ప్రధాన వార్తలు

జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించాడు. జగన్ కాన్వాయ్ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు.. నిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని, ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్తో పాటు ఇదే కేసులో వైఎస్సార్సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జగన్ క్వాష్ పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారు.కాన్వాయ్లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి

గిన్నిస్ బుక్లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి

పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్రేప్
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రిలో (rg kar medical college and hospital) జూనియర్ వైద్యురాలి ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే అకారణంగా లా కాలేజీలో (Calcutta Law College) న్యాయవిద్యను అభ్యసిస్తున్న లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. కాలేజీ క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డు రూమ్లో నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధితురాలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా.. మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. Kolkata Law student gang-raped inside college campusDo not repost @ravish_journo will get angry if news go viral. pic.twitter.com/Q8sqXyeCmt— Lala (@FabulasGuy) June 27, 2025కోల్కతా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్కతా లా కాలేజీలో జూన్ 25 రాత్రి 7.30 నుంచి 10.30 సమయంలో కాలేజీ క్యాంపస్లోనే లా విద్యార్థినిపై ముగ్గురు నిందితులు గ్యాంగ్రేప్ జరిగినట్లు తెలిపారు. వారిలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) ఆ కాలేజీకి కాలేజీకి అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం యూనిట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. టీఎంసీ నేతలతో మిశ్రా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజీలో లా చదువుతున్న జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)గా గుర్తించారు. లా కాలేజీలో ఘటన ఎలా జరిగింది? బాధిత విద్యార్థిని ఘటన జరిగిన బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను ఫిల్ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో కాలేజీ యూనియన్ రూమ్ లోపల కూర్చున్నారు. అప్పుడే నిందితుడు ఆదేశాలతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ మెయిన్ గేటు కాలేజీకి తాళం వేశారు. తరువాత క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డు రూమ్లో అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కస్బా పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం సంఘటన స్థలాన్ని భద్రపరిచారు.నిందితులకు ఐదురోజుల పోలీస్ కస్టడీజూన్ 26న తల్బాగన్ క్రాసింగ్లోని సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్ సమీపంలో మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్లను అరెస్టు చేయగా, జూన్ 27 తెల్లవారుజామున ప్రమిత్ ముఖర్జీని అతని నివాసంలో అరెస్టు చేశారు. ముగ్గురి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అలీపోర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పద్నాలుగు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం కోర్టు ముగ్గురినీ ఐదు రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసింది. పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు గతేడాది ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. తాజాగా లా విద్యార్థినిపై జరిగిన ఘటన వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.

‘కన్నప్ప’ మూవీ రివ్యూ
టైటిల్ : కన్నప్పనటీనటులు: విష్ణు మంచు, మోహన్ బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీనిర్మాత: మోహన్ బాబుకథ:పరుచూరి గోపాల కృష్ణ,ఈశ్వర్ రెడ్డి, జి. నాగేశ్వర రెడ్డితోట ప్రసాద్దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్సంగీతం : స్టీఫెన్ దేవస్సీసినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌఎడిటర్: ఆంథోనీవిడుదల తేది: జూన్ 27, 2025కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా, నిర్మాతగాను వ్యవహరించాడు. మంచు ఫ్యామిలికి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగెటివిటీ తగ్గిపోయింది. ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Kannappa Movie Review).కథేంటంటే..తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్ కుమార్) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది 50 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఓ భక్తి కథకు కావాల్సినంత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ ను నేటి తరానికి నచ్చేలా ‘కన్నప్ప’ కథను చెప్పాలనుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణుని అభినందించాల్సిందే. అయితే టెక్నికల్గా సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. సీజీ వర్క్ పేలవంగా ఉంది. వార్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎమోషన్ని తెరపై బాగా పండించి ఆ లోపాలను కాస్త కప్పిపుచ్చారు. భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్గా సాగుతూ.. శివ భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శివుడు గొప్పతనాన్ని పాట రూపంలో చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాల్సి వచ్చిందో అర్థవంతంగా చూపించారు. మంచు విష్ణు ఎంట్రీ కథనం ఆసక్తి పెరుగుతుంది. యువరాణి నెమలితో ప్రేమలో పడడం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ని ఆకట్టుకుంటాయి. పాటల పేరుతో భక్తి చిత్రంలోనూ శృంగార రసాన్ని బాగానే పండించారు. కొన్ని చోట్ల ఆ శృంగార రసం మితిమీరిపోయింది కూడా. ఇక మోహన్ బాబు ఎంట్రీ, మోహన్ లాల్ ఎంట్రీ సీన్స్ అదిరిపోతాయి. అయితే ఫస్టాఫ్లో వచ్చే యుద్ద సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఓవరాల్గా ఫస్టాఫ్ పర్లేదులే అన్నట్లుగా సాగుతుంది. ఇక సెకండాఫ్లో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్ ఎంట్రి ఇచ్చిన తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రభాస్ కనిపించేది 20 నిమిషాలే అయినా.. ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు. క్లైమాక్స్లో విష్ణు నటన ఆకట్టుకుంటుంది. శివ భక్తులకు చివరి 40 నిమిషాలు అయితే విపరీతంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిన్నడు అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్లో విష్ణు నటన అదిరిపోతుంది. ఆయన కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్గా కన్నప్ప నిలిచిపోతుంది. గూడెపు యువరాణి, శివుడి పరమ భక్తురాలు నెమలిగా ప్రీతి ముకుందన్ మంచి నటనతో ఆకట్టుకుంది. తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శిస్తూనే.. నటన పరంగాను మంచి మార్కులే సంపాదించుకుంది. విష్ణు, ప్రీతీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక రుద్రగా ప్రభాస్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా.. అవే సినిమాకు కీలకంగా మారుతాయి. తిన్నడు, నెమలితో పాటు మహాదేవ శాస్త్రీ పాత్రలకు రుద్రకు మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయి. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్లో విజిల్స్ వేయిస్తాయి. ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహాదేవ శాస్త్రీగా మోహన్బాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగు డెలివరీ ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది. మోహన్లాల్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీదేవి పాత్రలో కాజల్ ఒదిగిపోయారు. ఇక తిన్నడు తండ్రిగా శరత్కుమార్ నటన బాగుంది. కానీ, ఓన్ వాయిస్తో చెప్పిన డబ్బింగ్ బాగోలేదు. చిన్నప్పటి తిన్నడుగా నటించిన అవ్రామ్.. నటన పరంగా ఓకే కానీ డబ్బింగ్ దారుణంగా ఉంది. తెలుగు పదాలు సరిగా పలకలేకపోయాడు. బ్రహానందం, మధుబాల, శివబాలాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా బాగుంది. స్టీఫెన్ దేవస్సీ పాటలు పర్వాలేదు కానీ నేపథ్య సంగీతమే అంతగా బాగోలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేసేలా బీజీఎం ఉంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. న్యూజిలాండ్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్

‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’
చెన్నైలో అద్దెకు ఉండేందుకు ఫ్లాట్ల కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. మీలో చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటుంది. ఇదే అంశంపై ఆన్లైన్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ రోజుల్లో దాదాపు చాలామందికి ముక్కలేనిదే ముద్దదిగదనే ధోరణి వచ్చేసింది. అలాంటిది నాన్వెజ్ తింటే ఇల్లు అద్దెకు అవ్వబోమని ఓ యజమాని చెప్పడం చర్చకు దారితీసింది.సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ రంగస్వామి అనే వ్యక్తి చెన్నైలో ఇంటి అద్దె కోసం వెతుకుతున్నాడు. ఓ ఫ్లాట్ యజమానిని వాట్సప్ ద్వారా సంప్రదించాడు. ‘మీరు నాన్వెజ్ తింటే ఇల్లు అద్దెకు ఇవ్వబోం. సారీ సర్.. వెజిటేరియన్ ప్యామిలీ కోసం చూస్తున్నాం’ అంటూ యాజమాని చెప్పాడు. దాంతో ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిబంధనలు పెట్టడంపై ప్రశాంత్ ఆందోళన చెందుతూ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను స్క్రీన్షాట్ తీసి సామాజిక మాధ్యామాల్లో షేర్ చేశారు. ‘చెన్నైలో అద్దెకు ఫ్లాట్లు దొరకాలంటే నాన్ వెజ్ తినడం హానికరం’ అని ఆ పోస్ట్కు క్యాప్షన్ పెట్టారు.Eating non veg is injurious to finding flats for rent in Chennai . pic.twitter.com/MyWWYuJ0vB— Prashanth Rangaswamy (@itisprashanth) June 26, 2025ఇదీ చదవండి: సిబిల్ సరిగా లేదని ఎస్బీఐ ఉద్యోగం రద్దుమీలో లేదా మీకు తెలిసిన వారిలో చాలామంది ఈ సమస్యను ఏదుర్కొనే ఉంటారు. ఈ తంతు ఇంకెంత కాలం అంటూ కొందరు ఈ పోస్ట్కు రిప్లై ఇస్తుంటే.. సైలెంట్గా వేరే ఇల్లు చూసుకోండంటూ ఇంకొందరు చెప్పారు. ‘నేను శాకాహారినే. కానీ చుట్టూ మాంసం తినేవారున్న యూరప్లో నివసించాను. ఎప్పుడూ సమస్య లేదు. కానీ ఇక్కడ, ఈ ఆంక్షలు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి’ అని ఒక యూజర్ అన్నారు. అయితే కొందరు మాత్రం తమ ఆస్తిని ఎవరికి అద్దెకు ఇవ్వాలో నిర్ణయించే హక్కు ఇంటి యజమానులకు ఉందని తెలిపారు.

మనం చేసే పని 80 శాతం నాన్ కోర్ వర్కే!!
పని గంటలు.. వర్క్కల్చర్ గురించి ఈ మధ్యకాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రంగాలకు అతీతంగా ఈ వ్యవహారంపై ప్రముఖులు సైతం స్పందిస్తుండడం చూస్తున్నాం. అయితే.. ఓ సీనియర్ బ్యూరోక్రట్, అందునా LinkedIn లాంటి ప్రొఫెషనల్ వెబ్సైట్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ల పని తీరు గురించి చర్చించుకునేలా చేసింది. జైపూర్: రాజస్థాన్ సీనియర్ ఐఏఎస్ అధికారి అజితాభ్ శర్మ (Ajitabh Sharma).. ఇటీవల విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన తాజాగా LinkedInలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆయన IAS అధికారుల పని విధానంపై కఠినమైన వ్యాఖ్యలు చేశారు.ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి అజితాభ్ శర్మ ఏమన్నారంటే.. ‘‘మన పని 80 శాతం పైగా నాన్-కోర్ వర్క్(ప్రధాన బాధ్యతలు కాని పనులు) మీదే వెచ్చిస్తున్నాం. అవి.. ఇతర శాఖలతో జరిపే సాధారణ సమావేశాలు, మానవ వనరుల సమస్యలు (HR issues), కేసులు..లీగల్ వ్యవహారాలు, సమాచార హక్కు చట్టం (RTI)కు సమాధానాలు, వార్తా కటింగ్స్.. లేఖలపై సమాధానాలు ఇవ్వడం, ఎన్నో రిపోర్టులు తయారు చేయడం ఇవే ప్రధానంగా ఉన్నాయి. ఒక శాఖ యొక్క నిజమైన కోర్ పని చేయడమే సమాజానికి నిజమైన సేవ.. అయితే.. ప్రతీ IAS పోస్టింగ్ను కష్టమైనదిగా అనుకోవడం తప్పుదారి చూపుతోంది. అలాంటి భావనను నేను ఎప్పుడూ నమ్మను. అధికులు అసలు బాధ్యతలను నిర్వహించాల్సిన సమయం లేక విలువైన పని చేసేందుకు అవకాశం కోల్పోతున్నారు. తద్వారా పాలనా వ్యవస్థ నెట్వర్క్లో కొత్తతరహా ఆలోచనలకు తలుపులు మూసేస్తున్నారు అని అభిప్రాయపడ్డారాయన. అజితాభ్ శర్మ వ్యాఖ్యలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, అధికారుల పనితీరు, శాఖల స్వాతంత్ర్యం వంటి అంశాలపై పలువురు స్పందిస్తున్నారు. ప్రభుత్వం, పాలనా వ్యవస్థలో మార్పు కోరే దిశగా ఒక IAS అధికారే స్పందించిన తీరు.. పరిశీలించదగ్గదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. LinkedInలో తన పోస్టుతో IAS వ్యవస్థలో చెలామణిలో ఉన్న కొన్ని భ్రమలపై అజితాభ్ తీవ్ర విమర్శలు చేశారంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.IAS అధికారులు శాఖానుసారమైన ముఖ్యమైన లక్ష్యాల మీద కాకుండా.. సాధారణ పరిపాలనా ప్రక్రియల్లో బిజీగా ఉంటారని అజితాభ్ ఐఏఎస్ల వర్క్కల్చర్(IAS Work Culture) పోస్టుతో తేటతెల్లమైందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, ఉద్యోగుల స్వయంప్రేరణ, శాఖానుగుణమైన అవగాహన ఎంత అవసరమో గుర్తు చేశాయని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది పరిపాలనలో నిపుణత, ప్రత్యేకత, వినూత్నతను తగ్గించేలా ఉందని.. ఫలితంగా అధికారుల శక్తి ప్రభావవంతమైన పాలన మీద కాకుండా ‘ఫార్మాలిటీ’గానే మిగిలిపోతోందని మరో యూజర్ విమర్శించారు. అయితే అజితాభ్ శర్మ మాత్రమే కాదు.. గతంలో కూడా కొంతమంది ఏఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు, అధికారుల పని ఒత్తిడి, సమర్థత లోపం వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ మహిళా ఐఏఎస్ అరుణా సుందరరాజన్ బ్యూరోక్రసీలో ఉన్న ఫైల్ కల్చర్, కొత్త ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న దృక్పథం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. శివానందన్ అనే మాజీ ఐపీఎస్.. అధిక బ్యూరోక్రసీ, ఫీల్డ్ వర్క్కు ప్రాధాన్యత లేకపోవడాన్ని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ స్వరూప్ తన పుస్తకాల్లో(Fear of decision-making is the biggest bottleneck in governance), ఇంటర్వ్యూలలో.. ఫైల్ నిబంధనలు, అనవసరమైన నివేదికలు, అన్నింటికి మించి పాలనా వ్యవస్థలో ఉన్న భయాందోళనలు గురించి స్పష్టంగా చెప్పారు. అయితే.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న అజితాభ్ శర్మ లాంటి వ్యక్తి.. సూటిగా అదీ LinkedIn వేదికగా, పైగా గణాంకాలతో (80%) పాలనా సంస్కరణల అవసరాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అజితాభ్ శర్మ గురించి..1996 రాజస్తాన్ కేడర్కు చెందిన అజితాభ్ శర్మ.. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. భివాడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ (BIDA)కి ఓఎస్డీగా , జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్కు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా, ఇన్వెస్ట్మెంట్ & NRI వ్యవహారాలు, BIP, జైపూర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ.. ఇలా పాలనా రంగంల అనేక విభాగాల్లో సేవలందించారు. ఈ మధ్యే విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.

IND Vs ENG: అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?
టీమిండియాతో రెండో టెస్టుకు జోఫ్రా ఆర్చర్ (Jofra Archer)ను ఎంపిక చేయడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ విమర్శించాడు. ఈ పేస్ బౌలర్ను ఇప్పుడే ఆడించడం రిస్క్ అని మేనేజ్మెంట్ను హెచ్చరించాడు. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధిస్తేనే అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు.1-0తో ముందంజలో ఇంగ్లండ్కాగా ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ (Tendulkar-Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా .. లీడ్స్ (Leeds Test)లో నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి పోరులో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్లో 1–0తో ముందంజ వేసింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు... పేసర్ జోఫ్రా ఆర్చర్ను తీసుకుంది.2021లో చివరగా..గాయాలతో సహవాసం చేసే ఆర్చర్... 2021 తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. అతడు చివరగా... అహ్మదాబాద్ వేదిగా టీమిండియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. అనంతరం మోచేతి గాయంతో సుదీర్ఘ ఫార్మాట్కు దాదాపు దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ సంప్రదాయ క్రికెట్లో తిరిగి అడుగుపెట్టాడు.కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ వన్ మ్యాచ్లో ససెక్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు.. దుర్హమ్తో జరిగిన మ్యాచ్లో ఆడాడు. పద్దెనిమిది ఓవర్ల పాటు బౌలింగ్ చేసి దుర్హమ్ తొలి ఇన్నింగ్స్లో ఎమిలో గేను 37 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తరఫున రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆర్చర్ రాక గురించి ప్రస్తావిస్తూ ‘జాతీయ జట్టు తరఫున 13 టెస్టులు ఆడిన 30 ఏళ్ల జోఫ్రా ఆర్చర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. 2021 ఫిబ్రవరిలో భారత్పైనే చివరి టెస్టు ఆడిన అతడు... మళ్లీ టీమిండియాపైనే పునరాగమనం చేస్తున్నాడు’ అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. ‘‘రానున్న వారం రోజుల్లో ఇంగ్లండ్ నిజంగానే పెద్ద రిస్క్ తీసుకోబోతోంది. ఇందులో వారు సఫలం అవుతారో లేదో తెలియదు. జోఫ్రా ఆర్చర్ ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉందో నాకైతే తెలీదు.అంతా బాగుంటే మంచిదే. అయినా, ఆర్చర్ కోసం ఇప్పుడు ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నదే ప్రశ్న?.. ఇప్పుడే జట్టులో మార్పులు అవసరం లేదనుకుంటా. ఆర్చర్ను ఆడించే విషయంలో లార్డ్స్ టెస్టు వరకు వేచి చూస్తే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. ‘‘అతడు ససెక్స్ తరఫున ఒకే ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడి తిరిగి వస్తున్నాడు. నాలుగేళ్లు టెస్టులకు దూరంగా ఉండి.. రీఎంట్రీలో కేవలం 18 ఓవర్లు బౌల్ చేశాడు. నిజంగానే ఆర్చర్ పూర్తి ఫిట్గా ఉండే ప్రపంచంలో అతడే అత్యుత్తమ బౌలర్ అని చెప్పడానికి సందేహించను.అయితే, దురదృష్టవశాత్తూ గాయాల వల్ల సుదీర్ఘకాలంగా టెస్టు ఫార్మాట్కు అతడు దూరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ’’ అని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియాతో తొలి టెస్టులో క్రిస్ వోక్స్ ఒకే ఒక్క వికెట్ తీయగా.. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ కలిసి పదకొండు వికెట్లు కూల్చారు. అయితే, వోక్స్ పొదుపుగా బౌలింగ్ చేసిన కారణంగా అతడిని ఇప్పుడే జట్టు నుంచి తప్పించడం తొందరపాటు చర్యే అవుతుంది.చదవండి: WI vs AUS: ఆసీస్కు చుక్కలు చూపిస్తున్న విండీస్

రూ. 40 లకే భోజనం, ఎక్కడ? నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ కేవలం తన పాటల ద్వారా మాత్రమే కాదు, తన గొప్పమనసుతో అందరి మనసులను దోచుకున్నాడు. సెలబ్రిటీలు అనేక వ్యాపారాలకు, ఎండార్స్మెంట్లతో కోట్లకు పడగలెత్తుతున్న తరుణంలో తన రెస్టారెంట్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 40 రూపాయలకే కమ్మటి భోజనం అందిస్తున్నాడు. ఎక్కడ? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? తెలుసుకుందామాపశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లోని తన స్వస్థలం జియాగంజ్లో హెషెల్ అనే రెస్టారెంట్ను ప్రారంభించాడు అరిజిత్ సింగ్. కుటుంబ వ్యాపారంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశాడు. ఈ రెస్టారెంట్ చాలా తక్కువ ధరకు, కేవలం రూ. 40కి ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాడు. తద్వారా మధురమైన గానంతోపాటు సామాజిక సేవతో మరోసారి ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ హోటల్ కొత్తదేమీ కాదు. కుటుంబ వ్యాపారంలో భాగంగా గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. అయితే సగటు మనిషికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించడ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కొత్త ధరలను ప్రకటించినట్టు తెలుస్తోంది.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ హోటల్ను గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ నిర్వహిస్తున్నారు.ఇది చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వ్యాపారంలో భాగం. అయితే సగటు మనిషికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించం కూడా అధిక ప్రాధాన్యత ఉంటుందట.భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడు అరిజిత్ సింగ్ ఒకడు. అతని కచేరీకోసం ప్రేక్షకులు డిమాండ్ బాగా ఉంటుంది. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం. మొత్తంగా అరిజిత్ సింగ్ నెట్వర్త్ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.అయితే కోట్ల రూపాయలు ఆర్జించే గాయకుడు అరిజిత్ సింగ్ లాంటి వారికి ఛారిటబుల్ ఫుడ్ ఆర్గనైజేషన్ను నడపడం పెద్ద విషయం కానప్పటికీ, అభిమానులు ఇప్పటికీ ఈ వార్త నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ పూర్తి భోజనం విద్యార్థులకు మాత్రమేనని అందరికీ కాదని పేర్కొంటున్నారు. 'ఫర్ ఎ చేంజ్' అనే సంస్థ మరో పోస్ట్లో, ఈ రెస్టారెంట్ సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుందని తెలిపింది. ఈ రెస్టారెంట్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుందని, విద్యార్థులకు డిస్కౌంట్లను కూడా అందిస్తుందని, ఇది అరిజిత్ సమాజ సేవపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొపడం గమనార్హం.భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే పాపులర్ గాయకుల్లో ఒకరు అరిజిత్ సింగ్. అతని కచేరీలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం. మొత్తంగా అరిజిత్ సింగ్ నెట్వర్త్ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.

రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
గాంధీనగర్: గుజరాత్లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో, ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్లోని గోల్వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహంతో జనం పైకి దూసుకెళ్లింది.Breaking!🚨Three elephants went out of control during the Jagannath Rath Yatra in Ahmedabad, GujaratHorrifying visuals. #RathaJatra2025pic.twitter.com/W2b7CwHpVw— 𝗩eena Jain (@DrJain21) June 27, 2025 ఇక, సదరు ఏనుగును చూసి పక్కనే ఉన్న ఏనుగులు సైతం ఆగ్రహానికి లోనయ్యాయి. ఒక్కసారిగా అక్కడున్న భక్తులపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. దీంతో, ఏనుగులను చూసి అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. ఏనుగులు గట్టిగా అరుస్తూ.. అటూ ఇటూ తిరగాయి. ఈ క్రమంలో రథ యాత్ర వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథ యాత్రకు సిద్ధం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. Ahmedabad Rath Yatra ….All people are safe … pic.twitter.com/0rw979Mfxa— €hetu $oN¥ (@chetusony) June 27, 2025🔵During the Rath Yatra in Ahmedabad, an elephant ran out of control. A mishap was narrowly avoided...Jai Jagannath Ji 🙏🙏🙏 pic.twitter.com/fr6Cyx2qSi— THE UNKNOWN MAN (@Theunk13) June 27, 2025

హార్ముజ్ మూసివేత గండం గడిచినట్లేనా?!
ఇరాన్పై ఇజ్రాయెల్ (israel) అమెరికాల(USA) యుద్ధం నేపథ్యంలో హార్ముజ్( Hormuz) జల సంధిని మూసివేస్తామని ఇరాన్ (Iran)ప్రకటించడం కలకలం రేపింది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? ఇది ఇరాన్కు ఉత్తర భాగంలో, ఒమన్, యూఏఈ దేశాలకు పశ్చిమ భూభాగంలో ఉంటుంది. ఈ జలసంధి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో 50 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. లోతు చాల ఎక్కువగా ఉండి పెద్ద రవాణా నౌకలు కూడా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది గల్ఫ్ దేశాలను అరేబియా సముద్రానికి అనుసంధానిస్తుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఒక్క ఇరాన్ కాకుండా ఇంకా గల్ఫ్ దేశాలైన ఇరాక్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా ఆయిల్ సరఫరా చేస్తుంటాయి. అమెరికాలోని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 2023లో ఈ జలసంధి ద్వారా 2 కోట్ల బారెళ్ల క్రూడ్ ఆయిల్ని ఆ యా గల్ఫ్ దేశాలు సరఫరా చేశాయి. దీని విలువ సుమారు 600 బిలియన్ల డాలర్లు. ఇది ఒక్క ఏడాదిలో జరిగిన ఆయిల్ సరఫరా విలువ.యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డైరెక్టర్ సర్ అలెక్ యూన్గర్ అంచనా ప్రకారం ఈ జలసంధిని మూసివేయడం వల్ల ఆయిల్ రేట్లు అంచనాకు మించి పెరిగే అవకాశముంటుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావి తమవుతాయి. ఈ జలసంధి ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకు ఆయిల్ సరఫరా అవుతోంది. చైనా దిగుమతి చేసుకొనే 90% ఆయిల్ ఒక్క ఇరాన్ నుంచే సప్లై అవుతుంది. ఇండియా 60% క్రూడ్ను దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా 60%, జపాన్ ఉపయోగించే ఆయిల్లో మూడొంతులు ఈ జలసంధి ద్వారానే దిగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరలూ దీని మూసివేత వల్ల బాగా పెరిగే అవకాశంఉంటుంది. ఈ దేశాల వస్తువులు ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు వాడటంతో అంతటా ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది కనుక హార్ముజ్ మూసివేత నిర్ణయాన్ని విరమించినట్టు వస్తున్న వార్తలు నిజమైతే అదే పదివేలు! – డా.కొండి సుధాకర్ రెడ్డి లెక్చరర్
కన్నప్పను కాపాడిన రుద్ర!
భూకంపం.. బుల్లి బకాసురుడు
అంతర్జాతీయ టీ20ల్లో కొత్త రూల్స్
పేరుకు తగ్గట్టే.. రిటైర్డ్ ఉద్యోగి ధర్మారావు దాతృత్వం
జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ స్మారక సిరికోన నవలారచన పోటీ తుది ఫలితాలు
‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’
పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్రేప్
దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు
WI vs AUS: చెత్త అంపైరింగ్!.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
వారియర్గా 'రష్మిక మందన్నా'.. కొత్త సినిమా ప్రకటన
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
అమ్మ ఓడి.. 'పోయింది'
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
ఆధ్యాత్మిక పర్యటనలో అనసూయ (ఫోటోలు)
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
పెరగనున్న రైలు చార్జీలు
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
బంగారం కంటే వెండి ముద్దు
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
మొదటి రాత్రే భర్తకు షాక్ ఇచ్చిన భార్య
ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్
కుమార్తెలపై కోపంతో.. రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన తండ్రి
కన్నప్పను కాపాడిన రుద్ర!
భూకంపం.. బుల్లి బకాసురుడు
అంతర్జాతీయ టీ20ల్లో కొత్త రూల్స్
పేరుకు తగ్గట్టే.. రిటైర్డ్ ఉద్యోగి ధర్మారావు దాతృత్వం
జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ స్మారక సిరికోన నవలారచన పోటీ తుది ఫలితాలు
‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’
పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్రేప్
దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు
WI vs AUS: చెత్త అంపైరింగ్!.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
వారియర్గా 'రష్మిక మందన్నా'.. కొత్త సినిమా ప్రకటన
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
అమ్మ ఓడి.. 'పోయింది'
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
పెరగనున్న రైలు చార్జీలు
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
బంగారం కంటే వెండి ముద్దు
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్
కుమార్తెలపై కోపంతో.. రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన తండ్రి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
బూమరాంగ్లా బంగారం ధరలు! తులం ఎంతంటే..
సినిమా

అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
‘‘మా కథకి ‘తమ్ముడు’ సరైన టైటిల్. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమాలో నితిన్కి అక్క పాత్ర చేశాను. నటన పరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చేశారు’’ అని నటి లయ (Actress Laya) తెలిపారు. నితిన్ హీరోగా రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించిన లయ పంచుకున్న విశేషాలు.2023లో ఇండియాకు..వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. అప్పుడు కొన్ని యూట్యూబ్ చానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలు చూసిన ‘తమ్ముడు’ మూవీ టీమ్ నుంచి జూన్లో నాకు ఫోన్ వచ్చింది. నటిస్తారా? అని అడిగితే ఓకే అన్నాను. ‘తమ్ముడు’ కథ ఓ లైన్గా చెప్పారు. ఝాన్సీ కిరణ్మయి పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పడంతో స్వీట్స్ బాగా తిని, 7 కిలోలు బరువు పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక పూర్తి కథ విన్నాను. నా రీ ఎంట్రీకి ‘తమ్ముడు’ సరైన సినిమా అని బలంగా అనిపించి, నటించాను.ఉద్యోగం మానేశా‘తమ్ముడు’ సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు... అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది. ఝాన్సీ కిరణ్మయి స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది. నా క్యారెక్టర్లో స్ట్రిక్ట్నెస్తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి. అమెరికాలోనే కాదు హైదరాబాద్లోనూ..కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించాలని అనుకుంటున్నాను. నేను అమెరికా నటిని కాదు... పక్కా హైదరాబాద్ నటినే. నాకు అమెరికాలో ఇల్లు ఉంది. హైదరాబాద్లోనూ ఉంది. నాకోసం ఫ్లైట్స్లో బిజినెస్ క్లాస్ టికెట్స్, స్టార్ హోటల్స్లో వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్లోని నా ఇంట్లో ఉంటాను. ప్రస్తుతం శివాజీగారితో చేస్తున్న ఓ సినిమా తుది దశకు వచ్చింది. కొన్ని కథలు వింటున్నాను.చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ

బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
బిగ్బాస్ 9 (Bigg Boss Season 9).. ఆగమనానికి సర్వం సిద్ధమవుతోంది. తాజాగా బిగ్బాస్ 9 లోగోనూ లాంచ్ చేస్తూ ప్రోమో రిలీజైంది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటున్నాడు కింగ్ నాగార్జున. ఈసారి కూడా హోస్ట్ నాగార్జునే అన్న విషయం ప్రోమోతో స్పష్టమైపోయింది.బజ్ హోస్ట్గా..కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో ఉన్నవారిలో చాలామంది ఈ షోలో భాగం కానున్నారు. అలాగే ఈ వారం మొదలవుతున్న కూకు విత్ జాతిరత్నాలు కామెడీ షోలోని కంటెస్టెంట్లు కూడా బిగ్బాస్లో పార్టిసిపేట్ చేయనున్నారు. అటు బిగ్బాస్ బజ్ హోస్ట్గా ప్రేరణ కంభాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటివారంలో బిగ్బాస్ 9 షురూ కానుంది. చదవండి: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ

వారియర్గా 'రష్మిక మందన్నా'.. కొత్త సినిమా ప్రకటన
2018లో "ఛలో" తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా సత్త చాటుతున్నారు. పుష్ప, యానిమల్, ఛావా సినిమాలతో పాటు రీసెంట్గా 'కుబేర'తో బాక్సాఫీస్ వద్ద మెప్పించారు. కిల్లర్ లుక్స్తో ఇటు యూత్ ఐకాన్గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్గా ఆమె మారిందని చెప్పవచ్చు. వరుస చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకున్నారు. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె మరో ఆసక్తికర ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. త్వరలో 'మైసా' అనే సినిమాతో వస్తున్నట్లు ఒక పోస్టర్తో ప్రకటించారు. అందులో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచారు. పాన్ ఇండియా రేంజ్లో రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. తాను గతంలో ఎప్పుడూ పోషించని పాత్రతో 'మైసా' కోసం చేస్తున్నట్లు రష్మిక చెప్పారు. అభిమానుల కోసం ఎప్పుడు కూడా కొత్తగా, భిన్నంగా ఉన్న పాత్రలే చేయాలనేది తన ఉద్దేశం అంటూ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ మైసా పోస్టర్ను రష్మిక షేర్ చేశారు. ఇప్పటి వరకు రష్మికను శ్రీవల్లి, గీతాంజలిగా చూసిన ప్రేక్షకులు త్వరలో ఒక వారియర్గా ఆమెను చూడనున్నారు. భారీ బడ్జెట్తో ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మరిన్ని విషయాలు త్వరలో ప్రకటించనున్నారు.

మురుగ పుస్తకంతో జూనియర్ ఎన్టీఆర్
వెండితెరపై కార్తికేయుడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మైథాలజీ సినిమాలోనే కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ‘వార్ 2’ సినిమా వర్క్స్లో భాగంగా ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ (కార్తికేయుడు) పుస్తకం కనిపించింది.అందుకోసమే ఈ ప్రిపరేషన్దీంతో త్రివిక్రమ్తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, ఇందులో భాగంగానే మురుగ పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఈ సినిమాను కల్యాణ్రామ్, సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో ‘దేవర 2’ కమిట్ అయ్యారు. తమిళ దర్శకుడు నెల్సన్తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారని టాక్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ గురించి కూడా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

IND Vs ENG: అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?
టీమిండియాతో రెండో టెస్టుకు జోఫ్రా ఆర్చర్ (Jofra Archer)ను ఎంపిక చేయడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ విమర్శించాడు. ఈ పేస్ బౌలర్ను ఇప్పుడే ఆడించడం రిస్క్ అని మేనేజ్మెంట్ను హెచ్చరించాడు. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధిస్తేనే అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు.1-0తో ముందంజలో ఇంగ్లండ్కాగా ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ (Tendulkar-Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా .. లీడ్స్ (Leeds Test)లో నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి పోరులో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్లో 1–0తో ముందంజ వేసింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు... పేసర్ జోఫ్రా ఆర్చర్ను తీసుకుంది.2021లో చివరగా..గాయాలతో సహవాసం చేసే ఆర్చర్... 2021 తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. అతడు చివరగా... అహ్మదాబాద్ వేదిగా టీమిండియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. అనంతరం మోచేతి గాయంతో సుదీర్ఘ ఫార్మాట్కు దాదాపు దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ సంప్రదాయ క్రికెట్లో తిరిగి అడుగుపెట్టాడు.కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ వన్ మ్యాచ్లో ససెక్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు.. దుర్హమ్తో జరిగిన మ్యాచ్లో ఆడాడు. పద్దెనిమిది ఓవర్ల పాటు బౌలింగ్ చేసి దుర్హమ్ తొలి ఇన్నింగ్స్లో ఎమిలో గేను 37 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తరఫున రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆర్చర్ రాక గురించి ప్రస్తావిస్తూ ‘జాతీయ జట్టు తరఫున 13 టెస్టులు ఆడిన 30 ఏళ్ల జోఫ్రా ఆర్చర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. 2021 ఫిబ్రవరిలో భారత్పైనే చివరి టెస్టు ఆడిన అతడు... మళ్లీ టీమిండియాపైనే పునరాగమనం చేస్తున్నాడు’ అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. ‘‘రానున్న వారం రోజుల్లో ఇంగ్లండ్ నిజంగానే పెద్ద రిస్క్ తీసుకోబోతోంది. ఇందులో వారు సఫలం అవుతారో లేదో తెలియదు. జోఫ్రా ఆర్చర్ ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉందో నాకైతే తెలీదు.అంతా బాగుంటే మంచిదే. అయినా, ఆర్చర్ కోసం ఇప్పుడు ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నదే ప్రశ్న?.. ఇప్పుడే జట్టులో మార్పులు అవసరం లేదనుకుంటా. ఆర్చర్ను ఆడించే విషయంలో లార్డ్స్ టెస్టు వరకు వేచి చూస్తే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. ‘‘అతడు ససెక్స్ తరఫున ఒకే ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడి తిరిగి వస్తున్నాడు. నాలుగేళ్లు టెస్టులకు దూరంగా ఉండి.. రీఎంట్రీలో కేవలం 18 ఓవర్లు బౌల్ చేశాడు. నిజంగానే ఆర్చర్ పూర్తి ఫిట్గా ఉండే ప్రపంచంలో అతడే అత్యుత్తమ బౌలర్ అని చెప్పడానికి సందేహించను.అయితే, దురదృష్టవశాత్తూ గాయాల వల్ల సుదీర్ఘకాలంగా టెస్టు ఫార్మాట్కు అతడు దూరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ’’ అని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియాతో తొలి టెస్టులో క్రిస్ వోక్స్ ఒకే ఒక్క వికెట్ తీయగా.. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ కలిసి పదకొండు వికెట్లు కూల్చారు. అయితే, వోక్స్ పొదుపుగా బౌలింగ్ చేసిన కారణంగా అతడిని ఇప్పుడే జట్టు నుంచి తప్పించడం తొందరపాటు చర్యే అవుతుంది.చదవండి: WI vs AUS: ఆసీస్కు చుక్కలు చూపిస్తున్న విండీస్

భారత జట్టులో కీలక మార్పులు.. అతడిపై వేటు! తెలుగోడికి చోటు?
ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే రెండో టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.శార్ధూల్ ఠాకూర్పై వేటు..?తొలి టెస్టులో దారుణ ప్రదర్శన కనబరిచిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్(Shardul thakur)పై వేటు వేసేందుకు టీమిండియా మెనెజ్మెంట్ సిద్దమైంది. లీడ్స్ టెస్టులో శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన ఠాకూర్.. బౌలింగ్లో కేవలం రెండు వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో శార్ధూల్ బదులుగా ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish kumar reddy)ని తీసుకోవాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ తన ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఓ సెంచరీ కూడా సాధించాడు. దీంతో తిరిగి మళ్లీ అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ మెనెజ్మెంట్ యోచిస్తుందంట. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే శార్థూల్ స్ధానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.బుమ్రాకు విశ్రాంతి..?ఇక రెండో టెస్టుకు వర్క్లోడ్ కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుమ్రా కేవలం మూడు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ఈ సిరీస్కు ముందే భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.దీంతో రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చి తిరిగి లార్డ్స్ టెస్టులో ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నరంట. తొలి టెస్టులో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల హాల్తో బుమ్రా చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్లో వికెట్ పడగొట్టకపోయినప్పటికి దాదాపు 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రా దూరమైతే అతడి స్ధానంలో అర్ష్దీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశముంది. లేదంటే పేసర్ ఆకాష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

సౌతాఫ్రికా, జింబాబ్వేలతో సిరీస్కు కివీస్ జట్టు ప్రకటన
జింబాబ్వే- సౌతాఫ్రికాలతో ముక్కోణపు టీ20 సిరీస్ (T20 Tri Series)కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పేసర్ ఆడం మిల్నే (Adam Milne) తిరిగి రాగా.. బెవాన్ జేకబ్స్ (Bevon Jacobs) తొలిసారి చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. కొంత మంది సీనియర్లు మాత్రం వివిధ కారణాల వల్ల దూరమయ్యారు.కేన్ మామ ఎందుకు దూరం అయ్యాడంటే?మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు పేసర్లు లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్, కైలీ జెమీషన్.. అదే విధంగా.. బ్యాటర్ డెవాన్ కాన్వే ఈ త్రైపాక్షిక సిరీస్కు దూరంగా ఉండనున్నారు. విలియమ్సన్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో మిడిల్సెక్స్ జట్టుకు ఆడుతుండటంతో.. సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయాడు.ఇక పక్కటెముకల నొప్పి కారణంగా బెన్ సియర్స్ జట్టుకు దూరం కాగా.. ఫెర్గూసన్కు పనిభారం తగ్గించే నిమిత్తం విశ్రాంతినిచ్చారు. మరోవైపు.. జెమీషన్ తమ మొదటి సంతానానికి ఆహ్వానం పలికే క్రమంలో సెలవు తీసుకున్నాడు.వారిద్దరి రీ ఎంట్రీఈ జింబాబ్వే- సౌతాఫ్రికాలతో సిరీస్ సందర్భంగా ఆల్రౌండర్లు గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర తిరిగి జట్టులోకి రాగా.. కెప్టెన్ సాంట్నర్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన సాంట్నర్ ప్లే ఆఫ్స్ కారణంగా పాకిస్తాన్తో సిరీస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ బెవాన్ జేకబ్స్ తొలిసారి జట్టులోకి రాగా.. మిల్నే కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్తో న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాలు ఆరంభించనుంది. ఈ విషయాల గురించి కొత్త కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘బెవాన్ దేశీ క్రికెట్లో, ఫ్రాంఛైజీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక మిల్నే నైపుణ్యాలున్న టీ20 బౌలర్.ఫెర్గూసన్, సియర్స్, జెమీషన్ లేరు కాబట్టి మిల్నే రాకతో ప్రయోజనం చేకూరుతుంది. వరల్డ్కప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో మాకు సిరీస్ ఎంతో ముఖ్యమైనది. వైవిధ్యంతో కూడిన జట్టును అందుకే ఎంపిక చేశాం’’ అని పేర్కొన్నాడు.జింబాబ్వే- సౌతాఫ్రికాలతో ట్రై సిరీస్కు న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: భారత్-ఇంగ్లండ్ వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు తదితర వివరాలు ఇవే

ఉత్కంఠపోరు.. ఆఖరి బంతికి గెలిపించిన గ్లెన్ ఫిలిప్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గురువారం డల్లాస్ వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో వాషింగ్టన్ ఘన విజయం సాధించింది. నైట్రైడర్స్ నిర్ధేశించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని వాషింగ్టన్ ప్రీడమ్ ఆఖరి బంతికి చేధించింది.చివరి బంతికి ఒక్కపరుగు కావాల్సిన నేపథ్యంలో గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ను హోల్డర్ జారవిడిచడంతో నైట్రైడర్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వాషింగ్టన్ బ్యాటర్లలో మిచెల్ ఓవెన్(43) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ గ్లెన్ మాక్స్వెల్(42), గ్లెన్ ఫిలిప్స్( 33 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. నైట్రైడర్స్ బౌలర్లలో తన్వీర్ సంగా రెండు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్, అలీ ఖాన్, షాడ్లీ వాన్ షాల్క్విక్ తలా వికెట్ సాధించారు.ఫ్లెచర్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నైట్రైడర్స్ ఓపెనర్ అండ్రీ ఫ్లెచర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు.అతడితో పాటు ఉన్ముక్త్ చంద్(41), రస్సెల్(30) రాణించారు. వాషింగ్టన్ బౌలర్లలో హాలండ్ రెండు, జార్ ఎడ్వర్డ్స్ ఒక వికెట్ పడగొట్టారు. అయితే నైట్రైడర్స్ ఓటమి పాలవ్వడంతో ఫ్లెచర్ సెంచరీ వృథా అయిపోయింది. ఈ ఓటమితో నైట్రైడర్స్ ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన లాస్ ఏంజిల్స్ కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్దానంలో కొనసాగుతోంది.చదవండి: WI vs AUS: ఆసీస్కు చుక్కలు చూపిస్తున్న విండీస్.. ఓటమి తప్పదా?
బిజినెస్

నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,565కు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 ప్లాయింట్లు పుంజుకుని 83,799 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

అందులో అమ్మారు.. ఇందులో కొన్నారు!
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా పీబీ ఫిన్టెక్లో కంపెనీ సహవ్యవస్థాపకులు యాషిష్ దహియా, అలోక్ బన్సల్ 1.09 శాతం వాటాను షేరుకి రూ. 1,821.5 సగటు ధరలో విక్రయించారు. ఇన్సూర్టెక్.. పాలసీబజార్, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైసాబజార్ మాతృ సంస్థలో 50.5 లక్షల షేర్లను అమ్మివేయడం ద్వారా రూ. 920 కోట్లు సమకూర్చుకున్నారు. ఎన్ఎస్ఈ బల్్కడీల్ వివరా ల ప్రకారం సీఈవో దహియా 0.74 శాతం వాటాకు సమానమైన 34 లక్షల షేర్లు. వైస్చైర్మన్ బన్సల్ 0.36 శాతం వాటాకు సమానమైన 16.5 లక్షల షేర్లు విక్రయించారు. తాజా లావాదేవీల తదుపరి పీబీ ఫిన్టెక్లో దహియా వాటా 4.31 శాతం నుంచి 3.57 శాతానికి, బన్సల్ వాటా 1.4 శాతం నుంచి 1.04 శాతానికి క్షీణించింది. కాగా.. ఈ వాటాలను దేశీ ఎంఎఫ్, బీమా రంగ సంస్థలతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో టాటా ఎంఎఫ్, ఎడిల్వీజ్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రు లైఫ్సహా సిటీగ్రూప్ గ్లోబల్, గోల్డ్మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు చేరాయి.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లుడెల్హివరీలో వాటా కొనుగోలుజాబితాలో మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా లాజిస్టిక్స్ సర్వీసులందించే డెల్హివరీలో దేశ, విదేశీ దిగ్గజాలు వాటా కొనుగోలు చేశాయి. ఎన్ఎస్ఈ బల్క్డీల్ గణాంకాల ప్రకారం 1.6 శాతం వాటాకు సమానమైన 1.19 కోట్ల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నాయి. ఇందుకు షేరుకి రూ. 387 సగటు ధరలో రూ. 461 కోట్లు వెచి్చంచాయి. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ సింగపూర్, విరిడియన్ ఏఎంతోపాటు.. ఎంఎఫ్ సంస్థలు హెచ్డీఎఫ్ సీ, యాక్సిస్, టాటాతదితరాలు చేరాయి. అనుబంధ సంస్థలు నెక్సస్ అపార్చునిటీ ఫండ్, నెక్సస్ వెంచర్స్–3తో వీసీ కంపెనీ నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తాజాగా డెల్హివరీలో వాటా విక్రయించింది. 2025 మార్చికల్లా డెల్హివరీలో 5.88 % వాటాను నెక్సస్ వెంచర్స్–3 కలిగి ఉంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

రేట్ల కోతను వేగంగా బదిలీ చేయాలి: ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటును ఈ నెల మొదట్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించగా (0.50 శాతం), దీన్ని వేగంగా రుణ గ్రహీతలకు బదలాయించాలంటూ ఆర్బీఐ బులెటిన్ సూచించింది. బ్యాంక్లు వెంటనే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించాలని కోరింది. వాస్తవానికి చాలా బ్యాంక్లు ఇప్పటికే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించడం గమనార్హం.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లురుణ రేట్లను వేగంగా బదలాయించడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యంక్లు వేగంగా బెంచ్మార్క్ లెడింగ్ రేటు ఆధారిత రుణ రేట్లను సవరించాయి కూడా. రెపో రేటుతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని సైతం (సీఆర్ఆర్) అర శాతం మేర తగ్గిస్తూ ఆర్బీఐ వెసులుబాటు కల్పించడం తెలిసిందే. సీఆర్ఆర్ కోతతో బ్యాంకింగ్ రంగంలోకి రూ.2.5 లక్షల కోట్ల మేర అదనపు నగదు లభ్యత అందుబాటులోకి వచ్చినట్లయింది.

దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లు
భారత్లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యంత విలువైన బ్రాండ్ వివరాలను ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదిక తెలియజేసింది. దేశంలో టాటా గ్రూప్ (బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి 31.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది) మరోసారి అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక రంగాల్లో టాటా గ్రూప్ వ్యూహాత్మక పెట్టుబడులతో దేశంలో వేగంగా విస్తరిస్తోందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన బ్రాండ్లు మొత్తంగా బ్రాండ్ విలువలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. బలమైన దేశీయ డిమాండ్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం అంచనా వేసిన జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 7 శాతం మధ్య ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: సెకనుకు మూడు వాహనాలు డెలివరీబ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ‘మేక్ ఇన్ ఇండియా పిలుపును భారత్ నూతన శక్తితో స్వీకరిస్తోంది. తయారీ, ఆర్థిక సేవలు, వినోదం, వైద్యం, ఆతిథ్యం ఇలా ఏ రంగంలోనైనా భారత్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దేశ ఆర్థిక పురోగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విస్తరణ తన అగ్రశ్రేణి బ్రాండ్లను గ్లోబల్ లీడర్లుగా మారుస్తున్నాయి’ అన్నారు.
ఫ్యామిలీ

ఏఐ మాయ: తల్లి ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం..!
తనను తల్లి హగ్ చేసుకున్న చిన్నప్పటి ఫోటోను ఏఐ వీడియో క్లిప్గా మార్చి షేర్ చేశాడు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘రెడిట్’ కో–ఫౌండర్ ఎలెక్సిస్ ఒహానియన్. సోషల్ మీడియాలో ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా విమర్శలు కూడా వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’ అని కొద్దిమంది విమర్శించారు. దీనికి సంబంధించి ఒహానియన్ వివరణ ఇచ్చాడు. ‘ఇరవై సంవత్సరాల క్రితం అమ్మ నాకు దూరమైంది. నా దగ్గర అమ్మకు సంబంధించిన వీడియోలు లేవు. అందుకే ఈ ఏఐ వీడియో క్రియేట్ చేయాల్సి వచ్చింది. Damn, I wasn't ready for how this would feel. We didn't have a camcorder, so there's no video of me with my mom. I dropped one of my favorite photos of us in midjourney as 'starting frame for an AI video' and wow... This is how she hugged me. I've rewatched it 50 times. pic.twitter.com/n2jNwdCkxF— Alexis Ohanian 🗽 (@alexisohanian) June 22, 2025 (చదవండి: బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..)ఈ వీడియో క్లిప్ను 50 సార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒహానియన్. ఈ వీడియో క్లిప్కు 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’లాంటి విమర్శలను పక్కన పెడితే, ఒక ఫోటోగ్రాఫ్ను జీవం ఉట్టిపడే వీడియోగా మార్చిన సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ‘భేష్’ అంటున్నారు. (చదవండి: మూత్రంతో మరీ ఇలానా..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్)

మ్యారేజీ ఎంట్రీకి ఏజ్ ఏంటి?
పెళ్లికి అర్హతను నిర్ణయించేది అబ్బాయికైతే కొలువు .. అమ్మాయికైతే వయసు! ఉద్యోగం వస్తే అబ్బాయి స్థిరపడినట్టు.. ఇరవై ఏళ్లు నిండితే అమ్మాయి పెళ్లితో స్థిరపడాలన్నట్టు! ఇవి పెళ్లికి సంబంధించిన సామాజిక ప్రమాణాలు.. సాంస్కృతిక కట్టుబాట్లూనూ! పెళ్లి వ్యక్తిగత నిర్ణయం. మానసిక పరిణతి, సంసిద్ధత, ఆర్థిక స్వాతంత్య్రమే దానికి అర్హతలు ఎవరికైనా అంటున్నారు నేటి తరం వనితలు! ఆ చర్చే నేటి కథనం..అనూష (పేరు మార్చాం)కు 30 ఏళ్లు. ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేసింది. మంచి కంపెనీలోనే ఉద్యోగం. నచ్చిన కారు కొనుక్కుంది. దేశ, విదేశాలు తిరుగుతూ ప్రపంచాన్ని ఎక్స్΄్లోర్ చేస్తోంది. త్వరలోనే ఫ్లాట్ కొనుక్కోవాలనే ప్లాన్లోనూ ఉంది. తోటివాళ్లంతా అబ్బాయిలు సహా.. ఆమెను ఓ అచీవర్గా చూస్తుంటారు.. ఇన్స్పైర్ అవుతుంటారు. కానీ అనూష తల్లిదండ్రులే దిగులుపడుతూ ఉంటారు. 30 ఏళ్లు వచ్చినా పెళ్లిపేరు ఎత్తట్లేదని, అసలు పెళ్లి ఊసు ప్రస్తావించినా మండిపడుతోందని. బంధువుల పెళ్లిళ్లకు వెళితే ఆ తల్లిదండ్రులను ప్రశ్నలతో ముంచేస్తున్నారు అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా? వయసు మీద పడుతుంటే అమ్మాయిలు లావైపోతారు, ముందుముందు సంతానం కష్టమవుతుంది, అసలు కలగకపోనూ వచ్చు– అంటూ లేని భయాలను సృష్టిస్తున్నారు. అదంతా అమ్మాయి మీద ఒత్తిడిగా మారుతోంది.. ‘నీ తోటి వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోతున్నారు.. నువ్వేమో ఇల్లు కొనాలి, దేశాలు తిరగాలని ఊరేగుతున్నావ్’ అంటూ! ఇది నసలా అనిపించడంతో అనూష.. అమ్మానాన్నల దగ్గరకు రావడమే మానేసింది. ఇక్కడ అనూష ఒక ఉదాహరణ మాత్రమే! అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న అమ్మాయిలు ప్రతి ఇంట్లో ఉంటున్నారు. జీవితంలో సెటిల్ అవడం అంటే అబ్బాయిలకు ఎలాంటి నిర్వచనం ఉందో అమ్మాయిలకూ అలాంటి నిర్వచనమే ఉండాలని కోరుకుంటున్నారు. ఉద్యోగం వచ్చాక కూడా అబ్బాయిలు ఆర్థికంగా స్థిరపడటానికి టైమ్ ఎలా ఇస్తున్నారో అమ్మాయిలకూ ఆ సడలింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు.నిజమే కదా.. చదువు విషయంలో అమ్మాయిలకు అవకాశాలిస్తూ.. బాగా చదివేలా ఇటు కుటుంబాలు, అటు ప్రభుత్వాలూ వాళ్లను ప్రోత్సహిస్తూ మంచి ప్రయత్నానికి నాంది పలికారు. ఇప్పుడా ప్రయత్నం ఫలితాలనిస్తోంది అన్ని రంగాల్లో ఆడవాళ్ల ఉనికి చూపుతూ! మొదలుపెట్టాక గమ్యం చేరాలి కదా! ఆ ప్రయాణంలోనే ఉన్నారు నేటి అమ్మాయిలు. వాళ్లనుకున్న గమ్యం లేదా అచీవ్మెంట్ను సాధించే వరకు వేచి చూడమంటున్నారు. ఆ టైమ్ ఇవ్వమంటున్నారు. పెళ్లిని తమ జీవితాలకు పరమావధిగా చూ పొద్దంటున్నారు.. దానికిమించిన ఆలోచనలు, కార్యాచరణతో ముందుకుసాగుతున్న వాళ్లను మూడుముళ్లతో ఆ పొద్దంటున్నారు. అలాగని వాళ్లు పెళ్లిని వ్యతిరేకించడం లేదు. పెళ్లికి వయసుతో ముడిపెట్టిన సాంస్కృతిక కట్టుబాటును సవాల్ చేస్తున్నారు. వాళ్లు పెళ్లికన్నా తమ ఉద్యోగోన్నతి, మానసిక, భావోద్వేగాల పరిణతి, ఆర్థిక స్వాతంత్య్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లికి వయసు కన్నా మానసిక, ఆర్థిక సంసిద్ధతనే ప్రామాణికంగా చూస్తున్నారు.‘ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేసుకోవాలనేది ఒక మిత్. దాన్నొక కల్చరల్ ఎక్స్పెక్టేషన్లాగే భావిస్తున్నాం మ్యారేజ్ అనేది పర్సనల్ చాయిస్. ఎప్పుడు చేసుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయం. ఇంకా చె΄్పాలంటే పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం కానీ అదే జీవితం కాదు. అరే.. జీవితంలో సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచం చూడండి ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో.. దాంతో పోటీ పడాలి కదా!’ అంటోంది హైదరాబాద్కు చెందిన ఒక బిజినెస్ ఎనలిస్ట్.మరి బయోలాజికల్ క్లాక్ మాటేమిటి? ‘పిల్లలకేం అలాగే అంటారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అన్నారా? పెళ్లి సరైన వయసులో అయితేనే సంతానం కలుగుతుంది. లేకపోతే కనపడ్డ చెట్టు, పుట్టలకు మొక్కినా పిల్లలు పుట్టరు’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ‘అన్యాయం.. ఇలాంటి ఒత్తిళ్లతో అమ్మాయిలను అగౌరవ పరచకూడదు. అమ్మాయి విలువను పెంచేది ఆమె అమ్మ అవడం ఒక్కటే కాదుకదా!’ అని నొచ్చుకుంటున్నారు స్త్రీ వాదులు, సామాజిక విశ్లేషకులు. ‘బయోలాజికల్ క్లాక్ అనేది ఇదివరకటి మాట. ఇది కూడా ఒకరకమైన కల్చరల్ ఎక్స్పెక్టేషనే. సైన్స్ చాలా డెవలప్ అయింది. ఎగ్ ఫ్రీజింగ్ బ్యాంక్లు, ఆంబ్రియో ప్రిజర్వింగ్ సెంటర్సే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు. అవీ వీలుకాకపోతే దత్తత చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇన్ని ప్రత్నామ్యాయాల మధ్య కూడా బయోలాజికల్ క్లాక్ గురించిన భయం, సుదీర్ఘ చర్చ అవసరమా?’ అంటున్నారు ఇంకొంతమంది అమ్మాయిలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాల్సింది కుటుంబాలే! అమ్మాయిలకూ చదువు, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని వాళ్ల ఆశలకు రెక్కలు తొడిగినప్పుడు ఎగిరే స్పేస్నూ ఇవ్వాలి. పెళ్లి విషయంలో వాళ్ల నిర్ణయాలను గౌరవించాలి. వాళ్ల ఆలోచనలను అంగీకరించి తదనుగుణంగా ఇంటి ‘లా’ను మార్చాలి అని చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు. ఊహకందనంతగా సైన్స్ తద్వారా వైద్యరంగంలో మార్పులొస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఎగ్ ఫ్రీజింగ్. అమ్మాయిలు పొటెన్షియల్ ఏజ్లో అండాలను ప్రిజర్వ్ చేసుకోవడమన్నమాట. ఇది.. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉన్న విమెన్కి వరం లాంటిది. ఒకరకంగా చె΄్పాలంటే రి్ర పొడక్టివ్ చాయిస్ని మహిళలు తమ నియంత్రణలో ఉంచుకోవడమన్నమాట. పెళ్లి, పిల్లలతో కెరీర్కి బ్రేక్ పడకుండా నేటి అమ్మాయిలకు యూజ్ఫుల్గా ఉంటోందీ ప్రక్రియ. దీనివల్ల వయసు అయిపోతోంది పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పిల్లలు పుట్టకపోయే ప్రమాదం ఉండొచ్చు వంటి భయాలకు చోటు లేదు. అంటే బయోలాజికల్ క్లాక్ ప్రెజర్ లేకుండా జీవితంలో వాళ్లనుకున్న లక్ష్యాల మీద మనసు పెట్టే వీలును కల్పిస్తుందిది. అంతేకాదు కెరీర్లో, పర్సనల్ చాయిసెస్లో జెండర్ ఈక్వాలిటీనీ సపోర్ట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రతికూల ప్రభావాలూ లేకపోలేదు. – డాక్టర్ ఆకుల దివ్య, ఎమ్డి, హైదరాబాద్ – సరస్వతి రమ

సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. కొత్త పుంతలు
ఒకప్పటి ఉద్యానాల భాగ్యనగరం.. ఇప్పుడు ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్’గా ప్రసిద్ధి చెందుతోంది. ఇంటిపంట కొత్త పుంతలు తొక్కుతోంది. నగరం కేంద్రంగా ఇంటి పంటల సంస్కృతి దేశ, విదేశాలకు విస్తరించింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే సుమారు 70 వేల మందికి పైగా టెర్రస్ గార్డెనర్స్ భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. డాబాలు, బాల్కనీలు తదితర ప్రాంతాల్లో సుమారు 15వేల చదరపు గజాలకు పైగా విస్తీర్ణంలో ఇంటి పంటలను పండిస్తున్నట్లు అంచనా. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇళ్లపై సాగు చేస్తున్నారు. నగర టెర్రస్లపై ఆరోగ్య సిరులు కురిపిస్తున్న ఇంటి పంటలు సామాజిక మాధ్యమ వేదికలుగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి.బ్రిటన్, అమెరికా, సింగపూర్, జర్మనీ, ఆ్రస్టేలియా తదితర దేశాల్లోని తెలుగువాళ్లు అన్ని రకాల కూరగాయలను తమ ఇళ్లపై పండించుకొని ఇంటిపంట రుచిని ఆస్వాదిస్తున్నారు. 2019లో కేవలం 30 మంది సభ్యులతో ఏర్పడిన ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ సమూహం ఇప్పుడు 70,000 సంఖ్య దాటింది. వందల కొద్దీ వాట్సాప్ గ్రూపులు ఇంటిపంటల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. కొత్త తరహా పంటలను పరిచయం చేస్తున్నాయి. ఇంటిపంట సంస్కృతి దైనందిన జీవితంలో ఒక భాగమైంది. స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలతో ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. స్ట్రాబెర్రీ గ్రూపుతో ఆరంభం.. ‘మనం ఏం తింటామో అది మనమే పండించుకుందాం’ అనే నినాదంతో 6 సంవత్సరాల క్రితం నగరంలో 30 మంది సభ్యులతో ‘స్ట్రాబెర్రీ’ గ్రూప్ ప్రారంభమైంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట మాత్రమే పండే స్ట్రాబెర్రీలను టెర్రస్లపై పెంచే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్ హార్కర కన్వీకర్గా, ఈదల సరోజ కో– కన్వీనర్గా ఈ గ్రూపు సేవలు మొదలయ్యాయి. కేవలం 500 స్ట్రాబెర్రీ మొక్కలను తెప్పించి అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అనూహ్యంగా 5,600 మొక్కల కోసం ఆర్డర్లు వచ్చాయి. స్ట్రాబెర్రీ గ్రూపు వేగంగా విస్తరించింది. ఈ సమూహమే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)గా అవతరించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్ తదితర నగరాలతో పాటు విదేశాలకు విస్తరించింది. ఇంటి పంటలపై అనుభవాలను పంచుకొనేందుకు అవగాహనను పెంచుకొనేందుకు వేలాది మంది ఆసక్తి కనబర్చారు. సాధారణ కూరగాయలు, ఆకుకూరలతో పాటు కూరగాయల్లోనే ఎంతో విలువైన ఆగాకర, కాసర దుంపలు, పెన్సిల్ దొండ పాదులు వంటి వెరైటీ మొక్కలను సీటీజీ హైదరాబాద్ గార్డెనర్స్కు పరిచయం చేసింది. వంగ, మిర్చి, టమాటా, కాప్సికం, బీర, సొర, కాకరలలో అధిక దిగుబడినిచ్చే రకాలను నగరంలో అభివృద్ధి చేశారు.ఎన్నెన్నో వెరైటీలు.. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (city of terrace gardens) ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కింది. గ్రీన్ చామంతి, తెల్ల బంతి వంటి వెరైటీలు నగరంలో విరబూస్తున్నాయి. ఇక్కడి వాతావరణానికి అనుకూలమైన రెండు రకాల యాపిల్ మొక్కలను పెంచారు. మేఘాలయ ప్రభుత్వం ధ్రువీకరించిన లక్డంగ్ పసుపు హైదరాబాద్లో మిద్దెతోటలపై పండుతోంది. మొక్కలకు అవసరమైన జీవన ఎరువులు, ఘన, ద్రవ రూప ఎరువులు సిటీ ఆఫ్ గార్డెనర్స్ అందజేస్తోంది. నగర వాసులు తమ కూరగాయలు తామే పండించుకొని అందరూ కలిసి ఆరోగ్యాన్ని పంచుకొనేలా సీటీజీ అనేక కార్యక్రమాలను చేపట్టింది. మొక్కల పెంపకం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గార్డెన్ విజిట్స్, ఫార్మ్ విజిట్ ట్రిప్స్, ఫీల్డ్ ట్రిప్స్, సీడ్ బాల్స్ వంటి వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పది పాదులు ఉంటే చాలు.. ‘కేవలం పది పాదులకు సరిపడా కుండీలను ఏర్పాటు చేసుకోగలిగితే ఏడాది పాటు ఇంటి అవసరాలకు కావాల్సినన్ని పండించుకోవచ్చు. ఆయా కాలాలకు అనుగుణమైన కూరగాయలను, ఆకుకూరలను 365 రోజులు పండించుకొనేలా ప్రత్యేమైన అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు సీటీజీ కో– కన్వీర్ సరోజ. కొత్తగా ఇంటిపంట ప్రారంభించేవారికి శిక్షణనిస్తున్నారు. అవసరమైన కుండీలు, టబ్బులు, మొక్కలు, ఎరువుల వినియోగం, మొక్కలకు వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ శిక్షణ దోహదంచేస్తోందని ఆమె చెప్పారు. కేబీఆర్ పార్కు, పబ్లిక్ గార్డెన్స్, అగ్రి–హార్టీకల్చరల్ సొసైటీ, తెలంగాణ ఉద్యానశాఖ, జీహెచ్ఎంసీ తదితర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఇంటి పంట ఉద్యమంలో భాగస్వాములుగా నిలిచాయి. సీటీజీ సమావేశాల్లో రిటర్న్ గిఫ్ట్ల రూపంలో వివిధ రకాల మొక్కలు, సేంద్రియ విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు.చదవండి: తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వున్న గింజలుఇంటింటా ఓ మిద్దెతోట.. నగరంలో మిద్దెతోట (Midde Thota) చాలాకాలంగా విస్తరిస్తోంది. కేవలం కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలే కాకుండా కొంతమంది ప్రత్యేక అభిరుచితో చిన్న చిన్న ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటిపై చేపల పెంపకాన్ని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. ధాన్యం పండిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఇంటిపంటల పట్ల అభిరుచి ఉన్నవాళ్లందరిని ఒక గొడుగు కిందకు తెచ్చి ఇంటిపంట సంస్కృతికి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ నూతన ఒరవడిని తెచ్చింది.చాలా వెరైటీలు పెంచుతున్నారు హైదరాబాద్లో అన్నా వెరైటీ, హెచ్ఆర్ఎం యాపిల్ మొక్కలు పెంచారు. స్ట్రాబెర్రీతో పాటు బ్లాక్ బెర్రీ, ఇంగువ, కర్పూరం, ఇలాచీ దాల్చిన చెక్క ఆల్ స్పైసెస్ ప్లాంట్ వంటివి మన టెర్రస్లపై గుబాళిస్తున్నాయి. 2021 వరకు కూడా 5000 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత నాలుగేళ్లలోనే 70 వేల మందికి పైగా చేరారు. – ఈదల సరోజ, కో– కన్వీనర్, సీటీజీ

Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు
యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా యోగాను సాధన చేయడం వలన సుదీర్ఘ అనారోగ్యాలనుంచి బయటపడటం సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆధునిక కాలంలో పెద్ద సమస్యగామారిన అధిక బరువును కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వాటిలో కొన్నింటిని చూద్దాం. సూర్య నమస్కారాలు, విన్యాస యోగ, ఉత్కటాసన, ఉష్ట్రసన, సేతు బంధాసన, తడసన , నవాసన వంటివి బరువు తగ్గడానికి, కొన్ని యోగాసనాలు సహాయపడతాయి.సూర్య నమస్కారాలు: బరువు తగ్గడానికి హృదయ సంబంధ ఆరోగ్యానికి సహాయపడతాయి. విన్యాస యోగ: కేలరీలను బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది,. ఉత్కటాసన: ఈ ఆసనం కాళ్ళు , తుంటిని బలోపేతం చేస్తుంది, పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఉష్ట్రాసన: ఒంటె భంగిమ, ఇది బరువు తగ్గడానికి సహాయపడే ఒక సమగ్ర వ్యాయామం,. సేతు బంధాసన: ఈ ఆసనం బరువు నిర్వహణకు సహాయపడుతుంది. తడాసన: ఇది పర్వత భంగిమ అంటారు. బాలెన్స్ను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నవాసన: ఇది పొత్తికడుపు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ధనూరాసన: వెన్ను, ఛాతి, నడుము, చేతులు, పొత్తి కడుపు, కాళ్లకు మేలు జరుగుతుంది. ఫిట్నెస్ మెరుగవుతుంది. ధనస్సులా శరీరానికి వంచే ఫ్లెక్సిబులిటీ పెరిగి జీవక్రియ వేగవంతమై వెయిట్ లాస్కు ఈ యోగాసనం తోడ్పడుతుంది.వీటితో పాటు ఆహార నియమాలు, నడక లాంటి చిన్నపాటి వ్యాయామాలు చేస్తే మరింత త్వరగా ఫలితం లభిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతిమంగాఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.యోగాసనాలు ఎలా వేయాలి అనేది యోగా నిపుణుల ద్వారాగానీ, నమ్మకమైన యాప్ ద్వారా గానీ నేర్చుకోవాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

Bangui: స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి
బంగుయ్: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగుయ్లోని బార్తెలెమీ బోగాండా హై స్కూల్లో గురువారం ( జూన్ 26)న ఘోర ప్రమాదం జరిగింది.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా విద్యార్థులు భయంతో పరుగులు తీయగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 260 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో 16 మంది బాలికలు ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 5,000 మంది విద్యార్థులు పరీక్షల కోసం అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. గాయపడిన విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఆ దేశ విద్యా చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా నిలిచింది.#Breaking Une #bousculade suite à une explosion de transformateur fait une dizaine de morts cet après-midi au lycée Barthélémy #Boganda de #Bangui en #Centrafrique 🇨🇫. De nombreux blessés ont été transportés vers des hopitaux proches. pic.twitter.com/5loUFDnh5n— KOUAM JOEL HONORE (@honore123) June 25, 2025

Shubhanshu Shukla: ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు
సాక్షి,ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. #Ax4's @SpaceX Dragon spacecraft docked with the @Space_Station at 6:31am ET (1031 UTC). Next, the mission crew and our NASA astronauts will prepare to open the hatches. pic.twitter.com/Qj1sgy7RzC— NASA (@NASA) June 26, 2025అమెరికా టూ అంతరిక్షంభారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. (Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’)అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అయ్యింది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. LIVE: @Axiom_Space's #Ax4 mission, with crew from four different countries, is about to launch to the @Space_Station! Liftoff from @NASAKennedy is targeted for 2:31am ET (0631 UTC). https://t.co/yBgO8bxb6Z— NASA (@NASA) June 25, 202514 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.రాకేశ్ శర్మ తర్వాత శుభాంశు శుక్లారాకేశ్ శర్మ భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి. ఆయన 1984లో సోవియట్ యూనియన్కు చెందిన సోయుజ్ టి-11 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆయన మొత్తం 7 రోజులు 21 గంటలు 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన భారతదేశాన్ని అంతరిక్షం నుంచి పరిశీలించి, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.రాకేశ్ శర్మ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన రెండో భారతీయుడే ఈ శుభాంశు శుక్లా. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్న సందర్భంలో రాకేశ్ శర్మే తనకు స్పూర్తంటూ శుభాంశు శుక్లా పేర్కొన్నారు. 1984లో రాకేశ్ శర్మను చూసి ఎంతోమంది యువత అంతరిక్షం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పుడు శుభాంశు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ, తదుపరి తరం భారతీయులకు ప్రేరణగా నిలిచారు.

ఉమ్మడి ప్రకటనపై సంతకానికి నో
ఖింగ్డావో: ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు గురువారం ముగిసింది. 26 మంది పర్యాటకులను బలితీసుకున్న పహల్గాం ఉగ్రవాద దాడితోపాటు భారత్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదం, ముష్కరుల దాడుల పట్ల భారత్ ఆందోళన గురించి ఈ ప్రకటన ముసాయిదాలో మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో స్థానిక వేర్పాటువాద ఉద్యమకారులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక భారత్ హస్తం ఉండొచ్చనే వాదనను ఈ జాయింట్ డాక్యుమెంట్ ముసాయిదాలో పొందుపర్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సంతకం చేసేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఫలితంగా ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే ఎస్సీఓ సదస్సును ముగించాలని నిర్ణయించారు. చైనాలోని తీరప్రాంత నగరం ఖింగ్డావోలో ఎస్సీఓ దేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చైనా ఆతిథ్యం ఇచి్చన ఈ సదస్సులో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చేపట్టిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.🚨Breaking News: Rajnath Singh refused to sign the SCO joint statement. Why? Pakistan and China tried to weaken the conversation on terrorism. India stood firm on PulwamaAnd Rajnath Singh maintained a strong anti-terror stance#scosummit #RajnathSingh pic.twitter.com/ujsP9JiO9I— Priyanshi Bhargava (@PriyanshiBharg7) June 26, 2025 పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఇండియాలో అశాంతి సృష్టించాలన్న లక్ష్యంతో సీమాంతర పొరుగుదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్పై మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ ఆర్థికంగా అండగా నిలస్తోందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధానంగా మార్చుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాదులను ఏరిపారేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాల పాటించొద్దని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు ఏమాత్రం వెనుకాడొద్దని షాంఘై సహకార సంస్థకు సూచించారు. ఉగ్రవాదులను, వారి పోషకులను చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు.

ఇరాన్ ప్రజల ఆందోళన.. ఖమేనీ ఎక్కడ?
టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా సైతం ఆకస్మిక దాడులకు దిగింది. దీంతో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతోందా? అన్న భయాందోళన నెలకొంది. కానీ, అనూహ్య పరిణామాలతో యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. అయితే, వారం రోజులుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటి వరకు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అదృశ్యమయ్యారు. వారం రోజులుగా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా ఖమేనీ వాయిస్ కూడా బయటకు వినిపించలేదు. దీంతో ఇరాన్ నేతలు, ప్రజలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, యుద్ధం ప్రారంభం తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీని రహస్య భూగర్భ బంకర్కు తరలించారని వార్తలు బయటకు వచ్చాయి. ఆయనను ఎవరూ టార్గెట్ చేయకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు దూరంగా ఉంచినట్టు సన్నిహిత అధికారులు చెబుతున్నారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు కూడా ఆయనతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మంగళవారం ప్రైమ్-టైమ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ షో హోస్ట్ ఖమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి అడిగారు. ఈ సందర్భంగా ప్రజలు సుప్రీం లీడర్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మాకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కానీ ఫజేలీ.. మాత్రం ఆ ప్రశ్నను పక్కనపెట్టి మనమందరం ప్రార్థన చేయాలి. సుప్రీం లీడర్ను రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.చావుకు భయపడే మనిషి కాదు.. ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచ్చితంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం దొరకకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు.
జాతీయం

వీడియో: నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 2లోని ఓ ప్రైవేట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.భారీగా మంటలు వ్యాపించడంతో అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, గత వారం రోహిణిలోని రిథాల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.#WATCH | Uttar Pradesh | Updated visuals: A fire breaks out at a private firm in Noida Sector 2. Fire tenders are at the spot. Fire being doused. https://t.co/PJBThX8uSH pic.twitter.com/vPSt1vMoFk— ANI (@ANI) June 27, 2025

గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో ఆరో తరగతి బాలిక హఠాన్మరణం.. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా అధికమయ్యాయి. నూరేళ్ల జీవితం కళ్లముందే ఆవిరైతే కన్నవారి ఆవేదన మిన్నంటుంతోంది. ఈ కడుపు కోతకు పరిష్కారమే లేదా అని ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు కొన్ని పరిశోధనలు చేసి మొబైల్ఫోన్తో పాటు మరికొన్ని లింకులు ఉన్నట్లు తేల్చారు. కర్ణాటక: హాసన్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అర్ధాంతరంగా కన్నుమూసింది. బెంగళూరులో నివాసం ఉంటున్న సుప్రియా (22) గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు విడిచింది. దీంతో గత నెలరోజుల్లో గుండెపోటుతో చనిపోయిన హాసన్వాసుల సంఖ్య 14కు పెరిగింది. సుప్రియా హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా కట్టళ్లి వాసి, బెంగళూరు బ్యాటరాయనపురలో నివాసం ఉంటూ కర్ణాటక ఓపెన్ వర్శిటీలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఇంటిలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలింది. కుటుంబీకులు ఆస్పత్రి తరలిస్తుండగా దారిలో మరణించింది.

పొద్దున్నే లేవలేను.. పోలీసు ఉద్యోగం వొద్దు!
డియోరియో: పోలీసు శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో యూపీ పోలీసు నియామకాలు మరోసారి నిరూపిస్తున్నాయి. నాలుగు గంటలకు తాను నిద్ర లేవలేనని, ఈ పోలీసు ఉద్యోగం తనకొద్దని చెబుతున్నాడో పోలీసు. ఉత్తరప్రదేశ్లో కొత్తగా కానిస్టేబుల్ నియామకాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి నియామక లేఖలు అందుకున్నారు. అయితే.. శిక్షణ ఐదవ రోజునే ఓ కానిస్టేబుల్ తన తండ్రితో కలిసి డియోరియాలోని ఎస్పీ కార్యలయానికి వచ్చాడు. ఎస్పీ విక్రాంత్ వీర్ను కల్పించాలని కోరాడు. కారణం ఏమిటని ఎస్పీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) డాక్టర్ మహేంద్ర కుమార్ అడగగా.. తనకు ఉదయం త్వరగా నిద్రలేవడం అలవాటు లేదని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు... ఉదయం 8 గంటల వరకు నిద్రపోయే అలవాటు ఉందని, రోజంతా కఠినమైన శిక్షణ తనకు చాలా కష్టంగా ఉందని వెల్లడించాడు. తన కుమారుడికి బీఎడ్ డిగ్రీ కూడా ఉందని, ఆయన ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటున్నాడని అభ్యర్థి తండ్రి తెలిపాడు. పోలీసు శిక్షణలో శారీరక కఠినత్వం తన కొడుకును పెద్దగా ఉత్సాహపరచలేదని చెప్పాడు. అయితే, కౌన్సెలింగ్ నిర్వహించిన పీఆర్వో మహేంద్ర కానిస్టేబుల్కు నచ్చజెప్పి ఒప్పించాడు. శిక్షణా సెషన్లలో ఇటువంటి సమస్యలు సహజమని, తరువాత అంతా సాధారణంగా ఉంటుందని చెప్పారు. చివరికి మనసు మార్చుకున్న కానిస్టేబుల్ ఎస్పీని కలవకుండానే శిక్షణకు వెళ్లిపోయాడు.

బ్లాక్బాక్స్ నుంచి డేటా సేకరణ షురూ
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో ఈ నెల 12న చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(ఏఏఐబీ) నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని కేంద్ర పౌర విమానయానశాఖ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన బ్లాక్బాక్స్ను ఢిల్లీకి తరలించినట్లు తెలిపింది. ఈ బృందంలో ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏటీసీ అధికారి, బోయింగ్ విమానాల తయారీ, డిజైన్ను రూపొందించిన అమెరికా సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) ప్రతినిధులు ఉంటారని పేర్కొంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్) రెండూ ఏఏఐబీ) ఆధీనంలో ఉన్నాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ‘ఈ నెల 25న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ యుగంధర్ సారథ్యంలోని బృందం ఏఏఐబీ, ఎన్టీఎస్బీకి చెందిన సాంకేతిక సభ్యులు సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (సీపీఎం)ను సురక్షితంగా వెలికి తీశారు. మెమరీ మాడ్యూల్ను విజయవంతంగా తెరిచాం. డేటాను ఏఏఐబీ ల్యాబ్లో డౌన్లోడ్ చేశాం. కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), విమాన డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) విశ్లేషణ మొదలైంది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునరి్నర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది’అని పౌర విమానయాన శాఖ తెలిపింది.
ఎన్ఆర్ఐ

Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు
Air India plane crash అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమానం 171 ప్రమాదంలో ఘోర ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాంలో విమాన ప్రయాణికులతోపాటు, అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత వైద్య విద్యార్థులు ,వైద్యుల కుటుంబాలను ఆదుకోవడానికి యుఏఈలో ఉండే భారతీయ డాక్టర్ షంషీర్ వాయాలిల్ (Indian doctor Shamshir Vayalil) ముందుకొచ్చారు. సుమారు రూ. 6కోట్ల (2.5 మిలియన్ దిర్హామ్ సహాయాన్ని ప్రకటించారు..కేరళకు చెందిన వైద్యుడు బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ , VPS హెల్త్కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వాయలిల్ మానవ్, ఆర్యన్, రాకేష్ , జైప్రకాష్లను "భవిష్యత్ ఫ్రంట్లైన్ హీరోలు" అంటూ వారికి నివాళి అర్పించారు. స్వయంగా మెడికల్ హాస్టల్లో చదువుకున్న ఆయన వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. భోజనం తింటున్న సమయంలో హాస్టల్లో జరిగిన ప్రమాదంలపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యుల కుటుంబాలకు అండగా నిలబడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచే ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షల అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా డా. షంషీర్ ప్రకటించిన సాయం త్వరలోనే అందనుంది.They were future frontline heroes.Manav, Aaryan, Rakesh, and Jaiprakash were preparing to save lives, not lose their own. The AI171 crash took them from us. Pledging ₹6 crore to support their families and others affected.#AirIndia171 #AI171 #BJMedicalCollege pic.twitter.com/Jh0vivpstJ— Dr. Shamsheer Vayalil (@drshamsheervp) June 16, 2025ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట. తాను హాస్ట్లో ఉంటూ చదువుతకుంటూ రోజులను తలచుకున్న ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారట. వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు (Mangalore)లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నై(Chennai)లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ హాస్టళ్లలో ఉన్నారట. స్వయంగా వాయలిల్ అల్లుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ యజమాని M.A. యూసుఫ్ అలీ తెలిపారు. మరోవైపు బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన వాయలిల్ తన దాతృత్వాన్ని చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, బుర్జీల్ హోల్డింగ్స్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు.ఇదీ చదవండి: Cancer Risk ఈ ఫుడ్స్తో ముప్పే..!డాక్టర్ వార్నింగ్కాగా లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 ,జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అతుల్య హాస్టల్ కాంప్లెక్స్లో కూలిపోయింది. ఈఘటనలో మెడికల్ కాలేజీ (BJMC) మెస్ భవనంలో భోజనం చేస్తుండగా మరణించిన వారి సంఖ్యను BJMC జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JDA) ధృవీకరించింది . ప్రమాదంలో మరో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపింది. వారిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన చికిత్స పొందుతున్నారని DA అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేటి తెలిపారు. విద్యార్థుల ప్రాణనష్టంతో పాటు, "అతుల్యం" నివాస గృహాలలో నివసిస్తున్న సూపర్-స్పెషాలిటీ వైద్యుల నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక నివాస వైద్యుడి భార్య గాయపడి చికిత్స పొందుతోంది.

ఆలస్యం చేయొద్దు.. తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు అడ్వైజరీ
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు(Indians In Iran) ఇండియన్ ఎంబసీ తాజాగా మంగళవారం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని భారతీయులు.. తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నెంబర్లు +98 9010144557, +98 9128109115, +98 9128109109 లకు తమ వివరాలు తెలియజేయాలని కోరింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్పై ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ‘‘ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి’’ అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. విమాన మార్గం మూసేయడంతో.. ఇప్పటికే 100 మందితో కూడిన తొలి బృందాన్ని టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారత్కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎల్లప్పుడూ టచ్లో ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని కోరింది. ఇదీ చదవండి: యుద్ధం ముగిసేది అప్పుడే.. ఇజ్రాయెల్ స్పష్టీకరణ

అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా తెలుగమ్మాయి
అమలాపురం టౌన్: అమెరికా దేశం వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం అమ్మాయి చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్గా నిలిచింది. ఆమె కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ మనమరాలు. అమెరికాలోని ఆ స్కూల్లో శనివారం జరిగిన కాన్వగేషన్లో శ్రీకావ్యకు ఎమ్మెస్ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రదానం చేశారు. శ్రీకావ్య ఇప్పటికే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసింది.హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంటెక్, స్వీడన్ బ్లెకింజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి టెలీ కమ్యూనికేషన్స్ సిస్టమ్లో ఎమ్మెస్ డిగ్రీ చేసింది. కోచ్ కోడ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ చేసింది. ఈ ఇనిస్టిట్యూట్లో శ్రీకావ్య ఆటోమేషన్ ఆఫ్ క్లౌడ్ హాస్టెడ్ అప్లికేషన్స్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. ఈమె స్పోర్ట్స్లో కూడా విజేతే. జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్గా, తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత పది మీటర్ల మహిళా షూటింగ్ చాంపియన్ షిప్ గెలుచుకుంది. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది.
క్రైమ్

మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్ సలీం
సాక్షి, సిటీబ్యూరో/పహాడీషరీఫ్: అసలు పేరు మహ్మద్ సలీం... మారు పేరు సునీల్శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే సునీల్ గత నెల 5న జైలు నుంచి బయటకు వచ్చాడు... మరో రెండు నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజం ఈ సునీల్ శెట్టి నైజం. ఈ ఘరానా దొంగను బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ గురువారం వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్ఘాట్లోని ఓ హోటల్లో కారి్మకుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్పాస్ చేస్తాడు. చిన్న టార్చ్లైట్, కటింగ్ ప్లేయర్తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలకు వెళ్లాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి.

తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు
మంచిర్యాల: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దర్బాతాండకు చెందిన ఆడె నటరాజన్కు 2021లో మామడ మండలం గాయిది పల్లకి చెందిన సుజాత (25)తో వివాహమైంది. మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నటరాజన్ కోరమండల్ కంపెనీలో పనిచేస్తుండగా సుజాత టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో గొంతునొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరచూ అదనపు కట్నంకోసం వేధిస్తుండేవాడని, ఈక్రమంలో హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కాజల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. కాగా బోథ్ నుంచి మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్కు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.

ఛీ.. వీడేం టీచర్.. టెన్త్ నుంచి వేధింపులు.. పెళ్లి తర్వాత..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో చదివే బా లికను వేధించి, లోబర్చుకొని శారీరకంగా వాడుకున్న ఇంగ్లిష్ టీచర్ సాతూరి మధుకర్(52)కు 17 ఏళ్ల కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ ఫాస్ట్ట్రాక్ స్పెషల్ జడ్జి సునీత తీర్పు చెప్పారు. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉండే మధుకర్ 2013లో కాల్వశ్రీరాంపూర్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పని చేశాడు. ఆ సమయంలో 10వ తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బలవంతంగా లో బర్చుకున్నాడు. రాత్రి క్లాస్ల పేరిట స్కూల్కు పిలిచి స్టాఫ్ రూమ్లో చాలాసార్లు శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నను చంపేస్తానని బెదిరించాడు. తర్వాత బాలిక హనుమకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలో మధుకర్ అక్కడి కూడా వెళ్లి ఆమెను భయపెట్టి శారీరకంగా వాడుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను పిలిచినప్పుడల్లా రాకుంటే ఫొటోలు, వీడియోలు అందరికీ పంపిస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెకు పెళ్లయినా వదిలిపెట్టలేదు. ఆమె భర్తకు ఫోన్లో ఫొటోలు, వీడియోలు పంపించాడు. అవి చూసిన ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై ఎస్కే జానీపాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని రిమాండ్కు పంపించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేశ్ సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు. జడ్జి సునీత సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడికి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు.

క్రెడిట్ కార్డు నోటీసులకు భయపడి..
నిజామాబాద్: క్రెడిట్ కార్డు నోటీసులు రావడంతో ఆందోళన చెందిన ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బండాగల్లీకి చెందిన బశప్ప (35) క్రెడిట్ కార్డుపై రూ.70 వేలు అప్పు చేసాడు. గడువు దాటినా అప్పు చెల్లించకపోవడంతో బశప్పకు నోటీసులు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన బశప్ప గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్లంబర్గా పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.