను బయటపెట్టింది. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే టామ్ క్రూజ్ పట్ల తనకున్న అభిమానాన్ని అమీషా పటేల్ పంచుకోవడం ఇదేం మొదటిసారి కాదు.. 2023లోను తన గదిలో ఆ స్టార్ పోస్టర్లు ఉన్నాయని అమీషా వెల్లడించింది. టామ్తో కలిసి పనిచేయాలనేది తన కోరిక అని తెలిపింది.అమీషా పటేల్ మాట్లాడుతూ.. "నాకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం. మీరు అతనితో పాడ్కాస్ట్ చేయగలిగితే.. దయచేసి నన్ను కూడా ఆ పాడ్కాస్ట్కి పిలవండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్ అంటే ఇష్టం. నా పెన్సిల్ బాక్స్లో.. నా ఫైల్స్లో అతని ఫోటో ఉండేది. నా గదిలో ఉన్న ఏకైక పోస్టర్ టామ్ క్రూజ్దే. అతను ఎప్పుడు.. ఎప్పటికీ నా క్రష్. నేను అతని కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా వెనకాడను. అతనికి పెద్ద అభిమానిని అని.. అవకాశం ఇస్తే పెళ్లి చేసుకునేదాన్ని" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని..సరైన వ్యక్తి దొరికితే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడతానని కూడా అంటోంది అమీషా పటేల్.ఇక కెరీర్ విషయానికొస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత అమీషా పటేల్.. గదర్- 2తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆమె చివరిసారిగా 2024లో వచ్చిన తౌబా తేరా జల్వా మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఈ 50 ఏళ్ల బ్యూటీ ఎలాంటి ప్రాజెక్ట్ను ప్రకటించలేదు. -
నాకు పిల్లలు కావాలి: సల్మాన్ ఖాన్
ఆరు పదుల వయసుకు దగ్గర పడుతున్నారు సల్మాన్ ఖాన్. కానీ సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఫలానా హీరోయిన్తో ప్రేమలో ఉన్నారని, ఫలానా అమ్మాయితో సల్మాన్ పెళ్లి అని చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ సల్మాన్ మాత్రం ఏ అమ్మాయితోనూ ఏడడుగులు వేయలేదు. అయితే భవిష్యత్లో మాత్రం తనకు పిల్లలు కావాలని చెబుతున్నారు సల్మాన్ ఖాన్. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షో’లో ఆమిర్ ఖాన్తో కలిసి సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ షోలో సల్మాన్ ఖాన్ పెళ్లి, ప్రేమ అంశాల ప్రస్తావనను తీసుకువచ్చారు ట్వింకిల్.గతంలో కాఫీ విత్ కరణ్ షోలో సల్మాన్ ఖాన్ తనను తాను నవమన్మథుడిగా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ట్వింకిల్ ప్రస్తావిస్తూ, సల్మాన్కు డజనుమంది పిల్లలు ఉండి ఉండొచ్చని, వాళ్ల గురించి మనకు తెలియదని, ఈ విషయం సల్మాన్కు కూడా తెలియదన్నట్లుగా కాస్త చమత్కారంగా మాట్లాడారు. ఈ విషయంపై స్పందిస్తూ– ‘‘నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ నాకు పిల్లలు ఉంటే మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా?’’ అని పేర్కొన్నారు సల్మాన్.ఆ తర్వాత పిల్లల్ని దత్తత తీసుకునే చాన్స్ ఏమైనా ఉందా? అని సల్మాన్ను ట్వింకిల్ ప్రశ్నించగా, ‘‘దత్తత తీసుకునే ఆలోచన అయితే లేదు. కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. అది ఎప్పుడైనా జరగొచ్చు. భవిష్యత్లో ఏం జరుగుతుందో ఊహించి చెప్పలేం. అంతా దేవుడి దయ. నాకు పిల్లలు పుడితే వారి ఆలనా పాలనా చూసుకునేందుకు నా కుటుంబం ఉంది. అయాన్ (సల్మాన్ మేనల్లుడు), అలీజ్ ( మేనకోడలు)లు ఉన్నారు. వీరు పెద్దవాళ్లు అయ్యారు. అంతా ఇంట్లోవాళ్లే చూసుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఇక ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం షూటింగ్తో సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నారు. -
సీక్వెల్కి గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ ‘క్రూ’లోకి మళ్లీ తిరిగొచ్చారట హీరోయిన్ కరీనా కపూర్. టబు, కరీనా కపూర్, కృతీ సనన్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘క్రూ’. రాజేశ్ ఎ. కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా చిత్రం 2024లో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన ఏక్తా కపూర్ ‘క్రూ’కు సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సన్నాహాల్లో భాగంగానే కరీనా కపూర్ను మేకర్స్ సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.‘క్రూ’ సినిమాలో మాదిరిగానే ‘క్రూ 2’లోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. కాక పోతే తొలి భాగంలో నటించిన టబు, కృతీ సనన్ రెండో భాగంలో ఉండరనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. ఈ ఇద్దరి స్థానంలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఇద్దరు కొత్త హీరో యిన్లు అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. మరి... ఫైనల్గా ‘క్రూ 2’లో కరీనాతో పాటు నటించే ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. -
షారూఖ్ ఖాన్కు బిగ్ షాక్.. రెండు కోట్ల పరువు నష్టం కేసు!
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. ఈ నెల 18న ఓటీటీకి వచ్చిన ఈ సిరీస్ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ వెబ్ సిరీస్లో తనను తప్పుగా చూపించారంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సిరీస్లోని ఓ ఎపిసోడ్లో ఆర్యన్ను డ్రగ్ కేసులో అరెస్టు చేసిన అధికారి సమీర్ వాంఖడేతో పోలిక ఉందని నెటిజన్లు కామెంట్స్ చేయడంతో ఈ వివాదానికి దారితీసింది.దీంతో తనను ఉద్దేశపూర్వకంగానే తప్పుగా చూపించారని మాజీ అధికారి సమీర్ వాంఖడే ఆరోపిస్తూ.. షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో పాటు నెట్ఫ్లిక్స్పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రెండు కోట్ల రూపాయల పరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. ఇందులో తనపై దురుద్దేశంతోనే తప్పుగా చిత్రీకరించారని సమీర్ వాంఖడే ఆరోపించారు. ఇలాంటి వాటితో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ రూ. 2 కోట్ల పరిహారాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్కు విరాళంగా ఇవ్వాలని పిటిషన్లో ప్రతిపాదించారు.కాగా.. గతంలో సమీర్ వాంఖడే ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ను అరెస్టు చేశారు. ఆ సమయంలో సమీర్ వాంఖడే ఈ కేసును డీల్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ను దాదాపు నెల రోజులు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఆ తర్వాత 2023లో ఈ కేసులో ఉన్న వారి నుంచి రూ.25 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.Sameer Wankhede, former NCB Mumbai zonal director, has filed a defamation suit in the Delhi High Court against Red Chillies Entertainment Pvt. Ltd., owned by actor Shah Rukh Khan and Gauri Khan, global streaming platform Netflix, and others. He alleges that their series “Ba**ds…— ANI (@ANI) September 25, 2025 -
రోడ్డుపై అమిర్ ఖాన్ ప్రియురాలు.. ఇక్కడ కూడా వదలరా?
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఈ ఏడాది అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన బర్త్ డే రోజున ప్రియురాలిని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ఉన్నానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆరు పదుల వయస్సులో లవ్లో పడ్డానంటూ రివీల్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు.ఇదిలా ఉంచితే తాజాగా అమిర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తాజాగా ముంబయిలోని బాంద్రాలో కనిపించింది. రోడ్డుపై నడుచకుంటూ వెళ్తున్న ఆమెను కొందరు ఫోటోగ్రాఫర్స్ వెంటపడ్డారు. దీంతో అసహనానికి గురైన గౌరీ.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.. నేను వాకింగ్కు వెళ్తున్న అంటూ తన ఫోటోలు తీస్తున్న వారిపై మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాకింగ్ చేసేందుకు వెళ్తున్న ఆమెను వెంటపడమేంటని నెటిజన్స్ సైతం తప్పు పడుతున్నారు. సెలబ్రిటీలను ఇలా రోడ్లపై వేధించడం సరికాదని హితవు పలుకుతున్నారు.ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే ఈ ఏడాది 'సితారే జమీన్ పర్' చిత్రంలో బాస్కెట్బాల్ కోచ్గా నటించి మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన రజినీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయి. బ్రెయిన్ ఎన్యోరిజమ్ (మెదడులో వచ్చే సమస్య), ఏవీ మాల్ఫొర్మేషన్ (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ స్థితి). వీటివల్ల ఎముకలు విరుగుతూ.. అతడి శరీరం ఎంతో ఒత్తిడికి గురవుతూనే ఉంది. గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (ముఖంలో వచ్చే తీవ్రమైన నొప్పి)తోనూ బాధపడ్డాడు. అయితే ఈ వ్యాది పగవాడికి కూడా రాకూడదంటున్నాడు సల్లూ భాయ్.ఎనిమిదేళ్లు బాధపడ్డా..తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన సల్మాన్.. ట్రైజెమినల్ న్యూరాల్జియా వల్ల నేను పడ్డ నరకం మాటల్లో చెప్పలేనిది. పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదనే కోరుకుంటాను. ఏడెనిమిదేళ్లు ఈ వ్యాధితో బాధపడ్డాను. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి నొప్పి నన్ను వేధించేది. దానివల్ల బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా గంటన్నర సమయం పట్టేది. ఒక ఆమ్లెట్ తినాలన్నా కూడా కష్టంగా ఉండేది. నొప్పి నన్ను వెంటాడేది.దాన్ని భరించలేక ప్రాణాలు వదిలేవారుబలవంతంగా ఆమ్లెట్ నోట్లో కుక్కుకునేవాడిని. పెయిన్కిల్లర్స్ వాడినా ఫలితం లేదు. ఈ వ్యాధి వచ్చిన చాలామంది దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకునేవారు. ఇప్పుడు దానికి చికిత్స లభిస్తోంది. ఏడెనిమిది గంటలపాటు సర్జరీ చేసి ముఖంలో మనల్ని ఇబ్బందిపెడుతున్న నరాలను ఫిక్స్ చేస్తున్నారు. నేనూ ఆ సర్జరీ చేయించుకున్నా.. ఇకమీదట నొప్పి 30% తగ్గుతుందన్నారు. అదృష్టవశాత్తూ ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్.. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా చేస్తున్నారు.చదవండి: మోహన్లాల్ రికార్డ్.. ఒకే ఏడాదిలో రూ. 600 కోట్లు -
ఇంటిమేట్ సీన్.. హీరోను ఏడిపించిన హీరోయిన్
'బాబీ' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది డింపుల్ కపాడియా (Dimple Kapadia). హిందీలో అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. అయితే అనిల్ కపూర్ (Anil Kapoor)తో చేసిన ఓ సినిమాలో మాత్రం డింపుల్ బాగా ఇబ్బందిపడింది. ఆ సీన్ కహానీ ఏంటో చూసేద్దాం.. 1986లో జన్బాజ్ మూవీలో అనిల్ కపూర్, డింపుల్ కపాడియా జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇందులోని పాటలు ఇప్పటికీ పాడుకుంటూ, వింటూ ఉంటారు.అనిల్ కపూర్, డింపుల్ కపాడియారొమాంటిక్ సీన్అయితే ఈ మూవీలోని ఓ షాట్ కోసం.. ఫిరోజ్ ఖాన్ ఫామ్హౌస్ను ఎంచుకున్నారు. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య కాస్త క్లోజప్ (ఇంటిమేట్) సీన్స్ పెట్టారు. ఆ విషయం హీరోహీరోయిన్లిద్దరికీ చెప్పారు. సమయానికి ఇద్దరూ సెట్లోకి వచ్చారు. కానీ అనిల్ చొక్కా విప్పగానే డింపుల్ అడుగు ముందుకు వేయలేదట! కారణం.. అతడి ఛాతీనిండా గుబురుగా వెంట్రుకలు ఉండటం! దీంతో దర్శకుడు ఆమెను బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. చిట్టచివరకు ఆమె ఆ సీన్ చేసేందుకు అంగీకరించింది. అనిల్ ఛాతీపై వెంట్రుకలు చూసి డింపుల్ అతడిని చాలారోజులపాటు ఏడిపించిందట! ఇకపోతే జన్బాజ్ మూవీలోని ఓ సాంగ్లో హీరోయిన్ శ్రీదేవి తళుక్కుమని మెరిసింది.చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్ -
జాన్వీ కపూర్ 'హోమ్బౌండ్' ప్రీమియర్స్లో గ్లామర్ హీరోయిన్స్ (ఫోటోలు)
-
నేషనల్ అవార్డ్స్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఇద్దరు స్టార్స్ (ఫోటోలు)
-
అట్టహాసంగా జాతీయ అవార్డుల వేడుక.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం
దేశ రాజధాని ఢిల్లీ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. 2023 ఏడాది గానూ ఈ అవార్డులను అందించారు. ఉత్తమ నటులుగా షారూఖ్ ఖన్, విక్రాంత్ మాస్సే.. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 12 th ఫెయిల్ చిత్రానికి ఘనత దక్కింది. ఇవాళ ఢిల్లీలో 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్గా నిర్వహించారు.తెలుగులో జాతీయ అవార్డు గ్రహీతలు వీళ్లే.. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి జాతీయ అవార్డ్ దక్కింది. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్,స్టంట్ కొరియోగ్రఫీ అవార్డ్ హనుమాన్ సొంతం చేసుకుంది. బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాట అనే పాటకు బెస్ట్ లిరిక్స్ విభాగంలో అవార్డ్ సొంతమైంది. బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ సినిమా( సాయి రాజేష్ నీలం), బెస్ట్ మెయిల్ ప్లే బ్యాక్ సింగర్ రోహిత్ను జాతీయ అవార్డులు వరించాయి. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) జాతీయ అవార్డ్ అందుకుంది. ఉత్తమ్ చిత్రం యానిమేషన్ విజువల్స్,గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ నేషనల్ అవార్డ్ను సాధించింది.#WATCH | Delhi: Superstar Shah Rukh Khan, actors Rani Mukerji and Vikrant Massey present at Vigyan Bhawan for the 71st National Film Awards. The Best Actor in a Leading Role award has been shared by Shah Rukh Khan for 'Jawan' and Vikrant Massey for '12th Fail', and the Best… pic.twitter.com/PfogNDvfyx— ANI (@ANI) September 23, 2025 -
'ఆదిపురుష్' రిజల్ట్.. ఇన్నాళ్లకు ఒప్పుకొన్న ఓం రౌత్
ఆదిపురుష్.. ఈ పేరు చెబితే చాలు ప్రభాస్ ఫ్యాన్స్, దర్శకుడు ఓం రౌత్పై ఇంతెత్తున ఎగిరిపడతారు. ఎందుకంటే మూవీలోని గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉంటుంది. పురాణాల్లో రాముడు, రావణాసురుడు అంటే కొన్ని అంశాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వాటిని పూర్తిగా మార్చేసి ఇష్టమొచ్చినట్లు ఓం రౌత్ తీయడంపై అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. తర్వాత ఏ గ్రాఫిక్స్ మూవీ వచ్చినా సరే ఔం రౌత్పై కచ్చితంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే రిలీజ్ తర్వాత దీని గురించి ఎప్పుడూ మాట్లాడని ఈ దర్శకుడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి స్పందించాడు. విమర్శలు, ట్రోలింగ్ వల్ల ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడో చెప్పాడు.(ఇదీ చదవండి: హైకోర్ట్ తీర్పు.. 'కాంతార'కు లైన్ క్లియర్)'జీవితంలో తప్పులు చేయడం సహజం. హిట్ సంతోషాన్ని ఇస్తుంది. ఫ్లాప్ పాఠం నేర్పిస్తుంది. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మళ్లీ అలాంటివి జరగకుండా ముందుకెళ్లిపోవడమే జీవితం. అదే మనిషిని బతికిస్తుంది. 'ఆదిపురుష్' విషయంలో వచ్చిన విమర్శల వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. టీమ్తో పాటు ఆ ప్రభావం నా కుటుంబంపైనా పడింది. ఫలితంగా నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఆ సమయంలో నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. అలా కోలుకోగలిగాను. ప్రేక్షకుల నమ్మకం తిరిగి పొందేందుకు ఇప్పుడు చాలా కష్టపడాలి' అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.2015లో 'లోక్మాన్య' అనే మరాఠీ సినిమాతో దర్శకుడు అయిన ఓం రౌత్.. తర్వాత హిందీలో 'తానాజీ' అనే పీరియాడికల్ మూవీతో హిట్ కొట్టాడు. ఎప్పుడైతే 'ఆదిపురుష్' వచ్చిందో ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. అప్పటినుంచి మరో చిత్రం చేయలేదు. రీసెంట్గా 'ఇన్స్పెక్టర్ జెండే' మూవీని నిర్మించగా ఇది నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ప్రస్తుతం ధనుష్తో అబ్దుల్ కలాం బయోపిక్ తీస్తున్నాడు. దీంతో హిట్ కొట్టాడా సరేసరి లేదంటే మాత్రం అంతే!(ఇదీ చదవండి: 'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి) -
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మర్దానీ 3’. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. దసరా నవరాత్రులు శుభారంభం సందర్భంగా ‘మర్దానీ 3’ పోస్టర్ను ఆవిష్కరించారు మేకర్స్. ‘‘మర్దానీ (2014), మర్దానీ 2 (2019)’ వంటి విజయాల తర్వాత ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ను ఇచ్చేలా ‘మర్దానీ 3’ తెరకెక్కుతోంది.మంచికి, చెడుకి మధ్య జరిగే పోరాటాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి కనిపించబోతున్నారు. ఓ కేసుని పరిష్కరించడానికి, దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో సినిమాలో చూడాలి’’ అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. -
రణ్వీర్ సింగ్ విలన్గా ఊహించని పేరు.. ఎంట్రీ ఇస్తాడా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దురంధర్ మూవీ చేస్తోన్న బాలీవుడ్ స్టార్.. డాన్-3 మూవీ కూడా చేయనున్నారు. ఈ చిత్రంలో మొదటి కియారా అద్వానీని హీరోయిన్గా ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కియారా ప్లేస్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హీరోయిన్ను మార్చేసిన మేకర్స్.. విలన్ విషయంలో అదే జరుగుతోందని టాక్. డాన్-3లో మొదట 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేను అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రోల్కు విక్రాంత్ మాస్సే నో చెప్పినట్లు తెలుస్తోంది. పాత్రలో లోతు లేకపోవడం వల్ల అతను వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలన్ రోల్కు ఊహించని పేరు తెరపైకి వచ్చింది.ఈ ఏడాది అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన విలనిజంతో మెప్పించిన అర్జున్ దాస్ను విలన్గా ఎంపిక చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ దాస్ ఇప్పటికే మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, కైతి లాంటి హిట్ సినిమాలతో తన విలనిజాన్ని చూపించాడు. ప్రస్తుతం అర్జున్ దాస్తో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. -
'అతని నుంచి ప్రేరణ పొందా'.. ఫ్యాన్స్కు అమితాబ్ చిరు కానుకలు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు గిప్ట్లు అందించారు. తన నివాసం వద్దకు వచ్చిన ఫ్యాన్స్కు హెల్మెట్స్ అందజేశారు. అంతేకాకుండా దాండియా ఆట ఆడే కర్రలు కూడా ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతి కంటెస్టెంట్ రాఘవేంద్ర కుమార్ నుంచి తాను ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తోన్న అమితాబ్ వారికి చిరు కానుకలు అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. జీవితంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.అమితాబ్ తన ట్వీట్లో రాస్తూ.. కేబీసీలో హెల్మెట్ మ్యాన్ని కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది.. ఆయన బైక్ రైడర్లకు భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్లు ఇస్తారు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందాను. అందుకే ప్రతి ఆదివారం అభిమానుల సమావేశంలో దాండియా కర్రలతో పాటు.. వీలైనన్ని ఎక్కువ మందికి హెల్మెట్లు ఇచ్చాను' అని పోస్ట్ చేశారు.కాగా.. కౌన్ బనేగా కరోడ్పతి షో పాల్గొన్న రాఘవేంద్ర కుమార్ రోడ్డు భద్రతను ప్రోత్సహించే విషయంలో భారతదేశం అంతటా గుర్తింపు పొందారు. అతను ఇప్పటికే వేలాదిమందికి హెల్మెట్లను అందించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలపై ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఈ పోస్ట్ చూసిన కుమార్.. అమితాబ్కు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రశంసలు తన జీవితంలో దక్కిన గొప్ప అవార్డు సంతోషం వ్యక్తం చేశారు. తన కలకు మీరు తోడుగా నిలవడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.కాగా.. బిగ్ బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -17 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చివరిసారిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి 2898 ADలో కనిపించారు. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. T 5510 - Honoured to have met the "HELMET MAN" at KBC .. who voluntarily gives out helmets to bike riders for safety .. A learning for me .. so I followed and gave out at the Sunday Fan meet .. dandiya sticks for dandiya and helmets to as many as I could .. Each day is a… pic.twitter.com/jfdwe1Zi9j— Amitabh Bachchan (@SrBachchan) September 21, 2025 -
రూ.100 కోట్లు.. కాదు వెయ్యి.. రెండు వేల కోట్ల FD ఉంటే చాలు!
దేశంలోని అత్యంత ధనిక నటుల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఒకానొక సమయంలో భారత్లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించి వార్తల్లోకెక్కాడు. నిజాయితీగా ట్యాక్స్ కట్టినందుకుగానూ ఆదాయపన్నుశాఖ ఆయనకు ప్రశంసాపత్రాన్ని సైతం అందించింది. అయితే అక్షయ్కు డబ్బుపిచ్చి ఉందన్న ప్రచారం జరిగింది. తాజాగా ద కపిల్ శర్మ షోకి హాజరైన అక్షయ్ మనీ మైండెడ్ అని తనపై పడిన ముద్రపై స్పందించాడు. రూ.100 కోట్లు ఎఫ్డీ చేస్తే..హీరో మాట్లాడుతూ.. జితేంద్ర సాహెబ్ రూ.100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడని నేను ఎక్కడో వార్త చదివాను. నాకు బాగా గుర్తు.. అది చూశాక నేను మా నాన్న దగ్గరకు పరుగెత్తుకెళ్లాను. డాడీ, రూ.100 కోట్లు ఎఫ్డీ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? అని అడిగాను. అప్పట్లో ఇంట్రెస్ట్ రేట్ 13% ఉండేది. ఈ లెక్కన నెలకు రూ.1.3 కోట్లు అన్నాడు. అంటే నేను రూ.100 కోట్లు ఎఫ్డీ చేసుకోగలిగితే నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లే అని ఫీలయ్యాను. ఆశకు హద్దు లేదుకానీ మనషుల ఆశకు అంతెక్కడిది? రూ.100 కోట్లు కాస్తా వెయ్యి కోట్లయితే బాగుండు.. వెయ్యెందుకు? రూ.2 వేల కోట్లయితే బాగుంటుంది అనుకునేవాడిని. అలా మనలో డబ్బు ఆశకు అంతం లేదు అన్నాడు. మరి ఇప్పటివరకు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశావు? అని కపిల్ అడగ్గా.. అది నేను చెప్పనుగా అని తప్పించుకున్నాడు అక్షయ్.8 ఏళ్లుగా నేనే..ఆప్కీ అదాలత్ షోకి వెళ్లినప్పుడు కూడా అక్షయ్కు డబ్బు గురించే ప్రశ్న ఎదురైంది. అందుకీ బాలీవుడ్ స్టార్.. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను తప్ప ఎవరినీ దోపిడీ చేయడం లేదు కదా.. గత 8 ఏళ్లుగా ప్రభుత్వానికి నేనే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను. అలా అని నేను మనీ మైండెడ్ అని అర్థం కాదు. బతకాలంటే డబ్బు అవసరం.నేనేమైనా దొంగతనం చేస్తున్నానా?నేను సంపాదిస్తున్నా.. ట్యాక్స్ కడుతున్నా, సేవ చేస్తున్నా.. సేవాగుణం నా మతం. అందరూ ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం. ఎవరైనా కార్యక్రమానికి రండి, డబ్బులిస్తాం అన్నారనుకోండి. తీసుకుంటే తప్పేంటి? మనమేం ఎవరి జేబులోనో చేయి పెట్టి దొంగిలించట్లేదు కదా! అని చెప్పుకొచ్చాడు. అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జానీ:LLB మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు దాటేసింది.చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల్లో ఎంత సంపాదించాడంటే? -
ఒక్క మూవీతో ప్రేమలో పడ్డారా?.. సూపర్ హిట్ జంటపై డేటింగ్ రూమర్స్!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ లిస్ట్లో రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ ఏకంగా రూ.580 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనీత్ పద్దా, అహాన్ పాండే జంటగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్ను ఆకట్టుకుంది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి వీరిద్దరిపైనే పడింది. దీంతో ఆన్ స్క్రీన్ జోడీ.. ఆఫ్ స్క్రీన్ లైఫ్లో జత కట్టనున్నారా? అనే చర్చ మొదలైంది.సైయారాలో అనీత్ పద్దా, అహాన్ పాండే కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు. దీంతో నిజ జీవితంలోనూ డేటింగ్లో ఉన్నారని టాక్ తెగ వైరలవుతోంది. ఈ ఆన్ స్క్రీన్ జంట ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి తన రిలేషన్ గోప్యంగా ఉంచారని టాక్ నడుస్తోంది. ఒక్క సినిమాకే వీరిపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ కూడా స్పందించలేదు.ఓ నివేదిక ప్రకారం నిర్మాత ఆదిత్య చోప్రాకు దగ్గరి వ్యక్తి ఒకరు 'సైయారా' సినిమా షూటింగ్ సమయంలో అనీత్, అహాన్ ప్రేమలో పడ్డారని చెప్పారట. ఈ మూవీ కూడా ప్రేమకథ కావడంతో.. 'సైయారా' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది సహజంగానే జరిగిందని అన్నారట. షూట్లో మొదలైన స్నేహం.. ప్రేమగా మారిందని చెప్పాడట. ప్రస్తుతం ఈ జంట సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ.. ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. నిజంగానే ఆన్-స్క్రీన్ జోడీ ఆఫ్-స్క్రీన్ జంట కానుందా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.కాగా.. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన 'సైయారా' జూలై 18న విడుదలైంది. ఈ ఏడాది బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ హిందీ చిత్రంగా ఘనత సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రంగా నిలిచింది. -
షారుక్ చెప్పిన పాఠాన్ని ఫాలో అవుతున్నా!
‘‘పద్దెనిమిది సంవత్సరాల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు షారుక్ ఖాన్ నాకు కొన్ని పాఠాలు నేర్పారు. ఓ సినిమా మేకింగ్, ఆ సినిమా నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఆ సినిమాలో ఎవరితో కలిసి నటించాం అనే అంశాలు ఆ సినిమా విజయాని కన్నా ముఖ్యమైనవి అని ఆయన చె΄్పారు. షారుక్ నాకు నేర్పిన తొలి పాఠం ఇదే. అప్పట్నుంచి నేను తీసుకునే నిర్ణయాలకు ఈ పాఠాన్నే అమలు చేస్తున్నాను. షారుక్తో ఆరోసారి సినిమా చేస్తుండటానికి ఈ పాఠమే కారణమై ఉండొచ్చు’’ అని తన తాజా ఇన్స్టా పోస్ట్లో దీపికా పదుకోన్ పేర్కొన్నారు.షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుండగా, షారుక్ తనయ సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ‘కింగ్’ సినిమా షూటింగ్లోకి తాను అడుగుపెట్టినట్లుగా స్పష్టం చేస్తూ దీపికా పదుకోన్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పోల్యాండ్లో జరుగుతోందని, ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైనే ఉంటుందని బాలీవుడ్ టాక్. ఇక ‘ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్’ చిత్రాల్లో షారుక్–దీపిక హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా ‘కింగ్’ సినిమా కోసం ఈ ఇద్దరు ఆరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ‘కల్కి 2’ చిత్రంలో దీపిక నటించడం లేదని ఆ చిత్రం మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ప్రీమియర్లో సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
కొంపముంచిన కామెడీ స్పూఫ్.. ఏకంగా రూ.25 కోట్ల దావా
కామెడీ, ఎంటర్ టైన్మెంట్ షోల్లో రకరకాలుగా ఆకట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా సెలబ్రిటీలు వస్తే ఆయా హీరో లేదా హీరోయిన్ల సినిమాల్లోని పాత్రల స్పూఫ్స్ చేస్తూ అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఓ నిర్మాత హర్ట్ అయ్యాడు. ఏకంగా షో నిర్వహకులపై రూ.25 కోట్ల దావా వేశాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియలో చర్చనీయాంశంగా మారింది.బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హిట్ సినిమాల్లో 'హేరా పేరి'కి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2000లో వచ్చిన ఈ చిత్రంలో బాబురావు అనే పాత్రలో పరేశ్ రావల్ చేసే కామెడీ ఐకానిక్గా నిలిచిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే రీసెంట్గా తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్.. కపిల్ శర్మ షోకి వచ్చాడు. ఈ క్రమంలోనే బాబురావు పాత్ర స్పూఫ్ చేశారు. కమెడియన్ కికు శారదా ఈ పాత్ర మేనరిజాన్ని ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు)ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా.. 'హేరా పేరి' నిర్మాత ఫిరోజ్ నడియవాలా హర్ట్ అయ్యారు. తన అనుమతి లేకుండా ఈ పాత్రని కపిల్ శర్మలో షోలో ఇమిటేట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'బాబురావు అనేది ఓ క్యారెక్టర్ మాత్రమే కాదు. హేరా పేరికి ఆత్మ. మా కష్టం, విజన్, క్రియేటివిటీతో ఆ పాత్రకు ప్రాణం పోశాం. ఆర్థిక లాభాపేక్ష కోసం ఆ పాత్రని ఉపయోగించే హక్కు ఎవరికీ లేదు. ఈ పాత్రని ఇమిటేట్ చేస్తూ ఉన్న కంటెంట్ మొత్తాన్ని సోషల్ మీడియా, నెట్ఫ్లిక్స్, టీవీ ఛానెల్స్ నుంచి తొలగించాలి' అని నిర్మాత ఫిరోజ్ సూచించారు.తన అనుమతి లేకుండా బాబురావు పాత్రని ఇమిటేట్ చేసినందుకుగానూ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలి. అలానే నోటీసులు అందిన రెండు రోజుల్లోగా రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాత ఫిరోజ్.. కపిల్ శర్మ షో నిర్వహకులైన నెట్ఫ్లిక్స్కు అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ చేయకపోతే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరి షో నిర్వహకులు ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప) -
స్పిరిట్ బ్యూటీ 'తృప్తి డిమ్రి' ట్రెండింగ్ ఫోటోలు చూశారా ?
-
నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉండగా మా అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి?
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో సెలబ్రిటీలు అడుగుపెట్టినప్పుడు వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ లాగుతుంటారు. కొన్నిసార్లు వాళ్లే గతాన్ని గుర్తు చేసుకుని పక్కవారితో చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునిక సదానంద్ అదే పని చేసింది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది. నాకింకా పెళ్లి కాలేఈమె కెరీర్ తొలినాళ్లలో సింగర్ కుమార్ సానును ప్రేమించింది. ఈ విషయాన్ని ఆమె బిగ్బాస్ హౌస్లో వెల్లడించింది. నేను సింగర్ (కుమార్ సాను)ని ప్రేమించాను. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. అతడు భార్యతో విడిపోయి ఉంటున్నాడు. దీంతో మేమిద్దరం కలిసుండేవాళ్లం. తనను ఎంతగానో నమ్మాను. కానీ ఓరోజు తనకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసింది. తప్పేంటి?ఆ విషయం అతడే ఒప్పుకోవడంతో తనకు బ్రేకప్ చెప్పాను అంది. తల్లికి యుక్తవయసులో ఉన్న రిలేషన్షిప్ గురించి కునిక కుమారుడు అయాన్ లాల్ స్పందిస్తూ.. నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? అప్పుడు తన వయసు 27 ఏళ్లే కదా! అప్పుడు నేనింకా పుట్టనేలేదు. కానీ, అమ్మ ప్రేమ విషయం నాకు తర్వాత తెలిసింది. 27 ఏళ్ల వయసులో లవ్అమ్మ అతడిని (కుమార్ సాను) సింగర్గా ఇష్టపడేది. ఇంట్లో అతడి పాటలు పాడుతూ ఉండేది. ఇప్పటికీ పాడుతుంది కూడా! అతడి ప్రతిభను ఇష్టపడుతుంది, కానీ ఆ వ్యక్తిని కాదు. వాళ్ల ప్రేమాయణం 27 ఏళ్లు సాగిందని అందరూ అనుకుంటారు, అది నిజం కాదు! అమ్మ 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమలో పడిందంతే! కొన్నేళ్లకే విడిపోయారు అని చెప్పుకొచ్చాడు.రెండు పెళ్లిళ్లు- విడాకులుకునికకు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కొడుకు పుట్టాడు. తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఓ కుమారుడు సంతానం. కానీ ఈ జంట కూడా ఎంతోకాలం కలిసుండలేదు, భేదాభిప్రాయాల వల్ల విడాకులు తీసుకున్నారు.చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్గా రాము రాథోడ్ -
సందడిగా షబానా పుట్టినరోజు వేడక
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ ఎంతో ఉత్సాహంగా ‘ప్రెట్టీ లిటిల్ బేబీ’ పాటకు డ్యాన్స్ చేశారు. 75 ఏళ్ల వయసులో ఆమె ‘లిటిల్ బేబీ’ అంటూ డ్యాన్స్ చేయడానికి కారణం ఉంది. గురువారం (సెప్టెంబరు 18) షబానా 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా గ్రాండ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసి, పలువురు బాలీవుడ్ స్టార్స్ని ఆహ్వానించారు. అమెరికన్ సింగర్ కోనీ ఫ్రాన్సిస్ ఫేమస్ పాట ‘ప్రెట్టీ లిటిల్ బేబీ’కి భర్త జావేద్ అక్తర్తో కలిసి డ్యాన్స్ చేశారు షబానా.ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ నైట్ పార్టీలో డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ ‘పరిణీత’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘కైసీ పహేలీ జిందగాని’కి డ్యాన్స్ చేసి, ఆకట్టుకున్నారు. మాధురీతో కలిసి సీనియర్ నటి రేఖ స్టయిల్గా వేసిన స్టెప్పులు అందర్నీ అలరించాయి. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, ఊర్మిళ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలూæ వైరల్ అయ్యాయి.‘ఓజీ క్వీన్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే క్యాప్షన్తో ఓ వీడియోను నటుడు–నిర్మాత సంజయ్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకా ‘జిందగీ న మిలేగీ దోబారా’ చిత్రంలోని ‘సెనోరిటా’ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు దర్శక–నిర్మాత–నటుడు ఫర్హాన్ అక్తర్. ఈ వేడుకలో హృతిక్ రోషన్, సోనూ నిగమ్, కరణ్ జోహార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
విడుదలకు ముందే జాన్వీ కపూర్ మూవీ ఘనత.. ఏకంగా ఆస్కార్ అవార్డుకు ఎంట్రీ
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం హోమ్ బౌండ్ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్-2026 అవార్డులకు ఎంట్రీ దక్కించుకుంది. నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది)తాజాగా ఈ చిత్రం 2026 ఆస్కార్ అకాడమీ అవార్డులకు ఇండియా నుంచి అఫీషియల్గా ఎంట్రీ సాధించింది. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డులకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో హౌమ్ బౌండ్ పోటీపడనుంది. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. Taking back home a ton of love!#Homebound bags two awards : Best Film & Best Director (@ghaywan) at the IFFM 2025. pic.twitter.com/2CucgSEUDI— Dharma Productions (@DharmaMovies) August 15, 2025 India's official entry for the Oscars 2026 Best International Feature Film category is Homebound directed by Neeraj Ghaywan. Produced by Dharma, the film stars Ishaan Khatter, Vishal Jethwa, Janhvi Kapoor. N Chandra announced the same in Kolkata. #Homebound #Oscars2026 pic.twitter.com/iwBE4Ge9yd— Anindita Acharya (@Itsanindita) September 19, 2025 -
తమన్నా మరో ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. రీసెంట్గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్తో దర్శకుడిగా మారాడు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఏడు ఎపిసోడ్ల ఈ సిరీస్.. గురువారం(సెప్టెంబరు 18) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ నటీనటులతో పాటు రాజమౌళితో అతిథి పాత్ర చేయించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు.(ఇదీ చదవండి: 'మిరాయ్' విలనిజం తెచ్చిన మెగా అవకాశం?)అయితే ఈ సిరీస్ కోసం తమన్నాతో ఓ స్పెషల్(ఐటమ్) సాంగ్ చేయించారు. 'గఫూర్' అంటూ సాగే ఈ పాట వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో తమన్నా.. వరసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ గీతం కూడా వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఇందులో బాలీవుడ్ ఒకప్పటి విలన్స్ అయిన శక్తి కపూర్, గుల్షన్ గ్రోవర్, రంజీత్ కనిపించడం విశేషం. ఈ సాంగ్పై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్) -
అతనితోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డేటింగ్.. రూమర్స్కు ఫుల్స్టాప్!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. రాజ్కుమార్ రావు నటించిన స్త్రీ-2 మూవీతో సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. నాగిన్ మూవీతో పాటు మరో రెండు చిత్రాల్లో కనిపించనుంది. అటు షూటింగ్లతో బిజీగా ఉండే శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా నెట్టింట పోస్టులు పెడుతూనే ఉంది. గతంలో స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో శ్రద్ధాపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ముంబయిలో డిన్నర్ డేట్ తర్వాత అతనితో కలసి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు అప్పట్లో వైరలయ్యాయి. ఆ తర్వాత చాలాసార్లు అతనితో కలిసి జంటగా కనిపించింది.అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ మెరిశారు. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్లో టాక్ వినిపిస్తూనే ఉంది.తాజాగా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. మీ కోపా తాపాలను భరించే వ్యక్తి మీ లైఫ్లో కనుగొనండి అంటూ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. అంతేకాకుండా తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోదీని ట్యాగ్ చేసింది. ఆ వీడియోను రాహులే తీసినట్లు తెలుస్తోంది. మీ జీవితంలో హట్ లాంటివి వినే వాళ్లు ఎవరై ఉంటారని హింట్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు రాహుల్తో డేటింగ్ కన్ఫామ్ చేసేసిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోతో రాహుల్తో డేటింగ్లో ఉన్నట్లు పరోక్షంగానే చెప్పేసిందని పోస్ట్ చేస్తున్నారు.గతడాది డిసెంబర్లోనూ రాహుల్తో వడా పావ్ డేట్ గురించి పోస్ట్ చేసింది. అంతకుముందు ఆమె ఫోన్ వాల్పేపర్లో అతనితో దిగిన ఫోటోతో దొరికిపోయింది. ఇవాళ పోస్ట్ చేసిన వీడియోతో వీరిద్దరి డేటింగ్ ఉన్నట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'స్త్రీ- 2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ ద్వివేది తెరకెక్కిస్తోన్న 'నాగిన్'లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ
కెరీర్ పోతుందేమోనని భయంతో చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరు. కానీ ఓ దశ వచ్చిన తర్వాత మాత్రం బిజినెస్మ్యాన్ లేదంటే ఎవరో ఒకరిని వివాహం చేసుకుని సెటిలైపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఏజ్ పెరిగిపోతున్నా సరే సింగిల్గానే ఉండిపోతుంటారు. అలాంటి వారిలో హీరోయన్ అమీషా పటేల్ ఒకరు. ఈ బ్యూటీ 50 ఏళ్లు. అయినా సరే గ్లామర్ విషయంలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాల్ని చెప్పుకొచ్చింది.'నన్ను పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. అయితే వాళ్లందరూ వివాహం తర్వాత నటన మాసేసి పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని కండీషన్ పెట్టారు. ఇలాంటవన్నీ నచ్చక చాలామంది ప్రపోజల్స్ రిజెక్ట్ చేశాను. ప్రేమించే వ్యక్తులు ఎప్పుడూ కెరీర్లో రాణించేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. సినిమాల్లోకి రాకముందే నేను ఒకరితో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాను. మా ఇద్దరి కుటుంబ నేపథ్యం, ఇష్టాయిష్టాలు కలిశాయి. అయితే నేను నటిగా మారతానని చెప్పాను. పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి పార్ట్నర్గా వద్దని అతడి చెప్పేసరికి ప్రేమని వదులుకున్నాను. కెరీర్ని ఎంచుకున్నాను'(ఇదీ చదవండి: కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. దీపికకు నాగ్ అశ్విన్ కౌంటర్)'అలా అని నేనేమి పెళ్లికి వ్యతిరేకం కాదు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ నాకు మంచి కుటుంబాల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. తనలో సగం వయసున్న వారు కూడా డేటింగ్కి రమ్మని పిలుస్తున్నారు. దానికి నేను కూడా రెడీ. కాకపోతే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది.'కహోనా ప్యార్ హై' అనే హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమీషా.. తెలుగులోకి 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లో నటించింది. కొన్నేళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ఈమె.. 2023లో వచ్చిన 'గదర్ 2' మూవీతో హిట్ అందుకుంది. గతేడాది 'తౌబా తేరా జల్వా' అనే సినిమాలో చివరగా కనిపించింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది.(ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?) -
కల్కి 2 నుంచి దీపిక ఔట్.. అసలు కారణం చెప్పిన మేకర్స్
-
సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్ హీరో దర్శకుడిని చితకబాదాడు!
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ హిందీ చలనచిత్ర పరిశ్రమకు గుడ్బై చెప్పేసి సౌత్కు షిఫ్ట్ అయిపోయాడు. అనురాగ్ సోదరుడు అభినవ్ కశ్యప్ (Abhinav Kashyap) కూడా దర్శకుడిగా హిందీలో రెండే రెండు సినిమాలు చేసి సైలెంట్ అయిపోయాడు. అవి దబాంగ్, బేషరం. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ మూవీ బ్లాక్బస్టర్ విజయం సాధించింది. దీనికి దబాంగ్ 2, 3 అంటూ రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి.ధర్మేంద్రను తీసుకోవాలంటే భయంవాటిలో సల్మాన్ (Salman Khan) హీరోయే కానీ దర్శకుడు మాత్రం మారిపోయాడు. అందుకు గల కారణాన్ని దర్శకుడు అభినవ్ తాజాగా బయటపెట్టాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. దబాంగ్ సినిమా ప్రారంభంలో అంతా బానే ఉంది. అందరం అనుకున్నట్లుగా అనుపమ్ ఖేర్, ఓం పురిని తీసుకున్నాం. కానీ, ధర్మేంద్రను సెలక్ట్ చేసుకోవాలంటే భయమేసింది. అందుకే ఆయనకు బదులుగా వినోద్ ఖన్నాను తీసుకున్నాను.దర్శకుడిని చితకబాదిన హీరోనిజానికి దబాంగ్ మూవీ చేయమని ధర్మేంద్రను కలిశాను. అందుకాయన.. బేటా, ముఖ్యమైన పాత్ర ఉంటేనే ఇవ్వు, లేదంటే వద్దు అని చెప్పాడు. దాంతో నాకు భయమేసింది. ఆయన ఎలాంటి పాత్ర ఆశిస్తున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మేంద్రతో అసభ్య సన్నివేశం చిత్రీకరించినందుకుగానూ దర్శకుడు కాంతిషాపై హీరో సన్నీడియోల్ (Sunny Deol) చేయి చేసుకున్నాడని రూమర్లున్నాయి. ఏదైనా తేడా వస్తే గొడవ ఖాయం అని అర్థమై ధర్మేంద్రను పక్కనపెట్టాను. ఇక నేను ఏ నటుడితో మంతనాలు జరిపినా సల్మాన్ సోదరుడు సోహైల్ నా వెంటే వచ్చేవాడు.తండ్రి ధర్మేంద్రతో బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్సల్మాన్ ఓ గూండాతనే అందరి పారితోషికం గురించి చర్చలు జరిపాడు. వాళ్ల సూచనల ప్రకారమే యాక్టర్స్ను సెలక్ట్ చేసుకున్నా.. కానీ వారికి వ్యతిరేకంగా సోనూసూద్ను సినిమాలో తీసుకున్నా.. సోనూ ఫిజిక్ చూసి సల్మాన్ ఈర్ష్య పడేవాడు. అయినా సరే, వాళ్ల మాటను కాదని సోనూసూద్ను ఎంపిక చేసుకున్నాను. దబాంగ్ సినిమా ముందువరకు సల్మాన్ ఏంటో నాకు తెలీదు. కానీ, తర్వాత అర్థమైంది అతడో పెద్ద గూండా అని! అతడికి యాక్టింగ్ అంటే ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదాను మాత్రం ఇష్టపడేవాడు. అతడో నీచుడు, చెడ్డ వ్యక్తి అని అభినవ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.డైరెక్టర్పై సన్నీడియోల్ ఆవేశం.. అసలు కథ2017లో మిడ్డేలో వచ్చిన వార్తా కథనం ప్రకారం.. ధర్మేంద్ర స్టార్డమ్ కోల్పోయిన సమయంలో బీ గ్రేడ్, సీ గ్రేడ్ (తక్కువ బడ్జెట్, తక్కువ క్వాలిటీతో) సినిమాలు చేశారు. అందులో కొన్ని దర్శకనిర్మాత కాంతి షా తెరకెక్కించారు. అందులో ఓ సినిమాలో ధర్మేంద్రకు గుండెపోటు వచ్చినట్లుగా నటించమన్నాడు. కానీ దాన్ని ఎడిటింగ్లో పూర్తిగా మార్చేశాడు. బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించినట్లుగా అశ్లీలంగా రీఎడిట్ చేశాడు. అశ్లీల సీన్లో ధర్మేంద్ర!మొదటగా ఈ సినిమాను పంజాబ్లో రిలీజ్ చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ధర్మేంద్ర ముసలితనంలో ఇలా ఓ అమ్మాయితో బెడ్పై కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు. దీంతో ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ఆ దర్శకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఓ కథ గురించి చర్చించుకుందాం రమ్మని దర్శకుడు కాంతిని ఆఫీస్కు పిలిపించాడు. ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టాడు.చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే? -
షారుక్ ఖాన్ కుమారుడి కోసం తరలిన అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
హాలీవుడ్ బ్యూటీకి జాక్పాట్.. ఏకంగా రూ.530 కోట్లా?
సినీ ఇండస్ట్రీలో పారితోషికాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకైతే ఏకంగా వంద కోట్లు ముట్టజెప్పాల్సిందే. కొందరు బిగ్ స్టార్స్ ఏకంగా వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే పారితోషికాలు అంత ఎక్కువగా ఉండవు. హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్లో పదిశాతం కూడా ఉండకపోవచ్చు. అలాంటిది ఒక హీరోయిన్కు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది? అది మన బాలీవుడ్ సినిమాలో ఇంతలా భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ సిడ్నీ స్వీనీ కోసం బాలీవుడ్ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. 'యుఫోరియా', 'ది వైట్ లోటస్' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న సిడ్నీ త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఈ బిగ్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.ఓ నివేదిక ప్రకారం 28 ఏళ్ల సిడ్నీ స్వీనికి ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 530 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేందుకు సంప్రదించిందని టాక్. ఒకవేళ ఆమె ఈ డీల్ అంగీకరిస్తే బాలీవుడ్ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ జరగనుందని సమాచారం. మొదట ఈ ఆఫర్ చూసి సిడ్నీ స్వీనీ ఆశ్చర్యపోయిందని ఓ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ బిగ్ డీల్కు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సిడ్నీ తరఫున ప్రతినిధులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.ప్రస్తుతం సిడ్నీ స్వీనీ 'క్రిస్టీ' అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో యూఎస్ పోరాట యోధురాలు క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఆ తర్వాత సిడ్నీ నటించిన మరో చిత్రం 'ది హౌస్మెయిడ్' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Sydney Sweeney (@sydney_sweeney) -
బాక్సాఫీస్ మాత్రమే కాదు.. ఓటీటీలోనూ సంచలనమే!
ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది.ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మనోజ్ భాజ్పాయ్ నటించిన 'ఇన్స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్తో తొమ్మిదో స్థానంలో ఉంది. -
జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా జాన్వీ కపూర్ మరో మూవీలో కనిపించనుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోమ్ బౌండ్లోనూ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా వ్యవహిరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.హౌమ్ బౌండ్ కథేంటంటే..నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
అదంతా పీఆర్ స్టంట్.. నోరు విప్పుతానని చాహల్ భయపడ్డారు: ధనశ్రీ వర్మ
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ను పెళ్లాడారు. 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరు మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేశారు. ఫిబ్రవరి అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి యుజ్వేంద్ర చాహల్ ప్రముఖ ఆర్జే మహ్వశ్తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి.అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడాకుల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. చాహల్ను తాను మోసం చేశానంటూ పలు కథనాలొచ్చాయి. తాజాగా వీటిపై ధనశ్రీ వర్మ రియాక్ట్ అయింది. ఇదంతా నెగెటివ్ పీఆర్లో భాగంగానే చేశారని విమర్శించింది. ఓ ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ అర్బాజ్ పటేల్ చాహల్ను ధనశ్రీ మోసం చేసిందని తాను విన్నానని ఆమెతో చెప్పాడు.దీనిపై ధనశ్రీ స్పందిస్తూ.. 'అలాంటి వాళ్లు నా గురించి ఇలాంటి చెత్త మాటలు వ్యాప్తి చేస్తారు. నేను నోరు తెరుస్తానేమోనని భయపడుతున్నాడు. నా నోరు మూయించడానికే ఇదంతా చేస్తున్నారు. అసలేం జరిగిందో నిజమైన వివరాలు చెబితే.. ఈ షో మీకు మరోలా అనిపిస్తుంది. ఆర్జే మహ్వశ్తో రిలేషన్పై ధనశ్రీ మాట్లాడింది. నాకు చాహల్తో విడాకులు అయిపోయాయి. అతని గాసిప్స్ గురించి నాకు అక్కర్లేదు. నా లైఫ్లో అదొక ముగిసిన అధ్యాయం. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి. ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడేలా వ్యవహరించాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి? మీరు నా గురించి ఎంత నెగెటివ్గా మాట్లాడినా దాంతో మీకెలాంటి ఊపయోగం లేదు. మీ టైమ్ వేస్ట్ తప్ప' అని పంచుకుంది. -
ఐశ్వర్య అంటే ఆ హీరోకి పిచ్చి.. ఆమె ఇంటిముందు సీన్ క్రియేట్ చేసేవాడు
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందానికి మంత్రముగ్ధులు కానివారు ఉండరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆమెను ఆరాధించారు. కొందరు ఆమెతో ప్రేమలో పడ్డారు, ఒకరిద్దరు ఆమె ప్రేమను తిరిగి పొందారు. వారిలో ఒకరే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఒకప్పుడు సల్మాన్ - ఐశ్వర్య ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. 2002లో వీరి బ్రేకప్ స్టోరీ బీటౌన్లో సంచనలంగా మారింది. సల్మాన్తో బ్రేకప్తాజాగా దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్.. ఐష్- సల్మాన్ల బ్రేకప్ గురించి మాట్లాడారు. ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్తో బ్రేకప్ అయ్యాక బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టింది. అప్పుడు తను చాలా బాధపడింది. వీటి గురించి పట్టించుకోవద్దని ఆమెకు ధైర్యం చెప్పేవాడిని. సల్మాన్ కోసం ఇండస్ట్రీ తనను వెలేయడం తట్టుకోలేకపోయింది. అయితే బ్రేకప్ తర్వాతే తను కాస్త ప్రశాంత జీవితం గడిపింది. ఎందుకంటే తను అతి ప్రేమ, కోపంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించేవాడు. తల గోడకేసి బాదుకునేవాడునేనూ అదే అపార్ట్మెంట్లో ఉండేవాడిని కాబట్టి తను వచ్చివెళ్లేది కనిపిస్తూ ఉండేది. అతడి ప్రవర్తన చూశాక.. ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటున్నావ్? అని అడిగాను. అతడు ఐశ్వర్య కోసం ఆమె ఇంటికి వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడు. తల గోడకేసి బాదుకునేవాడు. అధికారికంగా ప్రకటించే సమయానికంటే ముందే వీళ్లిద్దరూ విడిపోయారు అని చెప్పుకొచ్చారు. కాగా 2007వ సంవత్సరంలో ఐశ్వర్య.. బిగ్బీ కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు ఆరాధ్య సంతానం.చదవండి: ఒక్క డైలాగ్తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు! -
Sai Pallavi: బాలీవుడ్లో బుజ్జి తల్లి బిజీ టాలీవుడ్ లో మాత్రం..
-
కిక్ ఇచ్చేలా 'దిశా పటాని' ఫోజులు.. ట్రెండింగ్లో (ఫోటోలు)
-
'పురుషులు, మహిళలు ఓకే బెడ్పై.. బిగ్బాస్పై నటి షాకింగ్ కామెంట్స్'
బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తాజాగా ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 ఏళ్లుగా తనకు బిగ్బాస్ ఆఫర్ వస్తోందని తెలిపింది. కానీ ఈ అవకాశాన్ని తాను తిరస్కరిస్తూనే ఉన్నానని వెల్లడించింది. తనకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేసినా కూడా ఈ షోలో పాల్గొనని మేకర్స్కు తేల్చి చెప్పానని పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజైరన తనుశ్రీ దత్తా బిగ్బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా.. నా లైఫ్లో ఎప్పటికీ బిగ్బాస్లో పాల్గొనని చెప్పింది.తనుశ్రీ దత్తా మాట్లాడుతూ..'బిగ్బాస్ ఆఫర్ ప్రతి ఏటా వస్తోంది. ఈ షోలో పాల్గొనాలని మేకర్స్ తనను సంప్రదిస్తారు. ప్రతి ఏటా ఈ రియాలిటీ షో కోసం నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. ఎందుకంటే వారు మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కూడా అంతే మొత్తాన్ని ఇచ్చారు. ఆమె కూడా నా స్థాయి నటినే. అంతకంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని బిగ్బాస్ మేకర్స్లో ఒకరు ఆఫరిచ్చారు. కానీ తిరస్కరించాను. ఎందుకంటే ఈ షోలో పురుషులు, మహిళలు ఓకే బెడ్పై పడుకుంటారు. అదే ప్లేస్లో కోట్లాడుకుంటారు. నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని అని వారు ఎలా అనుకుంటారు?.. నేను అంత చీప్ కాదు. వారు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్బాస్కు వెళ్లను. నేను నా ఫ్యామిలీతోనే కలిసి ఉండనని.. తనకంటూ ప్రత్యేక స్పేస్ కోరుకునేదాన్ని' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.బిహార్కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. -
ఏడాదిగా డేటింగ్.. సీక్రెట్గా హీరోయిన్ నిశ్చితార్థం?
మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైపోయింది. బాలీవుడ్కి హ్యుమా ఖురేషి.. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏడాది నుంచి ఓ యాక్టింగ్ కోచ్తో ఈమె రిలేషన్లో ఉందని, రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా వెళ్లొచ్చారని, ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం? హ్యుమా కాబోయే భర్త ఎవరు?(ఇదీ చదవండి: నేను ధనుష్ని వెన్నుపోటు పొడవలేను: జీవీ)'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపుర్' సినిమాలతో నటిగా పరిచయమైన హ్యుమా ఖురేషి.. 2012 నుంచి హిందీలో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. మలయాళంలో వైట్, తమిళంలో అజిత 'వలిమై', రజినీకాంత్ 'కాలా' చిత్రాల్లోనూ హీరోయిన్గా చేసింది. 'మహారాణి' వెబ్ సిరీస్తోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. గత ఏడాది నుంచి యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్తో ప్రేమలో ఉందని తెలుస్తోంది. హీరోయిన్ సోనాక్షి పెళ్లికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారని, అయితే తమ రిలేషన్ గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా హ్యుమా-రచిత్ వెళ్లొచ్చారు. ఇప్పుడు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని బాలీవుడ్లో వినిపిస్తుంది. ఇది నిజమే అయినప్పటికీ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని సన్నిహితుల మాట. హ్యుమాకి ప్రస్తుతం 39 ఏళ్లు. రచిత్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్కి చెందిన కుర్రాడు. మోడలింగ్ చేసేటప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. 2016లో ముంబై వచ్చేసిన తర్వాత యాక్టింగ్ కోచ్గా మారిపోయి సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరి హ్యుమా-రచిత్.. తమ నిశ్చితార్థం నిజం ఎప్పుడు చెబుతారో చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?) -
వచ్చే నెలలో కత్రినా కైఫ్ గుడ్ న్యూస్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ను పెళ్లాడింది. 2021లో వీరిద్దరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఈ జంటపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కత్రినా గర్భంతో ఉన్నారని చాలాసార్లు కథనాలొచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.అయితే ఈసారి ఏకంగా ఈ జంటపై మరో ప్రచారం మొదలైంది. వచ్చేనెలలోనే కత్రినా కైఫ్ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోది. ప్రస్తుతం ఆమె మూడో త్రైమాసికంలో ఉన్నారని.. వచ్చేనెల లేదా నవంబర్లో బిడ్డకు స్వాగతం పలకనున్నారని నెట్టింట చర్చ మొదలైంది. కత్రినా ప్రసవం తర్వాత సుదీర్ఘంగా విరామం తీసుకోవాలని యోచిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.రెండు నెలల క్రితం కత్రినా కైఫ్ ఓవర్సైజ్ షర్ట్లో కనిపించడంతో మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్ వినిపించాయి. ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తమపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై గతంలోనే విక్కీ కౌశల్ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని.. ఏదైనా ఉంటే తామే స్వయంగా చెబుతామన్నారు. అంతేకాకుండా 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ సమయంలో కూడా కత్రినా గర్భం ధరించారని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో కూడా ఇలాంటి వార్తల్ని ఆయన ఖండించారు. అయినప్పటికీ ఈ జంటపై పలు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే కత్రినా తన కాస్మెటిక్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ మరోసారి ఆమె గర్భవతి అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా వస్తోన్న కథనాలపై కత్రినా, విక్కీ కౌశల్ క్లారిటీ ఇస్తే కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్కు చెక్ పడేలా కనిపించడం లేదు.మరోవైపు విక్కీ కౌశల్ ఈ ఏడాది ఛావాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. విక్కీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్తో కలిసి 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తున్నారు.We got #VickyKaushal - #KatrinaKaif content today, but wait a minute….. are they expecting 👩🍼? pic.twitter.com/QrhZ1z5Xnf— Bollywood Talkies (@bolly_talkies) July 30, 2025 -
ఐశ్వర్య-అభిషేక్ బాటలో ప్రముఖ నిర్మాత!
ఇటీవల బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వినియోగించకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఐశ్వర్య, అభిషేక్ తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తన పేరుతో నిధులను సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పిటిషన్ వేశారు. ఈ మేరకు కరణ్ తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతి లేకుండా తన ఫోటోలు వినియోగిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో కరణ్ పేరుతో అనధికార పేజీలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. -
మాజీ లవర్ పెళ్లికి వెళ్లి మరొకరితో ప్రేమలో.. ఫన్నీగా ట్రైలర్
ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఓ హిందీ మూవీని విడుదలకు సిద్ధం చేసింది. 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' పేరుతో తీసిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబరు 2న సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఇదో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సన్నీ(వరుణ్ ధావన్).. అనన్య (సన్య మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె ఇతడిని రిజెక్ట్ చేసి విక్రమ్(రోహిత్ షరాఫ్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. మరోవైపు విక్రమ్.. తన ప్రియురాలు తులసి(జాన్వీ కపూర్)కి బ్రేకప్ చెప్పేస్తాడు. దీంతో సన్నీ-తులసి కలిసి విక్రమ్-అనన్య పెళ్లికి వెళ్తారు. నానా హంగమా చేస్తారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్) -
సిరిసిల్లవాసి.. బాలీవుడ్లో తిరుగులేని హీరోగా స్టార్డమ్
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు. మూకీ సినిమాలుఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.బాలీవుడ్లో రాణించిన తెలుగు వ్యక్తిమంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు. జీవితంపై డాక్యుమెంటరీనటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్ -
30 ఏళ్లకే తల్లి పాత్రలా?.. ఛావా నటి ఆవేదన
ఈ ఏడాది ఛావా, ఆజాద్ చిత్రాలతో మెప్పించిన బాలీవుడ్ డయానా పెంటీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళలను ట్రీట్ చేసే విధానంపై స్పందించారు. ఇండస్ట్రీలో మహిళలను సామర్థ్యం కంటే.. కేవలం బాహ్య రూపానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. కేవలం 30 ఏళ్ల వయసులేనే ఎంతోమంది పిల్లలకు తల్లిగా నటించే పాత్రలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డయానా మహిళా నటుల పట్ల చిత్ర పరిశ్రమ వైఖరిని ప్రశ్నించింది.డయానా మాట్లాడుతూ.. 'ఉదాహరణకు ఒక వేదికపై మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు.. మీ అందం మీరు అద్భుతం ప్రశంసిస్తారు. ప్రజలు మర్యాదగా ప్రవర్తిస్తూ మీ రూపాన్ని ప్రశంసించడం చాలా బాగుంది. కానీ ఒక మహిళగా అది అంతకు మించి ఉంటుందని ఆశిస్తారు. ఒక నటిగా కేవలం అందం మాత్రమే కాకుండా.. నైపుణ్యం, నటనతో ప్రసిద్ధి చెందగలమని ఆశిస్తాం. అది మాకు చాలా అవసరం కూడా. మహిళ నటులను కేవలం బ్యూటీఫుల్, అద్భుతం అని పిలవడం మంచిదే.. కానీ అది సరిపోదు. ఇది ఒక పోరాటం కాదు. కొంతకాలంగా ఒక ఈ పద్ధతిని అంగీకరించడం ప్రారంభించారు. నేను అలాంటి దానిలో భాగం కావాలా వద్దా అనేది నా సొంత నిర్ణయం. దీన్ని ఎదుర్కోవడానికి అదే ఉత్తమ మార్గం. ఇది నాకు మాత్రమే కాదు.. అందరికీ వర్తిస్తుంది' అని పంచుకున్నారు.కాగా.. డయానా ప్రస్తుతం 'డు యు వాన్నా పార్టనర్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో తమన్నా భాటియా, జావేద్ జాఫెరి, నకుల్ మెహతా, శ్వేతా తివారీ, నీరజ్ కబీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్కు కోలిన్ డి'కున్హా, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సహ నిర్మాతలుగా ఉన్నారు. ప్రస్తుతం డు యు వన్నా పార్టనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
తమన్నా లాంటి భార్య దొరికిందని అతడు ఆనందపడాలి
దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న తమన్నా.. ఇప్పటికీ అదే ఊపు, జోష్ చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు అంతే ఉత్సాహంతో ప్రమోషన్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. నటన పరంగా ఈమె దూసుకుపోతున్నప్పటికీ.. ప్రేమ పరంగా ఈమె జీవితంలో ఓ బ్రేకప్ ఉంది. హిందీ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసుకుంది. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉంటోంది.అయితే త్వరలోనే తనకు కాబోయే అదృష్టవంతుడిని చూస్తారని తమన్నా ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయ్ వర్మతో బ్రేకప్ అయి ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు తమన్నా ఈ తరహా కామెంట్స్ చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'డూ యూ వాన్నా పార్ట్నర్' ఈరోజు(సెప్టెంబరు 12) నుంచే స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన కాబోయే భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)'మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన అదే. గత జన్మలో ఎంత పుణ్యం చేసుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. దానికోసమే నా ప్రయత్నం. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది నాకు తెలియదు. త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో?' అని తమన్నా చెప్పింది. ఈమె మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే మళ్లీ ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తోంది. ఒకవేళ రిలేషన్లో ఉంటే అతడెవరా అనేది తెలియాల్సి ఉంది.2005 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నా ఇప్పటివరకు దాదాపు 90 సినిమాలు చేసింది. అలానే పలు వెబ్ సిరీసులు కూడా చేసింది. వయసు పెరుగుతున్నా సరే అదే అందాన్ని మెంటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ యూత్ని అలరిస్తోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాదిన్నర గ్యాప్.. హీరోయిన్ చేతిలో ఇప్పుడు 8 సినిమాలు) -
మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్!
ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్నెస్పై మరింత ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.శాఖాహారిగా మారిపోయాప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్బీర్ తన లైఫ్స్టైల్లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.సినిమారామాయణ సినిమాను నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్ 2.. 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రామాయణ్తో పాటు రణ్బీర్ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్ ఆలియా భట్తో కలిసి లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది. 🚨 Ranbir Kapoor has given up smoking, drinking, and has even turned vegetarian — all in preparation for his role as Lord Ram in #Ramayana. A true embodiment of discipline and devotion. ✨🔥 pic.twitter.com/W5F3akrREK— Ramayana: The Epic (@RamayanaMovieHQ) September 7, 2025 చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి -
రైల్లో నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ (Actress Karishma Sharma) కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది.కదులుతున్న రైలు నుంచి దూకేశా'షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో చర్చ్గేట్కు వెళ్దామనుకున్నాను. స్టేషన్కు వెళ్లి ట్రైన్ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కలేదన్న విషయం గమనించాను. అప్పుడు నేను చీర కట్టుకుని ఉన్నాను. అయినా ధైర్యం చేసి దూకేయగా తలకు, వెన్నెముకకు దెబ్బ తగిలింది. MRI స్కాన్ చేశారు. కొద్దిరోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. సినిమాఈ ప్రమాదం జరిగినప్పటినుంచి నొప్పితో విలవిల్లాడుతున్నాను. మీ ప్రేమాభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి. దయచేసి నా కోసం ప్రార్థించండి' అని కోరింది. కాగా కరిష్మా శర్మ.. ప్యార్ కా పంచనామా 2, ఉజ్దా చమాన్, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ మూవీస్లో నటించింది. రాగిణి ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది. బుల్లితెరపై పవిత్ర రిష్తా, కామెడీ సర్కస్, సిల్సిలా ప్యార్ కా వంటి సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
ఆ కేసులో హీరోయిన్ హన్సికకు షాక్..!
హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోతోందంటూ రూమర్స్ గట్టిగానే వినిపించాయి. తన ఇన్స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా సోహెల్కు రెండో పెళ్లి కావడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని మరో టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హన్సిక కొట్టిపారేసింది.ఈ సంగతి అటుంచితే గతంలో హన్సికతో ఆమె తల్లి జ్యోతిలపై సోదరుడి భార్య ముస్కాన్ గృహ హింస కేసు పెట్టారు. తనను వేధింపులకు గురి చేశారని బుల్లితెర నటి ముస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే హన్సిక, ఆమె తల్లికి ముంబయి సెషన్స్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ కేసును క్వాష్ చేయాలంటూ హన్సిక బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా హన్సిక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. హన్సిక దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఈ కేసులో నిరాశే ఎదురైంది. కాగా.. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్ జేమ్స్ను 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ ఫిర్యాదు చేసింది. -
నేషనల్ అవార్డ్ విన్నర్ కొత్త సినిమా.. రేపే రిలీజ్
తొలి సినిమా 'తిథి' (కన్నడ మూవీ)తోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్ రెడ్డి మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ జుగ్నుమా (Jugnuma - The Fable film). ఈ మూవీ ద ఫేబుల్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో విడుదలైంది. ఇప్పుడు దేశీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అలరించనుంది. జుగ్నుమా కథ ఇప్పటిది కాదు! తొమ్మిదేళ్ల క్రితం హిమాలయాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు తనవంతు సాయం చేశాడు రామ్ రెడ్డి. ఆ సమయంలో ఈ కథ పురుడు పోసుకుంది. భారత్- నేపాల్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ఇందులో అడవిలో చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. మనోజ్ బాజ్పాయ్, ప్రియాంక బోస్ ప్రధాన పాత్రలు పోషించారు. బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో జుగ్నుమా ప్రదర్శితమైంది. లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది. సినిమా ప్రదర్శితమైన ప్రతి చోటా దర్శకుడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దర్శకనటుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత గునీత్ మోంగా సైతం సినిమా చూసి అభినందించారు. -
జాన్వీ కపూర్ సినీ కెరీర్ లో కొత్త మలుపు!
-
సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) గురించి ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా అవీ కూడా ఓటీటీల్లోనే నేరుగా రిలీజయ్యాయి. ఈ ఏడాది హౌస్ఫుల్ -5, కాళీధర్ లపత్తా లాంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవలే అభిషేక్ సతీమణి ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు, పేరును వినియోగించకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్న వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. ఏఐ- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య ప్రస్తావించారు.అదే బాటలో అభిషేక్ బచ్చన్..అయితే తన భార్య పిటిషన్ వేసిన 24 గంటల్లోనే అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కొన్ని వెబ్సైట్లు తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ అనధికారికంగా ఫోటోలను ఉపయోగించడంపై నిషేధం విధించాలని ఆయన అభ్యర్థించారు.దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దయచేసి ఆ వెబ్సైట్ల వివరాలు సమర్పిస్తే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని అభిషేక్ తరఫు న్యాయవాదికి సూచించారు. ఒక రోజు సమయం ఇస్తే పూర్తి వివరాలు అందజేస్తామని న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. కొందరు వ్యక్తులు ఏఐతో అభిషేక్ ఫొటోలు క్రియేట్ చేసి అశ్లీల కంటెంట్కు ఉపయోగించుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. -
చిన్నారికి అరుదైన వ్యాధి.. హీరోయిన్ ఆపన్నహస్తం
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). బాబు ఇంటికి వెళ్లి తనతో కబుర్లు చెప్పి, ఆడించి నవ్వించే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులోని బాబు తల బెలూన్లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని హైడ్రోసెఫాలస్ (Hydrocephalus) అని పిలుస్తారు. అరుదైన వ్యాధిఈ వ్యాధి వచ్చిన శిశువుల తల అసాధారణంగా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధితో ఓ బాలుడు బాధపడుతున్నాడని తెలిసి జాక్వెలిన్ చలించిపోయింది. వెంటనే అతడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి వెల్లడిస్తూ జాక్వెలిన్కు అభినందనలు తెలిపాడు. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దామని పోస్ట్ పెట్టాడు. మంచి మనసుకాగా జాక్వెలిన్ పలు స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తూ ఉంటుంది. మూగ జీవాల సంరక్షణ, పిల్లల చదువులు.. ఇలా అన్నింటికోసం పాటుపడుతూ ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని జనాల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జాక్వెలిన్.. వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hussain Mansuri (@iamhussainmansuri) చదవండి: నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్మ్యాన్ -
ఫిల్మ్ఫేర్ గ్లామర్ అవార్డ్ వేడుకలో బాలీవుడ్ బ్యూటీస్ (ఫొటోలు)
-
మా తండ్రి ఆస్తుల్లో వాటా ఇవ్వాలి.. కోర్టుకెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు
న్యూఢిల్లీ: తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు న్యాయ పోరాటం ప్రారంభించారు. తండ్రి ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. సంజయ్ కపూర్కు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మరణానికి ముందు ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆయన రాసినట్లు చెబుతున్న విల్లు నకిలీదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు ఆరో పించారు.ఆస్తులు మొత్తం కొట్టేయడానికి తమ సవతి తల్లి ప్రియా కపూర్(ప్రియా సచ్దేవ్) కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఎస్టేట్ మొత్తం ప్రియా కపూర్ కు దక్కేలా సంజయ్ కపూర్ విల్లు రాసినట్లు సమాచారం. అయితే, ఆ విల్లును కుట్ర పూరితంగా సృష్టించారని, అది నిజమైన విల్లు కాదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు తేల్చిచెప్పారు. దాని గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియా కపూర్ కానీ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఇప్పుడు ప్రియా కపూర్ దురుద్దేశంతోనే హఠాత్తుగా నకిలీ విల్లును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. సంజయ్ కపూర్కు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టేలా ప్రియా కపూర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు.ఏమిటీ వివాదం? ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు. 1996 నుంచి 2000 సంవత్సరం దాకా వారు కలిసున్నారు. విడాకుల తర్వాత సంజయ్ కపూర్ 2003లో కరిష్మా కపూర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ ఉన్నారు. 2016లో అభిప్రాయభేదాల వల్ల సంజయ్ కపూర్, కరిష్మా విడిపోయారు. అనంతరం 2017 ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ 12న హఠాత్తుగా మృతిచెందిన సంగతి తెలిసిందే.లండన్లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగ దూసుకెళ్లింది. దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని సంజయ్ తల్లి రాణి కపూర్ యూకే ప్రభుత్వాన్ని కోరారు. సంజయ్ మరణం తర్వాత ఆయన ఆస్తులపై వివాదం మొదలైంది. రెండో భార్య సంతానం, మూడో భార్య మధ్య పోరాటం సాగుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రియా సచ్దేవ్గానే ఉన్న మూడో భార్య ఇటీవలే తన పేరును ప్రియా కపూర్గా మార్చుకోవడం గమనార్హం. అంతేకాకుండా తన అత్త రాణి కపూర్పై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ప్రియా కపూర్పై ఆరోపణలు వస్తున్నాయి. -
రూ.80 కోట్ల మోసం.. ఆ డెరెక్టర్ పెద్ద మోసగాడు: ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ సంచలన ఆరోపణలు చేశారు. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ తనను మోసం చేశారంటూ కామెంట్స్ చేశారు. సినిమా నిర్మాణంలో దాదాపు రూ.80 కోట్ల వరకు అవతవకలకు పాల్పడారంటూ ఆరోపించారు. అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా నిర్మించే సమయంలో తన ఫేక్ కంపెనీతో మనీ లాండరింగ్కు పాల్పడ్డాడని వాసు భగ్నానీ వెల్లడించారు.తన ఫేక్ కంపెనీ పేరుతో ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబుదాబిలో రిజిస్టర్ చేసిన కంపెనీ పేరుతో.. ముంబయిలో జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ పేరుతో మనీలాండరింగ్ చేశాడని అన్నారు. సినిమా బడ్జెట్ను దాదాపు రూ. 80 కోట్లు పెంచారని భగ్నాని వెల్లడించారు. ఆఖరికి నటీనటుల పారితోషికం తగ్గించినా భారీ మోసం కావడంతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేవలం నా డబ్బును తిరిగి పొందడం మాత్రమే కాదు. మరే ఇతర నిర్మాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని నిజం బయటకు రావాలని పోరాడుతున్నట్లు వాసు భగ్నానీ అన్నారు.నిర్మాత వాసు భగ్నానీ మాట్లాడుతూ.. 'అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా.. ఏఏజెడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారు. మేము బడే మియాన్ చోటే మియాన్ మూవీ కోసం వారితో జతకట్టా. నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక సహాయం కూడా చేశా. వారికి దర్శకత్వాన్ని బాధ్యతలు అప్పగించా. సృజనాత్మక నిర్ణయాలలో తాను పెద్దగా జోక్యం చేసుకోలేదని.. లండన్తో పాటు ఇండియాలో జాఫర్ సూచించిన షూటింగ్ ప్రదేశాలను ఆమోదించా. అయితే రెండు నెలల క్రితమే జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ సంస్థ గురించి తెలుసుకున్నా. అది జాఫర్ సహాయకుడి పేరుతో రిజిస్టర్ చేశారు. ఇదంతా బయటికి రాకుండా రహస్యంగా నిర్వహించారు. సినిమా ఖర్చులను పెంచడం, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు" అని అన్నారు. కాగా.. గతంలో బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టామని ఆవేదన చెందారు. -
రూ.30 వేల కోట్లు కొట్టేసే ప్లాన్.. సవతి తల్లిపై హీరోయిన్ పిల్లలు ఆరోపణ
బాలీవుడ్లో మరో ఆస్తి వివాదం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. తమకు సవతి తల్లి ఫేక్ వీలునామా ఇచ్చిందని ఈ పిల్లలిద్దరూ ఆరోపణ చేస్తున్నారు. తండ్రి ఆస్తిలో తమ వాటా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరుగుతోంది?బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. 2003లో సంజయ్ కపూర్ అనే బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. అప్పటికే అతడికి ఓసారి పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. అంటే కరిష్మా రెండో భార్య. దాదాపు 13 ఏళ్ల పాటు ఈమెతో కలిసున్న సంజయ్.. 2016లో విడాకులు ఇచ్చేశాడు. వీళ్లకు సమైరా, కియాన్ అని ఇద్దరు పిల్లలు. కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్.. ప్రియ సచ్దేవ్ని వివాహమాడాడు.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)ఈ ఏడాది జూన్లో సంజయ్ కపూర్.. గుండెపోటుతో చనిపోయాడు. అప్పటినుంచి తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు అంటున్నారు. ఇటీవల జరిగిన ఫ్యామిలీ మీటింగ్లోనూ నకిలీ వీలునామా చూపించిందని, తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పేందుకు గానీ సంబంధిత డాక్యుమెంట్స్ చూపించేందుకు గానీ ఆమె నిరాకరిస్తోందని పేర్కొన్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాని ఇప్పించాలని కోర్టుని ఆశ్రయించారు.సంజయ్ కపూర్ రాసిచ్చిన అసలు వీలునామా దాచిపెట్టి నకిలీది సవతి తల్లి ప్రియ తమకు చూపించిందనేది కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ. మరోవైపు ప్రియ సచ్దేవ్తో పాటు పలువురు వ్యక్తులు బలవంతంగా తమ తల్లి నుంచి సంతకాలు తీసుకున్నారని సంజయ్ సోదరి మందిర కపూర్ మీడియాకు చెప్పింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ మరణించే నాటికి అతడి ఆస్తి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు అని సమాచారం.(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్) -
అతని కోసం రూ.70 లక్షలు వదులుకున్న శ్రీదేవి: బోనీ కపూర్
దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల కొన్ని దశాబ్దాల పాటు సినీ ప్రియులను అలరించింది. వెండితెరపై తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. కానీ ఊహించని విధంగా 2018లోనే ఓ హోటల్లో మరణించింది. ఆమె చివరిసారిగా నటించిన చిత్రం మామ్. ఆమె భర్త బోనీ కపూర్ నిర్మాతగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మామ్ కోసం శ్రీదేవి చాలా కష్టపడిందని అన్నారు. ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వర్షన్స్కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందని తెలిపారు. ఈ మూవీ కోసం తన రెమ్యునరేషన్ సైతం వదులుకుందని వెల్లడించారు.బోనీ మాట్లాడుతూ.. "మామ్ షూటింగ్ సమయంలో మేము ఏఆర్ రెహమాన్ను తీసుకోవాలనుకున్నాం. కానీ అతనికి భారీగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అంత ఖర్చు మేం భరించలేకపోయా. శ్రీదేవి రెమ్యునరేషన్ కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టాం. కానీ ఆమె నాకు బ్యాలెన్స్ డబ్బులేవీ వద్దు. ఆ మిగిలిన మొత్తం రూ.70 లక్షలు రెహమాన్కు ఇచ్చిన తీసుకురావాలని చెప్పిందని' గుర్తు చేసుకున్నారు.అంతేకాకుండా మామ్ షూటింగ్ సమయంలో తనతో గది పంచుకోవడానికి కూడా శ్రీదేవి నిరాకరించిందని బోనీ కపూర్ వెల్లడించారు. సినిమా పట్ల అంత నిబద్ధతగా పనిచేసిందని తెలిపారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో.. ఆ తర్వాత జార్జియాలో చిత్రీకరించామన్నారు. సినిమా షూటింగ్ మొత్తం కాలంలో శ్రీదేవి ఎప్పుడూ గది పంచుకోలేదని వివరించారు. తన మైండ్సెట్ డైవర్ట్ కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆమె ఆ పాత్ర పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిందని పంచుకున్నారు.కాగా.. ఇటీవల ఐఫా రజతోత్సవ వేడుకల సందర్భంగా బోనీ కపూర్.. మామ్ మూవీకి సీక్వెల్ను ప్రకటించారు. ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశముందని బోనీ అన్నారు. కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కూడా నటించారు. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.175 కోట్లు వసూలుచేసింది. -
హీరో కుటుంబంతో కలిసి శ్రీలీల పండగ సెలబ్రేషన్స్
శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈమెపై రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్తో ఈమె డేటింగ్లో ఉందని అంటున్నారు. అందుకు తగ్గట్లు పలుమార్లు కలిసి కనిపించడం పుకార్లకు ఊతమిస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?శ్రీలీల ఇప్పటివరకు పలువురు హీరోలతో కలిసి పనిచేసింది. కానీ కార్తిక్ ఆర్యన్తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం సోదరి డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా కార్తిక్ ఆర్యన్ ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో కార్తిక్ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కనిపించారు. అలానే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తిక్ తల్లి.. తమకు డాక్టర్ చదువుకొన్న కోడలు రావాలనుకుంటున్నానని చెప్పింది. శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. కార్తిక్ తల్లి ఈమె గురించి మాట్లాడిందా అనేది క్వశ్చన్ మార్క్.(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్)ఇకపోతే ఇప్పుడు ముంబైలోని కార్తిక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరగ్గా.. శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా హాజరైంది. అయితే ఇది పార్టీ గెదరింగ్ లేదంటే తమ రిలేషన్ని కార్తిక్-శ్రీలీల పరోక్షంగా బయటపెడుతున్నారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం వీళ్లిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది ఇది రిలీజ్ కానుంది. మరి కార్తిక్ ఆర్యన్-శ్రీలీలది ఫ్యామిలీ బాండింగా లేదంటే డేటింగ్ అనేది తెలియాలంటే వీళ్లలో ఎవరో ఒకరు నోరు విప్పాలి.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా) -
జపనీస్ అమ్మాయిలా రష్మిక.. ముంబై స్క్రీనింగ్లో
యనిమే అభిమానుల కోసం క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంయుక్తంగా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్' సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ముంబైలో యనిమే అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. హీరోయిన్ రష్మిక, హీరో టైగర్ ష్రాఫ్ కూడా సందడి చేశారు.(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)రష్మిక.. టాంజిరో, నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా ఉండే ప్రత్యేక జపనీస్ డ్రస్సులో కనిపించింది. రష్మిక కూడా అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి అడిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో 'అకాజా vs గియు మరియు టాంజిరో' ఫైట్ సీక్వెన్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. మన దేశంలో దాదాపు 750కి పైగా స్క్రీన్స్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఓ యనిమే మూవీకి ఇంతలా రిలీజ్ దక్కుతుండటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్తోనూ ఈ మూవీ ఉండనుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
పిల్ల తెమ్మెర... హోరు గాలి ఆశా భోస్లే స్వరం!
'ఓ హసీన్దర్ద్దేదో జిసే మై గలే లగా లూ' అంటారు ఆశా భోస్లే ఓ పాటలో. ఆ పాట సందర్భం ఏదైనా ‘హసీన్ దర్ద్’ అనే మాట ఎంత బావుందో కదా. అది ఆశాజీ స్వరానికి చక్కగా సరిపోతుంది. ఆవిడ తన పాటతో మనందరికి అలాంటి అందమైన బాధనే కదా పుట్టిస్తారు. ఇంకో పాటలో 'దిల్చీజ్క్యా హై ఆప్మేరీ జాన్లీజియే' అంటారు. నిజమే ఆవిడ గొంతుక అంటే పడి చచ్చేవాళ్లంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఇది మీ కోసం మా గుండెలే కాదు ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని! ఈ పాట ఆశ పాడిన గొప్ప పాటల్లో ఒకటి. షహరయార్ రచన, ఖయ్యాం సంగీతం, రేఖ అభినయం ఒక ఎత్తు అయితే ఆశా భోంస్లే స్వరం ఒక్కటే ఒక ఎత్తు. అందుకే ఈ పాట ఆశాజీకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. దీంతో పాటు ఆవిడ మరో పాటకు కూడా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పాట చాలా విలక్షణమైనది సాహిత్యపరంగా, సంగీతపరంగాను!అదే 'మేరా కుఛ్ సామాన్... తుమ్హారే పాస్ పడా హై' సాంగ్ గుల్జార్ దర్శకత్వం వహించిన ఇజాజత్ సినిమాలోనిది. ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారని వేరే చెప్పాలా? ఇజాజత్ 1987లో రిలీజైంది. ఆర్డీ బర్మన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఓరోజు గుల్జార్ ఒక పాటకి లిరిక్స్ రాసి రికార్డింగ్కి పట్టుకెళ్లారు. ఆ లిరిక్స్ చూసి బర్మన్ దా ఇది పాట సాహిత్యమా లేక న్యూస్ పేపరా అని అడిగారు. గుల్జార్ మౌనంగా ఉండిపోయారు. ఆ పాట పాడాల్సిన ఆశా భోస్లే లిరిక్స్ చేతికి తీసుకుని మెల్లగా హమ్ చేస్తూపోయారు. అది వింటున్న బర్మన్ దాకి ఏదో స్ఫురించింది. అంతే! పదిహేను నిముషాల్లో బాణీ కట్టేశారు. అలా పుట్టిందే మేరా కుఛ్ సామాన్ అనే పాట!ఈ పాట లిరిక్స్నిజంగానే పైకి ప్లెయిన్గా కనిపిస్తాయి. కానీ తరచి చూస్తే ఆ పదాల్లో ఎంతటి అర్థం దాగుందో తెలుస్తుంది. సుతిమెత్తగా ఉన్నట్లు కనిపించినా ఈ పాట బాణీ చాలా కష్టమైంది. ఆలాపన మొదలుకొని చివరి దాకా ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది. పల్లవి, చరణం లాంటి సంప్రదాయ పద్ధతులు కనిపించవు. ఈ పాట పాడ్డం అప్పట్లో ఆశా భోస్లేకి పెద్ద సవాలుగా తోచింది. మాధుర్యం చెడకుండా మంద్రస్థాయి నుంచి తారస్థాయికి.. అక్కడి నుంచి మళ్లీ మధ్యమస్థాయి, మంద్రస్థాయులకు ప్రయాణిస్తూ ఆశా ఈ పాటకు పూర్తి న్యాయం చేశారు. మధ్యమధ్యలో మాటలు, విరక్తి నవ్వులు కూడా వినిపించారు. ఇంత బాగా పాడినందుకు ఆవిడకు, అంత విభిన్నంగా రాసినందుకు గుల్జార్కి 1988 సంవత్సరానికిగాను జాతీయ అవార్డులు దక్కాయి. ఈ పాట విన్నప్పుడల్లా ఆర్డీ బర్మన్తో గడిపిన రోజులే గుర్తొస్తాయని ఆశా భోస్లే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఈ పాటంటే ఆవిడకి ప్రాణమట!1933లో సెప్టెంబర్ 8న పుట్టిన ఆశా భోస్లే అక్క లతా మంగేష్కర్సాయంతో సినిమాల్లో పాడడం మొదలుపెట్టినా తొందరలోనే తనకంటూ ఒక స్టైల్ క్రియేట్చేసుకున్నారు. మత్తుగా, గమ్మత్తుగా పలికే ఆమె స్వరానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ఉంది. ‘ఆయియే మెహర్బాన్’ అంటూ ఒక పాటలో కవ్విస్తే ‘ఓ మేరే సోనారే’ అంటూ మరో పాటలో మురిపిస్తారు. ‘హరే రామ హరే కృష్ణ’లోని ‘దమ్మారో దమ్’ అనే రాక్ నంబర్ పాడినా ‘ఉమ్రావ్జాన్లోని ‘ఇన్ఆంఖోంకీ మస్తీ కే’ అనే ఘజల్ ఆలపించినా ఆశా స్టైల్ దేనికదే ప్రత్యేకం. హెలెన్కోసం ‘పియా తూ అబ్తో ఆజా’ మొదలుకొని చాలా పాటలే పాడారూ ఆశాజీ. ఆ పాటలన్నీ ఎవర్గ్రీన్హిట్సే! ఏ మేరా దిల్ యార్కా దివానా, ఓ హసీనా జుల్ఫోవాలీ లాంటి డాన్స్నంబర్స్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? 90స్ తర్వాత ఎ. ఆర్. రహమాన్ ఆశా భోస్లేకి మంచి హిట్స్ ఇచ్చారు. రంగీలా టైటిల్ సాంగ్, ‘తన్హా తన్హా’ పాటలు ఆవిడ వర్సటాలిటీకి అద్దం పడతాయి. ఇక 2001లో విడుదలైన ‘లగాన్’లోని ‘రాధ కైసే న జలే’ అనే పాటయితే జనం గుండెల్లో అలా నిలిచిపోయింది.అన్నట్లూ ఆశాజీ మన తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చిన్ని కృష్ణుడు’ సినిమాలోని ‘జీవితం సప్త సాగర గీతం’ అన్న ఆర్డీ బర్మన్ కంపోజిషన్ ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. ఇక ‘చందమామ’ సినిమా కోసం కె.ఎం. రాధాకృష్ణన్పాడించిన ‘నాలో ఊహలకు’ అనే పాట ఎంత హాయిగా, లయబద్ధంగా సాగిపోతుందో వేరే చెప్పాలా? ఆశా భోస్లే స్వరం మెత్తగా లాలించే పిల్ల తెమ్మెరే కాదు గుండెను పట్టి కుదిపేసే హోరుగాలి కూడా, మెల్లగా సాగే సెలయేరే కాదు, ఉవ్వెత్తున దూకే జలపాతం కూడా. ఆ స్వర ప్రవాహంలో తడిసి ముద్దవడం తప్ప సామాన్య శ్రోతలుగా మనమింకేం చేయగలం?-శాంతి ఇశాన్ -(సెప్టెంబర్ 8 ఆశా భోస్లే పుట్టినరోజు సందర్భంగా) -
సల్మాన్ ఖాన్ ఓ గూండా.. బాలీవుడ్ దర్శకుడు సంచలన కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఇతడు సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. అలాంటిది ఇతడిపై ఓ బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఓ గుండా, అతడికి నటన అంటే అసలు ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదా కోసమే మూవీస్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)తెలుగులో 'గబ్బర్ సింగ్' మూవీ పెద్ద హిట్. దాని ఒరిజినల్ చిత్రం 'దబంగ్'. 2010లో రిలీజైన ఈ హిందీ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకుడు. ఇతడు అనురాగ్ కశ్యప్కి అన్నయ్య. అయితే సల్మాన్తో ఈ మూవీ చేసిన తర్వాత అభినవ్.. ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడు. అయితే దీనికి సల్మాన్, అతడి కుటుంబమే కారణమని గతంలోనే అభినవ్ ఆరోపించాడు. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు.'2010లో 'దబంగ్' సీక్వెల్ చేయమని సల్మాన్ కుటుంబం నన్ను అడిగింది. దానికి నేను నో చెప్పాను. అప్పటినుంచి నాపై పగ పెంచుకున్నారు. సల్మాన్కి నటనపై ఆసక్తి లేదు. 25 ఏళ్లుగా అతడు నటించడం లేదు. సెలబ్రిటీగా ఉండటానికే సెట్కి వస్తాడు. అతడొక గూండా. పగ-ప్రతీకారంతో రగిలిపోయే ఓ అసభ్యకరమైన వ్యక్తి. వారు చెప్పిన మాట కాదంటే వెంటాడి మరీ వేధిస్తాడు. వారందరూ రాబందులు. సల్మాన్ మాత్రమే కాదు బోనీ కపూర్ కూడా అలాంటోడే. నా తమ్ముడు అనురాగ్తో బోనీ అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతడి సినిమా నుంచి అనురాగ్ బయటకొచ్చేశాడు. ఈ రాబందుల గురించి ముందే నా తమ్ముడు చెప్పాడు' అని అభినవ్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా) -
పోటీకి సై
వచ్చే ఈద్ పండక్కి బాక్సాఫీస్ ఫైట్కి సై అంటున్నారు అజయ్ దేవగణ్, రణ్బీర్ కపూర్. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాల్ 4’. రితేష్ దేశ్ముఖ్, సంజయ్ మిశ్రా, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకరియా నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ పండక్కి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక మరోవైపు ‘లవ్ అండ్ వార్’ సినిమాను ఈద్ పండగ సందర్భంగా 2026 మార్చి 20న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలోనే వెల్లడించారు ఈ చిత్రదర్శక–నిర్మాత సంజయ్లీలా భన్సాలీ. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరి... బాక్సాఫీస్ వద్ద వచ్చే ఈద్కి రణ్బీర్ది పై చేయి అవుతుందా? లేక అజయ్ దేవగణ్ హిట్ అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
పేరుకే ఫ్రాంచైజీ.. అన్నీ మన రీమేక్లే
ఒకప్పుడు రీమేక్ అంటే బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత బాగా తీసినా సరే జనాలు.. ఒరిజినల్తో పోల్చి చూస్తున్నారు. దీంతో గత కొన్నేళ్లలో పలు భాషల్లో వచ్చిన, వస్తున్న రీమేక్స్ అన్నీ ఫ్లాప్స్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం హిందీలోనూ 'బాఘీ 4' పేరుతో ఓ మూవీ రిలీజైంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం కూడా రీమేక్ అనే సంగతి బయటపడింది.(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?)ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా టైగర్ ష్రాప్.. ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'హీరో పంతి' అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇది యావరేజ్ అనిపించుకుంది. టైగర్ యాక్ట్ చేసిన తొలి మూవీ ఓ రీమేక్. అల్లు అర్జున్ 'పరుగు' చిత్రమే ఇది. అలానే టైగర్ ష్రాఫ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది 'బాఘీ' ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఇందులో నాలుగు మూవీస్ రిలీజ్ కాగా అవన్నీ దక్షిణాది చిత్రాల ఆధారంగా తీసిన రీమేక్స్. కాకపోతే ఎక్కడా అధికారికంగా ఇది దీని రీమేక్ అని టీమ్ చెప్పలేదు.బాఘీ.. ప్రభాస్ 'వర్షం' రీమేక్, బాఘీ 2.. అడివి శేష్ 'క్షణం' రీమేక్, బాఘీ 3.. తమిళ చిత్రం 'వెట్టై' రీమేక్, తాజాగా రిలీజైన బాఘీ 4.. తమిళ మూవీ 'ఐతు ఐతు ఐతు'కి రీమేక్. ఇలా పేరుకే యాక్షన్ ఫ్రాంచైజీ అని పెట్టుకున్నారు కానీ నచ్చిన రీమేక్స్ని ఇష్టమొచ్చినట్లు మార్చేసి తీసిపడేస్తున్నారు. మొదటి భాగానికే ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే వరసగా సీక్వెల్స్ తీస్తూనే ఉన్నారు. తాజాగా రిలీజైన నాలుగో భాగానికి కూడా ఏ మాత్రం పాజిటివ్ రివ్యూలు రాలేదు. టాప్ ఇంగ్లీష్ వెబ్ సైట్స్ అన్నీ 1 రేటింగ్ ఇచ్చాయి. మరి ఇప్పటికైనా టైగర్.. బాఘీ ఫ్రాంచైజీని ఆపుతాడా? లేదంటే త్వరలో ఐదో పార్ట్తో వస్తాడా? అనేది చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?) -
బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ హఠాన్మరణం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’, రాణీ ముఖర్జీ లీడ్ రోల్ పోషించిన ‘మర్దానీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘ఏక్ విలన్’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ వారంగ్. హిందీ సినిమాల్లోనే కాదు... మరాఠీ చిత్రాల్లోనూ నటించారాయన. ఆశిష్ వారంగ్ మృతిపై పలువురు నటీనటులు, దర్శకులు, సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే... ఆయన మృతికి కారణం ఏంటి? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
దృశ్యం నటుడు కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇక లేరు. హిందీలో దృశ్యం, సూర్యవంశి వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆయన శుక్రవారం మరణించారు. నటుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆశిష్ (Actor Ashish Warang) మరణ వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు షాకవుతున్నారు. దర్శకనిర్మాత అరిణ్ పాల్ సోషల్ మీడియా వేదికగా నటుడి మృతి పట్ల సంతాపం ప్రకటించాడు. మృదుస్వభావిఆశిష్ చనిపోయారని తెలిసి షాకయ్యాను. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించినందుకు గర్వంగా ఉంది. ఆయన మృదుస్వభావి, కళపట్ల అంకితభావంతో మెదిలేవాడు. ప్రతి సీన్లోనూ ప్రాణం పెట్టి యాక్ట్ చేసేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. కాగా ఆశిష్.. అక్షయ్కుమార్ 'సూర్యవంశీ', అజయ్ దేవ్గణ్ 'దృశ్యం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాణి ముఖర్జీ 'మర్దానీ' సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లోనూ యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Arin Paul (@arinpaul) చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న స్పై సిరీస్.. రెండు కథలు ఒకటే! -
రాజమౌళిపై బాలీవుడ్ నిర్మాత అంతమాట అనేశాడేంటి..!
-
అమ్మాయిలూ.. ప్రెగ్నెంట్ అవడం ఈజీ!: బాలీవుడ్ నటి
అన్నీ అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? కష్టసుఖాల్నే కాదు ఇంటిపనినీ సమంగా పంచుకుంటాడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు. భార్యకు అన్నివిధాలుగా అండగా ఉండే ఇతడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. రాజ్కుమార్ భార్య, నటి పాత్రలేఖ (Patralekha) జూలై నెలలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అయితే అంతకన్నా ముందు ఆమె తన ఎగ్స్ (అండాలను) భద్రపరిచింది.ప్రెగ్నెన్సీయే సులువుఈ విషయం గురించి పాత్రలేఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట నేను నా అండాలను భద్రపరిచాను. కానీ, ఇప్పుడు వాటి సాయం లేకుండా సహజంగా గర్భం దాల్చాను. నాకు తెలిసినంతవరకు ఎగ్స్ భద్రపరచడం కన్నా ప్రెగ్నెన్సీయే ఈజీ అనిపిస్తోంది. ఎగ్స్ ఫ్రీజ్ చేసే ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటుంది. దాని గురించి మా డాక్టర్ ముందుగా మాకెటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ప్రక్రియ అయిపోయాక నాకు తెలియకుండానే కాస్త డల్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే.. అమ్మాయిలూ, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి బదులు ప్రెగ్నెంట్ అవడానికి ట్రై చేయండి. కిట్లో నెగెటివ్ రిజల్ట్నేను సహజంగా గర్భం దాల్చాను. నిజానికి ప్రెగ్నెన్సీ కిట్లో కూడా నెగెటివ్ ఫలితమే చూపించింది. ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్ను కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ విషయం బయటపడింది. మూడు నెలలవరకైనా ఈ విషయం బయటకు చెప్పకూడదనుకున్నాం. కానీ గతేడాది డిసెంబర్లో ఓ ఈవెంట్కు వస్తామని రాజ్, నేను ఓ ఈవెంట్కు మాటిచ్చాం. సడన్గా రామని హ్యాండిస్తే మాట పోతుందని ఏప్రిల్లో ఆ ఈవెంట్కు వెళ్లాం. దానికంటే ముందు నెలలో అంటే మార్చిలో నేను గర్భం దాల్చాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే! -
లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే!
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) లగ్జరీ ఫ్లాట్ అమ్మేసింది. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ను గత నెలలో విక్రయించింది. దాదాపు 182 గజాల వైశాల్యంలో ఉన్న తన ఫ్లాట్ను రూ.5.30 కోట్లకు అమ్మింది. గతంలో అంటే 2018లో మలైకా ఇదే ఫ్లాట్ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐదున్నర కోట్లకు విక్రయించింది. అంటే దాదాపు రెండు కోట్ల మేర లాభాలను ఆర్జించింది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. మలైకా అరోరా చయ్య చయ్య పాటతో సెన్సేషనల్ అయింది. హిందీలో అనేక స్పెషల్ సాంగ్స్లో తళుక్కుమన్న ఆమె తెలుగులో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి ఐటం సాంగ్స్తో అలరించింది. బుల్లితెరపై జలక్ దిక్లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది.థామాలో స్పెషల్ సాంగ్ప్రస్తుతం రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న థామ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. మ్యాడ్డాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్లో నాలుగో చిత్రంగా ‘థామా’ తెరకెక్కుతోంది.చదవండి: అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత -
అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.310 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహ మూవీ (Mahavatar Narsimha). అటు బాలీవుడ్లో కొత్తవారితో తీసిన సయారా చిత్రం ఏకంగా రూ.580 కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే! అయతే కొత్తవారితో తీసిన ప్రతి సినిమా సయారాలా సెన్సేషన్ హిట్ అందుకోలేదంటున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్.. ఎందుకు?తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ (Karan Johar) విడుదల చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. అక్కడ.. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడానికి పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం లేదా స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఏది కారణం? అని ఓ ప్రశ్న ఎదురైంది.ఎవర్నీ తప్పుపట్టలేంఅందుకు కరణ్ స్పందిస్తూ.. ప్రతి సినిమాకు దాని ఫలితం ముందే రాసిపెట్టి ఉంటుంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టయిన రోజులున్నాయి. కాకపోతే పరిస్థితులు సరిగా లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. అలాగే కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు అవి సక్సెస్ అయిన రోజులున్నాయి, అలాగే ఫెయిలైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.దరిదాపుల్లోకి కూడా రాలేవ్సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.చదవండి: సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ! -
'రాజమౌళి సార్ మాస్టర్ అయితే.. మేమంతా విద్యార్థులం'.. నిర్మాత కామెంట్స్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియన్ సినిమాకు ఆయన ఒక బెంచ్ మార్క్ అని అన్నారు. ఆయనతో పోల్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజమౌళి అంటే నాకు గౌరవమని కరణ్ జోహార్ వెల్లడించారు. ఒక సినిమాను మరో మూవీతో పోల్చవద్దన్నారు. టాలీవుడ్ మూవీ మిరాయ్ ఈవెంట్కు హాజరైన ఆయన.. దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి సార్ ఒక మాస్టర్ అయితే.. మేమంతా ఆయన దగ్గర నేర్చుకునే శిష్యులమని కరణ్ జోహార్ అన్నారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో విజువల్ వండర్ మూవీ మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించనుంది.ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. -
రెండో భర్తతో విడాకులు.. ఆ విషయంలో వదిలిపెట్టేది లేదన్న బుల్లితెర నటి!
బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ చెప్పాల్సిన పనిలేదు. సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదటి భర్తతో విడిపోయినా ఆమె.. రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్ను రెండో పెళ్లి చేసుకోగా.. ఆతర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు. 2023లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కగా కొన్ని నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దల్జీత్ కౌర్ తన విడాకులపై మరోసారి మాట్లాడింది. తన మాజీ భర్త నిఖిల్ పటేల్పై విమర్శలు చేసింది. విడిపోయాక తన లైఫ్లో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను పంచుకుంది. ఈ విషయంలో నిఖిల్ పటేల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ విషయంలో మాత్రం తాను మౌనంగా ఉండనని స్పష్టం చేసింది. అతను క్షమాపణ చెప్పేవరకు పోరాటం చేస్తానని దల్జీత్ కౌర్ తెలిపింది.దల్జీత్ కౌర్ మాట్లాడుతూ.. 'పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నా లైఫ్లో మళ్లీ ఇలా జరగడం చాలా కోపం తెప్పించింది. ఈ విషయంలో తాను మౌనంగా ఉండనన్న విషయం నిఖిల్ తెలుసుకోవాలి. అతను నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ విషయంలో నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా. నాకు అతని వద్ద నుంచి క్షమాపణ రావాలి. దానికోసం ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్తా ' అని అన్నారు.కాగా.. నిఖిల్తో పెళ్లి తర్వాత కెన్యా వెళ్లిన ఆమె కేవలం పది నెలలకే ఇండియాకు తిరిగొచ్చింది. తన కుమారుడితో సహా వచ్చిన తర్వాత అతనిపై తీవ్ర విమర్శలు చేసింది. నిఖిల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అతనికి మరొకరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని..తనను మానసిక వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత నిఖిల్ తన స్నేహితురాలు సఫీనా నాజర్తో కూడా ముంబయిలో కనిపించారు.2009లో మొదటి పెళ్లి..కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కావడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. -
ప్లాన్ వరల్డ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్లో ఉన్న చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.తెలుగు సినిమా హీరోలు, దర్శక–నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కన్నడ వంటి సినీ పరిశ్రమలు కూడా హాలీవుడ్ మార్కెట్పై దృష్టి సారించాయి. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కాగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలను దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్తో రూ పొందిస్తున్నామని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం ఈ సినిమా తీసి పోదని ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ఓ సందర్భంలో తెలిపారు.అలాగే విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా ‘రామాయణ’ సినిమాను తీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ‘రామాయణ’ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ‘రామాయణపార్ట్ 1’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి, ‘రామాయణపార్ట్ 2’ చిత్రం ఆపై వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.ఇంకా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కొన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ వెర్షన్స్ను కూడా రిలీజ్ చేయనున్నాయి. ఈ విధంగా విదేశీ మార్కెట్పై భారతీయ ఫిల్మ్మేకర్స్ దృష్టి పెట్టారు. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబరు 2న విడుదల కానుండగా, ‘టాక్సిక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.అవతార్ను మించి..! హాలీవుడ్లో ప్రంపచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చెప్పుకునే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటివి దాదాపు వంద దేశాల్లో విడుదలయ్యాయి. అలాంటిది హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) మాత్రం అంతకు మించి, 120కిపైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదని.ఇంకా చెప్పాలంటే... హాలీవుడ్ చిత్రాలకే పోటీగా నిలుస్తున్న సినిమా ఇది. పైగా ఈ సినిమా అప్డేట్స్కి కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ ‘ఎస్ఎస్ఎమ్బీ29’ సినిమా ఫస్ట్ లుక్ను ‘టైటానిక్, అవతార్’ వంటి మూవీస్ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.నవంబరులో తన సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్లో భాగం దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని, ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయించేలా రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా చేస్తే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ రీచ్ గ్లోబల్ స్థాయిలో ఉంటుందన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. ⇒ ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. ఈ చిత్ర హీరో మహేశ్బాబుతోపాటుగా ఇతర ప్రధాన తారాగణం ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్పాల్గొంటుండగా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్లు అని, ఈ సినిమాకు ‘జెన్ –63’ అనే టైటిల్ను అనుకుంటున్నారని, దాదాపు 20కిపైగా భాషల్లో ఈ సినిమాను అనువదించి, 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఫారిన్ స్పిరిట్ ప్రభాస్ ది ఇంటర్నేషనల్ హీరో కటౌట్. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, కల్కి2898 ఏడీ’ వంటి చిత్రాలు జపాన్ దేశంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్, టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ‘స్పిరిట్’ను భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘స్పిరిట్’ చిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇంకా ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలు కాలేదు. రిలీజ్ సమయానికి ‘స్పిరిట్’ మరిన్ని విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు.ఇక ఈ చిత్రంలో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లుగా ఈ చిత్రదర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇంకా ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ విలన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డాన్ లీతో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో..‘స్పిరిట్’ చిత్రంలో డాన్ లీ, శ్రీకాంత్ ఏమైనా భాగం అయ్యారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.గ్లోబల్ డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారన్నది ఆ వార్తల సారాంశం. ఇందుకు తగ్గట్లుగానే ఈ ‘డ్రాగన్’ కోసం ఇంటర్నేషనల్ కనెక్ట్విటీ ఉండే ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్స్ నవంబరులో ప్రారంభం అవుతాయట. మరి... ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకుని, ఇంటర్నేషనల్ లొకేషన్స్లో చిత్రీకరణకు ప్లాన్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటారా? ‘డ్రాగన్’ టీమ్ ఈ దిశగా ఆలోచిస్తోందట. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.ఇదిలా ఉంటే... ‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్చరణ్ మరో హీరో) చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ ప్రమోషన్స్లో ఉత్సాహంగాపాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్త సినిమా ఆడియన్స్కు ఎన్టీఆర్ గురించి ఓ అవగాహన ఉంది.ఇంటర్నేషనల్ పెద్ది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాక పోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాషవారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో ‘మేరికోమ్, భాగ్ మిల్కా సింగ్, చక్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోనే చూసి, ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా ఇదే చేయనుందట. కాక పోతే ఇంటర్నేషనల్ లెవల్లో. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. రామ్చరణ్పాల్గొంటుండగా ఓపాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.కాగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిందట టీమ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రామ్చరణ్కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్లోనూ రామ్చరణ్ ఉత్సాహంగాపాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్ పెర్ఫార్మెన్స్ను కొందరు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్నారు. ఇదంతా ‘పెద్ది’ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్కు దగ్గర చేయడంలో ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోందని ఫిల్మ్నగర్ భోగట్టా.హాలీవుడ్ అసోసియేషన్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప:ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్టర్. భారీ బడ్జెట్తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది.హాలీవుడ్లో ‘అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాల ప్రమోషన్స్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అల్లు అర్జున్–అట్లీ టీమ్ అసోసియేట్ అయ్యేందుకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి ఇటీవల ముంబై వచ్చి, అల్లు అర్జున్–అట్లీ అండ్ టీమ్ని కలిసి మాట్లాడారు. ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అసోసియేషన్ దాదాపు ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ⇒ కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్తోపాటు ఈ చిత్రంలోని కీలక తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్కు స్కోప్ ఉందని, దీపికా పదుకోన్ ,మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ అయ్యారని, మిగతా హీరోయిన్స్గా జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే వంటివారు కనిపించే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, విజయ్ సేతుపతి వంటి వారు ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగుపాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత – తండ్రి–ఇద్దరు కొడుకులపాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారట. ఇక అల్లు అర్జున్ కెరీర్లోని ఈ 22వ సినిమా 2027 ఆగస్టులో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ది ప్యారడైజ్ ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నాని–దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ పొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కొన్ని భారతీయ భాషలతోపాటు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో ఇటీవల చర్చలు జరిపారు మేకర్స్. అంతేకాదు... ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ కోసం ఓపాపులర్ హాలీవుడ్ యాక్టర్తో అసోసియేట్ కావాలనుకుంటున్నారు మేకర్స్. ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.వీరే కాదు.. మరికొంతమంది తెలుగు హీరోలు కూడా తమ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో పెంచుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. – ముసిమి శివాంజనేయులు -
అనురాగ్ కశ్యప్ నిశాంచి.. ఆసక్తిగా ట్రైలర్
ఐశ్వరి థాకరే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం నిశాంచి. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీని జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథ అందించారు.ట్రైలర్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2000వ దశకంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య థాకరే కవలలుగా ద్విపాత్రాభినయం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. -
పరమ్ సుందరిలో యూత్ కలల రాణి.. షాకవుతున్న ఫ్యాన్స్!
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. కేరళ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ తర్వాత చర్చిలో ఓ వివాదాస్పద సీన్తో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ సీన్ మార్చడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అంతేకాకుండా ఈ మూవీలో నటించడానికి మీకు కేరళ నటి ఒక్కరు కూడా దొరకలేదా అంటూ మేకర్స్ను కొందరు విమర్శించారు. కేరళ అమ్మాయి పాత్రకు జాన్వీ కపూర్ను తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మలయాళీ నటులకు టాలెంట్ లేదా? అని మేకర్స్ను ప్రశ్నించారు.ఇదిలా పక్కనపెడితే పరమ్ సుందరిలో మలయాళీ ముద్దుగుమ్మ నటించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఒక్క కనుచూపుతో ఓవర్నైట్ స్టార్గా ఎదిగిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో కనిపించారు. అయితే ఇందులో ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు.జాన్వీకపూర్ కంటే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్గా తీసుకుంటే బాగుండని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఓరు అదార్ లవ్ మూవీలో ఒక్క కన్నగీటుతో యూత్ కలల రాణిగా ఫేమ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాశ్. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా కనిపించనుంది. ఇక పరమ్ సుందరి విషయానికొస్తే బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 34.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. -
మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి హెచ్చరిక
ప్రేమలో ఇన్వెస్ట్ చేస్తే ఏమీ మిగలదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే (Ranvir Shorey). చిన్నప్పటి నుంచి తనకు ప్రేమ కలిసిరావడం లేదని చెప్తున్నాడు. కానీ తాను బంబుల్ అనే ఓ డేటింగ్ యాప్లో ఉన్నట్లు తెలిపాడు. రణ్వీర్ ఇంకా మాట్లాడుతూ.. స్త్రీపురుషుల మధ్య దూరం పెరిగింది. మాజీ ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్య.. కుటుంబసభ్యుల అండదండలతో భార్య ప్రాణాలు తీసిన భర్త.. ఇలాంటి వార్తలే తరచూ కనిపిస్తున్నాయి. ప్రేమలో ఇన్వెస్ట్?నాకైతే చిన్నప్పటినుంచి ఈ ప్రేమలు కలిసిరావడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ను బట్టి ప్రేమలో పడేందుకు ఇది సరైన సమయం కాదేమో అనిపిస్తోంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు డబ్బు పెట్టరు. ప్రేమ విషయంలోనూ అంతే.. ఇప్పుడు మార్కెట్ బాగోలేదు. కాబట్టి లవ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రోజులెలా ఉన్నాయంటే.. నా మాజీ ప్రియుడు కూడా నా కుటుంబ సభ్యుడే అని భార్య ఎదురుతిరిగి చెప్తోంది. మార్కెట్ బాగోలేదుఆమె అన్నదాంట్లో తప్పేముందని పదిమంది తనకు వత్తాసు పలుకుతున్నారు. దీన్నే డౌన్ మార్కెట్ అంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రేమ జోలికి పోకుండా.. బుద్ధిగా ఇంట్లో ఉండి బాడీ బిల్డింగ్పై ఫోకస్ చేస్తే మీకే మంచిది అని సలహా ఇచ్చాడు. కాగా రణ్వీర్ షోరే.. గతంలో పూజా భట్ను ప్రేమించాడు. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి2010లో నటి కొంకణసేన్ శర్మను పెళ్లాడాడు. వీరికి కుమారుడు హరూన్ సంతానం. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2015లో విడిపోయారు. 2020లో విడాకులు తీసుకున్నారు. రణ్వీర్ చివరగా బిండియాకే బాహుబలి అనే సిరీస్లో కనిపించాడు. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం