chairaman
-
చంద్రబాబు రైతుల భూములు లాక్కున్నారు.. సాక్ష్యాలు ఇవిగో: ఎమ్మెల్యే ఆర్కే
-
వేలం వెర్రి..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ షెట్పల్లి సహకార సంఘం డైరెక్టర్, చైర్మన్ పదవులకు నిర్వహించిన వేలం పాటలో రూ.25 లక్షల వరకు ధర పలికింది. ఏర్గట్ల సొసైటీ రూ.15 లక్షలకు వేలం పాడారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు జిల్లాలో అనేక సొసైటీల పదవులకు వేలం పాటలు జరిగాయి. ఆర్మూర్ మండలం పిప్రి సొసైటీకి నిర్వహించిన వేలంలో రూ.77 లక్షల విలువైన పనులు చేçస్తామనే ఒప్పందంతో ఏకగ్రీవం చేశారు. సహకార సంఘాల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్ జిల్లాలో డైరెక్టర్, చైర్మన్ స్థానాలను వేలం పాటల ద్వారా దక్కించుకున్నారు. జిల్లాలో 89 సహకార సంఘాలు, వీటి పరిధిలో 1,157 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియగా, రాష్ట్రంలోనే అత్యధికంగా 26 సహకార సంఘాలు, 736 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కొన్ని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఏకగ్రీవం చేసిన స్థానాలు ఉండగా, ఎక్కువ భాగం వేలం పాటల ద్వారానే రూ.లక్షలు వెచ్చించి దక్కించుకున్నవే ఉండటం గమనార్హం. అయితే,, ఈ విషయమై గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాలనకు దీటుగా సమాంతర పాలన కొనసాగిస్తాయి. ఎవరైనా వీడీసీల కట్టుబాట్లను ధిక్కరిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, బహిష్కరణకు గురి కావాల్సి వస్తుంది. గ్రామాభివృద్ధికి నిధుల సమీకరణ పేరుతో సహకార సంఘాలకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. వేలంలో అత్యధిక ధర పలికి పదవిని కొనుక్కున్న వారు నిర్ణయించిన తేదీలోగా డబ్బులు కమిటీకి జమ చేయాల్సి ఉంటుంది. ఆధారాల్లేక చర్యలు తీసుకోలేకపోతున్నాం సహకార ఎన్నికల్లో వేలం పాటలు నిర్వహించకూడదనే జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఆదేశాలను వీడీసీలు ఖాతరు చేయలేదు. డైరెక్టర్, సొసైటీల చైర్మన్ స్థానాలకు యథేచ్ఛగా వేలం పాటలు నిర్వహించాయి. సరైన ఆధారం లేకపోవడంతోనే చర్యలు తీసుకోలేకపోయామని జిల్లా సహకారశాఖాధికారి సింహాచలం ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే పోలీసులతో విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు. -
సీఎం జగన్తో డీఆర్డీఓ చైర్మన్ భేటీ
-
సీఎం జగన్తో డీఆర్డీఓ చైర్మన్ భేటీ
సాక్షి, అమరావతి: డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్ జగన్తో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలోని రక్షణ రంగ ప్రాజెక్టులపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్టు సమాచారం. నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రికి సతీష్రెడ్డి వివరించినట్టు తెలిసింది. ఆయనకు సీఎం జగన్ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. (చదవండి: ముందే సంక్రాంతి) -
చైర్మన్ పీఠానికి ‘నామం’
చైర్పై నెహ్రూ తనయుడు - నామనకు పార్టీ జిల్లా పగ్గాలు సాక్షిప్రతినిధి, కాకినాడ : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే’ సామెత జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు విషయంలో నిజమవుతున్నట్టుగానే ఉంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి దక్కకపోవడంతో దాని ప్రభావం నామన పదవికి ఎసరుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కోనసీమలో పి.గన్నవరం నియోజకవర్గం మగటపల్లికి చెందిన నామన పార్టీ ఆవిర్భావం నుంచి వివాదరహితుడనే పేరుంది. లోక్సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచి పార్టీలో పలు పదవులు నిర్వర్తించారు. ఈ కారణాలతోనే జెడ్పీ పీఠానికి నామనను అప్పట్లో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జెడ్పీ చైర్మన్గా మూడేళ్లు పూర్తి కావస్తోంది. మునుపటి చైర్మన్లు మాదిరిగా నిధులు, విధులు మాటెలా ఉన్నా కనీసం బుగ్గకారు, ప్రోటోకాల్, హోదా ఇటు పార్టీలోను, అటు అధికారికంగాను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి వర్గ విస్తరణలో మెట్ట ప్రాంతానికి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మొండి చేయి ఎదురైనప్పుడే చర్చంతా జెడ్పీ పీఠంపైకి మళ్లింది. ఎందుకంటే నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయంగా అతని కుమారుడు, జగ్గంపేట జడ్పీటీసీ సభ్యుడు నవీన్కు జెడ్పీ పీఠాన్ని అçప్పగిస్తారని పార్టీలో విస్తృతమైన ప్రచారానికి తెరలేచింది. నెహ్రూ జీవితాశయం మంత్రి పదవి అధిష్టించడం. ఆ పదవితో పాటు మరికొన్ని ప్రలోభాల ఎరలోపడి చంద్రబాబు మాట నమ్మి నెహ్రూ టీడీపీలో తిరిగి చేరారని బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలోనే తాజా మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖాయమని గంపెడాశతో నిరీక్షించిన నెహ్రూకు చివరకు రిక్తహస్తమే ఎదురైంది. ఈ పరిణామం అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు నామన పీఠానికి ఎసరుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని టీడీపీలో చర్చ నడుస్తోంది. మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడంతో అంతర్మథనం చెందుతున్న నెహ్రూకు గుడా (గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ లేదా, అతని తనయుడు నవీన్కు జెడ్పీ చైర్మన్ పీఠం రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ విషయాన్ని పార్టీ జిల్లా నేతలు మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గుడా చైర్మన్ రేసులో ఇప్పటికే పార్టీ రాజమహేంద్రవరం నాయకుడు గన్ని కృష్ణ ఉన్నారు. అందునా నెహ్రూ కూడా గుడా చైర్మన్ గిరీని ఆమోదిస్తే తన స్థాయి తగ్గించుకోవడమే అవుతుందనే భావనలోనే ఉన్నారంటున్నారు. అటువంటి పరిస్థితి వస్తేగిస్తే అసలు ఏ పదవి వద్దనుకోవాలనే నిర్ణయంతో ఉన్నారని అనుచరవర్గం చెబుతోంది. జడ్పీ చైర్మన్ పీఠంపై కుమార్డు నవీన్ను కూర్చోపెట్టడానికి మాత్రం నెహ్రూ సుముఖంగానే ఉన్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మూడు దశాబ్థాల రాజకీయాల్లో నెహ్రూ జీవితాశయం మంత్రి పదవి ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ద్రాక్ష అందలేదు అందుకే... కనీసం తనయుడు నవీన్ను జెడ్పీ చైర్మన్గా చేస్తే రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసినట్టు అవుతుందనే ఆలోచనతో నెహ్రూ ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. అది జరగాలంటే ప్రస్తుత చైర్మన్ రాంబాబు చైర్మన్ పీఠం కదిలిపోవడం ఖాయమేనంటున్నారు. నవీన్కు చైర్మన్ పీఠం అప్పగించి రాంబాబుకు పార్టీ జిల్లా పగ్గాలతో సరిపెట్టాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని తెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మృతి చెందిన దగ్గర నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం తనయుడు, మంత్రి లోకేష్ కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో బసచేసిన సందర్భంలో ఈ అంశంపై కొద్దిసేపు జిల్లా టీడీపీలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య చర్చ సీరియస్గా సాగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడా యనమల పితలాటకమేనా...! నెహ్రూతో మెట్ట ప్రాంతంలో రాజకీయంగా బద్ధ వైరం ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జెడ్పీ చైర్మన్ పీఠం నవీన్కు అప్పగించే విషయంలో ఏమంత సుముఖంగా లేరని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగని ఎక్కడా పెదవి విప్పని యనమల వర్గీయులు నెహ్రూతో పడని నేతలను వ్యూహాత్మకంగా ఎగదోస్తున్నారని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. పార్టీని కాలదన్ని వెళ్లిపోయి స్వార్థం కోసం నిన్నగాక మొన్న పార్టీలోకి తిరిగొచ్చిన వారికి అత్యున్నత పదవులు కట్టబెడితే పార్టీ శ్రేణులకు ఏ రకమైన సంకేతాలు వెళతాయని అనుమాన బీజాలు నాటుతున్నారు. ఈ అంశానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రచారం ముమ్మరం చేయించే పనిలో నెహ్రూ వైరివర్గం చాపకింద నీరులా గోతులు తవ్వేస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తాయోనని వేచి చూడాల్సిందే. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నిజామాబాద్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లాపరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ లత అధ్యక్షతన కార్యక్రమం సాగింది. షాదీముబారక్ పథకంలో చేసిన సవరణలపై మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. ఇప్పటికీ పెళ్లికూతురుపై దరఖాస్తులను అందజేస్తున్నారని, తల్లి పేరుతో నేరుగా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాల న్నారు. కిందిస్థాయి సిబ్బంది పరిశీలించిన తర్వాతే దరఖాస్తుల జాబితాను ఎమ్మెల్యేను పంపించాలన్నారు. జిల్లాకు ఆరు మైనారిటీ గురుకులాలు మంజూరయ్యాయని మైనారిటీ కార్పొరేషన్ అధికారులు తెలిపా రు. జిల్లాలో కళ్యాణలక్ష్మి పథకానికి 1,064 దరఖాస్తు లు వచ్చాయని, అందులో 880 మందికి కళ్యాణ లక్ష్మి నిధులు అందించామని అధికారులు పేర్కొన్నారు. 26 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించామని, 159 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి ద్వారా ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు అందించనున్నట్లు తెలిపా రు. సమావేశంలో జెడ్పీ సీఈవో మోహన్లాల్, జెడ్పీటీసీ సభ్యులు కిషన్, లక్ష్మి, సాయిరాం పాల్గొన్నారు. ఎజెండా కాపీ లేకపోవడంపై ఆగ్రహం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ సమావేశానికి వచ్చినా.. తన ఎజెండా కాపీ అందజేయకపోవడంపై జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా కాపీ ఇవ్వకుండా సమావేశానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నివేదికను అందించడానికే ఇంత ఇబ్బంది పడితే క్షేత్రస్థాయిలో విధులు ఎలా నిర్వర్తిస్తున్నారో అర్థమౌతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకే సమాచారం ఇవ్వకుంటే మామూలు ప్రజానీకానికి ఏం ఇస్తారన్నారు. తర్వాత జరిగే సమావేశానికి ముందుగానే ఎజెండా కాపీని అందించాలని, లేకుంటే సమావేశానికి రావద్దని సూచించారు. -
నేడు అగ్రిగోల్డ్ చైర్మెన్,డైరెక్టర్ల విచారణ