అజ్ఞాతం వీడనున్న బెల్లి లలిత సోదరుడు
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం చేతిలో దారుణ హత్యకు గురైన నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బెల్లి లలిత సోదరుడు అజ్ఞాతం వీడనున్నారు. నయీం అకృత్యాలపై గళమెత్తిన బెల్లి లలితను నయీం ముఠా అత్యంత కిరాతకంగా చంపింది. ఈ ఘటన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన ఆమె అన్న కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవల పోలీసుల చేతిలో నయీం హతమైన అనంతరం ఆయన తిరిగి జనజీవనంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే ముందుగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడనున్నారు.