హర్షకుమార్కు నాన్ బెయిలబుల్ వారంట్
విశాఖ: కులంపేరుతో దూషించిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కు కోర్టు నాన్బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 2004లో ఓ వేడుక కార్యక్రమం లో స్వరూప్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించినట్లు ఆయనపై త్రీటౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న విచారణకు హర్షకుమార్గానీ, ఆయన న్యాయవాదిగానీ హాజ రుకాలేదు. దీంతో హర్షకుమార్కు నాన్బెయిల్బుల్ వారెంట్ జారీచేశారు.