BRS
-
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలవారీగా పార్టీ కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా జన సమీకరణపై పార్టీ అధినేత కే.చంద్రశేఖర్రావు దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేశారు. గ్రామాలవారీగా లెక్కలు వేసుకుంటూ వాహనాలు సమకూర్చుకుంటున్నారు. సభకు తరలివచ్చే ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 3 వేల బస్సులు సమకూర్చాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి దరఖాస్తు చేసింది. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు సోమవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిశారు. బస్సులకు అద్దె కోసం రూ.8 కోట్ల చెక్కును సజ్జనార్కు అందజేశారు. ఉమ్మడి వరంగల్ నేతలతో కేటీఆర్ భేటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోమవారం నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు. జన సమీకరణపై చర్చించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కనీసం రెండున్నర లక్షల మందిని సభకు తరలించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలను ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.పార్టీ ఇచ్చే ప్రచార సామగ్రిని క్షేత్ర స్థాయికి చేరవేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. పార్టీ కండువాలు, జెండాలు, వాల్ పోస్టర్లు తదితర ప్రచార సామగ్రి పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘స్వరాష్ట్రాన్ని సాధించాం.. సగర్వంగా నిలబెట్టాం’నినాదంతో ‘ఛలో వరంగల్’పేరిట రూపొందించిన రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ను ఒకటిరెండు రోజుల్లో కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. నేడు ‘గ్రేటర్’నేతలతో సమావేశం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం ఉదయం 10.30కు తెలంగాణ భవన్లో జరగనుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ భేటీని సమన్వయం చేస్తారు. సభకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి జన సమీకరణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గ్రేటర్ పరిధిలోనే బీఆర్ఎస్కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో జన సమీకరణను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. -
బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కోరారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి కూడా అవకాశం ఇస్తే పారదర్శక పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించా రు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయటం.. భారతదేశ గౌరవాన్ని పెంచటం, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలబెట్టడమే బీజేపీ లక్ష్య మని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకున్న సాధారణ వ్యక్తి కుమారుడిని ఈ దేశానికి ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మూడు దఫాలుగా అత్యంత సమర్థవంతమైన, పారదర్శక పాలనను బీజేపీ అందిస్తోందని తెలిపారు. బీజేపీవైపు చూస్తున్న తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని కిషన్రెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో 77 లక్షల మంది తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం అందించారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మజ్లిస్ ఆగడాలను అరికడతాం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని కిషన్రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు పోటీపడుతున్నాయ ని ఆరోపించారు. మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు మజ్లిస్ హైదరాబాద్లో కల్లోలం సృష్టించిందని, తీగలగుట్ట వద్ద 400 మంది దళితులు, హిందువులపై హత్యాకాండకు ఒడిగట్టిందని ఆరోపించారు. మజ్లిస్ దౌర్జన్యాల వల్ల పాతబస్తీ నుంచి హిందువులు వలస పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మజ్లిస్ పార్టీ ఆగడాలను అడ్డుకుంటుందని ప్రకటించారు. 14వ తేదీ వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 14 నుంచి 22 వరకు అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించాలని సూచించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రేవంత్రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రికాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు కరీంనగర్ టౌన్: సీఎం రేవంత్రెడ్డి రబ్బర్ స్టాంప్లా మారారని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చే శారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బండి సంజయ్ మొదట కరీంనగర్లోని తన నివాసంలో.. తరువాత పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సచివాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో సమీక్ష చేయడమేంటని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు వద్దు అనేదానిపై ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుందని, తెలంగాణలో పాలన భ్ర ష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. కాగా, 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొ డుకులు, అవమానాలను అధిగమించిందన్నారు. 16 రాష్ట్రాల్లో సొంతంగా.. 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తోందన్నారు. సన్న బియ్యం కోసం కేంద్రం కిలోకు రూ.37 ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం రూ.10 మాత్రమే అన్నారు. అలాంటప్పుడు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫొటో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం వరకు ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. -
అన్న వచ్చిండంటే.. తమ్ముళ్లకు పండగే..
పాపన్నపేట(మెదక్): మెతుకుసీమ గులాబీ దళంలో పట్టు సాధించడానికి ‘కంఠప్ప’ పావులు కదుపుతున్నాడు. మెదక్ అసెంబ్లీ టికెట్పై కన్నేసిన ఆయన మొదట జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకుంటున్నాడు. ఈనెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెడతారన్న సంకేతాల మేరకు ఆయన గులాబీ సైనికులను మచ్చి క చేసుకునే పనిలో పడ్డాడు. ఈక్రమంలో పాపన్నపేట మండల నాయకులకు వేసవి టూర్ ఆఫర్ చేశాడు. త్వరలోనే విహారయాత్రకు తరలివెళ్లేందుకు తమ్ముళ్లు తెగ ఆరాట పడుతున్నారు.అక్కను మరిచి.. అన్న పంచన చేరిఇంత వరకు అక్క మాట జవ దాటని వీర విధేయులు సైతం.. కంఠప్ప పంచన చేరుతున్నారు. పాపన్నపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యులైన పంచ పాండవులు. గ్రూపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడల్లా వెంట తిరిగిన తమ్ముళ్లకు సాయంత్రం ఆయన విందు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నాడు. ఈనెల 1న గాంధారిపల్లిలో భారీ విందు ఏర్పాటు చేసి తమ్ముళ్లను ఖుషీ చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ సంపాదించగలిగతే కాంగ్రెస్లో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన మాజీ అనుచరులు తనకు మద్దతు ఇస్తారన్న నమ్మకం ఆయనలో కనిపిస్తుంది. ఎమ్మెల్యే టికెట్ కోసం గత ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన భారీగా ఖర్చు చేస్తున్నాడు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. పరాజయ భారంతో అక్క కొంత కాలం మౌన దీక్ష పాటించింది. అయితే ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా తన కంటూ బలమైన కేడర్ను తయారు చేసుకునే పనిలో పడ్డాడు. ఈ పరిణామాన్ని సునిశితంగా గమనిస్తున్న అక్క పార్టీ అధ్యక్ష పదవిని బీసీకి కట్ట బెట్టాలనే డిమాండ్తో కంఠప్పకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏడుపాయల జాతరలో రథోత్సవానికి ఇద్దరు నాయకులు కలసి వస్తారని, పార్టీవర్గాలు సమాచారం ఇచ్చాయి. ఈ మేరకు ఒక వర్గం నాగ్సాన్పల్లిలో.. మరోవర్గం లక్ష్మీనగర్లో సేద దీరాయి. కానీ ఏం జరిగిందో ఏమో గాని మొదట అక్క కొంత మంది నాయకులతో కలసి విడిగా ఏడుపాయలకు వచ్చారు. ఆమె వెళ్లిన కొంత సేపటికి అన్న వెంట అధిక సంఖ్యలో గులాబీ నాయకులు తరలివచ్చారు. ఒకే పార్టీలో నెలకొంటున్న వర్గ విభేదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ఈ ఇద్దరు పార్టీ నాయకులు ఎక్కడా ఎదురు పడకుండా చూసుకుంటున్నారు. ఒక వేళ కనిపించినా ఎడముఖం.. పెడముఖం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్తున్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
మాకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదు
హైదరాబాద్,సాక్షి: బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది? అంటూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ. కాంగ్రెస్ పోటీలో లేదు. మేము బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది?బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ వేసింది. 112 ఓట్లలో బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మాకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తటస్థంగా ఉన్నాం. ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు.బీజేపీ ఎలా గెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకునికి బినామీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి లోపాయికారి ఒప్పందంతో మద్దతు తెలిపింది’ అని వ్యాఖ్యానించారు. -
అధికారం కోసం అడ్డదారులొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు మెచ్చి అధికారం ఇవ్వాల్సిందే తప్ప..దాని కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయంగా నైతిక విలువలు పాటిస్తూ ప్రజలతో మమేకమైతే మరో మూడేళ్లలో అధికారం మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే రజతోత్సవ మహాసభ ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనేతలతో జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలతోపాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డదారిలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చారో చాట్ జీపీటీ, గూగుల్లో వెతికినా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైంది. కొందరు అవగాహన రాహిత్యంతో బీజేపీ మెరుగవుతుందని అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ క్రమంగా బలహీనమవుతోంది. అబద్ధాలను ప్రచారం చేసి ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతానని బీజేపీ భ్రమపడింది. వాపును చూసి బలుపు అనుకున్న బీజేపీ అసలు స్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బహిరంగ సభకు దూరాభారాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జన సమీకరణపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ లు శంభీపూర్ రాజు, నవీన్రావు, వాణిదేవి, దా సోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్రెడ్డి, కాలేరు వెంకటేశ్లతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, పార్టీ నేత కల్వకుంట్ల వంశీధర్రావు ఎర్రవల్లిలో జరుగుతున్న సమావేశాలను సమన్వయం చేస్తున్నారు. -
2028 వరకు వేచి చూడాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి 14 నెలలు అవుతోంది. ఇది సరిపోదూ అన్నట్లు ఇంకా మరింత సమయం అడుగుతున్నారు?. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు 2028 జనవరి వరకు వేచి చూడాల్సిందేనా?. ఇదేనా మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే?’అంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనుసింఘ్వీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని న్యాయవాదులు మర్చిపోతే ఎలా? అంటూ చురకలు వేసింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై పలువురు ఇతర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఎస్ఎల్పీ, రిట్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు విన్పించారు. ఎస్ఎల్పిపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్రావులు వాదనలు వినిపించారు. సింఘ్వీ సుదీర్ఘ వాదనలను విన్న తర్వాత ధర్మాసనం తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది. స్పీకర్కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమనలేం.. ఈ ఫిరాయింపులపై స్పీకర్, స్పీకర్ కార్యాలయం స్పందించేందుకు మరికొంత సమయం కావాలంటూ సింఘ్వీ ఆరంభంలోనే అభ్యరి్థంచారు. ‘స్పీకర్ తలకు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమనలేం..’అని ఆయన అన్నారు. దీనికి జస్టిస్ గవాయి స్పందిస్తూ.. ‘ప్రతిరోజూ ముఖ్యమైనదే అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కోర్టుపై ఉందనే విషయాన్ని గుర్తించండి. రెస్పాండెంట్ల వాదనలో వైరుధ్యాలను కూడా కోర్టు ఎత్తి చూపింది. మీ దృష్టిలో రీజనబుల్ సమయం అంటే ఎంతో ఇప్పటికైనా చెబుతారా..?’అంటూ ధర్మాసనం నిలదీసింది. దీంతో ‘సహేతుకమైన కాలం‘అనేది స్పీకర్ నిర్ణయించాలని, ఆరు నెలల సమయం సరిపోతుందని సింఘ్వీ అన్నారు. ఇబ్బందికరంగా న్యాయవాదుల తీరు: ధర్మాసనం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల్లో ఒక షెడ్యూల్ నిర్ణయించాలని స్పీకర్ను సింగిల్ బెంచ్ ఆదేశించిన విషయం మర్చిపోవద్దని జస్టిస్ గవాయి అన్నారు. ‘కోర్టు జోక్యం చేసుకునే వరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కాలేదు’అని ఆర్యమా సుందరం చెప్పారు. ‘సహేతుక సమయం’లో స్పీకర్ నిర్ణ యం తీసుకుంటారని మరోసారి సింఘ్వీ చెబుతుండగా.. జస్టిస్ గవాయి అడ్డుకున్నారు. ‘ఇప్పటికే 14 నెలలు గడిచాయి. ఇంకా ఆరు నెలల సమయం అడుగుతున్నారు.అంటే 2028వ సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి ఎన్నికలు వచ్చే వరకు ఉండాల్సిందే అంటారా? ఇదేనా మీరు చెప్పే, మీ దృష్టిలో ఉన్న రీజనబుల్ టైం’అంటూ ఘాటుగా స్పందించారు. ‘ప్రత్యేకంగా ఇటువంటి కేసుల్లో న్యాయవాదులు వ్యవహరిస్తున్న తీరు న్యాయస్థానాలకు ఇబ్బందికరంగా ఉంటోంది..’అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.రెండు వైపులా వాదనలను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. 8 వారాల వరకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఆర్యమా సుందరం.. 8 వారాల్లోపే తీర్పు వెలువరించాలని అభ్యర్ధించారు. ఆ విధంగానే 8 వారాల్లోపు తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం హామీ ఇచ్చింది. -
కాంగ్రెస్ సర్కారు ఐదేళ్లు కొనసాగితేనే మంచిది
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనాన్ని మనం కోరుకోవొద్దు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగితేనే.. మనం చేసిన మంచి ఏమిటో వెలుగు చూస్తుంది. ఈ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు ఇప్పటికే విసిగివేసారిపోయారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడంతో జనంలో తిరుగుబాటు మొదలైంది. బీఆర్ఎస్ నేతలు అనునిత్యం ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటే మన పట్ల సానుకూలత పెరుగుతుంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలో గురువారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ, వరంగల్లో జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లపై ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కారుపై జనం తిరుగుబాటు ‘సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్ సర్కారుపై జనం తిరుగుబాటు ఆహ్వానించదగిన పరిణామం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపయోగంగా ఉన్న వాటితోపాటు ఆక్రమణలకు గురవుతున్న భూములను కాపాడి వాటిని పారదర్శకంగా వేలం వేసి ఖజానాకు ఆదాయం సమకూర్చాం. కానీ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూముల విక్రయంలో విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తోంది’అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర బీజేపీలో నాయకత్వలేమి ‘బీజేపీకి రాష్ట్రంలో సరైన నాయకుడు లేక నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీలోనూ అంతర్గతంగా నాయకుల నడుమ తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలతోపాటు ఏ ఇతర ఎన్నికలు జరిగినా ఆ రెండు పార్టీల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రతిఫలిస్తుంది’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేకించి మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి 2 లక్షలు, ఆదిలాబాద్ నుంచి లక్షన్నరకు తగ్గకుండా జన సమీకరణ చేయాలన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కేసీఆర్తో జరిగిన భేటీలో మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకష్ణారావు (కరీంనగర్), తోట ఆగయ్య (సిరిసిల్ల ) జోగు రామన్న (ఆదిలాబాద్ ), బాల్క సుమన్ (మంచిర్యాల) పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్ , సుంకే రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు . బండెనక బండి కట్టి.. గులాబీల జెండ పట్టి రజతోత్సవ సభ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూపొందించిన ‘బండెనక బండి కట్టి.. గులాబీల జెండ పట్టి‘పాటను కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ అవతరణ నాటి నుంచి నేటి వరకు ప్రస్థానాన్ని గుర్తు చేసేలా పాటలు, కళారూపాలు రూపొందించాలని రసమయి బాలకిషన్కు కేసీఆర్ సూచించారు. -
అంగుళం కూడా వదలకుండా స్వాదీనం చేసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: మరో మూడేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆ భూము ల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎకో పార్క్ను ఏర్పా టు చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజలకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్సీయూ భూమిని అంగట్లో సరుకులా చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాల్లో ప్రతీ అంగుళం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కాలే రు వెంకటేశ్తో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రభు త్వం తన నిర్ణయం మార్చుకోని పక్షంలో హైదరాబాద్ ప్రజలతో కలసి సెంట్రల్ యూనివర్సిటీ వరకు ర్యాలీ చేపడతామన్నారు. విద్యార్థుల పోరాట స్ఫూర్తికి సెల్యూట్.. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన, పోరాట స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ తరఫున సెల్యూట్ చేస్తున్నాం. పది రోజులుగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వమైతే వారిని పిలిచి మాట్లాడాలి. ఆందోళనను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం ప్రభుత్వ అధికారులు లేదా మంత్రిని పంపి విద్యార్థులతో చర్చించాలి. కానీ ఆందోళన చేస్తున్న విద్యార్థులను స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ‘గుంట నక్కలు’అంటూ సంబోధిస్తున్నారు. మరో మంత్రి పేమెంట్ బ్యాచ్ అంటూ విద్యార్థులపై నోరు పారేసుకుంటున్నారు. హెచ్సీయూలో జంతువులు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన కృత్రిమ మేధస్సును బయట పెట్టుకుంటున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ పెద్ద పాలేరు మాత్రమే.. ‘హెచ్సీయూ భూమిపై కొట్లాడుకునేందుకు ఇదేమీ దాయాదుల పోరు, ఆస్తి తగాదా కాదు. యూనివర్సిటీ విద్యార్థులకు రేవంత్ బంధువు కాదు. ముఖ్యమంత్రి అంటే నియంత, చక్రవర్తి, రాజు కాదు. పెద్ద పాలేరు తరహాలో ప్రజా సేవ చేయాలి. ప్రజాపాలన అంటూ ప్రజాస్వామిక స్ఫూర్తికి పాతరవేసి బుల్డోజర్లు, జేసీబీలతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ భూములకు సీఎం కేవలం తాత్కాలిక ధర్మకర్త మాత్రమే’అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్పందించాలి హెచ్సీయూలో విద్యార్థులపై లాఠీచార్జి జరుగుతున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తాము చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని, హైదరాబాద్ భవిష్యత్తు కోసమే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. న్యాయపరంగా, నైతికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలకు అండగా నిలుస్తామని కేటీఆర్ ప్రకటించారు. హెచ్సీయూ విద్యార్థుల విజయం: కేటీఆర్ ‘కంచ గచ్చిబౌలి వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చేపట్టడం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన విజయం. విద్యార్థుల నిస్వార్థ, నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే ఈ సానుకూల తీర్పు వచ్చింది. భూముల పరిరక్షణకు మద్దతు ఇచ్చిన పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు, మీడియా, సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగా.. ‘ఆ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం రేవంత్రెడ్డి దుందుడుకు చర్యలకు చెంపపెట్టు లాంటిది. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్సీయూ భూముల విషయంలో అక్షింతలు. అధికారం బలంతో ఏది పడితే అది చేస్తామంటే చట్టం చూస్తూ ఊరుకోదు..’అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
‘మీరు అమ్మిన భూములను మేము వెనక్కి తీసుకోవాలా?’
ఢిల్లీ: బీఆర్ఎస్ అమ్మిన భూముల్ని తాము ఎలా వెనక్కి తీసుకుంటామని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. హెచ్సీయూకు సంబంధించి భూముల్ని వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ‘ మీరు(బీఆర్ఎస్) అమ్మిన భూముల్ని మేము వెనక్కి తీసుకోవాలా?, చట్టం అడ్డు వస్తుందనే కామన్ సెన్స్ లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు.చట్ట పరంగా జరిగే నిర్ణయాలను ఎవరూ అడ్డుకోలేరు. హెచ్సీయూ భూములను మేము అభివృద్ధికి ఉపయోగిస్తాం. హెచ్సీయూ భూములను కాజేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి భూములను స్వాధీనం చేసుకుంది. బిల్లీ రావుకు చంద్రబాబు అప్పనంగా భూములు కట్టబెట్టారు’ అని మల్లు రవి విమర్శించారు.కాగా, హెచ్సీయూ భూముల వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గురువారం హెచ్ సీయూ భూముల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పర్యావరణ విధ్వంసాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బందిపోట్లలా కాంగ్రెస్ సర్కారు తీరు!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బందిపోట్లను తలపిస్తోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. వందలాది బుల్డో జర్లను రంగంలోకి దించి యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి పాల్పడటం రేవంత్ మనస్తత్వానికి అద్దంపడుతోందని విమర్శించారు. ఇతర అంశాల్లోనూ రేవంత్ దూకుడు ఇదే తరహాలో ఉండ టాన్ని ప్రజలు తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దిశగా వేగంగా పయనిస్తోందని, దానిని ఎవరూ రక్షించలేరని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలుసుకునే సీఎంతోపాటు మంత్రులు వీలైనంత త్వరగా సొంత జేబులు నింపుకొనేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని చెప్పారు. బుధవారం ఎర్రవల్లి నివాసంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి సహా 20కిపైగా మంది ముఖ్య నాయకులు పాల్గొన్నట్టు వెల్లడించాయి.మోదీ పట్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తి..‘‘దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడమే దీనికి సంకేతం. ఆర్ఎస్ఎస్ కూడా ప్రధాని మోదీ పనితీరు పట్ల సంతృప్తిగా లేదు. ఆయన ఒంటెద్దు పోకడల పట్ల ఆర్ఎస్ఎస్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదవి కోసం ఆర్ఎస్ఎస్ను దేబిరించాల్సిన పరిస్థితిలో ప్రధాని మోదీ ఉన్నారు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో తొలి రెండు పర్యాయాలు ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిర్మాణాత్మకంగా దేశానికి చేసినది చెప్పుకునేందుకు ఏమీ లేదని.. దీంతో ప్రజలు మళ్లీ తమవైపు చూస్తున్నారని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన పనితో ఇతర పార్టీల పనితీరును ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని.. రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం బీఆర్ఎస్ చేసిన పనులే ఇతర పార్టీల పనితీరుకు గీటు రాయిలా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.లక్షలాదిగా సభకు తరలిరావాలి..ఏప్రిల్ 27న అన్ని గ్రామాల్లోనూ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ జెండా ఎగరవేసి వరంగల్ సభకు బయలుదేరాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్కు దగ్గరలో ఉండే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు. ఒక్కో జిల్లా నుంచి కనీసం రెండు లక్షల మంది తరలివచ్చేలా వాహనాలు సమకూర్చుకోవాలని.. ఆర్టీసీ, ఇతర బస్సులను ఇప్పటి నుంచే సమీకరించడం ప్రారంభించాలని సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రచార పోస్టర్ రూపకల్పనకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్రెడ్డి, పార్టీ నేతలు జైపాల్రెడ్డి, ఆదర్శ్రెడ్డి... ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ బిగాల, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్రెడ్డి, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘బిల్లీ’ కబంధ హస్తాల్లోంచి..భూముల చెర విడిపించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైన కంచ గచ్చిబౌలి భూములను నాటి చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందని.. వారి కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెర విడిపించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో బిల్లీరావు కు కట్టబెట్టిన భూముల కేటాయింపులను రద్దు చేసి, దానిపై న్యాయపోరాటం చేసినది దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ భూములను స్వాదీనం చేసుకోవడం ద్వారా అద్భుత ముగింపు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడి ప్రజలకు కానుకగా ఇచ్చామని, అవే భూముల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణానికి ఎలాంటి ఇక్కట్లు కలగకుండానే అభివృద్ధి ఉంటుందని హామీ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం రగులుతున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివాద అంశాలపై స్పష్టత ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు హయాంలో ధారాదత్తం.. ‘‘యూనివర్సిటీ భూములను చంద్రబాబు ప్రభుత్వం 2003 ఆగస్టు 9న బిల్లీరావు అనే వ్యక్తికి చెందిన ఐఎంజీ భారత్కు అప్పనంగా ధారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2004 ఫిబ్రవరి 10న సేల్డీడ్ ద్వారా 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు ఇచ్చారు. దీనికి బదులుగా యూనివర్సిటీకి గోపన్పల్లిలో 397 ఎకరాల భూమిని ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో యూనివర్సిటీకి, బిల్లీరావుకు లబ్ధి జరిగితే నష్టపోయినది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలే. వైఎస్ పోరాడితే.. మేం ముగింపునిచ్చాం.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బిల్లీరావుకు కట్టబెట్టిన భూములను రద్దు చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2006 అక్టోబర్ 21న సేల్డీడ్ను రద్దు చేస్తూ.. భూములను తిరిగి స్వా«దీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బిల్లీరావు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే.. వైఎస్సార్ బలంగా న్యాయపోరాటం చేశారు. క్రమేణా రాష్ట్ర విభజన అనంతరం ఈ భూముల అంశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తే.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక కోర్టులో న్యాయపోరాటం మొదలుపెట్టింది. 2024 మార్చిలో హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు ఇస్తే.. బిల్లీరావు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సైతం బలమైన వాదనలు వినిపించింది. దీనితో అదే ఏడాది మే 3న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వైఎస్సార్ చేసిన పోరాటానికి ప్రభుత్వం అలా ముగింపునిచ్చింది. దశాబ్దాలుగా ప్రైవేటు వ్యక్తుల్లో ఉన్న భూమిని స్వా«దీనం చేసుకుంది. రాష్ట్ర ఆస్తి రాష్ట్ర ప్రజలకే దక్కాలన్నది ప్రభుత్వ భావన. ఇది ప్రజల విజయం. కుట్రదారులే అశాంతి రేపుతున్నారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లీరావుకే భూములు చెందాలన్న లక్ష్యంతో మౌనంగా ఉంది. పంచుకుని తిందామని చూసింది. అప్పుడు కోర్టులో కొట్లాడకుండా మౌనంగా ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ దానికి వంత పాడుతోంది. యువతలో అశాంతిని నెలకొల్పి ప్రభుత్వంపై ఉసిగొల్పాలన్నదే వారి లక్ష్యం. ఈ కుట్రలపై యువత అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలకు పోవద్దు. పోలీసులు సైతం సంయమనంతో వ్యవహరించాలి..’’అని భట్టి పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు లక్ష్యంగా అభివృద్ధి.. యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువత ఆశయాల కోసం కట్టుబడలేదు. అటు ప్రభుత్వ రంగంలో, ఇటు ప్రైవేటు రంగంలో ఉపాధి ఊసే లేదు. ప్రస్తుత ప్రభుత్వం యువత కోసం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ భూముల్లో ఐటీ హబ్, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హైటెక్ సిటీ ఫేజ్–1, 2 ఏర్పాటు చేస్తాం. దీనిద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్కు ఇప్పటికే ఉన్న గ్లోబల్ సిటీ పేరును మరింత విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప.. ఎవరి సొంత ప్రయోజనాలు లేవు. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిరక్షిస్తూనే అభివృద్ధి చేపడతాం. -
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
హైదరాబాద్,సాక్షి: అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే.బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా. మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం.అఖిలపక్షాన్ని తీసుకెళ్తే కేంద్రాన్ని నిలదీస్తారన్న జంకు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు హాజరు పేరిట మమ అనిపించే యత్నం.మోదీ సర్కారుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పకడ్బందీ స్కెచ్. తెలంగాణ ప్రజల ఓట్లే తప్ప.. వాళ్ల పాట్లు పట్టని కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హాజరవుతారని ప్రచారం. జంతర్ మంతర్కు కూతవేటు దూరంలోనే ఉన్నా ధర్నాకు రాకుండా బీసీలను అవమానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం.అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే...బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా...మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం...బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం...…— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 2, 2025 తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న ఏ ఒక్క దమనకాండపై ఇప్పటి వరకు నోరు విప్పని రాహుల్ గాంధీ. లగచర్ల రైతుల మీద, బంజారా మహిళలపై సర్కార్ అఘాయిత్యాలపై మాట్లాడరు. మూసి ప్రాజెక్టు పేరిట పేద ప్రజల ఇళ్లను కూలగొడితే స్పందించరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినా ఖండించరు.ఇప్పుడు ఢిల్లీ వేదికగా మా బీసీ బిడ్డల ధర్నాకు రాకుండా అవమానించారు. అందుకే మేము ముందే చెప్పాం.. ఆయన ఎన్నికల గాంధీ అని.రాహుల్ గాంధీకి తెలంగాణతో పేగుబంధం లేదు.. ఉన్నది కేవలం ఎన్నికల బంధం మాత్రమేనని. అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష’ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
బీజేపీ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని రంగాల్లోనూ బీజేపీ విఫలం కావడంతోపాటు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. బీజేపీలో 75 ఏళ్లు దాటినవారు అధికారిక పదవుల నుంచి తప్పుకోవాలంటూ ఆ పారీ్టలో ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో బీజేపీ నాయకత్వం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఏర్పడతాయి. సంకీర్ణ రాజకీయాల్లో మనం కీలకంగా మారుతాం’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 20 మంది ముఖ్య నేతలతో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో వరంగల్లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై చర్చించారు. దేశ, రాష్ట్ర రాజకీయ స్థితిగతులపైనా కేసీఆర్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు తగినంత సమయం ఇచ్చాం ‘రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలు వందశాతం ప్రభుత్వ పనితీరుపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నరగా తగినంత సమయం ఇచ్చాం. ప్రభుత్వాన్ని ఎండగట్టి, హామీల అమలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగసభ నిర్వహించడమే సరైన మార్గం. అందుకే వరంగల్లో జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో కదలాలి. తెలంగాణ సోయి మనకు ఉన్నా ఏమరుపాటుతనంతోనే ఓటమి పాలయ్యాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ప్రజలకు చేరువయ్యేందుకు మనం కృషి చేయాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ కేంద్రంగా దిశానిర్దేశం వరంగల్లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నియోజకవర్గాల వారీగా జనం, వాహనాల సమీకరణపై పలు సూచనలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి నుంచి రెండు లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా నిర్దేశించినట్టు సమాచారం. బుధవారం నుంచి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో బహిరంగసభ సన్నాహాలపై కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్షిస్తారు. బుధవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా నేతల సమావేశం జరుగుతుంది. కేసీఆర్ వరుస సమీక్షల నేపథ్యంలో కేటీఆర్ జిల్లాల వారీగా బహిరంగసభ సన్నాహక సమావేశాలు రద్దయ్యే అవకాశమున్నట్టు తెలిసింది. బహిరంగసభ తర్వాతే సంస్థాగత నిర్మాణం వరంగల్ సభ నిర్వహణ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీనేత గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు, అన్ని స్థాయిల్లో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు షెడ్యూలు విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. -
HCU Issue: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
-
రజతోత్సవాలపై బీఆర్ఎస్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సభకు జన సమీకరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సభకు ఎంత మంది తరలివచ్చే అవకాశముందని ఆరా తీస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు ఎప్పటికప్పుడు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అదే సమయంలో పార్టీ ముఖ్యనేతలతో వరుస భేటీలు నిర్వహించారు.ఉత్తర తెలంగాణలో బీజేపీ అంతర్గతంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఏడాది పొడవునా నిర్వహించాల్సిన రజతోత్సవ వేడుకల తీరుతెన్నులపైనా నేతల అభిప్రాయాలు కోరుతున్నట్లు తెలిసింది. సభ ఏర్పాట్లకు ప్రత్యేక కమిటీలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత.. సభ నిర్వహణలో పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. సభ నిర్వహణ కోసం 20కి పైగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సభా స్థలి ఎంపిక, రైతుల నుంచి నిరభ్యంతర పత్రాల సేకరణ, పోలీసుల అనుమతులకు దరఖాస్తులు తదితర పనుల్లో తలమునకలయ్యారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్కు కూడా బాధ్యతలు అప్పగించారు. సుమారు 1,200 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లు జరగనుండగా, మైదానం చదును చేయడం, వేదిక నిర్మాణం తదితరాలకు సంబంధించిఏప్రిల్ 2న భూమి పూజ చేస్తారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్షలు సభను విజయవంతం చేసేందుకు జిల్లాలవారీగా ఈ నెల 20న సన్నాహక భేటీలకు శ్రీకారం చుట్టిన కేటీఆర్.. ఇప్పటికే సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో వరుస సమావేశాలు జరుగనున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా ఈ సమావేశాల్లో భాగస్వాములను చేస్తారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఏప్రిల్ రెండో వారంలో కేటీఆర్ జిల్లాలవారీగా రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. కేటీఆర్ జిల్లా పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
1,200 ఎకరాలు.. 10 లక్షల జనం
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు వేదికగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఖరారైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉమ్మడి వరంగల్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, సతీష్బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాల మల్లు, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితదితరులు శుక్రవారం పరిశీలించారు. సభ నిర్వహణకు సంబంధించి భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అనుమతుల కోసం కాజీపేట ఏసీపీ తిరుమల్ను వరంగల్ ముఖ్య నాయకులు కలిసి దరఖాస్తు ఇచ్చారు.భారీగా జన సమీకరణఎల్కతుర్తి మండల కేంద్రంలో లక్షలాది మందితో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,200 ఎకరాలకు సంబంధించిన రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. మొత్తం 1,200 ఎకరాల్లో పార్కింగ్, సభా వేదికలు ఏర్పాటు చేయనున్నారు.సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కేసీఆర్ సూచించిన నేపథ్యంలో 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జాతీయ రహదారిలో అంబులెన్స్లను అందుబాటులో ఉంచేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ, ఇతర వాహనాలు కలిపి 40 నుంచి 50 వేల వరకు రావొచ్చని అంచనా వేస్తున్న నాయకులు ఆ మేరకు పార్కింగ్ ఏర్పాట్లు చూస్తున్నారు. వలంటీర్లను ఎంపిక చేసి రిటైర్డ్ పోలీసులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. రెండు రోజుల్లో సభ నిర్వహణ కమిటీలు..ఎల్కతుర్తి రజతోత్సవ సభపై శనివారం ఉమ్మడి వరంగల్ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ మేరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో చర్చించనున్నారు. అనంతరం సభ సక్సెస్ కోసం రెండు రోజుల్లో సుమారు 20 రకాల సన్నాహక కమిటీలు ఖరారు చేయనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. -
ఢీ అంటే ఢీ.. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో గురువారం శాసనసభ అట్టుడికింది. బిల్లుపై చర్చ ప్రారంభంలో కేటీఆర్ మాట్లాడుతూ తొలుత కేంద్రంపై ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. ‘మేం కక్ష పూరితంగా వ్యవహరిస్తే కేసీఆర్ కుటుంబం అసెంబ్లీలో కాదు.. జైల్లో ఉండేది’ అని సీఎం అంటే.. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. ఏం ఫరక్ పడదు’ అంటూ కేటీఆర్ స్పందించారు. ‘ఏం చేసినా పెద్దాయన (కేసీఆర్) ఆయన సీటు ఇవ్వడు..’ అని ముఖ్యమంత్రి అంటే.. ‘రేవంత్లో అపరిచితుడు ఉన్నాడు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని రేవంత్ విమర్శించారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్ అదే స్థాయిలో సీఎంపై ధ్వజమెత్తారు. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగైన రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఊర్లోనైనా రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేటీఆర్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అనేకసార్లు అడ్డుపడ్డారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలు లేవనెత్తడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసకుంది. కేటీఆర్, సీఎం పరస్పర వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో సభ వేడెక్కింది. విపక్షం ఆరోపణలకు సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: రేవంత్ ‘రైతుల రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.16,143 కోట్లే మాఫీ చేసింది. మొదటి ఐదేళ్లల్లో వడ్డీ తీసివేస్తే జరిగిన రుణమాఫీ రూ.13,514 కోట్లు మాత్రమే. రెండోసారి నాలుగేళ్ళల్లో ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఆఖరి ఏడాది 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. కానీ మేం రుణమాఫీ చేసి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రూ.20,616,89 కోట్లు మాఫీ చేశాం. ఎన్నికల నిబంధనతో వారు రైతుబంధు ఇవ్వకపోతే..మేము వచ్చాక ఇచ్చాం. వరి వేస్తే ఉరి అని రైతులకు చెప్పి, కేసీఆర్ కుటుంబసభ్యుల ఫామ్హౌస్ల్లో పండిన వడ్లను క్వింటాల్కు రూ.4,500 చొప్పున కావేరి సీడ్స్కు అమ్ముకున్నారు. వారు పదేళ్లలో చేయలేని పనులు మేము చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు..’ అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసింది. 2014 నాటికి 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు రూ.90,160 కోట్లయితే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 6,69,257 కోట్లు అప్పు చేశారు. వాళ్ళు పెట్టిన రూ.40,154 కోట్ల బకాయిలు కలిపితే, మొత్తం అప్పు రూ.7,19,151 కోట్లు. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ.1,58,041 కోట్లు అప్పు చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ.1,53,359 కోట్లు చెల్లించాం. ఇవి తీసేస్తే మేము చేసిన అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే. విపక్షం అబద్ధాల పునాదులపై వెళ్తే లాభం లేదు. ఇప్పటికే కూలిపోయింది. ఇప్పటికైనా మర్యాదగా ఉండాలి..’ అని సీఎం ధ్వజమెత్తారు. ఫాంహౌస్ల కోసం ప్రాజెక్టులు కట్టారు.. ‘బీఆర్ఎస్ నేతల ఫాం హౌస్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు. ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు కొన్నారు. కొండపోచమ్మ నుంచి ఎర్రవల్లి ఫాం హౌస్కు కాల్వలు తీసి నీళ్ళు తీసుకెళ్ళారా లేదా? చెప్పాలి. రంగనాయక సాగర్ దగ్గర హరీశ్రావుకు ఫాం హౌస్ ఉందా లేదా? దీనిపై కాంగ్రెసేతర శాసనసభ్యులతో కమిటీకి సిద్ధమా? మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం కడితే కుప్పకూలిపోతుందని ఇంజనీర్లు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులను జైలుకు పంపుతాం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతాం. కాళేశ్వరం లేకున్నా వ్యవసాయానికి నీళ్శివచ్చు. లగచర్లలో అధికారులను చంపమని విపక్షం రెచ్చగొట్టింది..’ అని సీఎం ఆరోపించారు. పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు.. ‘పెద్దాయన (కేసీఆర్) సీటు కోసం కుటుంబంలోని ఇద్దరూ ఆశ పడుతున్నారు. కానీ పెద్దమనిషి వదిలేట్లు లేడు. వీపు చింతపండు అవుతుందని పెద్దాయనే చెప్పాడు. పెద్దమనిషి ఉంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన వందేళ్ళు ఉండాలని, ప్రతిపక్షంలో ఉంటూ మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరూ పోటీ పడి పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు. ఆయనకు రక్షణ కల్పించాలి. ‘ఈ సందర్భంగా నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబాన్ని ఏకే 47 తుపాకీతో కాల్చిన ఉదంతాన్ని ప్రస్తావించారు) మీరు జాతిపిత అని చెబుతున్న కేసీఆర్ను కామారెడ్డిలో బండకేసి కొట్టారు..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫాంహౌస్ ఫొటోలు పత్రికలకిచ్చానని కేసులు పెట్టారు – తీవ్రవాదులు, నక్సల్స్ ఉండే డిటెన్షన్ సెల్లో ఉంచారు: రేవంత్ ‘కేటీఆర్ ఫాంహౌస్ను ఎవరో డ్రోన్తో చిత్రీకరించి నాకు ఫోటోలు ఇస్తే.. నేను వాటిని పత్రికలకు పంపిస్తే అక్రమ కేసులు పెట్టారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. కానీ నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిని. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. నన్ను అరెస్టు చేసి నక్సల్స్, తీవ్రవాదులును నిర్బంధించే డిటెన్షన్ సెల్లో ఉంచారు. మరోఖైదీ కానీ, మరొక వ్యక్తి కానీ కనిపించని విధంగా కక్షసాధింపుగా ఆ గది కేటాయించారు. రాత్రిళ్లు పడుకోవడానికి కూడా సరిపోని గది అది. అందులోనే చిన్న బాత్రూమ్. బయటకు కనపడేలా ఉంటుంది. రాత్రి ఎలాగోలా పడుకుందామని అనుకున్నా. లైట్ ఆఫ్ చేశారు కాదు. ఏమిటంటే పైనుంచి ఆర్డర్ అనేవారు. ఆ ట్యూబ్లైట్ చుట్టూ పురుగులు.. వాటి కోసం వచ్చే 30 బల్లులు. ప్రతిరోజూ నిద్ర లేకుండానే గడిపా. ఉదయం పూట బయటకు వదిలినప్పుడు చెట్ల కింద పడుకున్నా. 16 రోజులు అలా నిర్బంధంలో ఉంచారు. నా కూతురు పెళ్లి పత్రిక రాసుకునే కార్యక్రమానికి కూడా వెళ్లడానికి వీల్లేదంటూ ఢిల్లీ నుంచి లాయర్ను తీసుకునివచ్చి వాదించారు. కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో నేరుగా కార్యక్రమానికి వెళ్లి తిరిగి జైలుకు వచ్చా. ఇప్పుడు ఆ కోపాన్ని దిగమింగుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. అంతకంతకు దేవుడే చూసుకుంటాడని అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజునే నాపై కక్ష చూపించిన వాళ్లు ఆసుపత్రిపాలయ్యారు. కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?. ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నేను అమలు చేయలేదు..’ అంటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డ్రోన్ ఎగరేసి ఆడోళ్ల ఫొటోలు తీస్తారా – మీ భార్యాపిల్లల ఫొటోలు తీస్తే ఊరుకుంటారా?: కేటీఆర్ ‘సీఎం ఇంటి మీదికి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యా పిల్లలను ఇష్టం వచ్చినట్టు ఫొటోలు తీస్తామంటే ఊరుకుంటాడా? మీకే భార్యా పిల్లలు ఉన్నారా? వేరే వాళ్లకు లేరా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? లేని రంకులు అంటగట్టిం ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడుం నీతులు గుర్తుకు రాలేదా? మా ఇంట్లో పిల్లల్ని తిట్టింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? మా ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా?..’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జైల్లో పెట్టించారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘మా ఇంటి మీదకు డ్రోన్ ఎగరేసి ఇంటివాళ్ల ఫొటోలు తీయటం సరైన పనేనా అన్నది సీఎం చెప్పాలి. రేవంత్రెడ్డిని ప్రభుత్వం జైల్లో పెట్టలేదు. కోర్టులు రిమాండ్ చేశాయి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైల్లో ఉన్నా. అయినా రేవంత్రెడ్డి స్వాతంత్య్రం కోసం పోరాడాడా? ఏం గొప్ప పని చేసి జైలుకెళ్లాడు? ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. ఏం చేసినా ఫరక్ పడదు. పదవి, అధికారం శాశ్వతం అని సీఎం అనుకుంటున్నారు కానీ అవి ఏవీ శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవు. ఆయన ఎవరినీ జైలుకు పంపలేరు. కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు. రేవంత్ తిట్లన్నీ మాకు దీవెనలే.ం ఆయనకు తుపాకుల గురించి బాగా తెల్సుం. తెలంగాణపై గన్ను ఎక్కుపెట్టిన రైఫిల్రెడ్డి రేవంత్రెడ్డి. తెలంగాణ జాతి పిత ముమ్మాటికీ కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్రెడ్డే..’ అని కేటీఆర్ అన్నారు -
BRS హయాంలో నన్ను జైల్లో చిత్రహింసలకు గురిచేశారు
-
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది
-
‘ఒకరు సహాయ మంత్రి.. ఇంకొకరు నిస్సహాయ మంత్రి’.. అసెంబ్లీలో కేటీఆర్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. పురావస్తు శాఖ చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉంది. మరి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది వేగంగా జరిగింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రాష్ట్రం పేరు ఎక్కడా వినపడలేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా రాష్ట్రాభివృద్ధే మాకు ముఖ్యం.తెలంగాణా పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. రాష్ట్రానికి ఎన్నోసార్లు కేంద్రం అన్యాయమే చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. 2014 నుంచి కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేశాం. ట్యాక్స్ రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువ.. రాష్ట్రానికి వచ్చేది తక్కువ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దానిపై భట్టి విక్రమార్క ఒక్క మాట అనలేదు. 8 ప్లస్ 8 16కావాలి...కానీ తెలంగాణలో గుండు సున్నా అయింది. భారత జాతిని సాధుతున్న రాష్ట్రంలో తెలంగాణ టాప్ ఫైవ్లో ఉంది. పురావస్తు శాఖలో చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు.తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు...ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయమంత్రి. హైదరాబాద్ మెట్రో, అదిలాబాద్ వెనుకబడిన ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప.. రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగొద్దు. దేశం కోసం ధర్మం కోసం అనే వాళ్ళు వేములవాడ, కొండగట్ట, ధర్మపురి, భద్రాచలం ఆలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహాకుంభ మేళాకు కేంద్రం 2100 వంద కోట్లు ఇచ్చింది.వన్ ట్రిలియన్ ఎకానమీ 2030 వరకు ఎలా సాధిస్తారో చెప్పాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొటేషన్స్కు మాత్రమే పరిమితం అయ్యాయి. గత బడ్జెట్లో ఇండ్ల లెక్కలు 6లక్షలు అన్నారు.. ఈ సారి 5లక్షలు అంటున్నారు. కేంద్రంతో సఖ్యత అంటున్నారు..మరి ఏం సాధించారో చెప్పాలి. మా ప్రభుత్వం పోగానే ల్యాండ్ క్యూజర్లు కొన్నారని విమర్శలు చేశారు. అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లను ఇప్పుడు సీఎం,మంత్రులు వినియోగిస్తున్నారని’ అన్నారు. -
‘కమీషన్ల’పై దద్దరిల్లిన సభ!
30% కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20% కమీషన్ అంటూ సచివాలయంలో ధర్నాలు జరుగుతున్నాయి- కేటీఆర్కేటీఆర్ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేదంటే ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పండి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.-భట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పెద్దలు కమీషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కె.తారకరామారావు పేర్కొనడం, ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రులు అడ్డుపడుతుండటంతో.. బడ్జెట్ పద్దులపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డుపడటంపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ‘‘మంత్రులు పదే పదే అడ్డుపడుతున్నారు. సంయమనం ఉండాలి. మేం కూడా రెచ్చగొట్టగలం. 30శాతం కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20శాతం కమీషన్ అంటూ సచివాలయంలో (కాంట్రాక్టర్ల) ధర్నాలు అవుతున్నాయి’’అని వ్యాఖ్యానించారు. దీనిపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ‘‘కేటీఆర్ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేకుంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి’’అని సవాల్ చేశారు. గత ప్రభుత్వం పాపం వల్లే రూ.లక్ష కోట్ల పనులు చేసిన వారు బిల్లులు రాక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ.. కేటీఆర్ను ఉద్దేశించి భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బాధ్యతతో రాజకీయాల్లో వచ్చాం. అడ్డగోలుగా మీలా రాష్ట్రం మీద పడి బరితెగించి దోపిడీ చేయడానికి రాలేదు. నాలాగా అణగారిన వర్గాలు, బాధితులు, పీడితులు, పేద కుటుంబాల కోసం ఏదో చేయాలని ఉన్నతమైన ఆశయంతో వచ్చిన వాళ్లం. మీలా ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పాడు చేసిపోయేందుకు రాలేదు. మాట్లాడే ముందు బాధ్యత, నిబద్ధత ఉండాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదీ పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా?’’అని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. ‘30శాతం కమీషన్..’అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో.. కేటీఆర్ను ఉద్దేశించి ‘ఒళ్లు బలిసి’అంటూ భట్టి తప్పుడు మాటలు మాట్లాడరంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మళ్లీ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ దగ్గరికి దూసుకెళ్లారు. మొదట కేటీఆరే రెచ్చగొట్టారని, ఒకట్రెండు అన్పార్లమెంటరీ పదాలుంటే తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిరసన కొనసాగించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాత్రమే తాను సూచించానని భట్టి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని చెప్పారు. బట్టలు విప్పి కొడతామంటూ సభలో సీఎం రేవంత్ అన్నప్పుడు లేని అభ్యంతరం తమ మాటలకు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ప్యానల్ స్పీకర్ ఆయన మైక్ కట్ చేసి బీజేపీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా ‘వద్దురా నాయనా.. ట్వంటీ పర్సెంట్ పాలన’అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. కేటీఆర్, హరీశ్రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కాసేపు బైఠాయించి నినాదాలు చేశారు. భట్టి దళితుడనే ఆరోపణలు: పొన్నం దళితుడైన భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత పదవి దక్కవద్దనే ఉద్దేశంతోనే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. -
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్బుక్ వాళ్లే రాశారు. రూల్బుక్ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
నాణ్యమైన విద్య, వైద్యం మా ప్రభుత్వ విధానం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కుప్పకూలిన విద్యావ్యవస్థను బాగు చేసుకుంటూ ముందుకువెళుతున్నామని, పూర్తిగా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 11 వేలకుపైగా టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా చేపట్టామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పర్యాటకం, ఎక్సైజ్శాఖ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ పద్దుపై సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రస్తుతం విద్యావ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదే సమయంలో కలుగజేసుకున్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు.. పైవిధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 79 పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించామని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టును సైతం భర్తీ చేయలేదంటూ మంత్రి శ్రీధర్బాబు విమర్శించడంతో బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్రావు కలుగజేసుకున్నారు. ‘మా హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా చేశాం. గురుకులాల్లో 18 వేల నియామకాలు పూర్తి చేశాం’అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,913 స్కూళ్లు మూతపడ్డాయని, 257 గ్రామపంచాయతీల్లో అసలు ప్రభుత్వ పాఠశాలలే లేవని సబిత తెలిపారు. కాళేశ్వరం అప్పుల కుప్ప: యెన్నం బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయని పనులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బీటెక్ చదివిన విద్యార్థులు సైతం ఎందు కూ పనికిరానివారిగా మారుతున్న దుర్భర స్థితి ప్రస్తుత విద్యావ్యస్థలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉపాధ్యాయులనే పెట్టడంతో విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ, దశ దిశ లేకుండా బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల కు ప్ప చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణంతో ఎన్నో మార్పులు వచ్చాయని, విద్యారంగంలోనూ విద్యారి్థనులు పోటీపడుతున్నారని వివరించారు. -
వార్షికోత్సవం చేసుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్ టైం (తగిన సమయం) అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా? పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా?..’ అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని ప్రశ్నిస్తూనే.. మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా? అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద్ల పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ).. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మైస్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గిలు హాజరయ్యారు. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్రావు వాదనలు వినిపించారు. ఆ తీర్పుల ఆధారంగా చర్యలకు అవకాశం: ఆర్యమా సుందరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది మార్చి 15న తొలిసారి స్పీకర్కు తాము ఫిర్యాదు చేశామని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్లో ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించామని, జూన్లో రిట్ పిటిషన్ వేశామని చెప్పారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్పై ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే తన కుమార్తె కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేశారని, తెల్లం వెంకట్రావ్ సైతం పార్టీ ఫిరాయించారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, కనీసం నోటీసులు ఇవ్వలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలన్న సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్ కు వెళ్లగా.. స్పీకర్కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన సమయంపై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని విన్నవించారు. స్పీకర్ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని ఆర్యమా సుందరం గుర్తు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకున్నారు. ‘ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? వార్షికోత్సం జరుపుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేసు విషయంలో డిలే ట్యాక్టిక్స్ (ఆలస్యం చేసే చిట్కాలు) ఉపయోగించొద్దని అన్నారు. సుందరం తన వాదనలు కొనసాగిస్తూ.. ‘స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్పై కూడా ఉంది. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్గా వ్యవహరించాలి. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదు కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే మేము కోరుతున్నాం’ అని అన్నారు. ఆ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు: జస్టిస్ గవాయి గతంలో ఇలాంటి కేసులు విచారించిన రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్కు సమయంపై స్పష్టత ఇవ్వలేదని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తాము తిరిగి ఎలా రాయగలమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. దీంతో ‘తగినంత సమయం’ అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని సుందరం చెప్పారు. వారంలోపే హైకోర్టును ఆశ్రయించారు: సింఘ్వీ ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తే, 9వ తేదీ నాటికే హైకోర్టులో పిటిషన్ వేశారని సింఘ్వీ చెప్పారు. నారిమన్ కేసులో ఫిర్యాదుకు, పిటిషన్కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించి నోటీసులు ఇచ్చారని చెబుతుండగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని.. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోండి: బీజేఎల్పీ నేత పిటిషన్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది మిథున్ శశాంక్ జోక్యం చేసుకుని.. ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించబోతుండగా.. జస్టిస్ గవాయి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాము ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో తాము వాదనలు వినిపించేందుకు సుదీర్ఘ సమయం కావాలని రోహత్గి కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
‘దేవుళ్లని మోసం చేసిన రేవంత్కు రైతులను మోసం చేయడం ఓ లెక్క’
సాక్షి,మెదక్ జిల్లా : దేవుళ్లను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్క’ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజే రూ 2లక్షలు చేస్తామని చేతులెత్తేశారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్కు రైతులను మోసం చేయడం ఓ లెక్క. రైతులతో మిత్తిలు కట్టించి రుణాలు ఇవ్వలేదు. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసింది. అన్ని వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిందది. రూ 2లక్షల రుణమాఫీ మీద రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. రైతుబందు ఎగ్గొట్టింది. కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు అందించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలు లేవు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తాం’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. -
వీళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. బీఆర్ఎస్? కాంగ్రెస్?
-
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
సాక్షి, హైదరాబాద్/ గాంధీఆస్పత్రి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలపాలవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన మొత్తం తెలంగాణ సమాజాన్ని కలిచివేసేదిలా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో కవిత ఫోన్లో మాట్లాడి యువతిపై అత్యాచారయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కరువైంది: సబిత, శ్రీనివాస్గౌడ్నడుస్తున్న రైలులో అత్యాచారయత్నం రాష్ట్రానికే సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైంద ని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్ ఆవే దన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు సోమవారం పరామ ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో షీ టీమ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. -
కాంగ్రెస్ రైతులకు అన్యాయం చేసింది
-
నేను kcr అంత మంచోడిని కాదు: కేటీఆర్
సాక్షి,కరీంనగర్ : తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కేటీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘ఇవాళ సన్నాహక సమావేశాన్ని చూస్తే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో అర్థమైతుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కరీంనగర్. తెలంగాణ సెంటిమెంట్ లేదన్న రోజున కేసీఆర్ను 2 లక్షల మెజారిటీతో గెలిపించి వాదాన్ని నిలబెట్టిన గడ్డ కరీంనగర్.గత పదిహేను నెలలుగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రతిపక్షం బీఆర్ఎస్. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపమన్న నాయకుడు కేసీఆర్. ఇవాళ భూమికి జానెడున్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. వానపాములు బుసలు కొడుతున్నై, గ్రామసింహాలు సింహాలనుకుంటున్నై. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. బీజేపీ 1992లోనే ఒక్క ఓటు పేరు, రెండు రాష్ట్రాల పేరిట మోసం చేసింది. కాంగ్రెస్ మోసాలు చేస్తూనే ఉంటుంది ఇవాళ ఏం రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. ఇవాళ రైతులకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ, అణిచివేత రాజ్యం. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మనకు సమయం వస్తుంది. అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తాం. విదేశాల్లో దాక్కున్నా పట్టుకొస్తాం. ఈ ప్రభుత్వం 5 డీఏలు బాకీ ఉంది. 16 నెలల్లో 6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని యువత బాధ పడుతోంది. ఈ ఏడాది మొత్తం రజతోత్సవం చేసుకుందాం.ఏప్రిల్ 27న ఆవిర్భావ సభకు అందరూ కదిలి రావాలి. దక్షిణ భారతానికి నష్టం వాటిల్లబోతోందని తమిళనాడు సదస్సు నిర్వహించింది. కుటుంబ నియంత్రణ పాటించినందుకు మనకు ఉత్తరాది నాయకులు ప్రాతినిథ్యం తగ్గించి దక్షాణాదిని చిన్నచూపు చూస్తున్నాయి. ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడ సీట్లు తగ్గిస్తామంటోంది.అయోధ్య తలంబ్రాల పేరిట సెంటిమెంట్ పూసారు. అవి అయోధ్య వి కావు, ఉత్తినే. బీజేపీ ఎంపీ బండి సంజయ్ని ఏదడిగినా శివం, శవం ముచ్చట తప్ప వేరే లేదు. బడి కట్టినా, గుడి కట్టినా బీఆర్ఎస్ నాయకులే కట్టారు. పదేళ్లలో కడుపులో సల్ల కదలకుండా చూసుకున్నాడు కేసీఆర్. తెలంగాణాలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారు. బీఆర్ఎస్ మీద ద్వేషం, అసూయ, ఆశ అనే అంశాలను ప్రయోగించి దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం’అని పిలుపునిచ్చారు. -
చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై కిషన్ రెడ్డి ఆగ్రహం
-
తెలంగాణ విద్యా కమీషన్లో అర్బన్ నక్సల్స్
సాక్షి,కరీంనగర్ : తెలంగాణ విద్యా కమీషన్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములమ్మి జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చిందన్నారు.బీఅర్ఎస్ అధినేతకు బీదర్లో దొంగనొట్లు ముద్రించే ప్రెస్ ఉందని, దొంగనోట్ల వ్యాపారం చేసి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. పదేండ్లు బీఅర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వం భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చింది. ఈ ప్రభుత్వంలో 15 నుండి 18 కమిషన్ పెంచారు. కమిషన్ ఇచ్చిన వారికే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
-
ప్రత్యేక దేశంగా ‘సౌత్ ఇండియా’.. ఎమ్మెల్యే గంగుల సెన్సేషనల్ కామెంట్స్
సాక్షి,కరీంనగర్ : దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే కచ్చితంగా దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఆదివారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనపై స్పందించారు. ప్రత్యేక తెలంగాణా తరహాలోనే ఆ డిమాండ్నూ తోసిపుచ్చలేం. బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్కు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయి. వాటిని సమర్థవంతంగా చేయకపోతే ముందుంది ముసళ్ల పండుగ’ అని వ్యాఖ్యానించారు.డీలిమిటేన్కు వ్యతిరేకంజనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది.స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. -
బీఆర్ఎస్ నేతలకు మెంటలెక్కింది
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ నేతలకు మెంటలెక్కింది. మైండ్ పనిచేయడంలేదు. వారిని ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపించాలి’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పదేళ్లలో కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు అసలు శిక్షలే సరిపోవు. కేసీఆర్ పదిలక్షల అబద్ధాలు ఆడారు. ఆయన మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలి. దళితుడిని సీఎం చేయకపోతే తల తీసుకుంటా అన్నారు. కేసీఆర్ను తలతీసి ఇవ్వమని అడగాలి.లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోమని చెప్పాలి’అని కోమటిరెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సభలో హరీశ్రావు వేసిన ప్రశ్నే తప్పని, ఏడేళ్లపాటు నారపల్లి బ్రిడ్జి కట్టలేక పోయిన బీఆర్ఎస్ నేతలా తనపై విమర్శలు చేసేది అని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పవర్ లేని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ‘నల్లగొండలో రోడ్లు అభివృద్ధి చేశామన్న ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యలు తప్పు.మా ప్రభుత్వంలో చేసిన పనులు బీఆర్ఎస్ వాళ్లు తమ ప్రభుత్వంలో చేసినట్టు చెప్పుకుంటున్నారు’అని కోమటిరెడ్డి అన్నారు. ‘మామ చాటు అల్లుడు హరీశ్రావు. తండ్రి పేరు చెప్పి కేటీఆర్ వచ్చారు. మేము కష్టపడి వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాము. నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా పనిచేశాను. 1987లో నేను ఎన్ఎస్యూఐ లీడర్ను’అని పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ వాళ్లు హౌలాగాళ్లు.. వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్ప ఏమీ తెల్వదు’అని మండిపడ్డారు. -
మంత్రి కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఆయన చాంబర్లో కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు ఈ నోటీసు అందజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి సభకు అవాస్తవాలతో కూడిన సమాధానం చెప్పారని నోటీసులో పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఆర్ఎఫ్ నిధులు రాలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు ఎస్క్రో ఖాతా తెరవలేదని అబద్ధాలు చెప్పారన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి కూ డా ఖర్చు చేయలేదని అసత్యాలతో సభను తప్పుదోవ పట్టించారన్నారు. ఈ 3 అంశాలకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ స్పీకర్కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చి, సభా గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సభా గౌరవం కాపాడాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను కోరారు. -
రూ. 2 లక్షలపైన రుణమాఫీ లేదు: తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ. 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ. 2 లక్షలపైన మాఫీ లేదు. కుటుంబానికి రూ. 2 లక్షలలోపు రుణం ఉన్న వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్లు మాకు వివరాలు అందాయి. ఆయా కుటుంబాలకు రూ. 20,616 కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పశుసంవర్థక శాఖ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆది శ్రీనివాస్ మహేశ్వర్రెడ్డి సహా మొత్తం 13 మంది సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులపై రుణభారం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రుణమాఫీని ప్రధానాంశంగా తీసుకుందన్నారు. అలాగే రైతు భరోసా కోసం రూ. 7,625 కోట్లు విడుదల చేశామని.. ఈ పంటకు కూడా రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వంపై భారం పడినా రైతులకు ఉచిత విద్యుత్ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులను ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతులకు మేలు చేసేందుకే సన్న వడ్లకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. సన్నాలకు ఇప్పటివరకు రూ. 1,200 కోట్ల మేర బోనస్ ఇచ్చినట్లు తుమ్మల వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నాల సాగు 25 శాతం నుంచి 45 శాతానికి పెరిగిందన్నారు. ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. పంట నష్టపరిహారం ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని.. రైతులు నష్టపోయిన పూర్తి పంటకు కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. భవిష్యత్తులో బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు: హరీశ్రావు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ మోసం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘రూ. 2 లక్షలు పైబడిన రైతు రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలకు.. చేతలకు పొంతన లేదని రుజువు చేసింది. సీఎం మాటలు నమ్మి రూ. 2 లక్షలు పైబడిన రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. అలాగే రూ. 2 లక్షలలోపు తీసుకున్న రుణం ఇంకా మాఫీ కాక చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాల్లోని లోపాలను సవరించకుండా రైతులపైనే నెపం నెట్టి రుణమాఫీ నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన విధంగా రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేయాలి’అని హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
తెలంగాణ సంపదపై గుంట నక్కల్లా కన్నేశారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సంపద మీద గుంట నక్కల మాదిరిగా అందరూ కన్నేశారు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పని చేస్తలేరట.. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నా యి. కూటమి కట్టకుండా చంద్రబాబు అక్కడ (ఏపీలో) మళ్లీ అధికారంలోకి వచ్చేవాడా? అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉన్నవారిగా మనకు చూపే కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వీరిపట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఒక పొరపాటు జరిగినా జీవితకాలం దుఃఖం తప్పదు’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. ‘గోదావరి కన్నీటి గోస’పేరిట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ నెల 17న ప్రారంభమైన 180 కిలోమీటర్ల పాదయాత్ర శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ సమావేశమై మాట్లాడారు. ‘తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున ఎనిమిదేసి మంది ఎంపీలను గెలిపించినా ఏకాణా పని జరగడం లేదు. బీఆర్ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులు సాధించుకునేవాళ్లం. ఈ దిశగా ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి’అని సూచించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదు ‘తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింది. ఆ ఆవేదనతోనే వాళ్లను ఉద్యమ కాలంలో దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను. అంతేతప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది? రామగుండం ఎమ్మెల్యేకు నీటి గోసపై మాట్లాడే అవకాశమున్నా మౌనంగా ఉంటే ఏమనాలి? బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో అలుగు పారితే ఇప్పడు చెరువులు, కుంటలు అడుగంటాయి. కొట్లాడి సాధించిన తెలంగాణను ఎంతో జాగ్రత్తగా నిలబెట్టినా ప్రజలు కొత్త ప్రభుత్వానికి తెచ్చుకున్నారు. అది వాళ్లిష్టం అయినా ఫలితాన్ని లోకం చూస్తోంది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు చెన్నై వంటి నగరాల్లోనూ ఎంతో ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటున్నారు. తెలంగాణలోనూ ఖర్చుకు వెనుకాడకుండా తాగు, సాగునీరు అందించాల్సిందే’అని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చుతున్నారు ‘పల్లెల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చిన పేదలకు మనం అండగా నిలిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వారి ఇండ్లను కూల్చివేస్తోంది. హైడ్రా కూల్చివేతలతో ఆవేదన చెందుతున్న ప్రజలు.. ‘కేసీఆర్ అన్నా.. ఎక్కడున్నవు.. రావే’అని పిలుస్తున్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా? పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు మొదలయ్యాయి. తెలంగాణలో సమస్యలకు నాటి ప్రధాని నెహ్రూ మొదలుకొని సోనియాగాంధీ వరకు ప్రధాన శతృవు కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో మళ్లీ సాగు, తాగునీరు, విద్యుత్ కష్టాలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు తరాలను బాగుచేసే దిశగా ఆలోచించాలి. ప్రధాని మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బెల్లం ఉన్న దగ్గరకు ఈగలు వస్తాయి. అధికారం పోగానే కొందరు పార్టీకి దూరమవుతారు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ పార్టీదే. సింగిల్గా అధికారంలోకి వస్తాం. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. ప్రతీ కార్యకర్త కేసీఆర్లా తయారై తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేసీఆర్కు పార్టీ నేత బొడ్డు రవీందర్ నాగలి బహూకరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పుట్ట మధు, పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్రెడ్డి, నారాయణదాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
‘తమ్ముడూ.. నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు’
హైదరాబాద్: సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటిరిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీతక్క ఖండించారు. ‘ తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు. నియోజకవర్గంలో నేను తిరిగినట్లు నువ్వు తిరగలేవు. ప్రజలకు ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందాం. హైదరాబాద్ లో తిరిగే వాల్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో తెలుస్తుందా?,రైతులతో సంబందం లేకుండా హైదరాబాద్ లో తిరుగుతున్నట్లు ఉంది. బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసింది మీరు. వరి వేస్తే ఉరి అన్నది మీరు. ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 1200 కోట్లు బోనస్ ఇచ్చింది. ఇంకా ఎవరికన్నా రాకపోతే అవి కూడా ఇస్తాం. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. భూమి లేని వాల్లకే కూలీ భరోసా ఇస్తున్నాం. కొంత భూమి ఉన్న కూలీలకు ఇవ్వాలనే అంశం పరిశీలనలో ఉంది’అని సీతక్క పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి చూడండి..‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి చూడండి. మీరు మా ఇంటికి రావాలని ఆహ్వానం పలుకుతున్న. ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్స్ లోనే నేను నివసిస్తున్నాను. వైఎస్ భవనంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు. అది మా ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనమే. ఆ భనంలోనే ఉంటున్నాను. మీలాగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదు. మా ఇంటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మీ అందరిని భోజనానికి ఆహ్వానిస్తున్న... మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆహ్వానించలేదు. నాది నిరాడంబర జీవితం. నా కుమారుడు కూడా హన్మకొండ లోనే ఉంటాడు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. -
‘మహాలక్ష్మి పథకం లేదు కానీ.. అందాలు పోటీలకు మాత్రం సిద్ధం’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రతీ విషయంలోనూ పారియిందంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం తాము అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ బడ్జెట్ పై ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వకుండా పారిపోయింది. శాసన సభ చరిత్రలో చీకటి రోజు. ప్రభుత్వం తలుపు లు తెచిచే ఉంటాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి... కేవలం 20 శాతం కమిషన్ కోసం మాత్రమే తెరిచి ఉంచారని ఎద్దేవా చేశారు హరీష్.ప్రభుత్వం 20 శాతం కమిషన్ అడుగుతుందని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్మ చేశారు. ఉద్యోగుల విషయంలో భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టించారు. 2 లక్షల ఉద్యోగలా గురించి ప్రశ్నిస్తే సభను వాయిదా వేసి పారిపోయారు. ఎల్ఆర్ఎస్ అంశంలో భట్టి విక్రమార్క దాట వేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తే డబ్బులు చెల్లించాల్సిదేని భట్టి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదు. బీఆర్ఎస్ అప్పులపై లెక్కలు చూపించాలంటే పారిపోయారు. కాంట్రాక్టర్లు అంటే పెద్ద పీట .. ఉద్యోగులు అంటే చిన్నచూపు. మహాలక్ష్మి పథకం అమలు లేదు కానీ.. అందాల పోటీలు పెడుతున్నారు. ప్రభుత్వం దగ్గర మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయింది. సభలో అబద్ధాలు చెప్పి ప్రభుత్వం పారిపోయింది’ హరీష్ విమర్శనాస్త్రాలు సంధించారు. -
సీఎం రేవంత్రెడ్డితో హరీష్రావు భేటీ
-
వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : కేటీఆర్
సాక్షి,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘వచ్చే ఏడాది పాదయాత్ర బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడేమే లక్ష్యం. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం’ అని ధీమా వ్యక్తం చేశారు.మరోసారి కేసీఆరే సీఎంఅంతకుముందు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు.రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి.ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను నంబర్ వన్ చేశారు కేసీఆర్.ఎస్ఎల్బీసీలో విషాదం.. చేపల కూర తింటున్న మంత్రులు ఎస్ఎల్బీసీలో విషాదం జరిగితే మంత్రులు చేపల కూర తింటున్నారు. ఓ మంత్రి నీళ్లు, వాటర్ కలిశాయని అంటున్నారు. గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్పై ద్వేషంతో జిల్లాలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఇది. చెరువులు నింపితే బోర్లు ఎందుకు ఎండిపోతాయి. రేవంత్కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఒక్క మాట మాట్లాడదు. ఏం మాట్లాడకముందే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అసెంబ్లీని గాంధీభవన్ అన్న మజ్లిస్ సభ్యులపై చర్యలు తీసుకునే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. -
‘భూమికి మూడు ఫీట్లు లేరుగాని.. అసెంబ్లీలో తెగ మాట్లాడేస్తున్నారు’
సాక్షి,సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కేసీఆరే మరోసారి సీఎం అవుతారు. భూమికి మూడు ఫీట్లు లేని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.గ్రామ సింహాలు కూడా సింహాల్లా మాట్లాడుతున్నాయి. కేసీఆరే లేకపోతే తెలంగాణనే లేదనేది అక్షర సత్యం. మూడు పాత్రల్లో విజయవంతం అయిన ఏకైక పార్టీ బీఆర్ఎస్.తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ పార్టీ.బీఆర్ఎస్ అధికారంలో రావాలని కోరుకునేది ప్రజల కోసమే. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకునే పనికాకుండా పర్సంటేజీలు పెంచుకునే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కోర్టులో కీలక పరిణామం
సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు (MLAs Disqualification) సంబంధించిన కేసు కొనసాగుతున్న తరుణంలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను పార్టీ ఫిరాయించలేదని,కాంగ్రెస్లో చేరలేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లో తాను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక మర్యాదపూర్వకంగా తాను సీఎం రేవంత్రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. మీడియా వక్రీకరించిందని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఈ అంశంపై బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ పార్టీమీద గెలిచి, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై చివరి సారిగా (మార్చి 4,మంగళవారం) జరిగిన విచారణలో ఎమ్మెల్యేల అన్హత విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ మారి నెలలు గడుస్తున్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాప్యం చేయడంపై తీవ్రంగా పరిగణించింది. విచారణలో ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెండ్ డెడ్’ ధోరణి సరైంది కాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ(మార్చి 25)లోగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం, తెలంగాణ శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. -
తెలంగాణ బడ్జెట్ వేళ.. ఎండిన వరి కంకులతో BRS నిరసన
-
ఆరు గ్యారంటీలు గోవిందా.. బడ్జెట్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణలోని ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అలాగే, పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటనలేదని కామెంట్స్ చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ స్పందించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు గోవిందా అని అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది. ఏడాది దాటినా ఉద్యోగాల ఊసేలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కు రావాలి. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డు ఊసేలేదు. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.తులం బంగారం ఎక్కడ?.ఎన్నికల్లో ఇచ్చిన హమీ తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2000 పథకానికి పాతరేశారు. రూ.4000 ఇస్తామన్న పెన్షన్లు గోవిందా అనేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్లో మహిళలకు తీరని అన్యాయం జరిగింది. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను వెన్నుపోటు పొడిచింది. రైతు కూలీలకు ఏ ఒక్కరికీ రూ.12వేలు రాలేదు. ఆదాయం రూ.70వేల కోట్లు పడిపోయిందని సీఎం చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం ప్రస్తావనే లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ కుప్పకూల్చింది. కరోనా కంటే ప్రమాదకరం కాంగ్రెస్ వైరస్. మేం సంవత్సరానికి రూ.40వేల కోట్లు అప్పు చేస్తే గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే లక్షా 60వేల కోట్లు అప్పు చేసిందన్నారు. పెండింగ్ నగరంగా హైదరాబాద్..తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది. ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం. రంకెలు కాదు రేవంత్ రెడ్డి..అంకెలు ఎక్కడ పోయినాయి. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే.. ఇప్పుడు చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు. అది ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహా నగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. -
ప్రియాంకా.. స్కూటీలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన తెలిపారు. స్కూటీల ఆకారంలో ఉన్న ప్లకార్డులతో సభ ఆవరణకు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు.‘ప్రియాంకగాందీ.. స్కూటీలు ఎక్కడ?’అంటూ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు నినాదాలు చేశారు. అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద కవిత మాట్లాడుతూ కల్యాణమస్తులో భాగంగా తులం బంగారం ఇవ్వలేమన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పనిచేస్తోందన్నారు. సమస్యలకు కేంద్రంగా తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్లీ సమస్యలకు కేంద్రంగా మార్చుతోందని శాసనమండలి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. స్టేషన్ఘన్పూర్ సభలో తామిచ్చిన హామీలు అమలు చేయలేమని స్వయంగా వారే ఒప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
కరువు రైతులను ఆదుకొనే పూర్తి బాధ్యత సీఎందే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువు కాంగ్రెస్ తెచ్చిందని.. రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎండిన ప్రతీ ఎకరాకు రూ. 25 వేల చొప్పున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ముంచుకొస్తున్న కరువు ముప్పుపై ముందే హెచ్చరించినా, తెలివిలేని కాంగ్రెస్ ప్రభుత్వం చెవికి ఎక్కలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పచ్చని పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించిందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ జరగక, పెట్టుబడి సాయం అందక ఇప్పటికే అల్లాడుతున్న రైతులకు పంటలు ఎండిపోవడం గోరు చుట్టు మీద రోకటి పోటులా ఉందన్నారు. ఆర్థిక శక్తిని ఆగం చేస్తున్నారు ఆర్థికశక్తిగా ఎదిగిన తెలంగాణను ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని, రాష్ట్రంలో పాలనకు బదులుగా పీడన జరుగుతోందని కేటీఆర్ అన్నారు. హైడ్రా పేరిట వసూళ్లు, మూసీ సుందరీకరణ పేరిట పేదలపై పగ, ఫార్మాసిటీ పేరిట భూముల దందా జరుగుతోందన్నారు. ఫోర్త్సిటీ పేరిట ముఖ్యమంత్రి కుటుంబం రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ట్రిపుల్ఆర్ పేరిట పేదల భూముల ఆక్రమణ జరుగుతోందన్నారు. గతంలో మద్యం వద్దు అంటూ నినదించిన రేవంత్...ఇప్పుడు ధరల సవరణ, కొత్త బ్రాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. -
కుటుంబం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘నైతిక విలువలపై అసెంబ్లీలో చిలుక పలుకులు పలికిన సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ ఘన్పూర్ సభలో బజారు భాష మాట్లాడారు. రాజ కీయాల్లో హద్దు దాటకూడదని ఇన్నాళ్లూ సంయమనంతో వ్యవహరించాం. మేం కూడా రేవంత్ బట్టలు విప్పితే.. ఆయన బయట తిరగలేడు. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేటు కార్ల సంగతులు, సాగర్ సొసైటీలు, మైహోమ్ భుజ వ్యవహారాలను మేం మాట్లాడగలం. ఢిల్లీలో ఆయన గోడలు దూకిన విషయాలు చెప్పగలం. రేవంత్ దాటిన ‘రేఖలు, వాణిలు, తార’ల గురించి.. ఎక్కువగా మాట్లాడితే ఫొటోలు కూడా బయటపెట్టగలం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి తాము నోరు విప్పితే ఆయనకు ఇంట్లో తిండి కూడా పెట్టరని పేర్కొన్నారు. సోమవారం శాసనసభ లాబీలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం అప్పుడు గుర్తుకురాలేదా? తనపై 15 కేసులు పెట్టిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజాస్వామ్య విలువలు, కుటుంబం ఇప్పుడు గుర్తుకువస్తున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘మాపై అసహ్యకరమైన ఆరోపణలు చేసి సంబంధాలు అంటగట్టినప్పుడు, మా పిల్లలను రాజకీయాల్లోకి లాగిన రోజు మాకు కుటుంబాలు లేవా? మీకు విలువలు లేవా? ప్రస్తుతం తన భార్యాబిడ్డల గురించి మాట్లాడుతున్న రేవంత్కు.. మాకు కూడా కుటుంబాలు ఉంటాయనే విషయం గుర్తుకురాలేదా?’’అని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరేమిటో తెలుసని, బీజేపీ నేతల బాగోతాలు కూడా తమ వద్ద ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అందులో మూటల లెక్కలూ ఉన్నాయేమో! ‘‘ఈ ఏడాది రూ.70 వేల కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ అప్రూవర్గా మారి నిజం ఒప్పుకున్నారు. ఎలాంటి ఆర్థిక మాంద్యం, కోవిడ్ సంక్షోభం వంటివేవీ ఇప్పుడు లేకున్నా సీఎం రేవంత్ విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్. రాష్ట్ర అప్పులపై రేవంత్ చెప్తున్న కాకి లెక్కల్లో రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్లకు ఇచి్చన మూటల లెక్కలు కూడా ఉన్నాయేమో’’అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్కు గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదని మండిపడ్డారు. భూముల అమ్మకంపై సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. పాలన చేతకాదనే మాటలను నిజం చేస్తున్నారు.. ‘‘తెలంగాణకు నాయకత్వ లక్షణాలు లేవు, పాలన చేతకాదనే సమైక్యాంధ్ర పాలకుల మాటలను రేవంత్ నిజం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలు విచక్షణతో మాకు పగ్గాలు అప్పగించారు. కాబట్టే పునాదులు గట్టిగా పడ్డాయి. లేదంటే తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోయేది’’అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రహస్య మీటింగ్లపై కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని.. ఆ ఆరోపణలు అవాస్తవమైతే రాజాసింగ్ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. ఫార్ములా–ఈ రద్దుపై విచారణ జరిపిస్తాం.. ఫార్ములా–ఈ రేసును తప్పుబడుతున్న రేవంత్ ప్రభుత్వం.. రూ.250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు పెడుతోందని కేటీఆర్ నిలదీశారు. ‘‘ఫార్ములా–ఈ’ను ఏకపక్షంగా రద్దు చేయడంతో ప్రభుత్వానికి జరిగిన నష్టంపై మా ప్రభుత్వం వచి్చన తర్వాత విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడితే.. వారు జర్నలిస్టులే కాదంటూ, బట్టలు విప్పుతానంటూ సీఎం దూషణకు దిగుతున్నారు. గాడ్సే మూలాలు కలిగిన రేవంత్ జాతిపిత లాంటి కేసీఆర్పై చిల్లరగా మాట్లాడుతూ అభినవ గాడ్సేలా తయారయ్యారు’’అని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎంఐఎం విషయంలో తమ వైఖరిపై పునరాలోచించుకుంటామని చెప్పారు. -
అమెరికాలో రోడ్డుప్రమాదం తెలంగాణ వాసులు దుర్మరణం
-
సీఎం రేవంత్ రెడ్డి కి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది: కవిత
-
కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతా: సీఎం రేవంత్
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్, ఆయన ప్రభుత్వంలో జరిగిన పాపాల చిట్టా విప్పుతా..19, 20 తేదీల్లో బట్టబయలు చేస్తా. ఇప్పటివరకు చెప్పింది ఇంటర్వెల్ వరకే...అసలు సినిమా ముందుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేతుల బెడితే పదేళ్లలో రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతికి పాల్పడ్డారు. రూ.లక్ష కోట్లు వెనకేసుకున్నారు. అప్పులకు అసలు, మిత్తీ కలిపి ఏడాదిలో రూ.1.53 లక్షల కోట్లు మా ప్రభుత్వం కట్టింది. ఆ డబ్బే ఉంటే రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేవి..’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో జరిగిన ‘ప్రజాపాలన ప్రగతి బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పుల్లోనే పథకాల అమలు ‘కేసీఆర్ పాలించిన ఆ పదేళ్లలో ధనిక రాష్ట్రం అప్పుల కుప్పయ్యింది. దివాళా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. ఆనాడు నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.500 కోట్ల అప్పు ఉంటే ఈనాడు ప్రతినెలా వడ్డీ రూ.6,500 కోట్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. కేసీఆర్ పాలనలో రూ.8.29 లక్షల కోట్లు అప్పు తేలింది. అయినా అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేశాం. ఈ మహాలక్ష్మి పథకంతో నేటికి 150 కోట్ల మంది ఆడబిడ్డలకు గాను రూ.5,005 కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిస్తున్నాం. అప్పుల పాలైన రాష్ట్రంలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్, 25.35 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల పంట రుణమాఫీకి శ్రీకారం చుట్టాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టులు, పథకాలపై చర్చకు రావాలి ‘కృష్టా, గోదావరి జలాల ప్రాజ్టెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయి కూలేశ్వరంగా మారింది. తాటిచెట్టులా పెరిగిండ్రు కానీ ఆవకాయ అంత కూడా ఆయన మెదడులో తెలివి లేదు.. నేను హరీశ్రావుకు సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై చర్చకు రావాలి. 300 టీఎంసీలతో శ్రీరాంసాగర్, 200 టీఎంసీల నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులతో పాటు జూరాల, నెట్టెంపాడు, దేవాదుల, రాజీవ్, ఇందిరాసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి పక్కా శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పారదర్శక పాలనకు అద్దం పడతాయి. కాంగ్రెస్ ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో సాగునీరు రాకున్నా కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేలా తోడ్పాటు అందించాం. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చి అన్నదాతలను ఆదుకున్నాం. ఈ విషయాలపై విమర్శలు చేస్తున్న హరీశ్రావు, కేటీఆర్ పిల్లకాకులు. కేసీఆర్ను రమ్మన్నా..ఏ ప్రాజెక్టు వద్ద మాట్లాడుదాం రమ్మంటున్నా..’ అని రేవంత్ అన్నారు. జనగామ జిల్లా శివునిపల్లిలో మహిళా సంఘాలకు చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు ∙సభకు హాజరైన మహిళలు ఫామ్హౌస్లో పడుకొని ఉసిగొల్పుతుండు.. ‘అధికారం పోతే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ ఫామ్హౌస్లో పడుకొని ఉసిగొల్పుతుండు. అందుకే ఫామ్హౌస్లో నుంచి లేచి రమ్మన్నా. రూ.58 లక్షల ప్రజాధనం జీతభత్యాల కింద తీసుకున్నారు. ఏ రంగంలో జీతగాళ్లకైనా పని చేయకుంటే జీతం ఇస్తారా? అపార రాజకీయ అనుభవజు్ఞడైన కేసీఆర్ అ«ధికారం ఉంటే వస్తరు.. లేకుంటే అలిగి పండ్తరా? మీరైతే లక్షల కోట్లు సంపాదించి ఫామ్హౌస్లు, టీవీలు, పేపర్లు పెట్టుకున్నరు. నువ్వు గజ్వేల్, నీ కొడుకు జన్వాడ, నీ అల్లుడు మొయినాబాద్, నీ బిడ్డ శంకర్పల్లిలో ఫామ్హౌస్లు కట్టుకున్నరు. కానీ తెలంగాణ రైతులు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీరు క్యాప్సికమ్ పండించి కోట్లు సంపాదించిన తీరు వారికి, నిరుద్యోగ యువతకు చెప్పరా? అధికారం పోగానే దివిసీమ తుపాను బాధితుల కంటే ఎక్కువ ఆందోళనలో కేసీఆర్ కుటుంబం ఉంది. కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని హరీశ్రావు అంటున్నడు. జాతిపితకు, కేసీఆర్కు ఏమైనా పోలిక ఉందా? అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా? అసలైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపితే.. హరీశ్రావు చెప్పే జాతిపిత ఫామ్హౌస్లో పడుకుంటున్నారు. తెలంగాణ జాతిపితలంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్..’ అని సీఎం పేర్కొన్నారు. మా మీద ప్రజలకు కోపం ఎందుకుంటుంది... ‘ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్లే పయనంలో మహిళల అభ్యున్నతికి పాటు పడుతుంటే మాపై ప్రజలకు కోపం ఉందని చెబుతున్నారు. మాపై కోపం ఎందుకు ఉంటుంది? 65 లక్షల మందికి సారెచీర ఇచ్చినందుకా? వెయ్యి సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినందుకా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ తయారీతో శ్రీమంతులు చేసినందుకా? రూ.20,617 కోట్ల పంట రుణమాఫీ చేసినందుకా? రూ.500 బోనస్ ఇస్తూ రైతు భరోసా రూ.12 వేలకు పెంచినందుకా? మీడియా మిత్రులకు ఇళ్లపట్టాలు ఇచ్చినందుకా?..’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న దొంగలకు ఉప్పు పాతర వేస్తా అన్నందుకు దోపిడీ వర్గాలకు నాపై కోపం ఉంటుంది తప్ప ప్రజలకు ఉండదన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: పొంగులేటి ‘గత బీఆర్ఎస్ పాలకులు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. దోచుకున్న డబ్బులతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావట్లేదన్నారు. సభలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రామచంద్రునాయక్, యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రేవంత్కు కేసీఆర్ భయం పట్టుకుంది’
సాక్షి, నిజామాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫీవర్ పట్టుకుందని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ఇఫ్తార్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. తెలంగాణ అంటే గంగా జమునా తహిజిబ్.ఇతరులకు తెలంగాణ ఇక రాజకీయం. బీఅర్ఎస్కు తెలంగాణ ఒక టాస్క్. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది..గౌరవం,అభిమానం అనేది కొంటే రాదు.ముఖ్యమంత్రి మాటలు గౌరవ ప్రదంగా లేవు. తెలంగాణ హిస్టరీ కేసీఆర్ .. ఆయనతో రేవంత్కు అస్సలు పోలిక లేదు. కాంగ్రెస్ పార్టీ రంజాన్ తోఫా నిలిపివేయటం బాధాకరం. సంవత్సరం కాంగ్రెస్ పాలనలో ఎవరు ఎంటి అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు.ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. -
సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన హరీష్ రావు
సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 184 లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ పేదల కోసం సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఊళ్లలో కరెంట్ కష్టాలు మళ్లీ వచ్చాయి.ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. పేద ప్రజల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచించేవాడు. రేవంత్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. సిద్ధిపేటకు రేవంత్ అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు సిద్ధిపేట బాగా అభివృద్ధి చెందింది. మళ్లీ కేసీఆర్ రావాలి అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిద్ధిపేట అభివృద్ధి కోసం అసెంబ్లీలో కూడా కొట్లాడతా. కేసీఆర్ అన్ని ప్రాజెక్టులు నిర్మించాడు. బుద్ధి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది’ అని హరీష్ విమర్శించారు. -
‘దోచుకున్న డబ్బుతో మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు’
వరంగల్:: గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయిలు దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టలాని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో భాగంగా సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు వరంగల్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్.. బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రెండు సార్లు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన బుద్ధి రావట్లేదు.రాష్ట్ర విభజన జరిగిన నాడు తెలంగాణ ధనిక రాష్ట్రం. నిజాలు బయటపడతాయని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడడు. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ బయట బావ, బామ్మర్ధులు సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎందుతున్నాయంటే దానికి కారకులు గత పాలకులే’ అని ధ్వజమెత్తారు పొంగులేటికాంగ్రెస్ అంటేనే సంక్షేమం.. సామాజిక న్యాయంఅసలు కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమన్నారు మంత్రి సీతక్క. ఇంటింటికి ఒక్క ఉద్యోగం అని రంగుల ప్రపంచం కేసీఆర్ చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్12 నెలల్లోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగాలు ఇస్తుంటే కళ్లల్లో ప్రతిపక్షాలు నిప్పులు పోసుకుంటున్నాయన్నారు. సంవత్సరంలో రూ. 23, 600 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాం. పరీక్షలు రాయకుండానే పేపర్లు లీకైన చరిత్ర బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో స్టేసన్ ఘనపూర్ అభివ1ద్ధిలో అగ్రగామి అని సీతక్క స్పష్టం చేశారు. -
స్టేచర్ సరే.. స్టేట్ ఫ్యూచర్ సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘‘బీఆర్ఎస్ నేతలు మాటకు ముందు, మాటకు తర్వాత స్టేచర్ అంటున్నారు. ఆ స్టేచర్ విషయంలో ఉన్న ఆసక్తి, పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ విషయంలో ఏదీ? ఒకప్పుడు మీకు అధికార పార్టీ స్టేచర్ ఉండేది, తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని జనం మార్చురీకి పంపారు. స్టేచర్ గుండుసున్నా అయింది. నేను ఇదే చెప్పా, అందులో తప్పేముంది. నేను కేసీఆర్ను ఏదో అంటున్నానని కేటీఆర్, హరీశ్రావు అంటున్నారు.కేసీఆర్ నుంచి తీసుకునేందుకు ఇక ఏమీ లేదు. ఆయనది ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆయనకు జరగరానిది ఏదైనా జరిగితే.. కేటీఆర్, హరీశ్రావు దానికోసం పోటీపడతారేమో. దాన్ని నేనైనే కోరుకోను కదా! కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలి. అదే ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. నేను ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇది మా భవిష్యత్తు కార్యాచరణ..’’అని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు శనివారం ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.వివరాలు సీఎం రేవంత్ మాటల్లోనే.. ‘‘పార్టీలో పెద్ద మనిషి హోదాలో కేసీఆర్.. తాడు బొంగరం లేనట్టు వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీశ్రావులను సరిదిద్దాలి. ఇకనుంచి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. నా రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతున్నారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన నేను మంత్రి కాకుండా నేరుగా సీఎం అయ్యా. గతంలో ఎన్టీఆర్, నరేంద్ర మోదీ డైరెక్ట్గా సీఎం అయి పాలన అందించలేదా? 40ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కదా.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే.. అందులో మంచిని గుర్తించి నేర్చుకునేందుకు నేను సిద్ధం.. రైతులకు సంబంధించిన ఏ విషయంపై అయినా చర్చ జరగాలని కేసీఆర్ కోరితే నేను రెడీ. సభకు వచ్చి చర్చించాలి. పూర్తి చిట్టా విప్పుతా. ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా.. భూకంపం కూడా ఒక్కసారి రాదు, రెండుమూడు సార్లు కదిలి కంపిస్తుంది. తుఫాన్ ముందు కొంత ప్రశాంతత ఉంటుంది. కొన్నేళ్లు అలాంటి ప్రశాంతత చూపిన ప్రజలు చివరికి ఎన్నికల్లో ప్రభావం చూపారు. అసెంబ్లీ ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా వచ్చినా కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదు. వారి అధికారాన్ని దూరం చేసినందుకు నామీద కోపం ఉండొచ్చు. కానీ సీఎం కుర్చీకైనా గౌరవం ఇవ్వాలి కదా.. ఇంకా కుల దురహంకారాన్ని వీడలేదు. ఇట్లానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండుసున్నా ఖాయం. గవర్నర్ ప్రసంగం అలానే ఉంటుంది.. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానంలా ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అవును.. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానంలానే ఉంటుంది. ఎందుకంటే మాది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో కూడిన విధానాలనే పథకాలుగా అమల్లోకి తెచ్చాం. మా ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా రూపొందిన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాలనే గవర్నర్ ప్రస్తావించారు. అలాంటప్పుడు విమర్శించడం ఏమిటి? ప్రతిపక్ష నేతలు అజ్ఞానమే విజ్ఞానంగా, అడ్డగోలుతనమే గొప్పతనంగా భావిస్తున్నట్టున్నారు’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గింది.. ‘‘అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే యువతకు 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరోటి లేదు. నేను సవాల్ విసురుతున్నా.. ఉంటే చెప్పండి. 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతంగా ఉంటే.. 2024 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 18.1 శాతానికి తగ్గింది. కేంద్ర కార్మిక శాఖ ఆదేశం మేరకు లేబర్ఫోర్స్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక చెప్పిన వాస్తవమిది. నిరుద్యోగ సమస్యను తగ్గించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.’’ఔను.. మోదీ బడే భాయే.. ‘‘దేశంలోని ముఖ్యమంత్రులకు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ బడే భాయే (పెద్దన్న). ఈ మాటను మరోసారి చెప్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను తరచూ ప్రధానిని కలుస్తూనే ఉంటాను. పార్టీపరంగా ఆయనతో విభేదించొచ్చు. కానీ ప్రధానిగా గౌరవిస్తా. గత 15 నెలల్లో ఢిల్లీకి 32 సార్లు వెళ్లా, మూడు పర్యాయాలు ప్రధానిని కలిశా. నేను కలవని కేంద్రమంత్రి అంటూ ఎవరూ లేరు. అవసరమైతే మరో 300సార్లు వెళ్తా. మీరు ప్రధానిని గౌరవించరు. గవర్నర్ను గౌరవించరు. ప్రజలను పట్టించుకోరు.’’ -
సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పురోగతి కోసం శ్రమించిన కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం దారుణమన్నారు. కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బహిష్కరించామని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానించారు. ఉత్తమ్వి పచ్చి అబద్ధాలు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని హరీశ్రావు విమర్శించారు. సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించి ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేశారు. నాడు కృష్ణా జలాల్లో తెలంగాణకు తాత్కాలిక కేటాయింపులు మాత్రమే జరిగాయి. ఇటీవల తెలంగాణ అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్ ఢిల్లీకి వెళ్లి 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుని వచ్చారు’అని హరీశ్ అన్నారు. ‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో జరిగే అన్యాయంపై నాడు కాంగ్రెస్ నాయకులు పి.జనార్దన్రెడ్డి ఒక్కరే కొట్లాడారు. నాడు నాతోపాటు ఆరుగురు కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాం. కానీ ఉత్తమ్కుమార్ రెడ్డి.. కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో చోటుకోసం నోరు మూసుకున్నారు. ఆయనది ద్రోహ చరిత్ర అయితే బీఆర్ఎస్ది త్యాగాల చరిత్ర. ఉత్తమ్ దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాకు కేసీఆర్ నీళ్లు ఇస్తే.. హుజూర్నగర్ను ముంచి పులిచింతల ద్వారా ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చిన ఘనులు కాంగ్రెస్ నాయకులు’అని హరీశ్రావు మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో త్యాగాలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ మార్చురీకి పోతారని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. శనివారం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియా పాయింట్ వద్ద వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ను కించపరచడం తప్ప సీఎం 3 గంటల పాటు అసెంబ్లీలో మాట్లాడిందేమీ లేదన్నారు. రాజముద్ర నుండి చార్మినార్, కాకతీయుల కళాతోరణం తీసే ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ చాంబర్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్తో భేటీ అయ్యారు. సీనియర్ సభ్యుడైన జగదీశ్రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదనే విషయాన్ని హరీశ్రావు ప్రస్తావించారు. జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేసే అంశంలో విపక్ష ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కోరలేదన్నారు. జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై పునఃసమీక్షించి ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. సభ ప్రారంభమైన తర్వాత హరీశ్రావు ఇదే విషయాన్ని మరోమారు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను కోరారు. -
పల్లా వర్సెస్ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో హామీల అమలుతోపాటు పాలనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి దాడి చేయగా.. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ప్రతిదాడి చేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డి వరుస ఆరోపణలు చేస్తుండగా మంత్రులు పదేపదే కల్పించుకుని సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీల అమలుపై బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పల్లా సొంత నియోజకవర్గం జనగామలో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.124 కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము మూడు నెలల్లోనే రూ.263 కోట్లు మాఫీ చేశామన్నారు. మా సీఎం కూడా మీ సీఎంలాగే ఉండాలా?: భట్టి సీఎం రేవంత్రెడ్డి వద్దే విద్యా శాఖ ఉండడంతో పర్యవేక్షణ కొరవడిందని, 2 లక్షలమంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యా రని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపణలు చేయగా, భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఖండించారు. మీ సీఎం (కేసీఆర్) తరహాలోనే మా సీఎం ఉండాలని ఊహించుకుంటే ఎలా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎస్సీతో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేశారని, 22వేల మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చారని, 36 వేల మంది టీచర్లకు బదిలీలు కల్పించారన్నారు. గత ప్రభుత్వం వర్సిటీలను గాలికి వదిలేస్తే, 12 మంది వీసీలను నియమించారన్నారు. మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతోపాటు నిర్మాణానికి రేవంత్ రూ.540 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. గత ప్రభుత్వం మీకు (పల్లాకు), ఇతరులకు ప్రైవేటు వర్సిటీలను ధారాదత్తం చేస్తే వాటికి దీటుగా తాము ప్రభుత్వ వర్సిటీలను తీర్చిదిద్దుతున్నామన్నారు. బీఆర్ఎస్ ధోరణితోనే అన్యాయం: మంత్రి ఉత్తమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితోనే రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో తీరని నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల సామర్థ్యం పెంపు విషయంలో ఏపీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. తాము కేంద్రం, కృష్ణా బోర్డుతో కొట్లాడి సాగర్ కుడి కాల్వకు ఏపీ తీసుకుంటున్న జలాలను 10వేల నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించామన్నారు. మంత్రి డి.శ్రీధర్బాబు మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు నిర్వహించని బీఆర్ఎస్ వాళ్లు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రుణమాఫీ చేశామని, రైతులందరికీ బోనస్ చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళా జర్నలిస్టు ‘ఎక్స్’లో పెట్టిన వీడియోలోని భాషను చూసి కూడా ఆమెను సమరి్థస్తారా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100% రుణమాఫీ జరిగితే ముక్కును నేలకు రాస్తా: పల్లా రైతు రుణమాఫీ 50 శాతంలోపే జరిగిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామతోపాటు భట్టి నియోజకవర్గం మధిరలోని ఏ ఒక్క గ్రామంలోనైనా 100శాతం రుణమాఫీ జరిగితే తాను ముక్కును నేలకు రాసి, రాజీనామా చేస్తానని ప్రకటించారు. 27 శాతం మంది రైతులకే బోనస్ లభించిందని, ఏడాదిలో 564 మంది రైతులు, 116 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, గురుకులాల్లో 83 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. కరెంట్ కోతలపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టారని, అరెస్టైన జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ని విడుదల చేయాలన్నా రు. కాకతీయ కళాతోరణం, చారి్మనార్ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే పోరాడతామన్నారు. తెలంగాణ తల్లి సాధారణంగా ఉండాలని, నగలు, వడ్డాణం ఉండకూడదని చెప్పేటోళ్లు రూ.కోట్ల వాచీలు, వారి కుటుంబ సభ్యులు ఖరీదైన నగలు ధరిస్తున్నారన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 55వేల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. -
‘సోషల్ మీడియా చాలా ఇబ్బందిగా మారింది’
హైదరాబాద్: తాను కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ బారిన పడ్డ మహిళనే అన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోసల్ మీడియా ఎఫెక్ట్ను సీఎం రేవంత్ సభలో మాట్లాడటం తమ అందరికీ చాలా రిలీఫ్ గా ఉందన్నారు సీతక్క. ఈరోజు(శనివారం) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి.. మానసిక ఆవేదనకు గురి చేశారు. సోషల్ మీడియా పోస్ట్ లు కొన్ని సార్లు డీమోరల్ చేశాయి. మహిళలు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టం.. అలాంటిది మేము ఈ స్థాయికి వస్తే మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. సోషల్ మీడియాను సోషల్ సర్వీస్ కోసం వాడుకున్న నేను.. అంతే ఇబ్బందులకు గురయ్యాను. సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్ధాలకు వాడుతుంది. సోషల్ మీడియా కుటుంబాలను బజారుకీడుస్తుంది. బాడీ షేమింగ్, ఫోటోలు మార్ఫింగ్, అననివి అన్నట్లుగా చెప్తున్నారు. గత ఏడాది నుంచి ఇది ఎక్కువ అవుతుంది. అన్న చెల్లెల్లు చేతిలో చెయ్యి వేసుకున్నా.. మరోకరకంగా చూపుతున్నారు. సోషల్ మీడియాను మంచికి వాడాలి.. చెడు కు కాదు. కరోనా సమయంలో ఎంతో సర్విస్ చేసా.. దాన్ని కూడా సోషల్ మీడియాలో నన్ను విమర్శించారు. అబద్దాల పైనే బీఆర్ఎస్ నడుస్తుంది. అబద్ధానికి అర్థం బీఆర్ఎస్. ఏ రోజుకైనా నిజమే గెలుస్తుంది. సోషల్ మీడియా కట్టడి అవసరం. సోషల్ మీడియా ద్వారా మాపై బురద చల్లుతున్నారు....కడుక్కోవడం మా వంతు అవుతుంది’ అని సీతక్క వ్యాఖ్యానించారు. -
సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా బలంగా గొంతు వినిపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పార్టీ నేతలను ఆదేశించారు. ప్రభుత్వం పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ను ప్రభుత్వం ఆయుధంగా ఎంచుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని స్పష్టం చేశారు.ఒకవేళ అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటికి పంపినా వివిధ రూపాల్లో నిరసన తెలపాలని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని భావించినా హోలీ పండుగ నేపథ్యంలో కేటీఆర్ ఒక్కరే వెళ్లినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. ముందుగా ప్లాన్చేసుకునే సస్పెన్షన్లు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై చర్చ సందర్భంగా రచ్చ చేసి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎల్పీ భేటీలోనే ప్లాన్ చేసుకున్నారని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించడం ద్వారా ప్రజా సమస్యలు, ఆకాంక్షలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టే బడ్జెట్లోని డొల్లతనాన్ని బయట పెట్టేందుకు సమావేశాలను ఉపయోగించుకోవాలి. దూషణలు, పరస్పర విమర్శల జోలికి వెళ్లకుండా పూర్తి అధారాలు, అంకెలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి’’అని సూచించినట్టు సమాచారం. పార్టీ రజతోత్సవాలపైనా చర్చ బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా కేసీఆర్ పలు సూచనలు చేశారు. వరంగల్లో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మాజీ మంత్రి హరీశ్రావు ఇప్పటికే దృష్టి సారించారు. ఆ సభను విజయవంతం చేసేందుకు జరగాల్సిన కసరత్తు, నియోజకవర్గాల వారీ గా సన్నాహక సమావేశాలు, సన్నాహక కమిటీల ఏర్పాటు వంటి అంశాలపైనా కేటీఆర్కు కేసీఆర్ ప లు సూచనలు చేశారు. ఏర్పాట్లకు సంబంధించి త్వ రలో కేటీఆర్ అన్ని జిల్లాల ముఖ్య నేతలతో ఒక ప్ర త్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.22న డీఎంకే భేటీకి కేటీఆర్తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష భేటీకి హాజరుకావాల్సిందిగా కేటీఆర్ను కేసీఆర్ ఆదేశించారు. ఆ భేటీలో బీఆర్ఎస్ పక్షాన ప్రస్తావించాల్సిన అంశాలు, పోరాట రూపాలు, ఐక్యకార్యాచరణ, అవలంబించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్ష, దానిపై బీఆర్ఎస్ చేసిన పోరాటాలను కూడా ప్రస్తావించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, నిధుల పంపిణీలో వివక్ష, దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కంట్రిబ్యూషన్ తదితరాలపైనా దిశానిర్దేశం చేశారు. -
పాలన చేతగాకే.. గొంతునొక్కుతున్నారు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకనే అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కుతోందని మండిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబోమ్మలతో ర్యాలీలు నిర్వహించి దహనం చేశాయి. జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి బయటికి పంపడం అప్రజాస్వామికమని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ సస్పెన్షన్లను ఆయుధంగా మలుచుకున్నారని మండిపడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేయగా... పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. శాసనసభలో స్పీకర్ను అగౌరవపరిచే విధంగా జగదీశ్రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా... ప్రభుత్వం కక్షపూరితంగా, పథకం ప్రకారమే ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా చెప్పుకునేందుకు ఒక్క మంచి పనికూడా లేనందునే.. కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీని అడ్డాగా చేసుకుని అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశాయి. నకిరేకల్, దేవరకొండ, మునుగోడులలో రాస్తారోకోతో నిరసన తెలిపాయి. హుజూర్నగర్, మఠంపల్లి, నేరేడుచర్లలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, భీమారం, రామకృష్ణాపూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్లలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. కాగా.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంచిర్యాలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మణుగూరు, ఇల్లందు, మధిర తదితర చోట్ల తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు.ప్రజాకోర్టులో తేల్చుకుంటాం: కేటీఆర్పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ కేడర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి చేతకానితనం బయటపడొద్దనే బీఆర్ఎస్ నాయకులపై కుట్రలు చేస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కితే ప్రజాకోర్టులో తేల్చుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు, హామీల అమల్లో మోసాన్ని ఇదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
-
‘కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదు’
హైదరాబాద్: కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయంతం చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర పై విషయ ప్రచారం మొదలెట్టింది. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర లేదు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్ పార్టీ, బీ అర్ ఎస్ పార్టీ లు ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలపడటం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయి. ఏపీలో ఎన్డీఏ, పుదుచ్చేరి లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో గాల్లో దీపంలా సిద్దరామయ్య ప్రభుత్వం ఉంది.డీఎంకే ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్షం మీటింగ్ కి రేవంత్, కేటీఆర్ పోటీ పడి హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ ఇచ్చిన 420 హామీల పై అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి.హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాల్సిన బీ అర్ ఎస్ కాంగ్రెస్ తో కలిసి అఖిల పక్షం మీటింగ్ కి హాజరు అవ్వడం ఏంటీ?, డిలిమిటేషన్ రాజ్యాంగ బద్దంగా జరిగే ప్రక్రియ. దీనికి రాజకీయాలు అంటగడతార?, బ్రిటిష్ నినాదం విభజించు - పాలించు ను కాంగ్రెస్ అనుసరిస్తుంది. గతంలో అధికార దుర్వినియోగం తో కాంగ్రెస్ బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టింది. జనాభా తగ్గుదల పై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు ? , డిలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33శాతం సీట్లు దక్కనున్నాయి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని రేవంత్ అనుకుంటున్నారా? , కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తూ.....జనాభా లెక్కలు అడ్డుకోవాలని చూస్తోంది. దేశాన్ని ఇండియా - పాకిస్తాన్ మాదిరిగా విభజించినట్టు సౌత్, నార్త్ అంటూ ప్రజలను మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్.. రేవంత్ 20 - 20 రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. 20 - 20 మ్యాచ్ లో ఎన్నైనా అబద్ధాలు అడొచ్చా?, మొన్న జరిగిన ఢిల్లీ t20 లో మిమ్మల్ని డకౌట్ చేశారు. Mlc ఎన్నికల్లో రేవంత్ డాకౌట్ అయ్యారు. ఎటువంటి మ్యాచ్ జరిగిన మోదీ సెంచరీలు మోత మోగిస్తున్నారు’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్
-
డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్వహించబోయే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్వి భజన (డీ లిమిటేషన్) చేపడితే దక్షిణాది రాష్ట్రా లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని విమర్శించారు.ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి హాజరై బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వాదనను వినిపిస్తామని తెలిపారు. తమిళ నాడు పురపాలక శాఖ మంత్రి కె.ఎన్.నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్.ఎలాంగో బృందంతో తెలంగాణ భవన్లో కేటీఆర్ గురువారం సాయంత్రం సమావేశమయ్యా రు. డీలిమిటేషన్కు వ్య తిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి రావాల్సిందిగా డీఎంకే బృందం బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందజేసింది.ఈ సందర్భంగా ఇరుపక్షాలు మీడియాతో మాట్లాడాయి. ‘డీ లిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సమష్టిగా పోరాడితేనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. 1970–80 దశకంలో కుటుంబ నియంత్రణ సమర్ధవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాల సంఖ్యను కొత్తగా చేసే జనగణన ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్రం చెప్పడం అన్యాయం.ఇదే జరిగితే పార్లమెంట్లో ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరపున హాజరుకావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరై బీఆర్ఎస్తోపాటు తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని డీఎంకే నేతలు ప్రకటించారు. అంతకుముందు డీఎంకే నేతలను కేటీఆర్ సత్కరించారు. -
జగదీశ్రెడ్డి కామెంట్స్.. కలకలం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి గురువారం శాసనసభలో స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఈ సభ నీ సొంతం కాదు..’ అని ఆయన అనడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, అరుపులతో సభ దద్దరిల్లింది. దళిత స్పీకర్ను అవమానించిన, ఏక వచనంతో సంబోధించిన జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. అందరికీ సమాన హక్కులు: జగదీశ్రెడ్డి ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి.. స్పీకర్ను ఉద్దేశించి ‘ఈ సభ మనందరిది. మనందరికీ సమాన హక్కులున్నాయి. మనందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నరు తప్ప ఈ సభ నీ సొంతం కాదు..’ అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్రెడ్డి మాట్లాడిన ప్రతిపదం వెనక్కి తీసుకోవాల్సిందేనని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. సభాపతిని దూషించినందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. దళిత స్పీకర్ను అవమానించిన జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని కాంగ్రెస్ దళిత సభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించారని తప్పుబట్టారు. మొత్తం దళిత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్కి దళితుల పట్ల చిన్నచూపు అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్కుమార్ పేపర్లు పైకి విసిరేస్తే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సుదీర్ఘ విరామం తర్వాత సభ ప్రారంభం కాగా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులతో పాటు అధికార పక్ష సభ్యులు మాట్లాడారు. జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయాలని కొందరు, బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరినా స్పీకర్ వారికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ సెషన్ మగిసేవరకూ జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. ఆ తర్వాత కూడా అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సస్పెన్షన్పై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్ళారు. అయినా అవకాశం ఇవ్వకపోవడంతో మూకుమ్మడిగా సభ నుంచి నిష్క్రమించారు. అసలేమైంది..? ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగదీశ్రెడ్డి మాట్లాడుతుండగా (ఈ సమయంలో 4 బర్రెల కథ చెప్పారు)..అధికార పక్షం (మధ్యలో) మాట్లాడకుండా ఉండాలంటే చర్చను పక్కదారి పట్టించవద్దని స్పీకర్ అన్నారు. దీంతో ‘నేను గవర్నర్ ప్రసంగంపై చర్చ నుంచి అక్షరం పక్కకు పోయినట్టు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటా..పొమ్మంటే పోతా..’ అంటూ జగదీశ్రెడ్డి ఆవేశంతో తన చేతిలో ఉన్న నోట్స్ను కుర్చీకేసి విసిరికొట్టారు. దీంతో స్పీకర్ని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలను జగదీశ్రెడ్డి వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. ‘అసహనానికి గురికాకుండా సహనంతో మాట్లాడండి. సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు. మంత్రిగా పదేళ్లు పని చేశారు. మీరీ విధంగా మాట్లాడడం, సభా సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు..’ అని జగదీశ్రెడ్డిని ఉద్దేశించి స్పీకర్ అన్నారు. ‘ఏ సభా సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడానో మీరు చెబితే ఆ తర్వాత నేను మాట్లాడుతా..’ జగదీశ్రెడ్డి అన్నారు. దీంతో ‘నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం’ అని స్పీకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జగదీశ్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో వాతావరణం వేడెక్కింది. జగదీశ్రెడ్డి అన్నదాంట్లో తప్పేం ఉంది?: హరీశ్రావు బీఆర్ఎస్ సభ్యుడు, మాజీమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..‘సభ్యులందరికీ సమాన హక్కులుంటాయని, సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించింది కాదని, ప్రతిపక్ష సభ్యులకు కూడా సమాన హక్కులుంటాయని జగదీశ్రెడ్డి అన్నారు. ఇందులో తప్పేం ఉంది..’ అని ప్రశ్నించారు. మీరు చేయలేనిది మేం చేశాం: శ్రీధర్బాబు 2014–15లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందో తాము సంవత్సర కాలంలో చేసి చూపెట్టామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ‘వాళ్లు వ్యంగ్యంగా నవ్వుతున్నారు. వారి విషయంలో ప్రజలు వ్యంగ్యంగా నవ్వారు కాబట్టే మేము ఇక్కడ (అధికారంలో) ఉన్నాం..’ అని వ్యాఖ్యానించారు. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి దేశమంతా పచ్చగా కనిపించినట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా జగదీశ్రెడ్డికి కనిపించడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేశారా?: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దళితుడిని సీఎం చేయకపోతే నా మెడ మీద తల ఉండదని 10 వేల సార్లు అన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిలదీశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇచ్చావా? అని కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. దళితుడు (భట్టి విక్రమార్క) ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకి అని నిరూపించుకున్నవు అని అన్నారు. బీసీ కులగణన చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు పాల్గొనలేదని, వారికి ప్రజలపై ప్రేమలేదని వ్యాఖ్యానించారు. మమ్మల్ని రమ్మంటారా? వద్దా?: తలసాని సభ సాంప్రదాయాలను అధికారపక్షం పాటించకపోతే ఎలా? అని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. జగదీశ్రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. సభకు తమను రమ్మంటారా? వద్దంటారా? చెప్పాలని స్పీకర్ను ప్రశ్నించారు. అయితే జగదీశ్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని మంత్రులు, అధికారపక్ష సభ్యులందరూ ట్రెజరీ బెంచీల వద్ద నిలబడి నినాదాలతో హోరెత్తించడంతో సభ దద్దరిల్లింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సాయంత్రం 3.35కు సమావేశమైన తర్వాత జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ సభ్యులను అనుమతించారు. జగదీశ్రెడ్డి చెప్పిన 4 బర్రెల కథ ‘ఓ తండా వద్ద తవి్వన బావివద్దకు వెళ్లి ప్రజలకు గవర్నర్ ప్రసంగం చదివి వినిపించిన. అది విన్న వెంకటరాములు, రాజయ్యలు వారి ఊళ్లో ఉండే వెంకటయ్య కథతో పోల్చారు..మా అమ్మగారి ఇంటికి పాలుపోసి తీరుతా..అని నేను అంటే నా భర్త కొట్టిండని వెంకటయ్య భార్య సర్పంచ్కి ఫిర్యాదు చేసింది. మీకు బర్రెలే లేవు..పాలు ఎక్కడివి అని సర్పంచ్ అడిగితే నాకు నాలుగు బర్లున్నాయి అని వెంకటయ్య అన్నడు. పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, మా అత్తగారు ఒకటి ఇస్తే, నేను ఒకటి కొంటే.. నాలుగైతయి అన్నడు. గవర్నర్ ప్రసంగం కూడా ఇలానే ఉందని ఆ గ్రామస్తులు అన్నరు..’ అని జగదీశ్రెడ్డి చెప్పారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఆటో కారి్మకులకు రూ.12 వేలు, అక్కచెల్లెళ్లకు రూ.2500, రైతులకు బోనస్, తులం బంగారం, స్కూటీలు, 2లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని నిలదీయడంతో వివాదం ప్రారంభమైంది. ‘గవర్నర్ ప్రసంగాన్ని ఏఐ, చాట్ జీపీటీతో తయారు చేసినట్టు ఉంది. మనసు కవి ఆత్రేయ బతికి ఉంటే ..ప్రభుత్వాలు ఇంత మనస్సు లేకుండా పనిచేస్తాయా? అని చూసి ఆత్మహత్య చేసుకునేవారు. గవర్నర్తో 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాలు మాట్లాడించారు.’ అని అంతకుముందు విమర్శించారు. -
పదేళ్ల తుప్పును వదిలిస్తున్నాం!
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించిందని, దానిని వదిలించే పనిలో తామున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిన తుప్పును ఒకేసారి వదిలించాలంటే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే నెమ్మది నెమ్మదిగా వదిలిస్తూ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని, నిధుల సాధనలో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఏమాత్రం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గురువారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ కొద్దిసేపు మీడియాతో చిట్చాట్ చేశారు. ‘ఏ ముఖ్యమంత్రికైనా అధికారం చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇలా ఎవరి పాలనైనా చూడండి.. గత పాలకులు పరిపాలించిన దానిని చక్కదిద్దడానికే రెండేళ్లు సమయం పట్టింది. ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతీ హామీని అమలుచేస్తూ ముందుకెళ్తున్నా’అని చెప్పారు.కేంద్ర మంత్రి అయినందునే కిషన్రెడ్డి టార్గెట్ ‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు ఎవరైనా సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తుతారు. ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తారు. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. కానీ, మన కిషన్రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టే కదా? అందరూ నన్ను టార్గెట్ చేస్తోంది.కిషన్రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయనను టార్గెట్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఏం తెచ్చారని అడిగితే తప్పేంటి? మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తే పనులు మొదలుపెట్టొచ్చు. కిషన్రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, మరో మంత్రి బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి ’అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దడం ఏంటి? మూడు భాషల విధానాన్ని రేవంత్రెడ్డి తప్పుబట్టారు. ‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాష తెలుగే. మూడో వరుసలో బెంగాల్ భాష ఉంటుంది. మీరు హిందీ మాట్లాడతారు కదా? అందరూ అదే మాట్లాడాలంటే ఎలా?’అని రేవంత్ అన్నారు. ‘గాంధీ కుటుంబంతో సీఎంకు సాన్నిహిత్యం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గాంధీ కుటుంబంతో అందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది’ అని తెలిపారు.ప్రజలకు చెప్పకపోతే ఎలా? ‘రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? పదవుల విషయంలో నేను సమీకరణాలను చూడలేదు, కేవలం నేను ఇచ్చిన మాటనే చేశా. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, వివిధ చైర్మన్ పదవులు అన్నీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ఇచ్చాను. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు, ఆమె పార్టీకోసం ఎంతో కాలం కష్టపడి పనిచేశారు అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.నేను ఇక్కడ కులగణన చేశాను మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్ అసెంబ్లీలో జరిగే చర్చలకు కూడా రావాలి. ఓన్ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. నేను 2029 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తారు. చెప్పినవి చేస్తే వాళ్లే మనకు అండగా నిలుస్తారు’అని రేవంత్ చెప్పారు. వచ్చే మే నెలలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై హరీష్ రావు కామెంట్స్
-
జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై కేటీఆర్ రియాక్షన్
-
సీతాఫల్మండి బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ రిసెప్షన్లో కేటీఆర్ (ఫోటోలు)
-
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్ గురయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్కుమార్ను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ ప్రసాద్కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు.తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కావడంతో జగదీష్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్స్లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు. స్పీకర్ గురించి జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారంటే?తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. -
జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరం
-
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు
-
గవర్నర్ది గాందీభవన్ ప్రసంగం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగం.. గాందీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్మీట్లా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోటి వెంట అబద్ధాలు, అసత్యాలు చెప్పించి ఆయన స్థాయిని దిగజార్చిందని ఆరోపించారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కొత్త విషయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలపై స్పష్టత ఇస్తారని, గత 15 నెలల పాలనపై ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించాం. కానీ అలాంటిదేమీ జరగలేదుగానీ పెళ్లిలో చావుడప్పు కొట్టినట్టుగా ప్రసంగం ఉంది’అని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం పూర్తిస్థాయిలో ప్రజలను వంచించడమేనని, ఆయన ప్రతిష్టను సైతం తగ్గించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యంతో రైతులు అరిగోసలు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని, 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, గవర్నర్ ప్రసంగంలో ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్కమాట కూడా లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 నుంచి 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని, గవర్నర్ నోటి ద్వారా మాత్రం రుణమాఫీ పూర్తయిందని అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక ఆగమాగమవుతుంటే, రైతుబంధు అందిందని, అసత్యాలు వల్లించారని విమర్శించారు. సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, గోదావరి పరీవాహకంలో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 83 మంది విద్యార్థుల మరణాలపై గవర్నర్ ప్రసంగంలో ఒక్క సానుభూతి మాట కూడా లేదని విచారం వ్యక్తం చేశారు. బీసీలకు సామాజిక న్యాయమా? కులగణన పేరుతో బీసీల సంఖ్య తగ్గించి, వారిని మోసం చేసి.. ఏదో ఉద్ధరించినట్టు సోషల్జస్టిస్ అని గవర్నర్ నోటివెంట అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానించిందని తాము అనడం లేదని, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకరు గళం విప్పితే, ఆయన్ను సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘమైనా కులగణన లెక్కలు సరైనవని అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నడా? మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలైనా ఏకీభవించే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. నో విజన్.. ఓన్లీ కమీషన్ భారతదేశంలో ఏ రాష్ట్ర సచివాలయంలోనూ జరగని ఘోర సంఘటన తెలంగాణ సచివాలయంలో జరిగిందని కేటీఆర్ దుయ్యబట్టారు. 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట ధర్నా చేసిన సంఘటనే దీనికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి విజన్ లేదు.. కేవలం 20 శాతం కమీషన్ కక్కుర్తి మాత్రమే ఉందని మండిపడ్డారు. కమీషన్ నుంచి వచ్చిన డబ్బులను ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ. 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రూ.1.62 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. దావోస్లో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ ద్వారా అబద్ధాలు చెప్పించారని, గత ఏడాది చెప్పిన రూ.40,000 కోట్లలో ఒక్క పైసా కూడా రాలేదని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నమని, తెలంగాణ ప్రజలు సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడం ఖాయమన్నారు. పిచ్చికుక్క హద్దులన్నీ దాటేసింది ‘మర్యాదకు ఉండే హద్దులన్నింటినీ పిచ్చి కుక్కదాటేసింది. అతడిని వెంటనే ఏదైనా పిచ్చాస్పత్రికి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులను కోరుతున్నారు. అసహనంతో ఉన్న అతను.. తన చుట్టూ ఉన్నవారిని కరవడం మొదలుపెడతాడేమో. త్వరగా కోలుకో ‘చీఫ్ మినిస్టర్’అని సీఎం రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు నందినగర్లోని నివాసం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఆయన వెంట పార్టీ నేతలు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి రాగా, ఇంటి వద్ద కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి వాహనంపై గులా బీ పూలు చల్లారు. సభ ప్రారంభానికి అరగంట ముందే అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి, హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగ తం పలికారు. గంగుల కమలాకర్, కేపీ వివేకానంద్, తాతా మధు, నవీన్కుమార్రెడ్డి కేసీఆర్కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాసనసభ లాబీలో తన కు కేటాయించిన చాంబర్లో అరగంట పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన తమ్ముడి కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ను ఆహ్వానిస్తూ శుభలేఖ అందజేశారు. అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11కి ప్రారంభం కాగా, 5 నిమిషాల ముందే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడగానే అసెంబ్లీ నుంచి కేసీఆర్ తిరిగి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. కేసీఆర్ను కలిసిన మంత్రి తుమ్మల శాసనసభకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. ఆయన యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కేసీఆర్ కూడా మంత్రి తుమ్మల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ, మండలి భేటీతో ఈ సమావేశాలు మొదలవుతాయి. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదాపడనుంది. ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాలను ఎప్పటివరకు నిర్వహించాలి, ఏయే అంశాలను చేపట్టాలన్న దానిపై అందులో నిర్ణయం తీసుకుంటారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తరువాత సభ వాయిదా పడనుంది. శుక్రవారం హోలీ పండుగ కావడంతో సెలవు ఉంటుందని, శనివారం వీలును బట్టి అసెంబ్లీ నిర్వహిస్తారని లేదంటే మళ్లీ సోమవారం అసెంబ్లీ ప్రారంభమవుతుందని సమాచారం. కాగా.. గత బడ్జెట్ కన్నా సుమారు పది శాతం అదనంగా రూ.3.20 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. సభ ముందుకు రెండు బిల్లులు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం.. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత ఈనెల 19న లేదా 20న 2025–26 బడ్జెట్ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీ పద్దులపై చర్చిస్తారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు. ఇందుకోసం ఈనెల 27 లేదా 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరసనలకు నో..! అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు అసెంబ్లీ, ఇటు ప్రభు త్వ, పోలీసు వర్గాలు సమన్వయంతో వ్యవహరించేలా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఇప్పటికే ముందస్తు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరి వ్యూహం వారిదే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతోపాటు ఎంఐఎం, సీపీఐ సిద్ధమయ్యాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈసారి అధికార కాంగ్రెస్ అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీల వర్గీకరణతోపాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కోసం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటోంది. ఆరు గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తాగు, సాగునీటి కొరత, యూరియా, సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్గా ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానుంది. బడ్జెట్ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అంచనాలపై ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యంతోపాటు రాష్ట్ర సొంత పన్ను రాబడులు తగ్గిపోవడం, రిజి్రస్టేషన్లు, జీఎస్టీ రాబడుల్లో తగ్గుదల, రెవెన్యూ రాబడులకు, ఖర్చుకు మధ్య భారీ తేడా ఉండటం, ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలకు మధ్య రూ.50 వేల కోట్ల వరకు లోటు ఉండటం వంటివి కీలకంగా మారాయి. అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవిక బడ్జెట్ను రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా.. ఈసారి రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ పరిమాణం తగ్గినా ఆశ్చర్యం లేదని కూడా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతుండటం గమనార్హం. నిజానికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్న ఫ్యూచర్ సిటీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.19 వేల కోట్లు, విద్యుత్ రంగానికి సుమారు రూ.14 వేల కోట్లు, రవాణాకు రూ.5,800 కోట్లు, పెన్షన్ల పెంపు అమలుకు మరో రూ.8 వేల కోట్లు కావాలి. ఇక యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు రూ.11,500 కోట్లు కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి, వైద్యారోగ్య రంగాలకు కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. -
అనుభవం, జ్ఞానం లేదు.. కామన్సెన్స్ వాడరు
సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రికి అనుభవం, జ్ఞానం లేకున్నా కనీసం కామన్ సెన్స్ను కూడా ఉపయోగించడం లేదు. సీఎంకు అనుభవం లేని సందర్భంలో మంత్రివర్గంలో ఒకరిద్దరు అనుభవజు్ఞలు దిశానిర్దేశం చేసి ప్రభుత్వాన్ని నడుపుతారు. కానీ రాష్ట్రంలో సీఎం, మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంది. హామీలు, పథకాల అమలును పక్కనపెడితే ప్రజల కనీస అవసరాలైన సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటివి కూడా అందించలేకపోతున్నారు. రేవంత్ ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటిని అసెంబ్లీలో ఎత్తిచూపడమే మన మీద ఉన్న అతి పెద్ద బాధ్యత’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్రావు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలు, వేస్తున్న నిందలను తిప్పికొట్టాలని సూచించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అప్పులు సహా.. అన్నీ అబద్ధాలే! ‘‘రాష్ట్ర అప్పుల లెక్కలపై రేవంత్, మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు. గత ఏడాదికాలంలో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలైంది. బడ్జెట్తోపాటు సవరించిన అంచనాలను కూడా ప్రభుత్వం సభ ముందు పెడుతుంది. ఆదాయ లోటు కూడా భారీగా ఉండబోతోంది. అందువల్ల బడ్జెట్ ప్రతిపాదనలను లోతుగా అధ్యయనం చేయండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రులుగా పనిచేసినవారు మన పార్టీ తరఫున ఉభయ సభల్లోనూ ఉన్నారు. వారు ‘షాడో కేబినెట్’లా వ్యవహరించి పద్దులపై చర్చ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని ఎండగట్టాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తాగు, సాగునీటి కష్టాలతోపాటు రుణమాఫీ, రైతు భరోసా, విద్యుత్ కోతలు, వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతుండటం, ఎండుతున్న పంటలు వంటి రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో వివిధ రంగాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎత్తిచూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నెలకొన్న ప్రజావ్యతిరేకతకు సోషల్ మీడియా అద్దం పడుతోందని, నిజానికి అంతకంటే ఎక్కువ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో నెలకొందని పేర్కొన్నారు. నలుగురు సభ్యులు గైర్హాజరు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీకి నలుగురు సభ్యులు ముందస్తు సమాచారం ఇచ్చి గైర్హాజరు అయ్యారు. వ్యక్తిగత పనులతో తాము సమావేశానికి రాలేకపోతున్నట్టు తెలిపారు. గైర్హాజరైన వారిలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్రెడ్డి, అనిల్జాదవ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్రావు ఉన్నారు. దాదాపు 25 అంశాలపై దిశానిర్దేశం సుమారు మూడు గంటల పాటు సాగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ దాదాపు 25 అంశాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు, డీఏలు, పీఆర్సీ తదితరాలపై గొంతు వినిపించాలని సూచించారు. మహిళలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, వైద్యరంగంలో దిగజారిన ప్రమాణాలు, దళిత బంధు నిలిపివేత, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వంటి అంశాలు ప్రస్తావించాలన్నారు. ఏపీ నదీ జలాల చౌర్యం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో 20శాతం కమిషన్ల ఆరోపణలు, పరిశ్రమల ఏర్పాటుకు బలవంతపు భూసేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కేంద్రం నుంచి నిధుల సాధన, కులగణనలో తప్పులు, బెల్ట్షాపుల తొలగింపు, ఎల్ఆర్ఎస్, మేడిగడ్డ పునరుద్ధరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. నేడు అసెంబ్లీకి కేసీఆర్ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయన మంగళవారం ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి వచ్చి తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో పాల్గొన్నారు. అనంతరం నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లేదా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించాయి. బీఆర్ఎస్కు డిప్యూటీ లీడర్లు ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరిస్తుండగా.. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో బీఆర్ఎస్ విప్గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మండలిలో విప్గా సత్యవతి రాథోడ్ను కేసీఆర్ నియమించారు. తాజాగా ఉభయ సభల్లో బీఆర్ఎస్ సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ లీడర్లను నియమిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో పార్టీ డిప్యూటీ లీడర్గా మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్, మండలిలో ఎల్.రమణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతగా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న హరీశ్రావు డిప్యూటీ లీడర్గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమల్లో అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలు వ్యూహాత్మకంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలన్నారు. సభ్యులు మొక్కుబడిగా కాకుండా, సమావేశాలు జరిగే రోజుల్లో ఉదయం 9.30కు బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
-
రేపు బీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే చాన్స్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎన్నిక జరిగే ఐదు స్థానాల్లో కాంగ్రెస్ మూడు, సీపీఐ, బీఆర్ఎస్ చెరో స్థానాన్ని దక్కించుకోనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్లను అభ్యర్థులుగా ప్రకటించడంతోపాటు మరో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం బరిలో ఉన్నారు.ఐదుగురు రిటైర్ అవుతుండటంతో.. ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ల పదవీకాలం ఈ నెల 29న ముగుస్తోంది. ఖాళీ అవుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక కోసం ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారంతో ఈ గడువు ముగుస్తోంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. కానీ ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విజయశాంతికి ఎమ్మెల్సీ చాన్స్⇒ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన ఏఐసీసీ⇒ శంకర్నాయక్, అద్దంకి దయాకర్లకూ అవకాశం⇒ ఆదివారం సాయంత్రం ప్రకటించిన కేసీ వేణుగోపాల్సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు, పార్టీలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముగ్గురు నేతలు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్నాయక్, విజయశాంతిలకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరును ఎంపిక చేయడం మాత్రం టీపీసీసీ వర్గాలను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.నాలుగు స్థానాలకుగాను.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వారం రోజులుగా సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా కింద కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉండగా.. సీపీఐకి ఒక స్థానం కేటాయించడంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీ మేరకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ను సీపీఐ జాతీయ కమిటీ బలంగా కోరింది. సీపీఐ జాతీయ నేత డి.రాజా, మరికొందరు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఈ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం తీసుకున్నాయి. మిగతా మూడు స్థానాలకుగాను విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లను ఎంపిక చేశారు.నేడు ఉదయం 11 తర్వాత నామినేషన్లుసాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించిన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లతోపాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం అందుబాటులో ఉన్న వారంతా రావాలని సీఎల్పీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. -
హస్తిన పర్యటనలతో సెంచరీ కొట్టడం ఖాయం.. రేవంత్పై లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం మాత్రం శూన్యమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 38వ సారి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. త్వరలో సెంచరీ కొడతారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పట్టు సాధించకపోవడంతో పాలనపడకేసింది. కేబినెట్ విస్తరణ చేయలేక, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేసుకోలేక పోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగిన ప్రజలు.. మార్పు కోరున్నా అనే దానికి ఈ ఫలితాలు సంకేతం. అలవికాని హామీలు ఇచ్చి, అమలు చేయలేక బిక్క చూపులు చూస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ డబ్బులు చెల్లించలేకపోతున్నారు. సీఎం స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం శూన్యం. రేవంత్ 14 నెలల పాలనకు ఇది రెఫరెండంగా భావించాలి. బీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది’అని ఆరోపించారు. -
BRS ముఖ్య నేతలతో నేడు భేటీ కానున్న గులాబీ బాస్ కేసీఆర్
-
‘తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంకా దొరసాని అహంకారం తగ్గలేదని విమర్శించారు రాకేష్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రాకేష్ రెడ్డి..‘దొరలు.. దొరసానికి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు వచ్చింది. కవిత దొర అహంకారం మానుకో. కేసిఆర్..రేవంత్ రెడ్డి హిందూ ద్రోహులు. కుంభమేళాకు ఎందుకు పోలేదో చెప్పాలి. హిందువులను కేసీఆర్..రేవంత్ రెడ్డి అవమానించారు. అందుకే హిందువులు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు’అని మండిపడ్డారు.కొన్నిరోజుల క్రితం సీఎం రేవంత్ పై రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్రెడ్డి. కిషన్రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్రెడ్డి.కిషన్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి తెలిపారు -
భూములు అమ్మితే కానీ సర్కారు నడవని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: భూములు అమ్మితే కాని ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తెలంగాణ వచ్చిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైడ్రా, మూసీ వెంట ఇళ్ల కూల్చివేతలు.. వంటి తలాతోకలేని విధానాలతో రాష్ట్ర ఆదాయం తగ్గి ప్రభుత్వ భూములను అమ్ముకుంటే కాని ఆదాయం సమకూర్చుకోలేని స్థాయికి రేవంత్ సర్కార్ దిగజారిందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రూ.30 వేల కోట్ల నిధుల సమీకరణ కోసం తాజాగా హైదరాబాద్లోని విలువైన భూములను చవకగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలో ఉన్న 400 ఎకరాల భూములను అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు మాట మార్చారన్నారు. అసెంబ్లీని మోసం చేసిన రేవంత్, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులు చేసినప్పటికీ, ఎన్నో సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులు, పేదలను ఆదుకున్నామన్నారు. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు, రూ.28 వేల కోట్ల రుణమాఫీ, రూ.6 వేల కోట్లతో రైతు బీమా, లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని తమ ప్రభుత్వం అందించిందన్నారు. అలాగే, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు, 45 వేల చెరువుల పునరుద్ధరణ, 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి పథకాల అమలు, వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం 15 నెలల పాలనలోనే రూ. 1.65 లక్షల కోట్ల పైచిలుకు అప్పు చేశారని ఆరోపించారు. అవగాహన రాహిత్యంతో శ్రీశైలం సొరంగాన్ని కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలితీసుకున్న బాధ్యతలేని ప్రభుత్వం రేవంత్ది అన్నారు. -
3 వీళ్లకు..1 వాళ్లకు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన వేళ.. పార్టీల గెలుపోటములపై చర్చ జరుగుతోంది. ఏ లెక్క ఎలా ఉన్నా, ఎవరు హాజరైనా.. గైర్హాజరైనా పార్టీల బలాబలాను బట్టి చూస్తే.. ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి మూడు, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం తప్పనిసరిగా లభించనున్నాయి. ఐదో స్థానం సాధించేందుకు కాంగ్రెస్కు కానీ, బీఆర్ఎస్కు కానీ తగిన సంఖ్యా బలం లేదు. దీంతో ఈ స్థానానికి జరిగే ఎన్నిక కీలకంగా మారింది. ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఇతర పార్టీల వైఖరిపై ఆధారపడి ఉండడం గమనార్హం. అయితే బీఆర్ఎస్ తన బలానికి మించి రెండు స్థానాలకు అభ్యర్థులను నిలిపేతేనే ఎన్నికలు జరిగే అవకాశాలుండగా, అలా జరగకపోతే ఐదు స్థానాలూ ఏకగ్రీవమయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 29న ఐదుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం (ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు)తో పాటు ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ ఉన్నారు. ఈ స్థానాలు భర్తీ చేసేందుకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. బలాబలాలు ఇలా..! ⇒ అసెంబ్లీలో మొత్తం 119 మంది సభ్యులుండగా కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలున్నారు. మిత్రపక్షమైన సీపీఐకి మరో ఎమ్మెల్యే ఉన్నారు. ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు ఈసారి 20 ఓట్లు రావాల్సి ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురికి 60 ఓట్లు పోను మరో 6 ఓట్లు మిగులుతాయి. ⇒ బీఆర్ఎస్కు అధికారికంగా 38 మంది సభ్యుల బలముంది. అంటే ఆ పార్టీ 20 ఓట్లతో నికరంగా ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది. ఇంకా 18 ఓట్లు మిగులుతాయి. అయితే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. వారు బీఆర్ఎస్కు సహకరించే పరిస్థితి లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు కూడా లేవు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు సీక్రెట్ ఓటింగ్ పద్ధతిలో జరుగుతాయి. పార్టీ విప్కు భిన్నంగా ఓటేసిన వారిని ఆయా పార్టీలు గుర్తించగలవు కానీ అధికారికంగా నిర్ధారించలేవు. కానీ ఫిరాయింపు అంశంలో అనర్హత కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ 10 మంది ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్కు బీజేపీ దూరమేనా? ఈ ఎన్నికల్లో బీజేపీ పాల్గొనే అవకాశం లేదు. ఆ పార్టీకి 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగని ఆ పార్టీ కాంగ్రెస్కు లేదా బీఆర్ఎస్కు మద్దతిచ్చే అవకాశం కూడా లేదు. దీంతో వారు ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే అభ్యర్థుల గెలుపునకు అవసరమైన మేజిక్ ఫిగర్లో మార్పు వస్తుంది. 19 అవుతుంది. అయినా ఫలితాల్లో మార్పు ఏమీ ఉండదు. ⇒ బీజేపీతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది కూడా గైర్హాజరైతే మాత్రం అధికార పార్టీకి కొంత ఊరట లభిస్తుంది. అప్పుడు 101 మంది మాత్రమే ఓటేస్తారు. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 17 అవుతుంది. అప్పుడు నలుగురు గెలిచేందుకు 68 ఓట్లు అవసరమవుతాయి. అంటే కాంగ్రెస్, సీపీఐలకు మరో రెండు ఓట్లు మాత్రమే తక్కువ అవుతాయి. ఎంఐఎం సహకరిస్తే ఆ స్థానం సులువుగా కాంగ్రెస్ పక్షాన చేరుతుంది. కానీ ఎంఐఎం ఐదో సీటు తమకు కావాలని అంటోంది. మాకే కావాలంటున్న ఎంఐఎం తమ సభ్యుడు రియాజుల్ హసన్ పదవీ విరమణ నేపథ్యంలో తమకే ఆ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని ఎంఐఎం కోరుతోంది. కానీ కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదు. ఏఐసీసీ సూచన మేరకు నాలుగో స్థానాన్ని ఖచ్చితంగా సీపీఐకి ఇస్తారనే చర్చ జరుగుతోంది. అప్పుడు ఎంఐఎం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది. కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్న విధంగా హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో బరిలోకి దిగేందుకు ఎంఐఎం అంగీకరిస్తే కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎంల కూటమి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటుంది. కానీ ఎంఐఎం విభేదించి బీఆర్ఎస్ పక్షాన చేరితే ఫలితం భిన్నంగా ఉంటుంది. పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టినా బీఆర్ఎస్కు 28 మంది సభ్యులుంటారు. వీరిలో 20 మంది సాయంతో ఒక అభ్యర్థి గెలుస్తారు. మరో 8 మంది మిగులుతారు. వీరికి ఎంఐఎంకు చెందిన ఏడుగురు తోడయితే బలం 15కు చేరుతుంది. అప్పుడు కాంగ్రెస్ పక్షాన కూడా 15 ఓట్లు మాత్రమే మిగులుతాయి. (మ్యాజిక్ ఫిగర్ 17 అయితే, ముగ్గురు సభ్యులు గెలిచేందుకు అవసరమైన 51 ఓట్లు పోను మరో 15 మంది ఎమ్మెల్యేలు మిగిలిపోతారు. రసవత్తర పోరు! ఒకవేళ కాంగ్రెస్ సీపీఐలతో పాటు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్థులకు ఓటేస్తే వారి బలం 76కు చేరుతుంది. అయినా నలుగురు అభ్యర్థులు గెలవాలంటే నాలుగు ఓట్లు తక్కువ పడతాయి. అప్పుడు ఎంఐఎం కీలకం అవుతుంది. ముందే చెప్పినట్టు ఒకవేళ బీజేపీ గైర్హాజరైతే మాత్రం నలుగురు అభ్యర్థులు గెలవడానికి 76 ఓట్లు సరిపోతాయి. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రతిపాదిస్తుంది? సీపీఐకే అవకాశం ఖాయమా? ఎంఐఎం ఏం చేస్తుంది? ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓట్లేస్తారా? అసలు బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని నిలబెడుతుందా? అనే అనేక ప్రశ్నలతో ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఒకే అభ్యర్ధిని ప్రతిపాదిస్తే కాంగ్రెస్ కూటమికి నాలుగు, బీఆర్ఎస్కు ఓ స్థానం దక్కడం మాత్రం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ 20 ఇలా.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కౌంటింగ్ ప్రక్రియ శాసనసభా నియమావళి ఆధారంగా జరుగుతుంది. ఎమ్మెల్యే కోటాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు అవసరమైన ఓట్ల (మ్యాజిక్ ఫిగర్) కోసం ప్రత్యేక సూత్రాన్ని పాటిస్తారు. మొత్తం సభలోని ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నికలు జరిగే స్థానాల సంఖ్యకు ఒకటి కలిపి భాగిస్తారు. ఈ మొత్తానికి మరొకటి కలుపుతారు. అప్పుడు వచ్చే సంఖ్యను మేజిక్ ఫిగర్గా నిర్ధారిస్తారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 119. ఈ సంఖ్యను ఐదుకు ఒకటి కలిపి అంటే ఆరుతో భాగిస్తే 19 వస్తుంది. దానికి ఒకటి కలిపితే 20 అవుతుంది. 20 తర్వాత డెసిమల్స్లో ఎంత వచ్చినా పట్టించుకోరు. ఈ విధంగా ఈసారి ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు 20 ఓట్లు అవసరమవుతాయని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ పార్టీ సభ్యులైనా ఓటు వేయకుండా గైర్హాజరైన పక్షంలో మ్యాజిక్ ఫిగర్ మారుతుంది. -
నిర్ణయం ఇంకెప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రతిసారీ ‘‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అంటున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకా?. తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు..’ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటీసులపై వీరంతా ఈనెల 22లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఓ ఎస్ఎల్పీ, మరో రిట్ పిటిషన్పై విచారణ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్లపై ఎస్ఎల్పీ, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడి గాందీలపై రిట్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు పిటిషన్లపై తాజాగా మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ తదితరులు వాదనలు వినిపించారు. ఏడాది కావొస్తున్నా చర్యలు లేవు ‘గతేడాది మార్చి, ఏప్రిల్లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. అనంతరం జూన్లో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సమయం అవసరం లేదు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంపై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్టే. దీనిపై తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా..విచారణకు సమయాన్ని ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్కు వెళ్లింది. అయితే స్పీకర్కు తగినంత సమయం ఇవ్వాలన్న భావనతో ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంను ఆశ్రయించాం. కానీ స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పనేలేదు. స్పీకర్ సమయం తీసుకునే విషయంలో సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది..’ అని అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి గడువు ఫిక్స్ చేయలేదని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాణా కేసులో మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారం ఉన్నచోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అర్యమ సుందరం వాదించారు.స్పీకర్కు కోర్టు ఆదేశాలివ్వడానికి అవకాశం లేదుస్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ.. ‘ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తే 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారు.. నోటీసులు ఇచ్చారు. వారి నుంచి రిప్లై రాగానే నిర్ణయం తీసుకుంటారు. అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నతమైన పదవుల్లో స్పీకర్ పదవి ఒకటి. ఈ పదవిలో ఉన్న స్పీకర్కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదు..’ అని చెప్పారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘స్పీకర్కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదూ అంటే.. న్యాయమే డిసైడ్ చేస్తుంది ఆగండి..’ అంటూ వ్యాఖ్యానించింది. నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కూడా వీరికి నేరుగా నోటీసులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈనెల 25న ఐటెం నంబర్–1గా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. -
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
తెలంగాణ ప్రాజెక్టులను సర్వనాశనం చేసింది మీరే
అచ్చంపేట రూరల్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయడం కంటే.. వారి జేబులు నింపుకోవడంపైనే శ్రద్ధ చూపారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులదేనని చెప్పారు. గురువారం దోమలపెంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.నల్లగొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ నీటి నుంచి కాపాడటంతోపాటు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి పరుగులు పెట్టించారన్నారు. సొరంగ పనులు ముందుకుసాగడానికి గత ప్రభుత్వం కరెంట్ కూడా అందించలేదని చెప్పారు. ఎస్ఎల్బీసీ వద్ద ఎంతో నిష్ణాతులైన రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు. పూర్తిగా పారదర్శకంగా దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్ నిపుణులతో సమన్వయం చేసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు.11 ఏజెన్సీలను కోఆర్డినేట్ చేసి పనులు పర్యవేక్షిస్తున్నామన్నారు. రెండుమూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని, రెండు,మూడు నెలల్లో టన్నెల్ పనులు పునఃప్రారంభించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల నుంచి పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు అనుమతులు అడగటం సిగ్గు చేటని, వారుచెప్పే మాటల్లో అర్థం లేదన్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతున్నవి అబద్ధపు మాటలని చెప్పారు.గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేయకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి హరీశ్రావుకు సిగ్గుండాలన్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏ ప్రతిపక్ష నాయకుడికి చూసేందుకు అనుమతి ఇవ్వలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్బాబుకు సైతం అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. తాము భిన్నంగా వ్యవహరిస్తున్నామని, సొరంగ సంఘటనను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నాయకులకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. హెలికాప్టర్లో తిరగాలన్న మోజు లేదుతాను పాలన మరిచి హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నానని బీఆర్ఎస్ నాయకులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం సిగ్గు చేటని, తాను సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను కాపాడటానికే హెలికాప్టర్ ఉపయోగిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకే ఇక్కడకు వస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. తాను పైలట్నని, హెలికాప్టర్లో తిరిగే మోజు తనకు లేదన్నారు.గత ప్రభుత్వంలో శ్రీశైలం పవర్హౌస్లో 9 మంది చనిపోతే ఎవరూ పట్టించుకోలేదని, అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి అక్కడకు వెళ్తుంటే దారిలో అరెస్టు చేశారన్నారు. సొరంగ ఘటనను రాజకీయ లబ్ధికోసం బీఆర్ఎస్ మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగదీశ్రెడ్డి మంత్రిగా ఉండి ఎస్ఎల్బీసీకి కరెంటు కట్ చేయడంతోనే డీవాటర్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, గత పాలకులు సక్రమంగా పనిచేసి ఉంటే ప్రాజెక్టు ఎన్నడో పూర్తయ్యేదన్నారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వి.హన్మంతరావు పాల్గొన్నారు. -
తెలంగాణలో తుగ్లక్ పాలన.. రేవంత్పై ఈటల ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రధాని మోదీని విమర్శిస్తే.. కేసీఆర్కు పట్టిన గతే సీఎం రేవంత్రెడ్డికి పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి.. వీటిపై చర్చకు వస్తారా రండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25 ఏళ్లు కొట్లాడినాం.. మూత వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం... తెరిచింది బీజేపీ ప్రభుత్వం. కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందిఅధికారం చేతిలో ఉన్న పని చేసే దమ్ము రేవంత్ కు లేదు.. కానీ కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు ఎలా ముందుకు వెళ్తాయి. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర బస్టాప్ కట్టలేని దుస్థితి. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లో పనులు చూసి రావాలని రేవంత్కు సూచన.మోదీ గురించి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయారో రేవంత్కు అదే గతి పడుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది.. సిగ్గు అనిపించడం లేదా? అని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. -
‘రాజకీయాలు చేయడం కోసం వెళ్లారా?’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీకి వెళ్లిన బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే వారు రాజకీయాలు చేయడం కోసమే అక్కడకు వెళ్లినట్లు ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ఘటనను ప్రకృతి విలయలాగా చూడాలి కానీ రాజకీయాలు చేస్తామనడం సరైంది కాదన్నారు. ‘హరీష్ రావు రాజకీయాలు చేయడం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది.కాళేశ్వరం టన్నెల్ కూలినప్పుడు ప్రాణ నష్టం జరిగింది.. మీరు ప్రతిపక్షాలకు అనుమతి ఇచ్చిన చరిత్ర లేదు. మేము పోయి రాజకీయం చేయలేదు. శ్రీశైలంలో పవర్ హౌస్ పెయిల్ అయినప్పుడు ఆ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, మల్లు రవిని పోనియ్యలేదు. మీరు పర్మిషన్ అడగకున్నా slbc కి పోతం అంటే పోనిచ్చినం. హరీష్ రావు రెస్క్యూ టీమ్ కు సలహాలు ఇవ్వనక్కర్లేదు. అక్కడ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఎనిమిది మంది కుటుంబాలను ఎలా ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. రెస్క్యూ ను ప్రభుత్వం రిజాల్వ్ చేస్తుంది’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. -
‘మోదీ చెప్పినా.. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’
ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అభివృద్ధి ఎజెండాతో పేదలకు సంక్షేమ పథకాలతో అవినీతి రహిత ప్రజల పాలన అందిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. విపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్ లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. ఆ పార్టీలు కులం, మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ.. కొత్త ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలకు ఎటువంటి తగ్గింపులు ఉండవని ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్, వినోద్, స్టాలిన్ పదే పదే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు లక్ష్మణ్. తమిళనాడు పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా దక్షిణాది ప్రాంతాల్లో ఒక్కసీటు కూడా తగ్గదని స్పష్టం చేశారని, కానీ లేని ఎజెండాను సృష్టించి ప్రాంతీయ పార్టీలు ప్రజల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. -
‘నేను బీఆర్ఎస్లోనే ఉన్నా’.. పోలీసుల్ని ఆశ్రయించిన ఎమ్మెల్యే
సాక్షి,హైదరాబాద్: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy) జోగులాంబ గద్వాల టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ నెల 11న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తాను పార్టీ మారానని, అనుమతి అనుమతి లేకుండా తన ఫోటోను కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా తన ఫొటోలతో ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకొస్తున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిద్రలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుకొస్తున్నారని, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ఆయన కలలో కూడా ఊహించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు. 36 పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్.. కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నాడని, కీలక శాఖలకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు మల్కిరెడ్డి రాజేశ్వర్రెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది కారి్మకులు చిక్కుకున్నా ఢిల్లీ పర్యటనకు వెళ్లాడు. వ్యవసాయరంగంలో మోగుతున్న చావుడప్పునకు చేతకాని రేవంత్ రెడ్డి పాలనే ప్రధాన కారణం. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి’అని అన్నారు. కాళేశ్వరంపై విష బీజాలు ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారు. సుంకిశాల రిటైనింగ్ వాల్, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినా, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకుపోయినా బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు. రేవంత్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదాలపై జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) ఎందుకు మౌనంగా ఉంది. తెలంగాణలో రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని ఆరోపించినా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ను నిత్యం విమర్శించే రేవంత్రెడ్డి బీజేపీపై చిన్న విమర్శ కూడా చేయడం లేదు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి. 14 నెలల కాలంలో రూ.1.50లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ ఢిల్లీకి పంపుతున్న మూటలతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. త్వరలో సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్లో చేరతారు’అని కేటీఆర్ అన్నారు. ప్రమాదంపై జ్యుడీషియల్ కమిషన్ ఎస్ఎల్బీసీ ప్రమాదంలో జ్యుడీషియల్ కమిషన్ వేయాలని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ జరపాలి. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదంతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం న్యాయ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో సొరంగంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి’అని కేటీఆర్ చెప్పారు. -
‘సూటిగా కేసీఆర్ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?’
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ సభను సక్సెస్ చేసి కరీంనగర్ కాంగ్రెస్ కు కంచుకోట అని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘కరీంనగర్ జిల్లాకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా ఎదగడానికి ఘనత వహించిన పీవీ ఇక్కడివారు. అలాంటివారెందరికో కరీంనగర్ వేదిక. కరీంనగర్ చైతన్యవంతమైన వేదిక ఆనాడు ఆరు పార్లమెంట్, 42 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మంథని, సంగారెడ్డిల్లో మాత్రమే మనకు శాసనసభ్యులుండె. అయినా, జీవన్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని బీఆర్ఎస్ కోరుతుంది కదా మరి ఎవరిని వాళ్ళు గెలిపించాలని కోరుతున్నారో సమాధానం చెప్పాలి. సూటిగా కేసీఆర్ ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?, ఢిల్లీ కాళ్ళ ముందు బీఆర్ఎస్ నాయకులు సాగిలపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని బీఅర్ఎస్ ఉప ఎన్నికలు వేస్తే గెలుస్తామంటోంది. మీ నీతేంది, జాతేందని అడుగుతున్నా . ఈ 14 నెలల్లో మేం టీచర్స్ బదిలీలు, గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగాలు కల్పించకపోతే మాకు ఓటు వేయకండని నేనే చెబుతున్నా. పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు ఓట్లెయకుంటే మీరు ఓటెయ్యొద్దని చెబుతున్నా . కేసీఆర్ జీతాలు కూడా ఇవ్వకుండా అడుక్కునేలా చేశాడు ఇవాళ మీ జీతాలు సమయానికి వేస్తున్నాం కదా ఆలోచించి ఓటేయండని కోరుతున్నా. ఐటీఐలను టాటాలతో కలిసి ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం. 60 ఎకరాల్లో 600 కోట్ల కార్పస్ ఫండ్ తో నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం . ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలు . ఇవన్నీ చూసి ఆలోచించి మాకు ఓటేయండి. నిఖిత్ జరీన్, సిరాజ్ వంటివారిని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..?, బీఆర్ఎస్ సీటును గుంజుకున్నామనే బీఆర్ఎస్ అక్కసు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వానికి తెల్వకుండా ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు నిధులడుగుతున్నామని చెప్పడమేంటి..?, బీఆర్ఎస్ రైతుబంధులో ఇచ్చిన దానికంటే తాలుతప్ప పేరిట ధాన్యం కోత పెట్టి పంచుకుందెక్కువ. పదేళ్లలో నువ్వు చేసిన దుర్మార్గాలు, 12 ఏళ్ల మోడీ నిర్లక్ష్యం పక్కనబెట్టి మమ్మల్ని ఓడగొట్టాలా?, సందెట్లో సడేమియా అన్నట్టు సంజయ్ బయల్దేరిండు. మా పొన్నం తెలంగాణా కోసం కొట్లాడిండు. ఈ సంజయ్ ఏం తెచ్చిండు..? చిల్లిగవ్వ తేలే.ఏం తేలేకపోయినా పర్లేదు.. పెద్ద బీసీ మోదీ, చిన్న బీసీ సంజయ్ బీసీ లెక్కలైనా తేల్చారా కనీసం?, కేసీఆర్ లెక్కలు నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అవే చిలుకపలుకులు పలుకుతున్నారు 1979లోనే మండల్ కమిషన్ 29 ముస్లింలలోని తెగలను బీసీల్లో కలిపింది. బండికి అవగాహన లేకుంటే వారి అధికారులను కనుక్కోవాలని చెబుతున్నా. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లో ముస్లింలను చేర్చలేదా.. మోదీ ఆ విషయాలు చెప్పలేదా..?, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వి చావు తెలివితేటలు. మతం పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే సమాజం కాదు తెలంగాణా. బండి సంజయ్ ని ఓర్వలేక అధ్యక్షుడి సీటు గుంజుకుండు. బండారు దత్తాత్రేయను పక్కకు జరిపి తాను సీటెక్కిండు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గా పక్కకు జరిగి ఓ బీసీ అయిన మహేష్ గౌడ్ కు సీటు అప్పజెప్పినా. మోదీ కౌగిలిలో మందకృష్ణ నలిగిపోయిండు. ఈ ఎమ్మెల్సీ సీటు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేదేముండదు. కానీ, దీనివెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉంది’ అని రేవంత్ మండిపడ్డారు. -
ఉప ఎన్నికల్లో గెలుపు మాదే.. తెలంగాణలో బైపోల్స్ ఖాయం
సాక్షి, సిద్దిపేట జిల్లా: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి తలసాని శశ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం.త్రాగు నీరు,వసతి గదులు,బంగారు కిరీటం వంటి అనేక విధాలుగా మల్లన్న ఆలయం అభివృద్ధి చేశాం. కేసీఆర్ హయాంలో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేశారు కాబట్టే గతంలో సుమారు ఐదు కోట్లు ఉన్న ఆదాయం .. ఇప్పుడు గణనీయంగా సుమారు 20కోట్లకు పైగా చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్న రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు,420హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఇకపై ప్రజల ఇబ్బందులపై శ్రద్ధ చూపాలి.కులగణనపై ఏ కుల సంఘాల నాయకులు సంతృప్తి లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మబ్బే పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ విధానాలను అన్ని గమనిస్తున్నారు. రాష్ట్ర జనాభా 4కోట్లకు పైగా జనాభా ఉంటే ప్రభుత్వం 3కోట్ల 70లక్షలుగా చూపిస్తుంది. కులగణనపై హడావిడిగా అసెంబ్లీలో చేయాల్సి తీర్మానం చేయాల్సిన అవసరం లేదు.గతంలోనే మాజీ సిఎం కేసీఆర్ అసెంబ్లీలో కులగణనపై తీర్మానం ప్రవేశ పెట్టారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే భూతద్దంలో పెట్టీ చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి సొరంగం ఘటనపై ఎవరు భాధ్యత వహిస్తారు. నోరు ఉందిగా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. కేసీఆర్ దూరదృష్టి తోనే ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా నిలబడ్డారు.అన్నివర్గాల ప్రజలను కదిలిస్తే ఏ ప్రభుత్వం ప్రజలకోసం పనిచేసింది వాళ్ళే చెబుతారు. న్యాయస్థానం తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం,ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. -
దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దివ్యంగా ఉన్న రాష్ట్రం 15 నెలల కాంగ్రెస్ పాలనలో దివాలా తీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి అసమర్థతతో రాష్ట్ర ఆర్థికలోటు గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. తిక్క నిర్ణయాలు, హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని దుయ్యబట్టారు. తన చేతగానితనంతో కేవలం ఒక్క ఏడాదిలోనే అన్ని రంగాలనూ సీఎం చావుదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బీరం హర్షవర్ధన్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ఒక ఎజెండా ప్రకారం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తల్లి లాంటి రాష్ట్రాన్ని కేన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పరువు తీస్తున్నాడు. రేవంత్రెడ్డి అబద్ధాలను బట్టబయలు చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ను విడుదల చేశారు. సీఎం చెబుతున్న అబద్ధాలను తిప్పికొడుతూ సమగ్ర నివేదిక ద్వారా వాస్తవాలు బయట పెట్టారు. మాజీ సీఎం కేసీఆర్కు మంచిపేరు వస్తుందనే భయంతో వెబ్సైట్ నుంచి ఈ నివేదికను ప్రభుత్వం తొలగించింది’అని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలి సీఎం రేవంత్ రంకెలు వేయడం మాని పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు. ఆరు గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న చోటే సీఎం ఓట్లు అడగాలని సూచించారు. ‘రాబోయే రోజుల్లో రేవంత్ ఆడబిడ్డల పుస్తెల తాడు కూడా ఎత్తుకుపోతాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రక్షణలో రేవంత్ ఉన్నాడు. రేవంత్, బండి సంజయ్ను ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటున్నారు. బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.150 వసూలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ‘ఆర్ఆర్ టాక్స్’విధిస్తోందని గతంలో ప్రధాని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతోందో చెప్పాలి. బీజేపీలో చేరేందుకు రేవంత్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారా? సుంకిశాల ప్రమాదంలో రేవంత్ ఎవరిని కాపాడుతున్నారో తెలుసు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం డిమాండ్ చేస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నాడు. కృష్ణా జలాల దోపిడీ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అసెంబ్లీ వేదికగా ఎండగడతాం. తెలంగాణను ఎవరు తక్కువ చేసి దూషించినా అదే స్థాయిలో సమాధానం ఇస్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
‘కారు’ ఇక పరుగు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతల మధ్య పని విభజన ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడంపై దృష్టి సారించింది. ఉద్యమకాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి దగ్గర కావాలని నిర్ణయించింది.తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి గుర్తు చేస్తూ పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలనే అభిప్రాయంతో ఉంది. తద్వారా కొత్త తరాన్ని ఆకర్షించే ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఈ నెల 19న జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు అన్ని స్థాయిల్లో యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు కీలక నేతల నడుమ పని విభజన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీ రామారావుకు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి అమలు బాధ్యతను అప్పగించనున్నారు. ఇప్పటికే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన రైతు ధర్నాల్లో పాల్గొన్న కేటీఆర్.. ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారు.సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావుకు పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పు, పార్టీ శిక్షణ కార్యక్రమాలు తదితరాలను హరీశ్ పర్యవేక్షిస్తారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా హరీశ్రావుకే అప్పగించనున్నట్లు సమాచారం. అనుబంధ సంఘాలపై కవిత దృష్టి ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలపై కవిత వరుస సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ శక్తుల ఏకీకరణ.. యువతకు చేరువ ఉద్యమ కాలంలో పార్టీతో కలిసి వచ్చిన వ్యక్తులు, శక్తులకు తిరిగి దగ్గర కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి ఏడాది పొడవునా సాగే పార్టీ రజతోత్సవాల్లో ఉద్యమంలో కలిసి వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు, వివిధ జేఏసీల్లో క్రియాశీలంగా పనిచేసిన వారితో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయడంతో పాటు కొత్త తరానికి తెలంగాణ నేపథ్యం, రాష్ట్ర సాధన ఉద్యమం తదితరాలను పరిచయం చేయాలని, పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, పదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పుట్టిన పసికందులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న యువతగా ఎదిగారు. వారిలో తెలంగాణ అస్తిత్వ స్ఫూర్తిని రగిలించేలా సదస్సులు, సమావేశాలు, సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ కార్యక్రమాలకు రూపకల్పన బాధ్యతను పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. కార్యాచరణ రూపకల్పనకు కోర్ గ్రూప్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, ప్రణాళికల రూపకల్పనకు సుమారు 25 నుంచి 30 మంది సీనియర్ నేతలతో కోర్ గ్రూప్ ఏర్పాటు చేయాలని అధినేత భావిస్తున్నారు. ఈ గ్రూప్లో ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేసిన నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లకు చోటు కలి్పస్తారు. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోజనశాల, పార్కింగ్ తదితర వసతుల కల్పన పూర్తయిన తర్వాత మినీ సభలను తలపించేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. -
నాడు వైఎస్సార్, జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు
సాక్షి, నాగర్ కర్నూల్ / నారాయణపేట: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క 4 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచితే ఆయనకు ఊడిగం చేసి.. చెప్పులు మోసి.. కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించిన సన్నాసి చంద్రశేఖరరావు అని తెలంగాణ సీఎంరేవంత్రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా.. ఆనాడు మంత్రి వర్గంలో నీ మంత్రులు లేరా.. హరీశ్ రావు ఆ మంత్రి వర్గంలో మంత్రి కాదా.. సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆయన కుమారుడు జగన్సీఎం అయ్యాక, ప్రజల స్వేదంతో నిర్మించిన ఇదే ప్రగతి భవన్ అధికారిక నివాసానికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి.. ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా.. ఇది ద్రోహం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో.. ఏ నీళ్ల కోసం శ్రీకాంతచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే ఏం చేశావని ప్రశ్నించారు. రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు రావాల్సిన నీళ్లను తీసుకెళ్తుంటే ఒక్కరోజైనా నువ్వు అడ్డుకున్నావా అని ధ్వజమెత్తారు. ‘అవ్వాల నువ్వు చేసిన పాపం ఇయ్యాల మాకు శాపమైంది. ఇవాళ మాకు ఉరైంది. తొందర్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే నెల రోజులు కళ్లు మూసుకుంటే 300 టీఎంసీల శ్రీశైలం నీళ్లు మొత్తం తరలించుకుపోతారు’ అని చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో మెడికల్ కళాశాల, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. -
‘ఎల్రక్టానిక్స్’కే రూ.320 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు పలు ఎల్రక్టానిక్ పరికరాల కొనుగోలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.320 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఈ రూ. 320 కోట్ల విడుదలకు ఆధారాలు లేవని తేల్చింది. పరికరాల కొనుగోలులో నిబంధనలు పాటించలేదని, బిల్లులు లేకుండానే నిధులు విడుదల చేశారని పేర్కొన్నట్టు తెలిసింది.సచివాలయ నిర్మాణంలో అవినీతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్.. ఐటీ విభాగంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. నిర్మాణ సంస్థకు ఇప్పటివరకు సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం సదరు సంస్థకు పరికరాల కొనుగోలు కోసమే రూ.500–600 కోట్ల వరకు విడుదల చేసినట్టు విజిలెన్స్ తేల్చింది. -
దమ్ముంటేరండి!
2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చకు సిద్ధమా? అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా నాతో చర్చకు రావాలి. మీ బంట్లు, బంట్రోతులను ఎవరిని పంపుతారో తేల్చుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో.. ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) ఉన్న గ్రామాల్లో మేం పోటీ చేస్తాం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేయాలి. ఈ సవాల్ను స్వీకరించే దమ్ముందా?సాక్షి, నాగర్కర్నూల్/ నారాయణపేట: దేశంలో 12 ఏళ్ల మోదీ పాలన, రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలన.. 12 నెలల కాంగ్రెస్ పాలనపై తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్లకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు.. ఎవరు వస్తారో, ఎక్కడికి వస్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు అయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో ఉందని సీఎం విమర్శించారు.శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మెడికల్ కళాశాల, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలకు ప్రారంబోత్సవం చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో పనులు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎప్పుడో బ్రిటిష్ కాలమైన 1931లో చేసిన కులగణన తప్ప ఈనాటికీ ఎవరూ లెక్క చెప్పలేదు. బీసీలు చైతన్యం అవుతున్నారు. తమ లెక్క చెప్పాలని అంటున్నారు. దేశంలో మొదటిసారి ప్రతి కులం లెక్క తీసేందుకు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచాం. 30ఏళ్లుగా పీటముడి పడిన ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపాం.ఏడాదిలోనే సాధించిన ఈ విజయాలు కేసీఆర్ కళ్లకు కనబడటం లేదా? ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు కాకముందే దిగిపోవాలని చూస్తున్నారు. కళ్లలో నిప్పులు, కడుపులో కత్తులు పెట్టుకొని మన మధ్యనే పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. తాను కొడితే గట్టిగా వేరేలా ఉంటుందని కేసీఆర్ అంటున్నారు. ఆయన కొట్టాల్సి వస్తే ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీలు చేసిన కొడుకును, ఢిల్లీలో లిక్కర్ దందా చేసిన బిడ్డను, కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు మింగిన అల్లుడిని కొడితే వాళ్లకు బుద్ధి వస్తుంది. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు.. పాలమూరు నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపించినా ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన పాపం బీఆర్ఎస్దే. అప్పుడే పూర్తిచేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ ఎందుకు వచ్చేది? పోతిరెడ్డిపాడు ద్వారా జగన్ ఏపీకి 40వేల క్యూసెక్కులు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఊడిగం చేశారు. ఆనాడు మంత్రిగా ఉన్నది హరీశ్రావు కాదా? జగన్తో కలసి ప్రగతిభవన్లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పన్నింది ద్రోహం కాదా? రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీల చొప్పున నెల రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది. మహిళలకు ఏడాదికి రెండు చీరలు.. దేశంలోనే మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభించాం. ఇందిరా మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళల చేతికి పర్యవేక్షణ, మహిళా సమాఖ్యల ఆధ్యర్యంలో 600 బస్సుల కొనుగోలు, పావలా– జీరో వడ్డీ రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని మహిళా సంఘాల మహిళలకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు అందిస్తాం. పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చే బాధ్యత నాది.ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపుతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, జనంపల్లి అనిరు«ద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం కల: మంత్రులు రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కలగానే మిగులుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని అలాంటిది ఏడాది పాలనలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పారు. రాష్ట్రంలో కులగణనతోపాటు ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపి చరిత్రలో నిలిచామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సామాజిక న్యాయం అందిస్తూ అసమానతలను తొలగిస్తామన్నారు. నిన్నేం అంటలేను అక్కా.. – సీఎం రేవంత్, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద మహిళా సమాఖ్య ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంబోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఒకచోటుకు చేర్చి, మహిళా శక్తిని చాటుతూ నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామని సీఎం రేవంత్ పేర్కొనగా.. ఎంపీ డీకే అరుణ కలుగజేసుకుని కేంద్రం ఇప్పటికే నిధులను ఇస్తోందని చెప్పారు.దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘కేంద్రం ఇస్తుంది. ఇవ్వాలి. మిమ్మల్ని ఏమీ అనడం లేదు అక్కా. ప్రజలకు సేవ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మీకు ఇక్కడ తల్లి గారిల్లు, అక్కడ అత్త గారిల్లు, పిల్లల కోసం ఎవరేం ఇచ్చినా వద్దు అనలేం. అవసరమైనప్పుడు అందరం ఒక్క తాటిపై నిలబడాలి..’’ అని పేర్కొన్నారు. -
తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంతంటే?.. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక
హైదరాబాద్ : సచివాలయ నిర్మాణం, వ్యయం అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వింగ్ల వారిగా విచారణ మొదలుపెట్టింది. అయితే, ఈ విచారణలో సచివాలయం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ విభాగంపై విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికలో సెక్రటేరియట్లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ. 320కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది.బిల్లులు మంజూరు చేయకుండానే నిధులను విడుదల చేసినట్లు గుర్తించింది. రూ. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పటివరకు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వం సదరు సంస్థకు నిధులను విడుదల చేసింది. మొత్తం అంచనా రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని విజిలెన్స్ తాత్కాలిక రిపోర్టులో పేర్కొంది. -
సంధి ముగిసింది.. చర్యలు తీసుకోవడమే ఆలస్యం : మధుయాష్కీ
సాక్షి,హైదరాబాద్ : ప్రతిపక్షంతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ ప్రభుత్వంలోని పలు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కీలక అధికారులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని రాజకీయపరిణామాలపై మధుయాష్కీ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ బాగోతం ఇంకా బయటపడాలి. సోమేష్ కుమార్ అండతోనే జీఏస్టీ కుంభకోణం జరిగింది. దోచిపెట్టిన ,దాచి పెట్టిన అధికారుల పై విచారణ జరగాలి. అభయ్ కుమార్ లాంటి వారి పై చర్యలు అవసరం. విచారణలో వేగం లేనందునే కాంప్రమైజ్ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.విచారణ చేయాల్సిన అధికారులే దోషులు కావడంతో విచారణ ముందుకు సాగడం లేదు. సింగరేణిలో కవిత కు అన్ని రకాలుగా సహాకరించిన అధికారి ..మా ప్రభుత్వం లో ఉన్నత స్థానంలో ఉన్నారు. సంధి కాలం ముగిసింది.. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాలి. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారు’అని మండిపడ్డారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
-
ఎప్పుడైనా... ఎవరితోనైనా... కొట్లాటకు సిద్ధం
-
ఆధారాల్లేకుండానే కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాల్లేకుండా తనపై ముషీరాబా ద్, బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. 2023, నవంబర్ 27న ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ అప్పటి ముషీరాబాద్ ఏఎస్ఐ ఆర్.ప్రేమ్కుమార్ ఫిర్యాదు చేశారన్నారు.అయితే, ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నామని, బాణాసంచాతో ఇబ్బందులు పడినట్లు ఎవరూ ఫిర్యాదు చేయ లేదని చెప్పారు. ఫిర్యాదుదారులు.. సాక్షులు ఇద్దరూ పోలీసులేనన్నారు. సరైన దర్యాప్తు చేయకుండానే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని.. కేసులను కొట్టేయాలని కోరారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కేటీఆర్తో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా ఉన్నారు.అలాగే, కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి వసూలు చేసిన రూ.2,500 కోట్లను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి పంపారంటూ 2024, మార్చి 27న కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.శ్రీనివాసరావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఒకట్రెండు రోజుల్లో జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టనున్నారు. -
కృష్ణా జలాలపై సర్కార్ మొద్దునిద్ర: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది జలాలను అక్రమంగా తరలిస్తున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా రేవంత్రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని, వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్ యాదవ్తో కలసి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ గురించి పట్టింపులేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జరిగే నష్టం ఏమిటో తెలుస్తోందన్నారు. రోజుకు 10 వేల క్యూసెక్కులు అక్రమంగా తరలింపు‘నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఏపీ ప్రభుత్వం మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అక్రమంగా తరలిస్తోంది. గడచిన 25 రోజుల్లో 60 టీఎంసీల నీటిని తరలించారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు కాగా ఇప్పటికే 657 టీఎంసీలు తరలించింది. తెలంగాణకు రావాల్సిన వాటా 343 టీఎంసీలు కాగా 220 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. ఏపీకి మిగిలింది కేవలం 9 టీఎంసీలు కాగా తెలంగాణకు మరో 123 టీఎంసీల వాటా రావాలి. కానీ శ్రీశైలం, సాగర్లో అందుబాటులో ఉన్న నీరు వంద టీఎంసీలు మాత్రమే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి అన్యాయాన్ని అడ్డుకోవాలి’అని హరీశ్ అన్నారు.సాగర్ను అధీనంలోకి తీసుకోవాలి‘సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని సాగర్ ప్రాజెక్టును తెలంగాణ అధీనంలోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తున్నా చంద్రబాబును అడిగే ధైర్యం లేదు, కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము లేదు’అని హరీశ్రావు మండిపడ్డారు. ‘సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్ ఎస్సెల్బీసీ కింద సుమారు 9 లక్షల ఎకరాలకు 35 టీఎంసీల మేర నీరు కావాలి. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్ తాగునీరు నాగార్జున సాగర్పై ఆధారపడి ఉంది. ఏపీ జలదోపిడీపై కేఆర్ఎంబీ, జలశక్తి మంత్రి కార్యాలయాల ముందు ధర్నాకు సిద్ధం, ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలి. ఉమ్మడి ప్రాజెక్టులపై త్రిసభ్య కమిటీ సమావేశం కోసం డిమాండ్ చేయాలి. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి’అని హరీశ్రావు విమర్శించారు. వెంటనే సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
కాళేశ్వరంతో నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు మాత్రం నిండాయి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేసే మేడిగడ్డ కూలిపోయింది.. ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయంటూ బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన జలసౌధలో మాట్లాడుతూ.. కాళేశ్వరం కూలిపోయింది.. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.‘‘కృష్ణా వాటర్లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్కు వివరించా.. పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారు. పదేండ్ల పాటు తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్లను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని ఉత్తమ్ తెలిపారు.కాళేశ్వరం కూలితే.. స్వయంగా ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణలోనే.. ప్రాజెక్టు డిజైన్ తప్పు ఉందని స్పష్టం చేసింది. నీళ్లు నింపవద్దని స్వయంగా ఎన్డీఎస్ఏ లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం 12 శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు. ప్రాజెక్టుల రుణాలను నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించాం.’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి వివరించారు. -
ఏ ఆధారాలతో మాపై నిందలు వేస్తున్నారు: Gandra Venkata Ramana Reddy
-
పెండింగ్లో ‘ప్రాధాన్యం’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఆర్థిక బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లుల మంజూ రు క్రమంలో వస్తున్న అపవాదులు, ప్రతిపక్షాలు మోపు తున్న నిందలకు చెక్ పెట్టేలా అందుబాటులో ఉన్న నిధుల ను బట్టి ప్రాధాన్యతల వారీగా మంజూరు చేయాలని భావి స్తోంది. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు ప్రతి 15 రోజులకోసారి సమా వేశం కావాలని, ఈ బిల్లులపై చర్చించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకుగాను టోకెన్లు వచ్చి పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి ఈ సమావేశంలో చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ప్రతినెలా రాష్ట్ర ఖజానాపై పెద్దభారం పడకుండా, తక్కువ నిధులతో ఎక్కువమందికి ప్రయోజనం కలిగే విధంగా ఉండే బిల్లులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పాఠశాలల్లో పుస్తకాలు, క్రీడా పరికరాల సరఫరా, మెడికల్ బిల్లులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు, సర్పంచ్లకు రూ.5 లక్షల లోపు బిల్లులను వీలున్నంత త్వరగా క్లియర్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. తద్వారా ఇష్టారాజ్యంగా బిల్లులు ఇస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టాలనేది అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఉద్దేశమనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది. అంతర్గత విమర్శలకూ తావు లేకుండామరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బిల్లుల మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాము చెప్పినా బిల్లులు రావడం లేదనే అసంతృప్తితో వారున్నారనేది కాంగ్రెస్ పార్టీలో బహిరంగ రహస్యమే. ఈ అసంతృప్తికి కూడా చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత విమర్శలకు కూడా తావులేకుండా పెండింగ్ బిల్లుల మంజూరులో ప్రాధాన్యం పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాధాన్యతల ప్రకారం అడిగే బిల్లులను కూడా వీలున్నంత త్వరగా క్లియర్ చేసేలా 15 రోజులకోసారి జరిగే సీఎం, డిప్యూటీ సీఎంల భేటీలో నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. -
కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడుతున్నాం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ విషయాన్ని నేను గమనిస్తున్నా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పేరిట మళ్లీ ఏదో ఒక రూపంలో తెలంగాణలో అడుగు పెడుతానంటున్నడు. తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికావొద్దు..’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్ఎస్ ప్రస్థానం, సంస్థాగత నిర్మాణం, పార్టీ రజతోత్సవాల నిర్వహణ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తదితర అంశాలపై మాట్లాడారు. సీఎంకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది ‘తెలంగాణ ప్రజలకు నచ్చి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. అధికారంలో వచ్చినా కాంగ్రెస్కు అచ్చి రాలేదు. మంత్రివర్గానికి, సీఎంకు నడుమ సమన్వయం లేదు. ఐఏఎస్, ఐపీఎస్లు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం చెప్పడం ద్వారా ఆయనకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది. మనం ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం పెంచుకుంటూ వచ్చి ప్రజలకు కావాల్సినవి సమకూర్చాం. కానీ గడిచిన మూడు త్రైమాసికాల్లో రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఖజానాను ఎలా నింపాలో వారికి తెలియడం లేదు..’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ ‘తెలంగాణ సమాజం సామాజిక, చారిత్రక అవసరాల కోసం తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. అలా పురుడు పోసుకున్న బిడ్డను నలిపివేయాలని ఎన్నో కుట్రలు సాగాయి. గతం గాయాల నుంచి కోలుకుంటున్న మనం తిరిగి వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముంది. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం, రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణకు శాశ్వత న్యాయం జరగాలంటే ప్రజలను తిరిగి చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది..’ అని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీశ్రావు, కవిత ఇతర ముఖ్య నేతలు 7 నెలల పాటు సంస్థాగత నిర్మాణం ‘ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్ వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై పనిచేయాలి. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, అదే నెల 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. దీనికి సంబంధించి సబ్ కమిటీ బాధ్యతలు హరీశ్రావుకు అప్పగిస్తున్నాం. ఏప్రిల్ 10 నుంచి సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, పట్టణ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. అక్టోబర్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటిస్తాం. త్వరలో 30 మందికి పైగా కీలక నేతలతో భేటీ జరిపి అన్ని అంశాలపైనా స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం. సోషల్ మీడియా సహా పార్టీ అనుబంధ కమిటీలను బలోపేతం చేస్తాం..’ అని కేసీఆర్ తెలిపారు. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందుకే ఓటమి ‘రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. కానీ బీఆర్ఎస్కు తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యత. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాం. కొత్త తరానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యం, బీఆర్ఎస్ పోషించిన పాత్రను వివరించాలి. తెలంగాణ చరిత్రను అర్ధం చేసుకుంటే గుండె బరువెక్కుతుంది. భారతదేశంలో విలీనం తర్వాత కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోలేక పోయింది. రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి కాంగ్రెస్ అడుగడుగునా కుట్రపూరిత రాజకీయాలు చేసింది. వలసాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను అన్ని విధాల నాశనం చేశారు. తెలంగాణలో నెత్తురు ఏరులై పారిన సందర్భంలో నా ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు బాధలను పూర్తిగా తొలగిపోయే విధంగా, స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా తెలంగాణ తనకు తాను నిలబడాలనే ఆకాంక్షతో పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పార్టీ యంత్రాంగంతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, వివిధ వర్గాలను కలుపుకోవాలి. తెలంగాణ ఉద్యమ తరహాలో పార్టీ రజతోత్సవ వేడుకలు ఏడాది పొడవునా నిర్వహించాలి. తెలంగాణ చరిత్ర, బీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరించే డాక్యుమెంటరీలకు రూపకల్పన జరగాలి..’ అని మాజీ సీఎం ఆదేశించారు. అభిప్రాయాలు వెల్లడించిన నేతలు సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన సమావేశంలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. పలువురు మాజీ మంత్రులతో పాటు సీనియర్, జూనియర్ నాయకులు 29 మంది మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, యువతతో పాటు వివిధ వర్గాలకు చేరువ కావాల్సిన అవసరం, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేయాలనే ఆభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధు, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, రాకేశ్రెడ్డి, రాజా వరప్రసాద్, మూల విజయారెడ్డి, దాసరి ఉష, సత్య తదితరులు ప్రసంగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీశ్రావు సహా మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, తదితర నేతలు హాజరయ్యారు. -
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇది పక్కా..
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు వాస్తవాలు మాట్లాడుతుంటే.. అవి జీర్ణించుకోలేని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.కేసీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన కేసీఆర్ మండిపడ్డారు.‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించ దగ్గ విషయం’ అని సీరియస్ టోన్తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు.కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘కేసీఆర్కు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో రెండు హామీలను అమలు చేసాం. పంట బోనస్ , రైతు భరోసా పెంపు , 55 వేల ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టింగులు ఇలా చెప్పుకుంటే పోతే అనేకం చేశాం. ఇంకా చేస్తాం. కేసీఆర్ వ్యాఖ్యల్లో అసహనం తప్ప మరొకటి కనబడటం లేదు. అధికారం దరిదాపుల్లో కనబడక పోవడంతోనే కేసీఆర్లో అసహనం ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తారు... ఇది పక్కా. ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా పాత పథకాలను ఒక్కటి కూడా రద్దు చేయకుండా ,మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కేంద్రం ఇంకా సహకరిస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలి. తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తాం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కలసి రావాల్సిందేనని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. -
BRS శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం
-
నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు రానున్నారు. తెలంగాణ భవన్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు కలుపుకొని సుమారు 400 మందికి ఆహ్వానం పంపారు.ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు చేపట్టాల్సిన రాజకీయ కార్యకలాపాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పేరిట ఆవిర్భవించిన బీఆర్ఎస్ వచ్చే ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల పాటు పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూలు ప్రకటించే అవకాశముంది. -
ఫ్యూచర్, ఫోర్త్ సిటీల పేరుతో డ్రామాలు..: కేటీఆర్
ఆమనగల్లు: ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి రాజకీయ డ్రామా ఆడుతున్నారని, ఆయనకు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధ్వజమెత్తారు. ‘వెల్దండలో సీఎం రేవంత్రెడ్డికి 500 ఎకరాల భూమి ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల వెయ్యి ఎకరాలు నొక్కేశారు. మాడ్గుల ప్రాంతంలో భూముల రేట్లు పెంచేందుకు అత్తగారి ఊరుకు పెద్ద రోడ్డు వేస్తున్నాడు..’ అని ఆరోపించారు. రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత 35 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చాడని, కనీసం 35 పైసలు కూడా తేలేదని విమర్శించారు. కల్వకుర్తి నుంచి కొడంగల్కు వలస వెళ్లిన రేవంత్రెడ్డి అక్కడా, ఇక్కడా చేసిందేమీలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డి పతనం కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు నిరసన దీక్షకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.రేపు పుస్తెల తాళ్లు ఎత్తుకెళతారు..‘కొడంగల్లో ఏ ఒక్క రైతుకూ రుణమాఫీ కాలేదు. మహిళలకు రూ.2,500 పెన్షన్ ఇవ్వలేదు. కళ్యాణలక్ష్మి, తులం బంగారం పత్తాలేదు. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడికి వలస వస్తే.. ప్రస్తుతం ఇక్కడి నుంచి వలస పోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ పాలనలో మొన్న రైతుల ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. నిన్న మోటార్టు, స్టార్టర్లు తీసుకెళ్లారు. రేపు మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్లు ఎత్తుకెళ్తారు. కేసీఆర్ పాలనలో రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద 12 సీజన్లలో రూ.73 వేల కోట్లు అందాయి. కానీ రేవంత్రెడ్డి 420 రోజుల పాలనలో 430 మంది రైతులు, 56 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాగర్కర్నూల్లో చందు అనే రైతు బ్యాంకు ఎదుట బైక్ను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో రైతు జాదవరావ్, మేడ్చల్లో సురేందర్రెడ్డి ఆత్మహత్యలు చేసుకోగా ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు..42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను, రూ.15 వేలు రైతు భరోసా ఇస్తానని రైతులను, రూ.12 వేలు ఇస్తానని రైతు కూలీలను, నెలకు రూ.2,500 ఇస్తానని ఆడబిడ్డలను, స్కూటీలు ఇస్తానని యువతులను, లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తానని ఆడబిడ్డలను ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్రెడ్డి మోసం చేశారు. రాష్ట్ర ప్రజలు రేవంత్రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంకెవరైనా అయితే ఇప్పటికే పాడుబడిన బావిలో దూకేవారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. రేవంత్రెడ్డి నిజాయితీగల మోసగాడు..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతు దీక్షలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్కుమార్రెడ్డి, వాణిదేవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్రెడ్డి, అంజయ్య యాదవ్, బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీన్కుమార్, గోలి శ్రీనివాస్రెడ్డి, కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి..
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రుణమాఫీ విషయంలో మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడంతో తెలంగాణ అధోగతి పాలైంది. ప్రజలు తిడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చింది. సీఎం నియోజకవర్గంతోపాటు తెలంగాణలోని ప్రతీ పనికి సంబంధించిన కాంట్రాక్టు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతున్నాయి. కాంట్రాక్టుల మంత్రి ఇచ్చే కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం 30శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.ప్రత్యేక కారణాలతోనే బీఆర్ఎస్కు నష్టం‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అసాధారణ అభివృద్ధి జరిగినా అక్కడి ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా వరదల సమయంలో ప్రజలకు పైసా ఉపయోగ పడలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయినా ఏడాది కాలంగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.ఈ ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏకగ్రీవాల కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది’ అని కేటీఆర్ హెచ్చరించారు. త్వరలో తాను ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, జగదీశ్రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ తదితరులు పాల్గొన్నారు.కేసీఆర్ పుట్టిన రోజున ‘వృక్షార్చన’బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న ప్రతీ ఒక్కరూ మూడు మొక్కల చొప్పున నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘వృక్షార్చన’ పేరిట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కేటీఆర్ మంగళవారం విడుదల చేశారు. -
పీఏసీ చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ (పీఏసీ)గా నియమించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు నామినేషన్ పత్రాలను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడితో సంప్రదింపులు జరిపి పీఏసీ చైర్మన్ను ఎంపిక చేయాలనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. శాసనసభలో కమిటీ హాల్లో మంగళవారం జరిగిన పీఏసీ మూడో సమావేశం నుంచి బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్ హోదాలో సమావేశం నడపడం సమంజసం కాదని ప్రశాంత్రెడ్డి అన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన పీఏసీ చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీతోపాటు పీఏసీ భేటీలోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీ చైర్మన్ పదవి నుంచి అరికెపూడిని తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పీఏసీ చైర్మన్తోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రమణ డిమాండ్ చేశారు.అధికారుల తీరుపై పీఏసీ అసంతృప్తివైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులపై పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ శాఖలపై సమీక్ష నిర్వహించారు. భేటీకి అధికారులు తగినంత సమాచారంతో రాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి పూర్తి సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు పీఏసీ సభ్యులు పలు సూచనలు చేశారు. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడి పోతారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విధంగా మాట్లాడారు. -
‘చెల్లెల్ని చూసి నేర్చుకో’.. కేటీఆర్కు కొండా సురేఖ కౌంటర్
సాక్షి, హైదరాబాద్ : సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్, ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి. సర్వే అంటున్న కేటీఆర్.. చెల్లి కవితను చూసి నేర్చుకోవాలి. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలి. ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది నాకు తెలీదు..నేను ఎవరిని ఎంకరేజ్ చేయడంలేదు.దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది.అడ్మినిస్ట్రేషన్కు ఇబ్బంది అవుతుంది. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. లీగల్ లిటికేషన్స్లో లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాభిషేకాలు చేయాలో లిస్ట్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చాం.కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుంది. ఫారెస్ట్లలో సర్వేయర్ల ప్రొటెక్షన్పై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయి. గత ప్రభుత్వంలో నాయకులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్పై త్వరలోనే విచారణ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల సర్వేతో మాకు పేరు వస్తుందనే విమర్శలు. బీసీ రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదు. ఉద్యోగాలు,ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. -
మాటకు మాట : Congress Vs BRS
-
మేం చూస్తూ ఊరుకోం!.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి? తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం.’’ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సుప్రీంకోర్టు ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో చెప్పండి. ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా? ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే.. మేం చూస్తూ ఊరుకోబోం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే.. తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. రెండు పిటిషన్లపై విచారణ.. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ), మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచా రణ చేపట్టింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ వాదనలు విని పించగా.. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్రావు వాదనలు వినిపించారు. ఇంకా ఎంత సమయం కావాలి? తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము విచారణ జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని, అనర్హత పిటిషన్పై మాత్రమేనని, అందువల్ల పిటిషన్లో ఉన్న అంశాలను ప్రస్తావించాలని సూచించింది. పిటిషన్పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. తమకు ఇంకా తగినంత సమయం కావాలని రోహత్గీ బదులిచ్చారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటికే పది నెలలు గడిచింది, మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించి ఉంటే.. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదు’’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హక్కులకు సంబంధించిన అంశం ఇది అయితే తమకు ఇంకా సమయం కావాలని రోహత్గీ ఈ సందర్భంగా అభ్యర్ధించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం’’ అని స్పష్టం చేసింది. సంపత్కుమార్, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ కోరిన ‘తగినంత సమయం’ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన తీర్పును రోహత్గీ ప్రస్తావించారు. దీనితో ‘తగినంత సమయం’ అంటే ఎంత అని రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ‘‘తగినంత సమయం అంటే రెండు నెలలు, మూడు నెలలు అని ఏదీ కూడా ఆ తీర్పులో ధర్మాసనం చెప్పలేదని రోహత్గీ బదులిచ్చారు. డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం’ అంటే ఎంత? రోహత్గీ సమాధానంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంత? పది నెలలు రీజనబుల్ టైం కాదా? అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి? మీరు చెప్పే రీజనబుల్ టైమ్కు గడువు అనేది ఉందా, లేదా? పోనీ మీరు రీజనబుల్ టైం చెప్పకపోతే.. మేమే ఓ గడువు విధిస్తాం. ఆ గడువులోపు దానిని పూర్తి చేయండి’’ అని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్చంద్రన్ల ధర్మాసనం పేర్కొంది. అయితే ‘రీజనబుల్ వ్యక్తికి రీజనబుల్ టైం ఇవ్వాల’ని రోహత్గీ తిరిగి అభ్యర్ధించారు. ‘‘రీజనబుల్ వ్యక్తి దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటీ, అసలు ఎంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. దీనికి బదులు ఇచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం కావాలని రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ధర్మాసనానికి అన్ని ఆధారాలు సమర్పించాం: మోహిత్రావు తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ తరపు న్యాయవాది పి.మోహిత్రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధర్మాసనానికి సమర్పించామని చెప్పారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని వివరించామన్నారు. -
KTR: దుర్యోధనుడు పాలించినట్లు కాంగ్రెస్ పాలన!
-
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
-
నేటితో GHMC పాలకమండలి ఏర్పడి నాలుగేళ్లు పూర్తి
-
బీఆర్ ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డితో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇవాళ (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో తెలంగాణ స్పీకర్ తరుఫున ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. తమకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజులు సమయం కావాలని కోరారు. రోహ్గతి విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్కు గురి చేయొద్దు. ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయి. తగిన సమయం అంటే ఏంటి? అని ప్రశ్నించింది. పార్టీ మారి పది నెలలు అవుతుంది. ఇది రీజనబుల్ టైం కాదా? అని వ్యాఖ్యానించింది. అందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన టైం ప్రకారం.. రీజనబుల్ టైం అంటే మూడు నెలలే అంటే బీఆర్ఎస్ తరుఫు న్యాయవాది తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ‘చలో కామారెడ్డి’: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కులగణన పేరుతో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘కామారెడ్డి డిక్లరేషన్’లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అక్కడే ‘చలో కామారెడ్డి’ పేరిట భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ బీసీ నేతల సమావేశం జరిగింది. సుమారు 500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో చలో కామారెడ్డి సభను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు వారం రోజులపాటు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించాలని తీర్మానించారు. ఈ నెలాఖరులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ సభకు అంతరాయం కలగకుండా చలో కామారెడ్డి సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, కేటీఆర్ సోమవారం సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గిలో రైతుల సభలో పాల్గొననున్నారు. కులగణన నివేదిక ఒక చిత్తు కాగితం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అని కేటీఆర్ విమర్శించారు. పార్టీ బీసీ నేతల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీసర్వే చేసి కులాలవారీగా కచ్చితమైన లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభాను 5.5 శాతం తక్కువగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. కులగణన నివేదిక చిత్తుకాగితంతో సమానమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఇండ్ల కేటాయింపులు, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని ఎంబీసీలు, బీసీలు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్సీయే కులగణన సర్వేను చిత్తు కాగితంతో సమానమని తగులబెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాం. బిల్లు తేలేదు కానీ.. సొల్లు మాత్రం చెప్పారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి పైగా టికెట్లు ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 19 సీట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల వారీగా ప్రజలను చైతన్యం చేస్తామని ప్రకటించారు. బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. -
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు.. రేపు సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.కేటీఆర్ రిట్ దాఖలుఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు.అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. రేపు (ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
కాంగ్రెస్ నేతలు కనిపిస్తే.. జనం కొట్టేలా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రం నలుమూలలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తే జనం కొట్టేలా ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి కూడా పోలీసు సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ కాకుండా మరొకరు ఆ స్థానంలో ఉంటే ఈ పాటికి ఆత్మహత్య చేసుకునే వారు..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శనివారం వేర్వేరుగా జరిగిన సిర్పూర్ కాగజ్నగర్,వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఏడాది లోపే కాంగ్రెస్ దగాకోరు విధానాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని.. రేవంత్రెడ్డి పుణ్యాన మరో 15 ఏళ్ల వరకు తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితిలో కాంగ్రెస్ ఉండదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలోని మంత్రులు అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారని ఆరోపించారు. రేవంత్ ఐరన్ లెగ్ సీఎం.. ‘‘ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్కు గుండు సున్నా తీసుకువచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించి ఢిల్లీలో ముగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో బీజేపీ, ప్రధాని మోదీకి అతిపెద్ద కార్యకర్తలా పనిచేస్తున్నారు. రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది చొప్పున గెలిచినా బడ్జెట్లో తెలంగాణకు దక్కింది శూన్యం..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక్క బీజేపీ ఎంపీ నోరు మెదపలేదేమని ప్రశ్నించారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే కేంద్రాన్ని నిలదీసేవారని చెప్పారు. మోసగాళ్లంతా వెళ్లిపోయారు ‘‘మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పుకొనే రేవంత్రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైకు ఇవ్వడానికి వణికిపోతున్నారు..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో పేదల సంక్షేమం కోసం అనేక మంచి పనులు చేసిన కేసీఆర్.. సూర్యుడి తరహాలో కొంతకాలం మబ్బుల చాటుకు వెళ్లారని, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తమతో కలసి పనిచేసేందుకు అధికార పార్టీ ఆహ్వానాన్ని పక్కనపెట్టి మరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. చిన్న చిన్న తప్పుల వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని పేర్కొన్నారు. మరో పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు. గెలిచే అభ్యర్థులకు అవకాశాలు ఇస్తామని, కలసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నేడు బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల భేటీ రాష్ట్రంలో కులగణన లోటుపాట్లను ఎత్తిచూపడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం లక్ష్యంగా బీఆర్ఎస్ ఆదివారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి రావాలంటూ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోపాటు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కలిపి సుమారు 500 మందికిపైగా ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ బీసీ నేతల సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీని గెలిపించిన రాహుల్ గాం«దీకి కంగ్రాట్స్! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవకపోవడాన్ని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాం«దీకి కంగ్రాట్స్’’అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. -
సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ
-
మండలి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలోని మూడు స్థానాలకు ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ముఖ్య నేతలకు స్పష్టత ఇచ్చారు. పట్టభద్రుల కోటా స్థానంలో పోటీ చేయాలని పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించారు. పట్టభద్రుల కోటాలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలకు ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా కీలక నేతలకు సూచించారు.అదే సమయంలో మండలి ఎన్నికల్లో ఇతర పార్టీలు లేదా అభ్యర్థులెవరికీ మద్దతు ఇవ్వ డం లేదనే సంకేతాలు కూడా ఇచ్చారు. శాసన మండలి ఎన్ని కలకు బదులు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సన్నాహాలు ప్రారంభించాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ ఆదేశించారు. ఇక స్థానిక ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు.. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ నిర్వహణపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. పోటీకి నేతలు సిద్ధమైనా.. శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ కోటా స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దా ర్ రవీందర్సింగ్, డాక్టర్ బీఎన్ రావు, శేఖర్రావు, రాజారాం యాదవ్ తదితరుల పేర్లు వినిపించాయి.పట్టభద్రుల కోటా లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేందర్రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఓ దశలో ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీకి సన్నద్ధమవుతున్న ప్రసన్న హరికృష్ణను బీఆర్ఎస్లోకి తీసుకువచ్చి పార్టీ టికెట్ ఇప్పించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కొంతమేర ప్రయత్నాలు కూడా చేశారు. కానీ చివరికి పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తిరిగి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్ చేయనున్నారు. -
‘మీ సర్వే బోగస్ అని మీ పార్టీ నేతలే అంటున్నారు’
సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్రెడ్డి(Revanth Reddy) సర్కార్ చేపట్టన సర్వే అంతా బోగస్ అని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి(Jagadish Reddy ఆరోపించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సర్వేనే కరెక్ట్ ఉందని, ఇప్పుడు చేపట్టిన సర్వే బోగస్ అని తాను అనడం కాదని కాంగ్రెస్ పార్టీ నేతలే విమర్శిస్తున్న విషయాన్ని రేవంత్ తెలుసుకోవాలన్నారు. సూర్యాపేటలో ప్రెస్మీట్ నిర్వహించిన జగదీష్రెడ్డి.. రాష్ట్రంలో పాలన కుక్కల చించిన విస్తరిలా ఉందన్నారు. జనాభాను తగ్గించి చూపితే మన రాష్ట్రానికి నష్టమనే సోయిలేదా? అని విమర్శించారు.‘కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. కొంతమంది అనామకులు మేమున్నామని చెప్పుకోవడానికే అప్పుడప్పుడు మొరుగుతున్నారు. సీఐడీ కాదు అంతకంటే పెద్దది సీఐఏ తో ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ అంటూ జరిగితే ముందుగా జైలుకు పోయేది రేవంతే. గుమ్మడికాయ దొంగలేవరంటే కాంగ్రెస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారు. లక్ష డప్పులు.. వేల గొంతుల కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికే అసెంబ్లీ పెట్టారు.ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను పూర్తిగా అమలుచేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధానన్ను కలిసిన కేటీఆర్
-
లెక్క తప్పలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ ఎక్కడా లెక్క తప్పలేదని, అన్ని సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా తేలాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ప్రస్తుత కులగణనలో లభించిన సమాచారం ఆధారంగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె గాందీభవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడిన సీతక్క కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. మేక వన్నె పులిలా బీసీ, ఎస్సీల హక్కులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేశారని, అదంతా కేవలం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసమేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు కులగణన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆలె నరేంద్ర, ఈటల రాజేందర్ లాంటి బలమైన బీసీ నేతలను పార్టీ నుంచి వెళ్లగొట్టారన్నారు. తమ సర్వేను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు జరిగిన కులగణన ఎందుకు బయటపెట్టలేదో కేసీఆర్ను ప్రశ్నించలేదని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం, ఇన్చార్జ్ భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని, ప్రతి మూడు నెలలకోసారి ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుందని సీతక్క చెప్పారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఆయన సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు. అధికారులను వెళ్లి కలవండి మంత్రితో ముఖాముఖిలో భాగంగా తమకు వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు చేరవేస్తామని, వాటి పరిష్కారానికి ప్రజలు స్థానిక అధికారులను సంప్రదించాలని సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్రామాల రోడ్లు, హోంగార్డు ఉద్యోగాలు, పంట రుణాల మాఫీ, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల ఏర్పాటు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ధరణి తదితర అంశాలపై ప్రజలు మంత్రి సీతక్కకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ.ఫహీం, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ నేత అల్లం భాస్కర్ పాల్గొన్నారు. -
ఫిరాయింపుల వ్యవహారం.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ!
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 10న విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో కేటీఆర్ రేపటి నుంచి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్లు వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై న్యాయవాదులతో చర్చించనున్నారు.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
‘సర్వే రిపోర్ట్ను కాంగ్రెస్ ఎమ్మెల్సీలే తగలబెట్టమన్నారు’
సాక్షి,హైదరాబాద్ : ‘సర్వే రిపోర్ట్ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కులగణనపై తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో కేటీఆర్ మాట్లాడారు. ‘42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అధికారులకు గుర్తు చేశాం. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారు. ఆ డాక్యుమెంట్ అందుకే వెబ్సైట్స్లో పెట్టాం. సమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు. 51శాతం. ముస్లింలు 10 శాతం వాళ్లను కలిపితే మొత్తం 61 శాతం. కాంగ్రెస్ సర్వే రిపోర్ట్ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు.. మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని అన్నారు. -
‘ఎమ్మెల్యేల అనర్హత’పై 10న తదుపరి విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహీపాల్రెడ్డి, అరికెపూడి గాందీలపై కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే హరీశ్రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న ఈ పిటిషన్ ప్రతిని, ప్రతివాది అయిన తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. బీఆర్ఎస్ను వీడిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్తో కేటీఆర్ పిటిషన్ను జత చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద్ పిటిషన్ వేశారు. దీనిపై గత శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి ధర్మాసనం..తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ‘తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటే ఎంత కాలం? అసెంబ్లీ గడువు ముగిసే దశలో నిర్ణయం తీసుకుంటారా?’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు
కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. జాతీయ పార్టీలు ఎప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే, 16 మంది ఎంపీలు తెలంగాణకు తెచ్చింది అక్షరాలా గుండుసున్నా. సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తున్న బడేభాయ్– చోటేభాయ్ అనుబంధంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్కు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజల గమనిస్తున్నారు. పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసిం జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైంది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసింది.దేశఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. సీఎం రేవంత్ 30 మార్లు ఢిల్లీకి వెళ్లింది నిధుల కోసం కాదని, ఢిల్లీకి మూటలు మోసేందుకు వెళ్లారని బడ్జెట్ ప్రతిపాదనలతో తేటతెల్లమైంది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు నయాపైసా తీసుకురాలేకపోయారు. – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ ముగిసేంత సమయం కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? అసలు మీకెంత సమయం కావాలి? అసెంబ్లీ కాలపరిమితి ముగిసేంత సమయం కావాలా?’అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మీకెంత సమయం కావాలో చెప్పండంటూ ఆదేశించింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఈనెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి)ను దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాం«దీలపై బీఆర్ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు తదితరుల పేర్లతో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఎల్పిపై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్తో కూడిన ధర్మాసనం విచారించింది. పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై పది నెలలుగా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు దామ శేషాద్రి నాయుడు, పొనుగోటి మోహిత్రావు సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులు వచ్చి ఏడు నెలలైనా స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని నివేదించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పగా.. ఫిర్యాదులపై నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి పది నెలల సమయం పట్టిందా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రీజనబుల్ టైం అంటే ఎంత? పార్టీ ఫిరాయింపులపై స్పందించేందుకు స్పీకర్ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంత అని న్యాయవాది రోహత్గీని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఇందుకు రోహత్గీ బదులిస్తూ.. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచి్చన తీర్పును చదివి వినిపించారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని ఆ తీర్పులో ఆదేశాలు ఇచ్చిందన్నారు.జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ కాలపరిమితి ముగింపు దశలో నిర్ణయం తీసుకుంటారా? అనర్హత విషయంలో మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా?’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై స్పందించేందుకు ఎంత సమయం కావాలో అసెంబ్లీ సెక్రటరీ కనుక్కుని చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు మీకెంత సమయం కావాలో చెప్పాలని ధర్మాసనం రోహత్గీని అడగ్గా.. రెండు వారాలు కావాలని బదులిచ్చారు. రోహత్గీ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ.. ‘ఈ అంశం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరమైతే లేదు. ఫోన్ కాల్ సరిపోతుంది’అంటూ జస్టిస్ గవాయి చమత్కరించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి ధర్మాసనం వాయిదా వేసింది. -
నేను కొడితే.. వట్టిగ ఉండదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు కదా. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్(congress party) అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ను ఎండబెడుతున్నరు. ఈ అన్యాయాలపై ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ పెట్టి వీళ్ల సంగతి చూడాలి. పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి తెలంగాణ శక్తిని మరోమారు చాటాలి. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి’ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు(Kcr) పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మన పార్టీకి కులం, మతం, జాతి అనే భేదభావం లేదు. తెలంగాణ సరిహద్దు లోపల ఉన్న వారందరికీ న్యాయం జరిగి బాగుపడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే కొట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సింది బీఆర్ఎస్ అనే విషయంలో రెండో మాటే లేదు. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే ప్రాజెక్టులు, నీళ్లు సాధించుకోవాలి. అవసరమైన సందర్భంలో నేను, జిల్లా నాయకులు ఇచ్చే పిలుపునకు స్పందించి ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎదురు తిరిగి కొట్లాడాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన గులాబీ జెండా తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్గా నిలబెట్టింది. కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు.. ఇన్నాళ్లూ కోటి రూపాయలు పలికిన భూమిని ఇప్పుడు రూ.50లక్షలకు కొనే పరిస్థితి లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్చి వరకు రూ.15వేల కోట్ల ఆదాయం తగ్గుతోందని కాగ్ రిపోర్టు చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆదాయంలో రూ.15 వేల కోట్ల వృద్ధిని సాధించింది. ఇప్పుడు మరో నాలుగైదు నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమనే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు.మనం ప్రాజెక్టులు, చెరువుల కింద నీటి తీరువా రద్దు చేసి రైతులకు ఎన్నో సదుపాయాలు కల్పించాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అత్యాశకు పోయి ఓట్లేసి బావిలో పడ్డారు. మంది మాటలు పట్టుకుని మార్వాణం పోతే మళ్లీ వచ్చేసరికి ఇల్లు ఆగమైందన్నట్టు పరిస్థితి తయారైంది. తులం బంగారం ఇస్తామంటే నమ్మి ఓటేస్తే ఏమవుతుందో తెలంగాణలో మంచి గుణపాఠం అయింది. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు. ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నరు.. రైతుబంధుతో వ్యవసాయం మెరుగై అప్పులు తీర్చుకుని, చిట్టీలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడా సంతోషం మంటగలిసింది. వాళ్లు ఎన్నికల సమయంలో ఇస్తరో ఎప్పుడు ఇస్తరో దేవుడికే ఎరుక. కరోనా సమయంలో మేం రైతుబంధు ఇచ్చి రైతులను కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు వేయించుకుని వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు కాన్వెంట్ విద్య అందిస్తే.. ఇప్పుడు పిల్లలు విషాహారం, పురుగుల అన్నం, కడుపునొప్పితో ఇంటి బాట పడుతున్నరు. కాంగ్రెస్ పాలన లోపాలను ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్లకు పట్టిస్తున్నారు. ఏడాది పాలనతోనే కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొడతం అన్నట్లుగా జనం ఉన్నరు. ఫామ్హౌజ్కు వస్తే పార పట్టొచ్చు వాళ్ల పార్టీ నిన్న ఒక పోలింగ్ పెట్టింది. అందులో 70శాతం మనకు, 30శాతం వాళ్లకు వచ్చింది. ఫామ్ హౌజ్ అంటే ఇక్కడ వరి, మక్కలు, అల్లం తప్ప ఏముంటది. కాంగ్రెస్ వాళ్లు వస్తే తలాకొంత సేపు పారపట్టి పనిచేయచ్చు. ఫామ్హౌజ్ అని బదనాం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనకు విసిగి మళ్లీ మనమే రావాలని ప్రజలు వందశాతం కోరుకుంటున్నరు. కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులను సమీకరించి ఉద్యమం జహీరాబాద్ నియోజకవర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసి రైతులను ఇబ్బందులు పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు నష్టం జరుగుతుంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై రైతులను భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్రావుకు కేసీఆర్ సూచించారు.పాదయాత్రగా ఎర్రవల్లికి వచ్చిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, బోయిని చంద్రయ్య, పార్టీ నేతలు సంగమేశ్వర్, ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు కేసీఆర్ను సత్కరించి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు. బలంగా కొట్టుడు కాదు. సరిగ్గా నిలబడమనండి’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్ (kcr) వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్ (Farm House)లో కూర్చొని మాటలు చెప్పుడు కాదు. అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసిరారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కోసం ఎవరు ఎదురు చూడడం లేదు. జహంగీర్ పీర్కి రూ.100 కోట్లు, రాజరాజేశ్వరస్వామికి రూ.100 కోట్లు ఇస్తామని మోసం చేశారు. పాలమూరును ఎండబెట్టిన ఘనలు మీరు. ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు. బలంగా కొట్టుడు కాదు. సరిగ్గా నిలబడు. 14 నెలల ఫామ్ హౌస్లో పడుకుని గంభీరంగా చూస్తున్నాం అని అంటున్నావ్. ఏం చేస్తున్నావ్...హరీష్ను, కేటీఆర్ను ఊరిమీదకు వదిలావ్. నీను మీలాగా మాటలు చెప్పి ఎగ్గొట్టను. అబద్ధాలు చెప్పడం వల్లే ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు గాడిగుడ్డు చేతికి ఇచ్చారు. అసెంబ్లీకి వస్తే ఏ ఊరికి ఎంత రుణ మాఫీ చేశామో చెబుతాం. నాకు, కేసీఆర్కు పోలింగ్ పెడితే కేసీఆర్కు ఎక్కువ ఓట్లు వచ్చాయంటా. సల్మాన్ఖాన్కు.. రాఖీ సావంత్కు ఓటింగ్ పెడితే .. రాఖీ సావంత్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంత మాత్రానా సల్మాన్ ఖాన్ హీరో కాకుండా పోరుగా. ప్రజలు తిరస్కరించినా బుద్ధిరాలేదు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.👉చదవండి : నేను కొడితే మామూలుగా ఉండదు -
తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపిస్తా: కేసీఆర్
-
నేను కొడితే మాములుగా ఉండదు : కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : సుదీర్ఘ కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ( kcr) మౌనం వీడారు. ‘నేను కొడితే మాములుగా ఉండదు’ అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ (congress party) పాలనపై నిప్పులు చెరిగారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జహీరాబాద్ బీఆర్ఎస్ (brs) కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నెల 27న జహీరాబాద్ నుంచి పాదయాత్రగా ఇవాళ ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతా. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కు ఓటేశారు. 👉చదవండి : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్నిన్న కాంగ్రెస్ వాళ్లు ఓటింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను చెప్పినా వినలేదు. అత్యాసకు పోయి కాంగ్రెస్కు ఓటేశారు. మన విజయం తెలంగాణ విజయం కావాలి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభ పెడుతున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఓట్ల కోట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుంది. సంగమేశ్వ, బసవేశ్వర టెండర్లను ఎందుకు పిలవలేదు. కాంగ్రెస్పై అంతటా అసంతృప్తే. అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచేసింది. పాలన వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు.రైతుబంధుకి రాంరాం, దళితబంధుకు జైభీం చెబుతారని ఆనాడే చెప్పా. అన్నీ మబ్బులు తొలగి పోయి అన్నీ బయటకు వస్తున్నాయి. మంచేదో చెడేదో ప్రజలకు తెలుస్తోంది. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కు ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మనం విజయం తెలంగాణ విజయం కావాలి. కైలాసం ఆడితే పాము మింగినట్లుగా ఉంది పరిస్థితి. మాట్లాడితే ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ అని బద్నం చేస్తున్నారు. ఫామ్ హౌస్లో పంటలే ఉంటాయి కదా’ అని వ్యాఖ్యానించారు. -
2028లో కేసీఆరే ముఖ్యమంత్రి
తెలంగాణ భవన్: మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే’అని అన్నారు. శుక్రవారం కేటీఆర్ పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2028లో ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. కేసీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోని అన్నీ రాష్ట్రాల కంటే మన రాష్ట్ర మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నాం. బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం. రూ. 700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది, 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలగా జీతాలు రావడం లేదు.సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చాం. టకీ టకీమని డిల్లీలో పైసలు పడుతున్నాయి తప్పా..రైతుల అకౌంట్లలో మాత్రం పడడం లేదు. పదవి కాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్లు ప్రజల్లోనే ఉంటే తిరిగి ప్రజలే గెలిపిస్తారు’ అని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. -
కాంగ్రెస్.. ‘ఢీ’ఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎసీ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అసెంబ్లీ తరహాలో మార్షల్స్తో సభ్యులను బలవంతంగా బయటకు పంపించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య జరిగిన వివాదంతో సభాధ్యక్ష స్థానంలోని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ బయటకు పంపించాల్సిందిగా మార్షల్స్ను ఆదేశించారు. దాంతో వారు కార్పొరేటర్లను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. అనంతరం రామ్గోపాల్పేట పీఎస్కు తరలించి, సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. దాదాపు మూడు గంటల వ్యవధిలో సభ నాలుగుసార్లు వాయిదా పడింది. ఆరంభం నుంచే.. సమావేశం ఆరంభం నుంచే రసాభాస చోటు చేసుకుంది. ఉదయం 10.35 గంటలకు సభ ప్రారంభం కాగా 10.40 గంటలకు బడ్జెట్పై చర్చ ప్రారంభిద్దామని మేయర్ అన్నారు. తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టాలని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం చెలరేగడంతో 10.50 గంటలకు మేయర్ సభను వాయిదా వేశారు. ఈ సమయంలోనూ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ జూటా అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. తిరిగి సభ ప్రారంభమయ్యాక సైతం గందరగోళం ఆగలేదు. ఎలాంటి చర్చ లేకుండానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) రూ. 8440 కోట్ల బడ్జెట్ను ఆమోదించినట్లు (డీమ్డ్ టూ అప్రూవ్ అంటూ) మేయర్ ప్రకటించారు. పరిస్థితి అదుపు తప్పిందిలా.. బీఆర్ఎస్ సభ్యుల చేతుల్లోని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ప్లకార్డుల్ని కాంగ్రెస్ సభ్యులు బాబా ఫసియుద్దీన్, సీఎన్రెడ్డి తదితరులు చించివేశారు. బడ్జెట్ ప్రతులను బీఆర్ఎస్ వారు మేయర్ పోడియంపైకి విసిరారు. పోడియం వద్దకు వెళ్లకుండా కాంగ్రెస్ సభ్యులు వారికి అడ్డు నిల్చున్నారు. కాంగ్రెస్ డౌన్డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. రెండు పార్టీల మధ్య తోపులాట పెరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఒక దశలో బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సింధు, శాంతి, పద్మా వెంకట్రెడ్డి, విజయ్కుమార్గౌడ్లను బయటకు పంపించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. దీంతో బయటకు పంపిన తమ సభ్యులను లోనికి తీసుకురావాల్సిందేనని, లేనిదే తాము చర్చలో పాల్గొనమని బీఆర్ఎస్ సభ్యులు మన్నె కవితారెడ్డి తదితరులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ సభ్యులందరినీ బయటకు తీసుకెళ్లాల్సిందిగా మేయర్ ఆదేశించడంతో 33 మంది సభ్యులను మార్షల్స్ బలవంతంగా ఎత్తుకెళ్లారు. బయటకెళ్లిన వారు నిరసన ప్రదర్శనకు దిగగా జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి రామ్గోపాల్పేట పీఎస్కు తరలించారు. బీఆర్ఎస్ బలంతోనే మేయర్గా ఎన్నికైన విజయలక్ష్మి తమనే బయటకు పంపించడం దారుణమని ఆ పార్టీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా.. కాంగ్రెస్ వాళ్లు కేటీఆర్ 420 అంటూ, బీఆర్ఎస్ వాళ్లు సీఎం రేవంత్రెడ్డి 420 అంటూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్లకార్డులు పట్టుకొచ్చారు. సభ ప్రారంభానికి ముందు బీజేపీ సభ్యులు శ్రవణ్, తదితరులు తమకు బడ్జెట్ కేటాయించడం లేదంటూ, మేయర్ ఎంట్రన్స్ వద్ద యాచకుల మాదిరిగా చిప్పలు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. బాబా ఫసి యుద్దీన్ భారత్ జోడో యాత్ర టీషర్ట్ వేసుకొని రావడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 70 శాతం ఆదాయం అధికారులకే.. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్, సంబంధిత అధికారులు బదులిచ్చారు. వీధిదీపాల సమస్యలు త్వరలో తీరుతాయని, చెత్త సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలున్నాయని డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి తెలిపారు. మేయర్తో కలిసి అన్నిడివిజన్లలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బల్దియాలో అనసరంగా ఎందరో అధికారులున్నారని, 70 శాతం జీహెచ్ఎంసీ ఆదాయం వారి జీతభత్యాలకే పోతుండగా, వారి ద్వారా ఒరుగుతున్నదేమీ లేదని కాంగ్రెస్ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ జీహెచ్ఎంసీ తీరును ఎండగట్టారు. అవసరమైన పారిశుధ్యం వంటి పనులకు మాత్రం సిబ్బంది లేరన్నారు. సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఇలంబర్తి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ చర్య దుర్మార్గం: కేటీఆర్ జీహెచ్ఎసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా? అని ఆయన ప్రశ్నించారు.రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే : మంత్రి పొన్నం జీహెచ్ఎఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. బడ్జెట్ను అడ్డుకోవడం హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టేనన్నారు. -
‘మండలి’ పోటీపై నేడోరేపో బీఆర్ఎస్ స్పష్టత
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో మూడు స్థానాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావుతో గురువారం భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మండలి ఎన్నికల్లో పోటీ, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మాజీ మంత్రి హరీశ్రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా.. జ్వరం కారణంగా హాజరు కాలేదని తెలిసింది. మెదక్– కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్, వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరికైనా అధికారికంగా మద్దతు ఇవ్వాలా? లేక తటస్థంగా ఉండాలా? అనే అంశంపై ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పట్టభద్రుల కోటాలో ‘మెదక్– కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్’స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఆశావహులు కూడా పార్టీ వైఖరిపై స్పష్టత ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ.. స్థానిక ఎన్నికలు ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలుచేయాలన్న డిమాండ్తో ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ నిర్వహించనున్న బహిరంగ సభపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి అనుగుణంగా ముందుకు సాగాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాసంలో జరిగిన పార్టీ మాదిగ సామాజికవర్గం నేతల భేటీలో చర్చించిన అంశాలను కేసీఆర్కు కేటీఆర్ వివరించారు. ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం ముందు పెట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ పరంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. నేడు మున్సిపల్ మాజీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం ఇటీవల పదవీకాలం ముగిసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్రావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రేవంత్ను నమ్మారా.. నమ్మితే నట్టేట మునిగినట్లే : పాడి
సాక్షి,తెలంగాణ భవన్ : సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్రెడ్డి మాట్లాడారు. ఎవ్వరి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి. ఈ పత్రాలు చూసి ఇళ్ళు కట్టుకుంటే ప్రజలు మోసపోతారు ..తస్మాత్ జాగ్రత్త. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మోసపోవద్దు ..ఇండ్లు కట్టుకున్న తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వరు. స్థలం లేని వారికి ఇండ్ల కేటాయింపులో స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి ఓ పెద్ద జోకర్లా మారారు. తుగ్లక్లా పాలిస్తున్నారు. ఓ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు.కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది ఆయన తీరు. టకీ టకీ అని రైతు భరోసా డబ్బులు పడతాయని రేవంత్ అన్నారు.ఒక్క రోజు డబ్బులు వేసి ఆపేశారు. అధికారులు వచ్చి నామమాత్రపు పత్రాలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి?ఈ పత్రాలు చూసి తొందరపడి ఇల్లు కట్టుకుంటే మోసపోతారు.. తస్మాత్ జాగ్రత్త.- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/RRNCkW8D6L— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 30, 2025ఆరునెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసాను ఆపే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఎవరి పాలన బాగుంది అంటే కేసీఆర్ పాలన బాగుంది అని 70 శాతం నెటిజన్లు సమాధానమిచ్చారు. దాదాపు 90 వేల మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారు.మరో ఛానల్ నిర్వహించిన సర్వేలో కూడా 80 శాతం మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. అన్ని పథకాలు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
-
ఎన్నికల ముందు పథకాల డ్రామా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానికసంస్థల ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పథకాల డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆ ఎన్నికలు పూర్తయితే రైతుభరోసా బంద్ అవుతుందన్నారు. మంగళవారం నల్లగొండ గడియారం సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్జీ కాలేజీ నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. మేం నాట్లకు ముందు.. కాంగ్రెస్ ఓట్లకు ముందు‘రేవంత్కు.. ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తా యి. అవి పూర్తయితే పట్టించుకోరు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తుండటంతో ఓట్ల కోసం కొత్త డ్రామా అడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాట్లకు ముందు రైతుబంధు ఇచ్చాం. కానీ రేవంత్ ప్రభుత్వం రైతుభరోసా డ్రామా ఆడుతోంది’అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదు ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రూ. 2 లక్షల మేర రైతు రుణాలను డిసెంబర్ 9న మాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేశారని ఆరోపించారు.ఏ ఊళ్లోనూ 100 శాతం రుణమాఫీ చేయలేదని.. యాసంగి రైతు భరోసా సైతం ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ రైతుబంధు ఇస్తానంటే రేవంత్రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించారని కేటీఆర్ విమర్శించారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టారని, ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి రూ.17,500 రేవంత్రెడ్డి బాకీ పడ్డారన్నారు. మోసం చేయడంలోనూ చరిత్రాత్మకమే బీఆర్ఎస్ రూ.12 వేలు రైతుబంధు ఇస్తానంటే, తాను రూ.15 వేలు ఇస్తానని చెప్పి రేవంత్రెడ్డి ప్రజలను మభ్య పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఓట్లు వేయించుకొని గెలిచాక సిగ్గులేకుండా రూ.12 వేలకు కుదించారన్నారు. ప్రజలను మోసం చేయడంలోనూ కాంగ్రెస్ది చరిత్రాత్మకమేనని ఎద్దేవా చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి, చివరకు సన్నాలకే ఇస్తానని మెలిక పెట్టి మోసం చేశారన్నారు. . కేసీఆర్ హయాంలో 11 విడతలుగా రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశారని గుర్తు చేశారు. రైతులు తిరగబడాలి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తిరగబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, రైతు లు, చేనేత కారి్మకులు చనిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుబంధు, రైతుభరోసా, రుణమాఫీ విషయంలో ప్రజలు తిరుగబడాలని, నల్లగొండ నుంచే పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకే..: జగదీశ్రెడ్డి రైతులను మోసం చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ అన్యాయంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుంటుందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పేందుకే కేటీఆర్ నల్లగొండ వచ్చారన్నారు. ప్రశ్నిస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.పలువురు నేతల ఫోన్లు, గొలుసులు చోరీ నల్లగొండలో కేటీఆర్ పాల్గొన్న రైతు మహాధర్నాలో దొంగలు రెచ్చిపోయారు. ఎన్జీ కాలేజీ నుంచి బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ర్యాలీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, స్థానిక నేత హమీద్ సెల్ఫోన్లతోపాటు ఆరుగురు నేతల నుంచి సుమారు 11 తులాల బంగారు గొలుసులు కొట్టేశారు. దొంగల ముఠాలోని ఒకరిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే వై.ఎస్..రైతుబంధు అంటే కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్పగానే ప్రజలందరికీ ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని కేటీఆర్ చెప్పారు. అలాగే రైతుబంధు పథకం అనగానే మాజీ సీఎం కేసీఆర్ గుర్తుకొస్తారన్నారు. ఈ పథకాలను ఎవరూ చెరపలేరన్నారు. కానీ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి రైతుబంధు పథకాన్ని బంద్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సామాన్యులకు రేషన్కార్డు కావాలన్నా, రైతుబంధు కావాలన్నా ప్రభుత్వం కేవలం దరఖాస్తులే తీసుకుంటోందని విమర్శించారు. -
రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది.. అందుకు ఇదే నిదర్శనం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు.తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసింది. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా?. ఎమ్మెల్సీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. యువరాజు సమాధానం చెప్పాలి.టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోవడం దారుణం. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు సీఆర్ఎస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పని అయిపొయింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. బీఆర్ఎస్ తొకముడువడంతో బీజేపీ విజయం నల్లేరుమీద నడకయ్యిందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్రెడ్డి (వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సార అన్నట్టుగా ఉంది: కేటీఆర్