breaking news
bristal
-
చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. ప్రపంచ రికార్డు
భారత క్రికెటర్ రిచా ఘోష్ (Richa Ghosh) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక స్ట్రైక్రేటుతో వెయ్యి పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి ప్లేయర్గా నిలిచింది. ఇంగ్లండ్తో రెండో టీ20 (England Women vs India Women) సందర్భంగా రిచా ఘోష్ ఈ ఘనత సాధించింది.కాగా భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటింగ్హామ్లో ఆతిథ్య జట్టును 97 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. తాజాగా రెండో టీ20లోనూ అదరగొట్టింది.బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో నాట్ సీవర్-బ్రంట్ బృందాన్ని ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యం సంపాదించింది.దంచికొట్టిన అమన్జోత్, రిచాఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (13), షెఫాలీ వర్మ (3) నిరాశపరిచినా.. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ శతకం (41 బంతుల్లో 63)తో మెరిసింది.ఇక రెండో టీ20తో తిరిగి వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (1) తీవ్రంగా నిరాశపరచగా.. ‘ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్’ అమన్జోత్ కౌర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ దంచికొట్టారు. అమన్జోత్ 40 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. మరోవైపు.. రిచా ఘోష్ 20 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో నాటౌట్గా ఉంది.తొలి మహిళా క్రికెటర్గా ప్రపంచ రికార్డుఈ క్రమంలోనే రిచా అరుదైన రికార్డులు తన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 140కి పైగా స్ట్రైక్రేటుతో ఈ ఘనత సాధించింది. తద్వారా మహిళల అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో (T20 Format) ఈ ఫీట్ నమోదు చేసిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించింది.ఫాస్టెస్ట్ 1000.. రెండో ప్లేయర్గాఅదే విధంగా.. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో బంతుల పరం (702)గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో మహిళా క్రికెటర్గానూ రిచా ఘోష్ నిలిచింది. అంతకుముందు ఐల్ ఆఫ్ మ్యాన్కు చెందిన లూసీ బార్నెట్ 700 బంతుల్లో ఈ ఘనత సాధించింది.కాగా పదహారేళ్ల వయసులో 2020లో రిచా టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసింది. ఇప్పటికి 64 మ్యాచ్లలో కలిపి 1029 పరుగులు సాధించింది. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. 21 ఏళ్ల రిచా 37 వన్డేల్లో 800, రెండు టెస్టు మ్యాచ్లలో కలిపి 151 పరుగులు సాధించింది.ఇంగ్లండ్ను మరోసారి ఓడించిన భారత్ఇక ఇంగ్లండ్తో రెండో టీ20 విషయానికొస్తే.. భారత్ విధించిన 182 లక్ష్యాన్ని ఛేదించడంలో ఆతిథ్య జట్టు విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసిన ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. టామీ బీమౌంట్ హాఫ్ సెంచరీ (54) చేయగా.. మిగతా వారిలో ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. స్నేహ్ రాణా- రాధా యాదవ్, స్మృతి మంధాన- రిచా ఘోష్ జోడీలు రెండు రనౌట్లలో భాగమయ్యాయి.అత్యుత్తమ స్ట్రైక్రేటుతో మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్లు🏏రిచా ఘోష్ (ఇండియా)- 143.11 స్ట్రైక్రేటుతో 1029 రన్స్🏏లూసీ బార్నెట్ (ఐల్ ఆఫ్ మ్యాన్)- 139.69 స్ట్రైక్రేటుతో 1172 రన్స్🏏తాహిలా మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 132.94 స్ట్రైక్రేటుతో 132.94 రన్స్🏏క్లో టైరాన్ (సౌతాఫ్రికా)- 132.81 స్ట్రైక్రేటుతో 1283 రన్స్🏏అలీసా హేలీ (ఆస్ట్రేలియా)- 129.79 స్ట్రైక్రేటుతో 3208 రన్స్చదవండి: సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్లో టీమిండియా యువ సంచలనం ఆల్రౌండ్ షో -
సిరీస్ కైవసం: ‘వరల్డ్ కప్నకు ముందే ఆ లోపాలు సవరించుకోవాలి’
బ్రిస్టల్/ఇంగ్లండ్: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డే వర్షంతో రద్దయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 2–0తోనే సిరీస్ను సరిపెట్టుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 41.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. షనక (48 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ టామ్ కరన్ (4/35) రాణించాడు. ఇన్నింగ్స్ విరామంలో మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... ‘‘ఈరోజు కూడా మేమే పైచేయి సాధించాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉండే మజాను ఆస్వాదించాం. మా ఆటగాళ్లంతా ఎంతో పట్టుదలగా నిలబడ్డారు. సమిష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. విల్లీ అద్భుతంగా రాణించాడు. వరల్డ్ కప్-2019లో అతడు భాగస్వామ్యం కాలేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇక టామ్ కరన్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లో తను విఫలమైనా.. నేడు 4 వికెట్లతో సత్తా చాటాడు. అయితే, మేం డెత్ ఓవర్ల బౌలింగ్పై మరింత దృష్టి సారించాల్సి ఉంది. మిడిల్ ఓవర్స్లో కూడా నిలకడగా ఆడాల్సి ఉంది. ప్రపంచకప్నకు ముందే ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలి. పాకిస్తాన్తో ప్రారంభం కాబోయే సిరీస్ కోసం సన్నద్ధమవుతాం’’ అని చెప్పుకొచ్చాడు. Oh @jbairstow21! 😱 Scorecard/clips: https://t.co/litP0weU1U 🏴 #ENGvSL 🇱🇰 pic.twitter.com/AS1y93rmpM — England Cricket (@englandcricket) July 4, 2021 We need 167 to win 🏏 Scorecard/clips: https://t.co/litP0vXjam 🏴 #ENGvSL 🇱🇰 pic.twitter.com/QGFTHIJHTa — England Cricket (@englandcricket) July 4, 2021 -
వన్డే సమరానికి ‘సై’
బ్రిస్టల్: ఏడేళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్తో చక్కని పోరాటపటిమ కనబరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. ఈ మ్యాచ్తో భారత టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. 2019లో టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు శ్రీకారం చుట్టిన ఈ హరియాణా టాపార్డర్ బ్యాటర్ ఇంగ్లండ్ గడ్డపైనే ఇటీవల ఏకైక టెస్టు ఆడింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధసెంచరీ (96, 63)లతో అదరగొట్టిన షఫాలీ ఇప్పుడు వన్డే కెరీర్కు గొప్ప ప్రారంభం ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్లిష్టమైన ప్రత్యర్థి. కెప్టెన్ హెదర్నైట్, బీమోంట్లతో పాటు బ్యాటింగ్ ఆల్ రౌండర్లు సీవర్, సోఫియా రాణిస్తే భారత్కు కష్టాలు తప్పవు. బౌలింగ్లో కేట్ క్రాస్, ఎకిల్స్టోన్, ష్రబ్సోల్లతో ఈ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్తో ఇప్పటివరకు 71 మ్యాచ్ల్లో తలపడిన భారత్ 30 మ్యాచ్ల్లో గెలిచింది. 37 మ్యాచ్ల్లో ఓడింది. మరో నాలుగు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. -
జంక్ ఫుడ్తో చూపు, వినికిడి కోల్పోయిన యువకుడు
చేత్తో మనసారా గోరు ముద్దలు పెట్టి తినిపిస్తే చాదస్తం అనుకుంటున్నారు. ఓ స్పూన్ చేత్తో పట్టుకుని నూడుల్స్ తింటే మావాడు ఎంత బాగా తింటున్నాడో అంటూ పిల్లల్ని చూసి తెగ మురిసిపోతున్నారు. ఇంట్లో చేసిన ఎంత కమ్మనిన వంటకమైనా మొహం తిప్పుకుంటారు. కానీ అష్టరోగాలు తెచ్చే జంక్ఫుడ్ను మాత్రం ఆవురావురుమంటూ తింటారు నేటి పిల్లలు. తిన్నంత సేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాతే.. దాని అసలు పైత్యాన్ని చూపిస్తుంది. ఇందుకు ఈ ప్రత్యక్ష ఉదాహరణ సాక్ష్యంగా నిలిచింది. జంక్ఫుడ్ తినే అలవాటుతో జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాడు ఓ యువకుడు. వివరాలు.. లండన్ : ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో ఓ యువకుడు ఏడేళ్ల వయసు నుంచి జంక్ఫుడ్ మాత్రమే తీసుకునేవాడు. పండ్లు, కూరగాయలు అస్సలు ముట్టుకునేవాడు కాదు. స్కూలుకు వెళ్లేప్పుడు తల్లి లంచ్ బాక్స్లో రోజూ పండ్లు, ఇతర పోషకాహార పదార్ధాలు పెట్టినా వాటిని ముట్టుకోక సాయంత్రం లంచ్ బాక్సును అలాగే తెచ్చేవాడు. రోజూ ఇంటికి దగ్గర్లో ఉన్న దుకాణం నుంచి చిప్స్, సాసర్, వైట్ బ్రెడ్, ప్రాసెస్డ్ మాంసాహారంలను మాత్రమే తీసుకొని తింటుండడంతో పంతొమ్మిదేళ్లు వచ్చేసరికి అంధత్వం వచ్చింది. దాంతో పాటు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఇటీవల ఆ యువకుడు పై చదువుల నిమిత్తం ఐటీ కోర్సులో చేరాడు. కానీ చూపు లేకపోవడం, చెవుడు వంటి సమస్యలతో ఆ కోర్సు నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. అతనికి సోదరి, సోదరుడు ఉన్నా వారు మంచి పోషకాహారం తీసుకోవడంతో వారికి ఎలాంటి సమస్య లేదు. చిన్నప్పటి నుంచీ సదరు యువకుడు సన్నగా ఉండడంతో తల్లి అతని బరువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ యువకుడు చాలా సన్నగా, ఒక రేకులా కనిపిస్తున్నాడు. డాక్టర్లు అతనిని పరిశీలించి కౌన్సిలింగ్లో భాగంగా సమతుల ఆహారం, పండ్ల రసాలు, విటమిన్ ట్యాబ్లెట్టు ఇస్తే వాటిని కొన్నిరోజులు వాడి మళ్లీ యథావిధిగా జంక్ఫుడ్ తీసుకునేవాడు. దీంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఆ యువకుడి వయస్సు ఇప్పుడు 19 సంవత్సరాలు మాత్రమే. -
మనుషులనే కాన్వాస్గా..
బ్రిస్టల్: నెమలి బొమ్మ బాగుందా ? కాకపోతే ఇది కాన్వాస్పై వేసింది కాదు. మనుషులనే కాన్వాస్గా చేసుకుని అద్భుతంగా వేసిన బాడీ పెయింటింగ్ ఇది. బ్రిస్టల్కు చెందిన కేట్ డీన్ అనే యువతి కొంతమంది మోడల్స్ శరీరంపై రంగులు వేయడం ద్వారా ఈ చిత్రాన్ని ఇంత అందంగా తీర్చదిద్దింది.