chaitanyapuri police
-
ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు
సాక్షి, హైదరాబాద్ : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడో వ్యక్తి. ఈ ఘటన దిల్సుఖ్నగర్లోని బృందావన్ లాడ్జిలో జరిగింది. మంగళవారం ఉదయం నెల్లూరుకు చెందిన వెంకటేష్ (22) అనే యువకుడు లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. కాగా, మధ్యాహ్న సమయంలో తనతోపాటు ఉన్న ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చైతన్యపురి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమ్మాయి హైదరాబాద్లోని బడంగ్పేటకు చెందిన మనస్విని (22)గా పోలీసులు గుర్తించారు. -
వాహన తనిఖీల్లో రూ.6 లక్షలు స్వాధీనం
చైతన్యపురి: వాహనాల తనిఖీలలో చైతన్యపురి పోలీసులు రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం అష్టలక్ష్మీ దేవాలయం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో వచ్చిన వాసవికాలనీకి చెందిన వ్యాపారి పాపిశెట్టి వెంకటేశ్వరరావును ఆపి సోదా చేశారు. కారులో రూ.6 లక్షలు నగదు ఉండడంతో డబ్బుకు సంబంధించిన వివరాలను అడిగారు. ఆయన ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు, ఐటీ అధికారులకు సమాచారం అందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు కావడంతో తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్ఐ కోటయ్య తేలిపారు. -
పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన మహిళలు
-
పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన మహిళలు
హైదరాబాద్: పేకాట స్థావరంపై దాడిచేసి ఏడుగురు మహిళలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని చైతన్యపురి గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాటులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 26 వేల నగదుతో పాటు ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాలనీలోని ఓ ఇంట్లో ఒక మహిళ మూడు ముక్కలాట క్లబ్ నిర్వహిస్తోందనే సమాచారంతో రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీళ్లందరినీ చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. ఈ మహిళలంతా బడా వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందినవారని తెలుస్తోంది. అసలు తెలంగాణ పరిధిలో ఎక్కడా పేకాట క్లబ్బులను అనుమతించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెబుతుండగా, మరోవైపు మహిళలు ఇలా డబ్బులతో పేకాట ఆడటం విస్మయం కలిగించిందని ఎస్ఓటీ పోలీసులు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో జరిగింది. గతంలో రోడ్ నెం.2లో కొంతమంది మహిళలు పేకాట ఆడారని చెబుతున్నారు.